Saturday, 30 May 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరీక్షిన్మహారాజు నుడివెను - మహాత్మా! శుకయోగీ! నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగబలములను అవలీలగా జయించి, త్రైలోక్య రాజ్యసంపదను అనుభవించెనని నీవు తెలిపియుంటివి. ఆ నారాయణ కవచమును నాకు ఉపదేశింపుము. దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానమును వివరింపుము.

శ్రీ శుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు త్వష్టపుత్రుడగు విశ్వరూపుని పురోహతునిగా చేసికొనిన పిమ్మట, దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకు నారాయణ కవచమును ఉపదేశించెను. దానిని సావధానుడవై వినుము.

విశ్వరూప ఉవాచ

విశ్వరూపుడు వచించెను- దేవేంద్రా! భయావహ పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ కవచమును పఠించి, తమ శరీరమును రక్షించుకొనవలెను. దాని విధానమును తెలిపెదను- కాళ్ళు, చేతులను ప్రక్షాళనమొనర్చుకొని, ఆచమింపపవలెను. పవిత్రమును చేతియందు ధరించి, ఉత్తరముఖముగా కూర్చొనవలెను. అనంతరము కవచధారణ పర్యంతము మౌనము వహించుటకు నిశ్చయించుకొని, శుచియై ఓమ్ నమో నారాయణాయ, ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముల ద్వారా హృదయాది అంగన్యాసమును, అంగుష్ఠాది కరన్యాసములను ఆచరింపవలెను. ఓమ్ నమోనారాయణాయ - అను అష్టాక్షరి మంత్రము యొక్క ఓమ్ మొదలుకొని ఎనిమిది అక్షరములను క్రమముగా కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, ముఖము, శిరస్సు అను అంగముల యందు న్యాసము చేయవలెను (ఎనిమిది అంగములను స్పృశించుచు మంత్రము నందలి ఎనిమిది అక్షరములను జపించవలెను). లేదా ఇదే మంత్రమును యకారమునుండి ఓంకార పర్యంతము ఎమిమిది అక్షరములను శిరస్సుతో ప్రారంభించి పాదములవరకు, ఎనిమిది అంగములయందు విపరీత (సంహార) క్రమములో న్యాసము చేయవలెను.

అనంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మంత్రముయొక్క ఓం మొదలుకొని పన్నెండు అక్షరముల మంత్రముతో, ఓంకారమును మొదలుకొని, యకారము వరకు ఒక్కొక్క అక్షరమునకు ఓంకారమును జోడించి రెండు చేతుల ఎనిమిది వ్రేళ్ళయందు (బొటన వ్రేళ్ళను మినహాయించి), రెండు బొటన వ్రేళ్ళు యొక్క నాలుగు కణుపులయందు, వెరసి పన్నెండు స్థానములలో కరన్యాసమును చేయవలెను.

పిమ్మట ఓం విష్ణవే నమః అనుమంత్రము యొక్క ఓంకారమును హృదయమునందును, వి కారమును బ్రహ్మరంధ్రమున, ష కారమును కనుబొమల మధ్యయందును, ణ కారమును శిఖయందును, వే కారముసు రెండుకనుల యందును, స కారమును అన్ని కీళ్ళయందును వ్యాసము చేయవలెను. ఓం, మః, అస్త్రాయఫట్ అని చెప్పి దిగ్బంధము చేయవలెను. ఈ విధముగా వివేకియైన సాధకుడు ఓం విష్ణవే నమః అను మంత్రస్వరూపుడగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

అనంతరము సమగ్రమగు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను  సద్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానింపవలెను. తనను గూడ ఆ రూపములోనే చింతింపవలెను. పిదప విద్య, తేజస్సు,తపస్స్వరూపమైన ఈకవచమునుపఠింపవలెను.

ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. ఎనిమిది చేతుల యందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనుస్సు, పాశము ధరించియున్నాడు. ఓంకారస్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక.

శ్రీహరి మత్స్యమూర్తియై, జలముల యందలి జలజంతువుల నుండియు, వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక. మాయాబ్రహ్మచారి రూపమునగల వామనమూర్తి భూతలము నందును, విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక.

శ్రీహరి, నృసింహప్రభువుగా అవతరించి రాక్షససైన్యములను హతమార్చెను. దిక్కులు పిక్కటిల్లునట్లు ఆ స్వామి యొనర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్యస్త్రీలయొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్దానములయందు కాపాడుగాక!

శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి, పృథ్విని తన దంతములపై ధరించెను. అట్టి ఆ ప్రభువు మార్గములయందు నన్ను కాపాడుగాక! పర్వతశిఖరములపై పరశురాముడుగను, ప్రవాసకాలముల యందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడుగను నన్ను రక్షించుగాక!

