వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు పలికెను- దైత్యులు పూజ్యుడైన శుక్రాచార్యుని తమ పురోహితునిగా నియమించుకొనియుండిరి. అతనికి శందుడు, అమర్కుడు అను ఇరువురు కుమారులు గలరు. వారు రాజభవనమునకు సమీపమునందే నివసించుచుండిరి. హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు నీతికోవిదుడైన ప్రహ్లాదునకును, ఇంకను ఇతర దైత్యబాలురకును రాజనీతి, అర్థనీతి శాస్త్రములను నేర్పుచుండిరి.
ప్రహ్లాదుడు గురువు నేర్పిన పాఠమును వినుచుండెను. యథాతథముగ వినిపించుచుండెను. కాని, అవి అతని మనస్సునకు నచ్చకుండెను. ఏలయన, ఆ పాఠములు స్వ-పరభేదములను తెలుపుచుండెను.
ధర్మరాజా! ఒకనాడు హిరణ్యకశిపుడు తనపుత్రుడైన ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో చేర్చుకొని, ఇట్లు ప్రశ్నించెను. 'కుమారా! నీవు నేర్చిన వాటిలో నీకు మంచిదని తోచిన ఒకదానిని వినిపింపుము'.
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు పలికెను - "నాయనా! ఈ జగత్తున మానవులు 'నేను, నాది' అను మాయలోబడి మిథ్యావిషయములను పట్టుకొని సర్వదా ఉద్విగ్నులగుచుందురు. ఇదే వారి అధఃపతనమునకు మూలకారణము' - అని నేను తలంతును. గృహము గడ్డితో కప్పబడిన అంధకార మయమైన బావి వంటిది. జనులు దానిని త్యజించి, వనములలో సాధుపురుషుల సాంగత్యమును నెఱపుచు శ్రీహరిని శరణు వేడుటయే మేలు"
నారద ఉవాచ
నారదుడు పలిచెను- ప్రహ్లాదునినోట శత్రువుల యొక్క ప్రశంసను విని, హిరణ్యకశిపుడు బిగ్గరగా నవ్వి ఇట్లనెను- 'శత్రుపక్షపాతము గలవారు బాలుర బుద్ధులను వక్రమార్గమును పట్టింతురు. గురువు గారి ఇంటిలో కొందరు విష్ణు పక్షపాతము గల బ్రాహ్మణులు మారు వేషములతో నివసించుచున్నారని నేను అనుకొందును. ఈ బాలుని బుద్ధి అపమార్గము పట్టకుండ చక్కగా శిక్షణ గరపవలెను".
దైత్యులు ప్రహ్లాదుని మరల గురువుల ఇంటికి చేర్చిరి. అప్పుడు వారు ప్రహ్లాదుని బుజ్జగించుచు మధురముగా అనునయవచములను పలికిరి-
"కుమారా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక! నిజము పలుకుము. నీ బుద్ధి ఇట్లు ఏల వక్రించినది. ఇతర బాలకుల బుద్ధి ఇట్లు లేదుగదా! వంశోద్ధారకా! నీ బుద్ధిని ఇతరులు ఎవరైనను ఇట్లు వక్రమార్గమును పట్టించిరా? లేక సహజముగనే నీకు తోచినదా! గురువులమైన మేము తెలిసికొనగోరుచున్నాము. తెలుపుము.
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు పలికెను - "భగవంతుని మాయకు వశులైన మనుష్యులయొక్క బుద్ధి మోహగ్రస్తమగుచుండును. దానివలన వారు స్వ-పర భేదమునకు లోనగుచుందురు. అట్టి మాయాధీశుడగు ఆ భగవంతునకు నమస్కారము. పశుబుద్ధి కారణముగనే మానవులకు 'ఇది నేను, ఇది నాకంటెను వేరైనది' అను భేదబుద్ధి కలుగును. భగవంతుని కృపకలిగిన నాడు ఈ పశుబుద్ధి తొలగిపోవును. ఈ ఆత్మయే ఆ పరమాత్మ. అజ్ఞానులు ఇది - నేను, ఇతడు పరాయివాడు అను భేదముతో ఆ ఆత్మనే వర్ణింతురు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనుట మిగుల కష్టము. బ్రహ్మాది వేదజ్ఞులు గూడ ఆ విషయమున మోహితులగు చుందురు. ఆ పరమాత్మయే నా బుద్ధి వక్రించినది అని మీతో పలికించుచున్నాడు. గురువులారా! అయస్కాంతము వైఫు ఇనుము స్వయముగా ఆకర్షింపబడును. అట్లే చక్రధారియైన ఆ శ్రీహరివైపు నా మనస్సు తనంతటతానే భక్తిప్రపత్తులతో ఆకృష్టమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు ఇట్లు పలికెను- పరమజ్ఞానియైన ప్రహ్లాదుడు తన గురువుతో ఇట్లు పలికి మిన్నకుండెను. ఆ పురోహితుడు రాజునకు సేవకుడు, పరాధీనుడు. అతనిలో కోపము ముంచుకొనివచ్చెను. అపుడు ఆ పురోహితుడు ప్రహ్లాదుని మందలించుచు ఇట్లు పలికెను-
"అరే, ఎవ్వరైనను ఒక బెత్తమును తీసికొనిరండు. ఈ బాలుడు మా కీర్తికి కళంకమును తెచ్చుచున్నాడు. తమ వంశమునకు చిచ్చు పెట్టుచున్నాదు. ఈ దుర్బుద్ధిని బాగుచేయుటకు చతురుపాయములలో నాల్గవదియైన దండనయే సరియైనది. దైత్యవంశమనెడి చందనవనమునందు ఇతడు ఒక ముండ్ల పొదవలె జన్మించినాడు. విష్ణువు ఈ వనమును భేదించునట్టి గొడ్డలివంటివాడు. ఈ ఆర్భకుడు అతనికే తోడ్పడుచున్నాడు"
ఈ విధముగా గురువు పలు విధములుగా మందలించుచు ప్రహ్లాదుని భయపెట్టెను. ధర్మార్ధకామముల యందు అతనికి శిక్షణను ఇచ్చెను.
ప్రహ్లాదుడు సామదానభేద దండోపాయములను గూర్చి చక్కగా తెలిసినవాడని గురువు గ్రహించెను. అపుడు అతడు ప్రహ్లాదుని అతని తల్లి దగ్గరకు తీసికొనిపోయెను. తల్లి మిక్కిలి వాత్సల్యముతో అతనిచే స్నానము చేయించి, మంచి వస్త్రాభరణములను అలంకరింప జేసినది. పిమ్మట ఆమె అతనిని హిరణ్యకశిపుని కడకు తీసికొని పోయెను.
ప్రహ్లాదుడు తన తండ్రిపాదములకు నమస్కరించెను. హిరణ్యకశిపుడు అతనిని ఆశీర్వదించి తన రెండు చేతులతో లేవనెత్తి అక్కున జేర్చుకొనెను. ఆ సమయమున ఆ దైత్యరాజుయొక్క హృదయము ఆనందముతో నిండిపోయెను.
హిరణ్యకశిపురువాచ
ధర్మరాజా! హిరణ్యకశిపుడు ప్రసన్నముఖుడైన ప్రహ్లాదుని తన యొడిలోనికి చేర్చుకొని శిరమును మూర్కొనెను. అతని నేత్రములనుండి జాలువాఱిన ఆనందాశ్రువులు ప్రహ్లాదుని శరీరమును తడిపివేసేను.పిమ్మట హిరణ్యకశిపుడు తన పుత్రునితో ఇట్లు పలికెను "చిరంజీవీ! ప్రహ్లాదా! ఇంతవరకును గురువునొద్ద నీవు అభ్యసించిన విద్యలో శ్రేష్ఠమైన విషయమును వివరింపుము"
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు వచించెను తండ్రీ శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగు వానిని వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామ రూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మనివేదనము చేయుట. ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తియని వ్యవహరింతురు.
ప్రహ్లాదుని ఈ వచనములను వినగనే హిరణ్యకశిపుడు క్రోధావిష్టుడు అయ్యెను. పెదవులు వణక సాగెను. పిదప గురుపుత్రునితో ఇట్లనెను- "ఓరీ! బ్రాహ్మణాధమా! నీవు కుబుద్ధివి. ఇదియేనా నీవు నేర్పిన విద్య? నన్ను ఏమాత్రమూ లక్ష్యపెట్టక మా కుమారునకు ఇట్టి సారరహితమైన విషయములను నేర్పితివి. నీవు నా శత్రుపక్షమును వహించినట్లున్నది. లోకములో మిత్రులవలె నటించుచు శత్రువుల కార్యములను నెరవేర్చు దుష్టులకు కొదువలేదు. కాని, రహస్యముగ పాపకృత్యములను ఒనర్చిన వారి పాపములు సమయము వచ్చినప్ఫుడు రోగముల రూపములో బయటపడినట్లు ఈ దుష్టాత్ముల దుర్బుద్ధి ఏదేని యొక సమయమున బహిర్గతము కాక తప్ఫదు.
గురుపుత్ర ఉవాచ
గురుపుత్రుడు పలికెను ఇంద్రశత్రూ! మీ పుత్రుడు పలుకుచున్న మాటలు నేనుగాని, మరెవ్వరైనగాని నేర్పినవి కావు. ప్రభూ! ఇతనికి ఈ బుద్ధి జన్మతః అబ్బినది. కోపమును వీడి శాంతి వహింపుము. మాపై దోషారోపము చేయవద్దు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు వచించెను- ధర్మరాజా! గురువు ఈ విధముగా సమాధానము ఇచ్చినంతనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరల ఇట్లు ప్రశ్నించెను- 'బాలకా! ఇట్లు అమంగళకరమైన ఈ దుర్బుద్ధి గురువునుండి నీకు ప్రాప్తింపనిచో, మరి ఎట్లు అబ్బినది?'
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు నుడివెను- తండ్రీ! ప్రపంచములో జనులు ఇంద్రియములకు వశులై అనుభవించిన విషయ సుఖములనే మరలమరల అనుభవింపగోరుదురు. ఇవి చర్విత చరణములే (నమలిన వాటినే మరల నమలుటవంటిది). అట్టివారు సంసార రూప ఘోరనరకమున పడియుందురు. అట్టి గృహాసక్తులైన వారి బుద్ధి సహజముగా గాని, ఇతరులు నేర్పుటవలనగాని శ్రీహరియందు కుదురుకొనదు. ఇంద్రియములకు గోచరించు బాహ్యవిషయములే పరమార్థములని భావించునట్టి మూర్ఖులు, అంధుని మార్గనిర్దెశములో నడచునట్టి అంధునివలె గోతులలో పడుదురు. వారు వేదములో వర్ణింపబడు కామ్యకర్మలచే బంధింపబడుదురు. అట్టి వారికి స్వార్థపరమార్థములు శ్రీమహావిష్ణువు అని తెలియదు. అట్లు అజ్ఞానులను ఆశ్రయించుట వలన పురుషార్థములు ఎట్లు సిద్ధించును?
శ్రీహరిపాదపద్మముల యందే నిమగ్నమైన బుద్ధిగల వారిని జనన మరణరూప అనర్థములు అన్నియును పూర్తిగా వదలిపోవును. కాని, భగవద్భక్తులైన అకించనుల పాదధూళిలో స్నానమొనర్పనివారు, కామ్యకర్మలను ఎంతగా సేవించినను వారి బుద్ధి భగవచ్చరణారవిందములయందు లగ్నముకాదు.
ప్రహ్లాదుడు ఈ విధముగ పలికి మిన్నకుండెను. హిరణ్యకశిపుడు మాత్రము క్రోధాంధుడై అతనిని తనయొడి నుండి నేలపై పడద్రోసెను.
ప్రహ్లాదుని వచనములకు హిరణ్యకశిపుడు కోపావిష్టుడయ్యెను. అతని కనులు ఎర్రబారెను. వెంటనే అతడు ఇట్లుపలికెను- "దైత్యులారా! వీనిని ఇప్ఫుడే ఇచటి నుండి గొనిపోయి చంపివేయుడు. ఇతడు వధార్హుడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఈ బాలుడు తన తోడివారిని, స్వజనులను కాదని, తన పినతండ్రిని చంపిన విష్ణుని పాదములనే ఒక సేవకునివలె పూజించుచున్నాడు. నా సోదరుని చంపిన విష్ణువే ఈ రూపమున వచ్చినట్లున్నది.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఇతడు విశ్వాసపాత్రుడు కాడు. ఐదు సంవత్సరముల వయస్సులోనే విడదీయరాని మాతాపితరుల ప్రేమానురాగాలను మరచిపోయినాడు. ఇంతటి కృతఘ్నుడైన ఇతడు ఆ విష్ణువునకు మాత్రము ఎట్టి మేలు చేయగలడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
పరాయివాడైనను ఔషధమువలె మేలు చేకూర్చినచో, అతడొక విధముగా పుత్రుడేయగును. కాని, తన కుమారుడే కీడుతలపెట్టినచో, అతడు రోగమువలె శత్రువేయగును. శరీరములోని ఒక అంగము వలన శరీరమంతటికిని హాని జరిగినచో, వెంటనే దానిని ఖండింపవలెను. అట్లొనర్చినచో, మిగిలిన శరీరము సురక్షితముగును. అప్పుడు ఆ వ్యక్తి హాయిగ జీవింపగలడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
స్వజనునివలె నటించుచున్న వీడు నిజముగా నాకు శత్రువే. భోగలాలసుడైన యోగికి అతని యింద్రియములే నష్టము కలిగించునటులు, పుత్రుడైన ఇతడే నాకు ద్రోహమును తలపెట్టినాడు. కనుక, భుజించు సమయమునగాని, నిద్రించునపుడుగాని, కూర్చొనియున్నప్పుడుగాని, ఏదైనా ఒక ఉపాయముచే ఇతనిని చంపివేయుడు".