శ్రీమన్నారాయణుడు అభిచారహోమముల వంటి భయంకరమైన మారణ హోమములనుండియు, అన్నివిధమలైన ప్రమాదముల నుండియు, నన్ను రక్షించుగాక! ఋషిశ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమును దూరము చేయుగాక! యోగ విఘ్నములనుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక! త్రిగుణాధిపతియైన కపిలభగవానుడుగా కర్మబంధముల నుండి నన్ను రక్షించుగాక!

మహర్షియైన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక! హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించుచున్నప్పుడు, దేవతామూర్తులకు నమస్కారములు చేయకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుచుందురుగాక! దేవర్షియైన నారదుడు నేను ఒనర్చెడి సేవాపరాధములనుండి నన్ను రక్షించుచుండుగాక! కూర్మావతారుడైన శ్రీహరి వివిధములగు నరక బాధలనుండి రక్షించుచుండుగాక!

ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక! జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖదుఃఖాది భయంకర బాధలనుండి నన్ను కాపాడుగాక!  యజ్ఞ పురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండియు, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండియు, ఆదిశేషుడు క్రోధమును సర్పగణములనుండియు నన్ను రక్షించు చుండునుగాక!

వ్యాసభగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యములనుండి రక్షించుచుండుగాక! బుద్ధుడు పాషండగణముల నుండియును, ప్రమాదముల నుండియు నాకు రక్షణను ప్రసాదించుచుండుగాక! ధర్మరక్షణకొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాపసంకులమైన కలికాల దోషములనుండి నన్ను కాపాడుచుండుగాక!

కేశవభగవానుడు ప్రాతఃకాలమున తన గదాయుధము తోడను, ఆసంగవకాలమున (సూర్యోదయానంతర కాలమున) వేణుగానలోలుడగు గోవిందుడు, పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు, మధ్యాహ్న కాలమున విష్ణుభగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు, నన్ను రక్షించుచుండుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అపరాహ్ణకాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనుస్సుతోడను, సాయంకాలము నందు మాధవుడు బ్రహ్మవిష్ణుమహేశ్వర రూపము తోడను, సూర్యాస్తమయమైన పిదప హృషీకేశునిగను, అర్ధరాత్రముస పద్మనాభునిగను నన్ను కాపాడుగాక!

అపరరాత్రి యందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు, ఉషఃకాలమున ఖడ్గధారియైన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషఃకాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక!

తీవ్రమైన అంచులు గల సుదర్శనచక్రము ప్రళయాగ్నిని విరజిమ్ముచు, భగవత్ప్రేరణచే అన్ని వైపుల తిరుగుచుండును. వాయువు తోడగుటతో అగ్ని ఎండుగడ్డిని కాల్చివైచినట్లు ఆ సదర్శనచక్రము మా శత్రుసైన్యములను వెంటనే దగ్ధమొనర్చుగాక!

కౌమోదకీ గదాయుధమా! నీనుండి వెలువడు అగ్ని కణముల స్పర్శ వజ్రాయుధమువలె దుర్భరమైనవిగా నుండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ ప్రభువునకు సేవకుడను. కనుక, నీవు కూష్మాండ వినాయక, యక్షరాక్షసభూత ప్రేతాది గణములను ఇప్పుడే నుగ్గు నుగ్గు చేయుము. అట్లే నాశత్రువులను పిండి, పిండిగావింపుము.

శ్రేష్ఠమైన శంఖమా! పాంచజన్యమా! శ్రీకృష్ణభగవానునిచే పూరింపబడి, భీకరమైన శబ్దమొనర్చుచు శత్రువుల హృదయములను కంపింపజేయుదువు. అట్లే రాక్షసులు, ప్రమథగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోలుము.

శ్రీహరికి ప్రీతి పాత్రమైన ఓ ఖడ్గమా! నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలు గావింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీయందు వందలకొలది చంద్రునివంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము.

సూర్యాదిగ్రహములు, ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోఱలుగల క్రూరమృగములు, భూతప్రేతాదులు, అట్లే పాపాత్ములైన ప్రాణులనుండియు నన్ను రక్షింఫుము. మా శ్రేయస్సునకు వీరు అందరు విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తించుటవలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక!

పూజ్యుడు, వేదమూర్తియు అగు గరుత్మంతుడు బృహద్రధంతరము మొదలగు సామములచే స్తుతింపబడు చుండును. ఆ ప్రభువు అన్ని కష్టములనుండియు మమ్ము కాపాడుచుండుగాక! పార్షదుడైన విష్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావముచే నన్ను రక్షించుగాక!