హిరణ్యకశిపుడు ఇట్లు ఆదేశింపగనే దైత్యులు త్రిశూలములను చేబూని కొట్టుడు, చంపుడు అని బిగ్గరగా అరవసాగిరి. ఆ దైత్యుల కోరలు వాడిగా నుండెను. ముఖములు భయంకరముగా నుండెను. గడ్డములు, మీసములు, కేశములు రాగి వన్నెలో ఉండెను. ప్రహ్లాదుడు మాత్రము మౌనము వహించి యుండెను. వారు అతని ఆయువుపట్టులను శూలములతో పొడుచుచుండిరి.
ఆ సమయమున ప్రహ్లాదుడు తన చిత్తమును పరబ్రహ్మమునందే నిలిపియుండెను. ఆ పరమాత్మ అవాఙ్మానస గోచరుడు, సకల ప్రాణులలో విలసిల్లుచుండు వాడు. ఆ ప్రభువు సమస్త శక్తులకును ఆధారమైనవాడు. కనుక ఆ దైత్యుల ప్రహారములు అన్నియును అదృష్టహీనుని కార్యములవలె నిష్ఫలములయ్యెను.
ధర్మరాజా! శూలములచే పొడుచుటవలన ప్రహ్లాదుని శరీరముపై ఎట్టి గాయము కలుగకపోవుటను జూచి, హిరణ్యకశిపునకు గొప్ప సంశయము గలిగెను. అప్పుడు అతడు ప్రహ్లాదుని వధించుటకై పలు ఉపాయములను పన్నసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మద గజములచే త్రొక్కించెను. విషసర్పములచే కరిపించెను. కృత్య అను రాక్షసిచే బాధింపజేసెను. పర్వత శిఖరములనుండి పడద్రోయించెను. శంబరాసురుని మాయోపాయములను ప్రయోగించెను. చీకటి కొట్లలో బంధించెను. విషమును త్రాగించెను. భోజనమును లేకుండజేసెను. మంచు తిన్నెలపై నిలిపెను. తీవ్రమైన గాలులతో బాధించెను. అగ్ని కుండములలో పడద్రోయించెను. సముద్ర జలములలో ముంచెను. పర్వతముల క్రింద నలిగి పోవునట్లు చేసెను. కానీ, ఈ ఉపాయములలో దేనిచేతను గూడ నిర్దోషియైన తన పుత్రుని చంపలేకపోయెను. అప్పుడు అతడు దీర్ఘముగా ఆలోచింపసాగెను. ప్రహ్లాదుని చంపించుటకు ఎట్టి ఉపాయమూ తోచలేదు.
అతడు ఇట్లు ఆలోచింపసాగెను- 'ఇతనిని ఎన్నియో పరుషోక్తులాడితిని, చంపించుటకు పెక్కు ప్రయత్నములు చేసితిని. కాని, నేను చేసిన అపచారములు, దుష్టప్రయత్నములు, అతని తేజస్సుముందు ఏమాత్రమూ పనిచేయకుండెను.
ఇతడు బాలుడేయైనను గొప్పతెలివి గలవాడు. నా సమీపముననే నిర్భయముగానుండెను. ఇతనిలో ఏదో తెలియని ఒక అద్భుతశక్తి యున్నది. పూర్వము శునశ్శేపుడు తన తండ్రి చేసిన కార్యము ఫలితముగా అతనికి విరోధియయ్యెను.అట్లే ఇతడు గూడ నా దుష్కార్యములను మరచిపోడు. ఇతడు ఎవరికి భయపడుట లేదు. ఇంతగా ప్రయత్నించినను మృతుడు కాలేదు. ఇతని శక్తి ఎంతటిదో అర్థమగుటలేదు. ఇతని యెడ శత్రుత్వము వహించుట వలన ఇతని వలననే నాకు చావు తప్పనట్లున్నది.
శునశ్శేపుని వృత్తాంతము (సంక్షిప్తముగా - పూర్తికథ నవమస్కంధమునందు ఏడవ అధ్యాయమునందు వచ్చును. ఇక్కడ కూడా ప్రత్యేక సందేశముగా నీయబడినది)
శునశ్శేపుడు అజీగర్తుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు. వరుణయాగమునందు బలియిచ్చుటకై అతని తండ్రి హరిశ్చంద్రుని పుత్రుడైన లోహితాస్యునకు అమ్మివేసెను. అప్పుడు అతని మామయైన విశ్వామిత్రుడు అతనిని రక్షించెను. అంతట అతడు తన తండ్రికి విరోధియై విశ్వామిత్రుని పక్షమున చేరెను.
ఇట్లు చింతించుటవలన హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. అంతట అతడు తలవంచుకొని యుండుటను శుక్రాచార్యుని కుమారులైన శండామార్కులు చూచిరి. వారు ఏకాంతముగా ఆయనతో ఇట్లు పలికిరి-"ప్రభూ! నీవు ఒక్కడవే ముల్లోకములను జయించితివి. నీవు కోపముతో బొమముడి వైచినంతనే లోకపాలురు గడగడలాడెదరు. ఈ బాలుని విషయములో నీవు ఏమాత్రము చింతింపవలదు. పిల్లల విషయములో మంచి చెడులను గూర్చి అంతగా మథనపడవలసిన పనియేలేదు. మా తండ్రియైన శుక్రాచార్యుడు ఇచటికి రానంత వరకును ఇతడు భయపడి ఎక్కడికిని పారిపోడు. కనుక ఇతని వరుణపాశముతో బంధింపుడు. వయస్సు పెరుగుచున్న కొలదియు గురువుల సేవల ప్రభావమువలన ఇతని బుద్ధి మారవచ్చును.
'సరే! మంచిది!. అని పలికి హిరణ్యకశిపుడు గురుపుత్రుల సూచనను మన్నించెను. పిదప, గృహస్థులైన రాజులు పాటించునట్టి ధర్మములను ఇతనికి ఉపదేశింపుడు' అని పలికెను.
ధర్మరాజా! అంతట పురోహితులు ప్రహ్లాదుని తీసికొని తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. అతనికి క్రమముగ ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములలో శిక్షణను ఇచ్చిరి. ప్రహ్లాదుడు అచట మిక్కిలి వినమ్రుడై సేవకునివలె ఉండసాగెను. కాని, గురువుల ఉపదేశము ప్రహ్లాదునకు నచ్చలేదు. ఏలయన,అది కేవలము ధర్మార్థకామములకు సంబంధించినది మాత్రమే అయియుండెను. ఆ విద్య రాగద్వేషాది ద్వంద్వములలో విషయభోగములకు మాత్రమే ప్రయోజనకరము.
ఒకనాడు గురువు ఇంటి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళియుండెను. అవకాశము దొరికినందులకు సమవయస్కులైన బాలురు తమతో ఆడుకొనుటకు పిలిచిరి. ప్రహ్లాదుడు పరమ జ్ఞాని. తనయెడ వారికిగల ప్రేమనుజూచి అతడు మధుర వచనములతో వారిని తన యొద్దకు పిలిచెను. వెంటనే ప్రేమపూర్వకముగా వారికి అతడు ఉపదేశింప సాగెను.
ధర్మరాజా! వారు ఇంకను పిన్నవయస్కులే. కావున రాగద్వేషములతో, విషయ భోగలాలసులైన పురుషుల ఉపదేశముల వలనను, చేష్టల వలనను వారి బుద్ధులు ఇంకనూ కలుషితములు కాలేదు. ప్రహ్లాదునిపై గల గౌరవభావముతో వారు తమ ఆట వస్తువులను త్యజించి, అతని చుట్టును చేరిరి. ఏకాగ్రచిత్తముతో అతని ఉపదేశములను వినుచు ప్రేమ పూర్వకముగ అతని వైఫు చూడసాగిరి. పరమభాగవతుడు, సుహృదుడు ఐన ప్రహ్లాదుడు వారిపై కరుణచూపుచు ఇట్లు పలుకసాగెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమోఽధ్యాయః (5)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
5.1 (ప్రథమ శ్లోకము)
పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురైః|
షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజగృహాంతికే॥5768॥
5.2 (రెండవ శ్లోకము)
తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదమ్|
పాఠయామాసతుః పాఠ్యానన్యాంశ్చాసురబాలకాన్॥5769॥
నారదుడు పలికెను- దైత్యులు పూజ్యుడైన శుక్రాచార్యుని తమ పురోహితునిగా నియమించుకొనియుండిరి. అతనికి శందుడు, అమర్కుడు అను ఇరువురు కుమారులు గలరు. వారు రాజభవనమునకు సమీపమునందే నివసించుచుండిరి. హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు నీతికోవిదుడైన ప్రహ్లాదునకును, ఇంకను ఇతర దైత్యబాలురకును రాజనీతి, అర్థనీతి శాస్త్రములను నేర్పుచుండిరి.
5.3 (మూడవ శ్లోకము)
యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేఽనుపపాఠ చ|
న సాధు మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయం॥5770॥
ప్రహ్లాదుడు గురువు నేర్పిన పాఠమును వినుచుండెను. యథాతథముగ వినిపించుచుండెను. కాని, అవి అతని మనస్సునకు నచ్చకుండెను. ఏలయన, ఆ పాఠములు స్వ-పరభేదములను తెలుపుచుండెను.
5.4 (నాలుగవ శ్లోకము)
ఏకదాసురరాట్ పుత్రమంకమారోప్య పాండవ|
పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్॥5771॥
ధర్మరాజా! ఒకనాడు హిరణ్యకశిపుడు తనపుత్రుడైన ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో చేర్చుకొని, ఇట్లు ప్రశ్నించెను. 'కుమారా! నీవు నేర్చిన వాటిలో నీకు మంచిదని తోచిన ఒకదానిని వినిపింపుము'.
ప్రహ్లాద ఉవాచ
5.5 (ఐదవ శ్లోకము)
తత్సాధు మన్యేఽసురవర్య దేహినాంసదా సముద్విగ్నధియామసద్గ్రహాత్|
హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత॥5772॥
ప్రహ్లాదుడు పలికెను - "నాయనా! ఈ జగత్తున మానవులు 'నేను, నాది' అను మాయలోబడి మిథ్యావిషయములను పట్టుకొని సర్వదా ఉద్విగ్నులగుచుందురు. ఇదే వారి అధఃపతనమునకు మూలకారణము' - అని నేను తలంతును. గృహము గడ్డితో కప్పబడిన అంధకార మయమైన బావి వంటిది. జనులు దానిని త్యజించి, వనములలో సాధుపురుషుల సాంగత్యమును నెఱపుచు శ్రీహరిని శరణు వేడుటయే మేలు"
నారద ఉవాచ
5.6 (ఆరవ శ్లోకము)
శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః|
జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః॥5773॥
5.7 (ఏడవ శ్లోకము)
సమ్యగ్విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః|
విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైర్న భిద్యేతాస్య ధీర్యథా॥5774॥
నారదుడు పలిచెను- ప్రహ్లాదునినోట శత్రువుల యొక్క ప్రశంసను విని, హిరణ్యకశిపుడు బిగ్గరగా నవ్వి ఇట్లనెను- 'శత్రుపక్షపాతము గలవారు బాలుర బుద్ధులను వక్రమార్గమును పట్టింతురు. గురువు గారి ఇంటిలో కొందరు విష్ణు పక్షపాతము గల బ్రాహ్మణులు మారు వేషములతో నివసించుచున్నారని నేను అనుకొందును. ఈ బాలుని బుద్ధి అపమార్గము పట్టకుండ చక్కగా శిక్షణ గరపవలెను".
5.8 (ఎనిమిదవ శ్లోకము)
గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః|
ప్రశస్య శ్లక్ష్ణయా వాచా సమపృచ్ఛంత సామభిః॥5775॥
దైత్యులు ప్రహ్లాదుని మరల గురువుల ఇంటికి చేర్చిరి. అప్పుడు వారు ప్రహ్లాదుని బుజ్జగించుచు మధురముగా అనునయవచములను పలికిరి-
5.9 (తొమ్మిదవ శ్లోకము)
వత్స ప్రహ్లాద భద్రం తే సత్యం కథయ మా మృషా|
బాలానతి కుతస్తుభ్యమేష బుద్ధివిపర్యయః॥5776॥
5.10 (పదియవ శ్లోకము)
బుద్ధిభేదః పరకృత ఉతాహో తే స్వతోఽభవత్|
భణ్యతాం శ్రోతుకామానాం గురూణాం కులనందన॥5777॥
"కుమారా! ప్రహ్లాదా! నీకు శుభమగుగాక! నిజము పలుకుము. నీ బుద్ధి ఇట్లు ఏల వక్రించినది. ఇతర బాలకుల బుద్ధి ఇట్లు లేదుగదా! వంశోద్ధారకా! నీ బుద్ధిని ఇతరులు ఎవరైనను ఇట్లు వక్రమార్గమును పట్టించిరా? లేక సహజముగనే నీకు తోచినదా! గురువులమైన మేము తెలిసికొనగోరుచున్నాము. తెలుపుము.