శ్రీహరియొక్క నామ, రూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు, మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను, సకల ఆపదలనుండి  కాపాడుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.1 (ప్రథమ శ్లోకము)

యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్॥5060॥

8.2 రెండవ శ్లోకము)

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|
యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే॥5061॥

శ్రీ శుక ఉవాచ

8.3 (మూడవ శ్లోకము)

వృతః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే|
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు॥5062॥

విశ్వరూప ఉవాచ

8.4 (నాలుగవ శ్లోకము)

ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః|
కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః॥5063॥

8.5 (ఐదవ శ్లోకము)

నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే|
పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి॥5064॥

8.6 (ఆరవ శ్లోకము)

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్|
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా॥5065॥

8.7 (ఏడవ శ్లోకము)

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా|
ప్రణవాదియకారాస్తమంగుళ్యంగుష్ఠపర్వసు॥5066॥

8.8 (ఎనిమిదవ శ్లోకము)

న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని|
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్॥5067॥

8.9 (తొమ్మిదవ శ్లోకము)

వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు|
మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః॥5068॥

8.10 (పదియవ శ్లోకము)

సవిసర్గం షదంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్|
ఓం విష్ణవే నమ ఇతి॥5069॥

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.5.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

ఆత్మానం పరమం ధ్యాయేద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్|
విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్॥5070॥

8.12 (పండ్రెండవ శ్లోకము)

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్టే|
దరారిచర్మాసిగదేషుచాపపాశాన్ దధానోఽష్టగుణోఽష్టబాహుః॥5071॥

8.13 (పదమూడవ శ్లోకము)

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదోగణేభ్యో వరుణస్య పాశాత్|
స్థలేషు మాయావటువామనోఽవ్యాత్ త్రివిక్రమః భేఽవతు విశ్వరూపః॥5072॥

8.14 (పదునాలుగవ శ్లోకము)

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోఽసురయూథపారిః|
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః॥5073॥

8.15 (పదునైదవ శ్లోకము)

రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః|
రామోఽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోఽవ్యాద్భరతాగ్రజోఽస్మాన్॥5074॥

8.16 (పదునారవ శ్లోకము)

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదాత్  నారాయణః పాతు నరశ్చ హాసాత్|
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్॥5075॥

8.17 (పదునేడవ శ్లోకము)

సనత్కుమరోఽవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్|
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్॥5076॥


8.18 (పదునెనిమిదవ శ్లోకము)

ధన్వన్తరిర్భగవాన్ పాత్వపథ్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా|
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః॥5077॥


8.19 (పందొమ్మిదవ శ్లోకము)

ద్వైపాయనో భగవానప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్|
కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః|


8.20 (ఇరువదియవ శ్లోకము)

మాం కేశవో గదయా ప్రాతరన్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః|
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిః మధ్యందినే విష్ణురరీంద్రపాణిః॥5079॥


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

దేవోఽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్|

దోషీ హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోఽవతు పద్మనాభః॥5080॥

8.22 (ఇరువది రెండవ శ్లోకము)

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోఽసిధరో జనార్దనః|

దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః॥5081॥

8.23 (ఇరువది మూడవ శ్లోకము)

చక్రం యుగాన్తానల తిగ్మనేమి భ్రమత్ సమంతాద్భగవత్ప్రయుక్తమ్|

దందగ్థి దందగ్ధ్యరి సైన్యమాశు కక్ష్యం యథా వాతసభో హుతాశః॥5082॥

8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢీ నిష్పింఢ్యజితప్రియాసి|

కూష్మాండవైనాయక యక్షరక్షోభూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయాదీన్॥5083॥

8.25 (ఇరువది ఐదవ శ్లోకము)

త్వం యాతుధానప్రమథ ప్రేతమాతృపిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్| 

దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోఽరేర్హృదయాని కంపయన్॥5084॥

8.26 (ఇరువది ఆరవ శ్లోకము)

త్వం తిగ్మధారాసివరారిసైన్యమ్ ఈశప్రయుక్తో మమ ఛింధి ఛింధి|

చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్॥5085॥

8.27 (ఇరువది ఏడవ శ్లోకము)

యన్నో భయం గ్రహేభ్యోఽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ|

సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోఽంహోభ్య ఏవ వా॥5086॥

8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్|

ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయః ప్రతీపకాః॥5087॥

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః|

రక్షత్వశేషకృఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః॥5088