ప్రహ్లాద ఉవాచ
5.11 (పదకొండవ శ్లోకము)
స్వ: పరశ్చేత్యసద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః|
విమోహితధియాం దృష్టస్తస్మై భగవతే నమః॥5778॥
5.12 (పండ్రెండవ శ్లోకము)
స యదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే|
అన్య ఏష తథాన్యోఽహమితి భేదగతాసతీ॥5779॥
5.13 (పదమూడవ శ్లోకము)
స ఏష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిర్దురత్యయానుక్రమణో నిరూప్యతే|
ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం॥5780॥
5.14 (పదునాలుగవ శ్లోకము)
యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్షసన్నిధౌ|
తథా మే భిద్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్ఛయా॥5781॥
ప్రహ్లాదుడు పలికెను - "భగవంతుని మాయకు వశులైన మనుష్యులయొక్క బుద్ధి మోహగ్రస్తమగుచుండును. దానివలన వారు స్వ-పర భేదమునకు లోనగుచుందురు. అట్టి మాయాధీశుడగు ఆ భగవంతునకు నమస్కారము. పశుబుద్ధి కారణముగనే మానవులకు 'ఇది నేను, ఇది నాకంటెను వేరైనది' అను భేదబుద్ధి కలుగును. భగవంతుని కృపకలిగిన నాడు ఈ పశుబుద్ధి తొలగిపోవును. ఈ ఆత్మయే ఆ పరమాత్మ. అజ్ఞానులు ఇది - నేను, ఇతడు పరాయివాడు అను భేదముతో ఆ ఆత్మనే వర్ణింతురు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనుట మిగుల కష్టము. బ్రహ్మాది వేదజ్ఞులు గూడ ఆ విషయమున మోహితులగు చుందురు. ఆ పరమాత్మయే నా బుద్ధి వక్రించినది అని మీతో పలికించుచున్నాడు. గురువులారా! అయస్కాంతము వైఫు ఇనుము స్వయముగా ఆకర్షింపబడును. అట్లే చక్రధారియైన ఆ శ్రీహరివైపు నా మనస్సు తనంతటతానే భక్తిప్రపత్తులతో ఆకృష్టమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
26.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
5.15 (పదునైదవ శ్లోకము)
ఏతావద్బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః|
తం నిర్భర్త్స్యాథ కుపితః సుదీనో రాజసేవకః॥5782॥
నారదుడు ఇట్లు పలికెను- పరమజ్ఞానియైన ప్రహ్లాదుడు తన గురువుతో ఇట్లు పలికి మిన్నకుండెను. ఆ పురోహితుడు రాజునకు సేవకుడు, పరాధీనుడు. అతనిలో కోపము ముంచుకొనివచ్చెను. అపుడు ఆ పురోహితుడు ప్రహ్లాదుని మందలించుచు ఇట్లు పలికెను-
5.16 (పదునారవ శ్లోకము)
ఆనీయతామరే వేత్రమస్మాకమయశస్కరః|
కులాంగారస్య దుర్బుద్ధేశ్చతుర్థోఽస్యోదితో దమః॥5783॥
5.17 (పదునేడవ శ్లోకము)
దైతేయచందనవనే జాతోఽయం కంటకద్రుమః|
యన్మూలోన్మూలపరశోర్విష్ణోర్నాలాయితోఽర్భకః॥5784॥
"అరే, ఎవ్వరైనను ఒక బెత్తమును తీసికొనిరండు. ఈ బాలుడు మా కీర్తికి కళంకమును తెచ్చుచున్నాడు. తమ వంశమునకు చిచ్చు పెట్టుచున్నాదు. ఈ దుర్బుద్ధిని బాగుచేయుటకు చతురుపాయములలో నాల్గవదియైన దండనయే సరియైనది. దైత్యవంశమనెడి చందనవనమునందు ఇతడు ఒక ముండ్ల పొదవలె జన్మించినాడు. విష్ణువు ఈ వనమును భేదించునట్టి గొడ్డలివంటివాడు. ఈ ఆర్భకుడు అతనికే తోడ్పడుచున్నాడు"
5.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఇతి తం వివిధోపాయైర్భీషయంస్తర్జనాదిభిః|
ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం॥5785॥
ఈ విధముగా గురువు పలు విధములుగా మందలించుచు ప్రహ్లాదుని భయపెట్టెను. ధర్మార్ధకామముల యందు అతనికి శిక్షణను ఇచ్చెను.
5.19 (పందొమ్మిదవ శ్లోకము)
తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయం|
దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతమ్॥5786॥
ప్రహ్లాదుడు సామదానభేద దండోపాయములను గూర్చి చక్కగా తెలిసినవాడని గురువు గ్రహించెను. అపుడు అతడు ప్రహ్లాదుని అతని తల్లి దగ్గరకు తీసికొనిపోయెను. తల్లి మిక్కిలి వాత్సల్యముతో అతనిచే స్నానము చేయించి, మంచి వస్త్రాభరణములను అలంకరింప జేసినది. పిమ్మట ఆమె అతనిని హిరణ్యకశిపుని కడకు తీసికొని పోయెను.
5.20 (ఇరువదియవ శ్లోకము)
పాదయోః పతితం బాలం ప్రతినంద్యాశిషాసురః|
పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిం॥
ప్రహ్లాదుడు తన తండ్రిపాదములకు నమస్కరించెను. హిరణ్యకశిపుడు అతనిని ఆశీర్వదించి తన రెండు చేతులతో లేవనెత్తి అక్కున జేర్చుకొనెను. ఆ సమయమున ఆ దైత్యరాజుయొక్క హృదయము ఆనందముతో నిండిపోయెను.
5.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభిః|
ఆసించన్ వికసద్వక్త్రమిదమాహ యుధిష్ఠిర॥5788॥
హిరణ్యకశిపురువాచ
5.22 (ఇరువది రెండవ శ్లోకము)
ప్రహ్లాదానూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం|
కాలేనైతావతాఽఽయుష్మన్ యదశిక్షద్గురోర్భవాన్॥5789॥
ధర్మరాజా! హిరణ్యకశిపుడు ప్రసన్నముఖుడైన ప్రహ్లాదుని తన యొడిలోనికి చేర్చుకొని శిరమును మూర్కొనెను. అతని నేత్రములనుండి జాలువాఱిన ఆనందాశ్రువులు ప్రహ్లాదుని శరీరమును తడిపివేసేను.పిమ్మట హిరణ్యకశిపుడు తన పుత్రునితో ఇట్లు పలికెను "చిరంజీవీ! ప్రహ్లాదా! ఇంతవరకును గురువునొద్ద నీవు అభ్యసించిన విద్యలో శ్రేష్ఠమైన విషయమును వివరింపుము"
ప్రహ్లాద ఉవాచ
5.23 (ఇరువది మూడవ శ్లోకము)
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం॥5790॥
5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా|
క్రియేత భగవత్యద్ధా తన్మన్యేఽధీతముత్తమమ్॥5791॥
ప్రహ్లాదుడు వచించెను తండ్రీ శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగు వానిని వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామ రూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మనివేదనము చేయుట. ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తియని వ్యవహరింతురు.
5.25 (ఇరువది ఐదవ శ్లోకము)
నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా|
గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః॥5792॥
5.26 (ఇరువది ఆరవ శ్లోకము)
బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతాసతా|
అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే॥5793॥
5.27 (ఇరువది ఏడవ శ్లోకము)
సంతి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్ఛద్మవేషిణః|
తేషాముదేత్యఘం కాలే రోగః పాతకినామివ॥5794॥
ప్రహ్లాదుని ఈ వచనములను వినగనే హిరణ్యకశిపుడు క్రోధావిష్టుడు అయ్యెను. పెదవులు వణక సాగెను. పిదప గురుపుత్రునితో ఇట్లనెను- "ఓరీ! బ్రాహ్మణాధమా! నీవు కుబుద్ధివి. ఇదియేనా నీవు నేర్పిన విద్య? నన్ను ఏమాత్రమూ లక్ష్యపెట్టక మా కుమారునకు ఇట్టి సారరహితమైన విషయములను నేర్పితివి. నీవు నా శత్రుపక్షమును వహించినట్లున్నది. లోకములో మిత్రులవలె నటించుచు శత్రువుల కార్యములను నెరవేర్చు దుష్టులకు కొదువలేదు. కాని, రహస్యముగ పాపకృత్యములను ఒనర్చిన వారి పాపములు సమయము వచ్చినప్ఫుడు రోగముల రూపములో బయటపడినట్లు ఈ దుష్టాత్ముల దుర్బుద్ధి ఏదేని యొక సమయమున బహిర్గతము కాక తప్ఫదు.
గురుపుత్ర ఉవాచ
5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
న మత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేంద్రశత్రో|
నైసర్గికీయం మతిరస్య రాజన్
నియచ్ఛ మన్యుం కదదాః స్మ మా నః॥5795॥
గురుపుత్రుడు పలికెను ఇంద్రశత్రూ! మీ పుత్రుడు పలుకుచున్న మాటలు నేనుగాని, మరెవ్వరైనగాని నేర్పినవి కావు. ప్రభూ! ఇతనికి ఈ బుద్ధి జన్మతః అబ్బినది. కోపమును వీడి శాంతి వహింపుము. మాపై దోషారోపము చేయవద్దు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
26.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
గురుణైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురః సుతమ్|
న చేద్గురుముఖీయం తే కుతోఽభద్రాసతీ మతిః॥5796॥
నారదుడు వచించెను- ధర్మరాజా! గురువు ఈ విధముగా సమాధానము ఇచ్చినంతనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరల ఇట్లు ప్రశ్నించెను- 'బాలకా! ఇట్లు అమంగళకరమైన ఈ దుర్బుద్ధి గురువునుండి నీకు ప్రాప్తింపనిచో, మరి ఎట్లు అబ్బినది?'
ప్రహ్లాద ఉవాచ
5.30 (ముప్పదియవ శ్లోకము)
మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిథోఽభిపద్యేత గృహవ్రతానామ్|
అదాంతగోభిర్విశతాం తమిస్రం పునః పునశ్చర్వితచర్వణానామ్॥5797॥
5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
న తే విదుః స్వార్థగతిం హి విష్ణుం దురాశయా యే బహిరర్థమానినః|
అంధా యథాంధైరుపనీయమానా వాచీశతంత్యామురుదామ్ని బద్ధాః॥5798॥
ప్రహ్లాదుడు నుడివెను- తండ్రీ! ప్రపంచములో జనులు ఇంద్రియములకు వశులై అనుభవించిన విషయ సుఖములనే మరలమరల అనుభవింపగోరుదురు. ఇవి చర్విత చరణములే (నమలిన వాటినే మరల నమలుటవంటిది). అట్టివారు సంసార రూప ఘోరనరకమున పడియుందురు. అట్టి గృహాసక్తులైన వారి బుద్ధి సహజముగా గాని, ఇతరులు నేర్పుటవలనగాని శ్రీహరియందు కుదురుకొనదు. ఇంద్రియములకు గోచరించు బాహ్యవిషయములే పరమార్థములని భావించునట్టి మూర్ఖులు, అంధుని మార్గనిర్దెశములో నడచునట్టి అంధునివలె గోతులలో పడుదురు. వారు వేదములో వర్ణింపబడు కామ్యకర్మలచే బంధింపబడుదురు. అట్టి వారికి స్వార్థపరమార్థములు శ్రీమహావిష్ణువు అని తెలియదు. అట్లు అజ్ఞానులను ఆశ్రయించుట వలన పురుషార్థములు ఎట్లు సిద్ధించును?
5.32 (ముప్పది రెంఢవ శ్లోకము)
నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః|
మహీయసాం పాదరజోఽభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్ *॥5799॥
శ్రీహరిపాదపద్మముల యందే నిమగ్నమైన బుద్ధిగల వారిని జనన మరణరూప అనర్థములు అన్నియును పూర్తిగా వదలిపోవును. కాని, భగవద్భక్తులైన అకించనుల పాదధూళిలో స్నానమొనర్పనివారు, కామ్యకర్మలను ఎంతగా సేవించినను వారి బుద్ధి భగవచ్చరణారవిందములయందు లగ్నముకాదు.
5.33 (ముప్పది మూడవ శ్లోకము)
ఇత్యుక్త్వోపరతం పుత్రం హిరణ్యకశిపూ రుషా|
అంధీకృతాత్మా స్వోత్సంగాన్నిరస్యత మహీతలే॥5800॥
ప్రహ్లాదుడు ఈ విధముగ పలికి మిన్నకుండెను. హిరణ్యకశిపుడు మాత్రము క్రోధాంధుడై అతనిని తనయొడి నుండి నేలపై పడద్రోసెను.
5.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
ఆహామర్షరుషావిష్టః కషాయీభూతలోచనః|
వధ్యతామాశ్వయం వధ్యో నిఃసారయత నైరృతాః॥5801॥
ప్రహ్లాదుని వచనములకు హిరణ్యకశిపుడు కోపావిష్టుడయ్యెను. అతని కనులు ఎర్రబారెను. వెంటనే అతడు ఇట్లుపలికెను- "దైత్యులారా! వీనిని ఇప్ఫుడే ఇచటి నుండి గొనిపోయి చంపివేయుడు. ఇతడు వధార్హుడు.
5.35 (ముప్పది ఐదవ శ్లోకము)
అయం మే భ్రాతృహా సోఽయం హిత్వా స్వాన్ సుహృదోఽధమః|
పితృవ్యహంతుర్యః పాదౌ విష్ణోర్దాసవదర్చతి॥5802॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఈ బాలుడు తన తోడివారిని, స్వజనులను కాదని, తన పినతండ్రిని చంపిన విష్ణుని పాదములనే ఒక సేవకునివలె పూజించుచున్నాడు. నా సోదరుని చంపిన విష్ణువే ఈ రూపమున వచ్చినట్లున్నది.
5.36 (ముప్పది ఆరవ శ్లోకము)
విష్ణోర్వా సాధ్వసౌ కిం ను కరిష్యత్యసమంజసః|
సౌహృదం దుస్త్యజం పిత్రోరహాద్యః పంచహాయనః॥5803॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
ఇతడు విశ్వాసపాత్రుడు కాడు. ఐదు సంవత్సరముల వయస్సులోనే విడదీయరాని మాతాపితరుల ప్రేమానురాగాలను మరచిపోయినాడు. ఇంతటి కృతఘ్నుడైన ఇతడు ఆ విష్ణువునకు మాత్రము ఎట్టి మేలు చేయగలడు.
5.37 (ముప్పది ఏడవ శ్లోకము)
పరోఽప్యపత్యం హితకృద్యథౌషధం స్వదేహజోఽప్యామయవత్సుతోఽహితః|
ఛింద్యాత్తదంగం యదుతాత్మనోఽహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్॥5805॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
పరాయివాడైనను ఔషధమువలె మేలు చేకూర్చినచో, అతడొక విధముగా పుత్రుడేయగును. కాని, తన కుమారుడే కీడుతలపెట్టినచో, అతడు రోగమువలె శత్రువేయగును. శరీరములోని ఒక అంగము వలన శరీరమంతటికిని హాని జరిగినచో, వెంటనే దానిని ఖండింపవలెను. అట్లొనర్చినచో, మిగిలిన శరీరము సురక్షితముగును. అప్పుడు ఆ వ్యక్తి హాయిగ జీవింపగలడు.
5.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
సర్వైరుపాయైర్హంతవ్యః సంభోజశయనాసనైః|
సుహృల్లింగధరః శత్రుర్మునేర్దుష్టమివేంద్రియం॥5805॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపముతోనూగిపోవుచు, దైత్యులతో ఇంకను ఇట్లను చుండెను
స్వజనునివలె నటించుచున్న వీడు నిజముగా నాకు శత్రువే. భోగలాలసుడైన యోగికి అతని యింద్రియములే నష్టము కలిగించునటులు, పుత్రుడైన ఇతడే నాకు ద్రోహమును తలపెట్టినాడు. కనుక, భుజించు సమయమునగాని, నిద్రించునపుడుగాని, కూర్చొనియున్నప్పుడుగాని, ఏదైనా ఒక ఉపాయముచే ఇతనిని చంపివేయుడు".
5.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
నైరృతాస్తే సమాదిష్టా భర్త్రా వై శూలపాణయః|
తిగ్మదంష్ట్రకరాలాస్యాస్తామ్రశ్మశ్రుశిరోరుహాః॥5806॥
5.40 (నలుబదియవ శ్లోకము)
నదంతో భైరవాన్నాదాన్ ఛింధి భింధీతి వాదినః|
ఆసీనం చాహనన్ శూలైః ప్రహ్లాదం సర్వమర్మసు॥5807॥
హిరణ్యకశిపుడు ఇట్లు ఆదేశింపగనే దైత్యులు త్రిశూలములను చేబూని కొట్టుడు, చంపుడు అని బిగ్గరగా అరవసాగిరి. ఆ దైత్యుల కోరలు వాడిగా నుండెను. ముఖములు భయంకరముగా నుండెను. గడ్డములు, మీసములు, కేశములు రాగి వన్నెలో ఉండెను. ప్రహ్లాదుడు మాత్రము మౌనము వహించి యుండెను. వారు అతని ఆయువుపట్టులను శూలములతో పొడుచుచుండిరి.
5.41 (నలుబది ఒకటవ శ్లోకము)
పరే బ్రహ్మణ్యనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని|
యుక్తాత్మన్యఫలా ఆసన్నపుణ్యస్యేవ సత్క్రియాః॥5808॥
ఆ సమయమున ప్రహ్లాదుడు తన చిత్తమును పరబ్రహ్మమునందే నిలిపియుండెను. ఆ పరమాత్మ అవాఙ్మానస గోచరుడు, సకల ప్రాణులలో విలసిల్లుచుండు వాడు. ఆ ప్రభువు సమస్త శక్తులకును ఆధారమైనవాడు. కనుక ఆ దైత్యుల ప్రహారములు అన్నియును అదృష్టహీనుని కార్యములవలె నిష్ఫలములయ్యెను.
5.42 (నలుబది రెండవ శ్లోకము)
ప్రయాసేఽపహతే తస్మిన్ దైత్యేంద్రః పరిశంకితః|
చకార తద్వధోపాయాన్ నిర్బంధేన యుధిష్ఠిర॥5809॥
ధర్మరాజా! శూలములచే పొడుచుటవలన ప్రహ్లాదుని శరీరముపై ఎట్టి గాయము కలుగకపోవుటను జూచి, హిరణ్యకశిపునకు గొప్ప సంశయము గలిగెను. అప్పుడు అతడు ప్రహ్లాదుని వధించుటకై పలు ఉపాయములను పన్నసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
27.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఐదవ అధ్యాయము
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకు ప్రయత్నించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
5.43 (నలుబది మూడవ శ్లోకము)
దిగ్గజైర్దందశూకైశ్చ అభిచారావపాతనైః|
మాయాభిః సన్నిరోధైశ్చ గరదానైరభోజనైః॥5810॥
5.44 (నలుబది నాలుగవ శ్లోకము)
హిమవాయ్వగ్నిసలిలైః పర్వతాక్రమణైరపి|
న శశాక యదా హంతుమపాపమసురః సుతమ్|
చింతాం దీర్ఘతమాం ప్రాప్తస్తత్కర్తుం నాభ్యపద్యత॥5811॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మద గజములచే త్రొక్కించెను. విషసర్పములచే కరిపించెను. కృత్య అను రాక్షసిచే బాధింపజేసెను. పర్వత శిఖరములనుండి పడద్రోయించెను. శంబరాసురుని మాయోపాయములను ప్రయోగించెను. చీకటి కొట్లలో బంధించెను. విషమును త్రాగించెను. భోజనమును లేకుండజేసెను. మంచు తిన్నెలపై నిలిపెను. తీవ్రమైన గాలులతో బాధించెను. అగ్ని కుండములలో పడద్రోయించెను. సముద్ర జలములలో ముంచెను. పర్వతముల క్రింద నలిగి పోవునట్లు చేసెను. కానీ, ఈ ఉపాయములలో దేనిచేతను గూడ నిర్దోషియైన తన పుత్రుని చంపలేకపోయెను. అప్పుడు అతడు దీర్ఘముగా ఆలోచింపసాగెను. ప్రహ్లాదుని చంపించుటకు ఎట్టి ఉపాయమూ తోచలేదు.
5.45 (నలుబది ఐదవ శ్లోకము)
ఏష మే బహ్వసాధూక్తో వధోపాయాశ్చ నిర్మితాః|
తైస్తైర్ద్రోహైరసద్ధర్మైర్ముక్తః స్వేనైవ తేజసా॥5812॥
అతడు ఇట్లు ఆలోచింపసాగెను- 'ఇతనిని ఎన్నియో పరుషోక్తులాడితిని, చంపించుటకు పెక్కు ప్రయత్నములు చేసితిని. కాని, నేను చేసిన అపచారములు, దుష్టప్రయత్నములు, అతని తేజస్సుముందు ఏమాత్రమూ పనిచేయకుండెను.
5.46 (నలుబది ఆరవ శ్లోకము)
వర్తమానోఽవిదూరే వై బాలోఽప్యజడధీరయం|
న విస్మరతి మేఽనార్యం శునఃశేప ఇవ ప్రభుః॥5813॥
5.47 (నలుబది ఏడవ శ్లోకము)
అప్రమేయానుభావోఽయమకుతశ్చిద్భయోఽమరః|
నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా న వా॥5814॥
ఇతడు బాలుడేయైనను గొప్పతెలివి గలవాడు. నా సమీపముననే నిర్భయముగానుండెను. ఇతనిలో ఏదో తెలియని ఒక అద్భుతశక్తి యున్నది. పూర్వము శునశ్శేపుడు తన తండ్రి చేసిన కార్యము ఫలితముగా అతనికి విరోధియయ్యెను.అట్లే ఇతడు గూడ నా దుష్కార్యములను మరచిపోడు. ఇతడు ఎవరికి భయపడుట లేదు. ఇంతగా ప్రయత్నించినను మృతుడు కాలేదు. ఇతని శక్తి ఎంతటిదో అర్థమగుటలేదు. ఇతని యెడ శత్రుత్వము వహించుట వలన ఇతని వలననే నాకు చావు తప్పనట్లున్నది.
శునశ్శేపుని వృత్తాంతము (సంక్షిప్తముగా - పూర్తికథ నవమస్కంధమునందు ఏడవ అధ్యాయమునందు వచ్చును. ఇక్కడ కూడా ప్రత్యేక సందేశముగా నీయబడినది)
శునశ్శేపుడు అజీగర్తుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు. వరుణయాగమునందు బలియిచ్చుటకై అతని తండ్రి హరిశ్చంద్రుని పుత్రుడైన లోహితాస్యునకు అమ్మివేసెను. అప్పుడు అతని మామయైన విశ్వామిత్రుడు అతనిని రక్షించెను. అంతట అతడు తన తండ్రికి విరోధియై విశ్వామిత్రుని పక్షమున చేరెను.
5.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
ఇతి తచ్చింతయా కించిన్మ్లానశ్రియమధోముఖమ్|
శండామర్కావౌశనసౌ వివిక్త ఇతి హోచతుః॥5815॥
5.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
జితం త్వయైకేన జగత్త్రయం భ్రువోర్విజృంభణత్రస్తసమస్తధిష్ణ్యపమ్|
న తస్య చింత్యం తవ నాథ చక్ష్మహే న వై శిశూనాం గుణదోషయోః పదమ్॥5816॥
5.50 (ఏబదియవ శ్లోకము)
ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా|
బుద్ధిశ్చ పుంసో వయసార్యసేవయా యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి॥5817॥
ఇట్లు చింతించుటవలన హిరణ్యకశిపుని ముఖము వాడిపోయెను. అంతట అతడు తలవంచుకొని యుండుటను శుక్రాచార్యుని కుమారులైన శండామార్కులు చూచిరి. వారు ఏకాంతముగా ఆయనతో ఇట్లు పలికిరి-"ప్రభూ! నీవు ఒక్కడవే ముల్లోకములను జయించితివి. నీవు కోపముతో బొమముడి వైచినంతనే లోకపాలురు గడగడలాడెదరు. ఈ బాలుని విషయములో నీవు ఏమాత్రము చింతింపవలదు. పిల్లల విషయములో మంచి చెడులను గూర్చి అంతగా మథనపడవలసిన పనియేలేదు. మా తండ్రియైన శుక్రాచార్యుడు ఇచటికి రానంత వరకును ఇతడు భయపడి ఎక్కడికిని పారిపోడు. కనుక ఇతని వరుణపాశముతో బంధింపుడు. వయస్సు పెరుగుచున్న కొలదియు గురువుల సేవల ప్రభావమువలన ఇతని బుద్ధి మారవచ్చును.
5.51 (ఏబది ఒకటవ శ్లోకము)
తథేతి గురుపుత్రోక్తమనుజ్ఞాయేదమబ్రవీత్|
.
ధర్మా హ్యస్యోపదేష్టవ్యా రాజ్ఞాం యో గృహమేధినాం॥5818॥
'సరే! మంచిది!. అని పలికి హిరణ్యకశిపుడు గురుపుత్రుల సూచనను మన్నించెను. పిదప, గృహస్థులైన రాజులు పాటించునట్టి ధర్మములను ఇతనికి ఉపదేశింపుడు' అని పలికెను.
5.52 (ఏబది రెండవ శ్లోకము)
ధర్మమర్థం చ కామం చ నితరాం చానుపూర్వశః|
ప్రహ్లాదాయోచతూ రాజన్ ప్రశ్రితావనతాయ చ॥5819॥
5.53 (ఏబది మూడవ శ్లోకము)
యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితం|
న సాధు మేనే తచ్ఛిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం॥5820॥
ధర్మరాజా! అంతట పురోహితులు ప్రహ్లాదుని తీసికొని తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. అతనికి క్రమముగ ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములలో శిక్షణను ఇచ్చిరి. ప్రహ్లాదుడు అచట మిక్కిలి వినమ్రుడై సేవకునివలె ఉండసాగెను. కాని, గురువుల ఉపదేశము ప్రహ్లాదునకు నచ్చలేదు. ఏలయన,అది కేవలము ధర్మార్థకామములకు సంబంధించినది మాత్రమే అయియుండెను. ఆ విద్య రాగద్వేషాది ద్వంద్వములలో విషయభోగములకు మాత్రమే ప్రయోజనకరము.
5.54 (ఏబది నాలుగవ శ్లోకము)
యదాచార్యః పరావృత్తో గృహమేధీయకర్మసు|
వయస్యైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణైః|
5.55 (ఏబది ఐదవ శ్లోకము)
అథ తాన్ శ్లక్ష్ణయా వాచా ప్రత్యాహూయ మహాబుధః|
ఉవాచ విద్వాంస్తన్నిష్ఠాం కృపయా ప్రహసన్నివ॥5822॥
ఒకనాడు గురువు ఇంటి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళియుండెను. అవకాశము దొరికినందులకు సమవయస్కులైన బాలురు తమతో ఆడుకొనుటకు పిలిచిరి. ప్రహ్లాదుడు పరమ జ్ఞాని. తనయెడ వారికిగల ప్రేమనుజూచి అతడు మధుర వచనములతో వారిని తన యొద్దకు పిలిచెను. వెంటనే ప్రేమపూర్వకముగా వారికి అతడు ఉపదేశింప సాగెను.
5.56 (ఏబది ఆరవ శ్లోకము)
తే తు తద్గౌరవాత్సర్వే త్యక్తక్రీడాపరిచ్ఛదాః|
బాలా న దూషితధియో ద్వంద్వారామేరితేహితైః॥5823॥
5.57 (ఏబది ఆరవ శ్లోకము)
పర్యుపాసత రాజేంద్ర తన్న్యస్తహృదయేక్షణాః|
తానాహ కరుణో మైత్రో మహాభాగవతోఽసురః॥5824॥
ధర్మరాజా! వారు ఇంకను పిన్నవయస్కులే. కావున రాగద్వేషములతో, విషయ భోగలాలసులైన పురుషుల ఉపదేశముల వలనను, చేష్టల వలనను వారి బుద్ధులు ఇంకనూ కలుషితములు కాలేదు. ప్రహ్లాదునిపై గల గౌరవభావముతో వారు తమ ఆట వస్తువులను త్యజించి, అతని చుట్టును చేరిరి. ఏకాగ్రచిత్తముతో అతని ఉపదేశములను వినుచు ప్రేమ పూర్వకముగ అతని వైఫు చూడసాగిరి. పరమభాగవతుడు, సుహృదుడు ఐన ప్రహ్లాదుడు వారిపై కరుణచూపుచు ఇట్లు పలుకసాగెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమోఽధ్యాయః (5)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఐదవ అధ్యాయము (5)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment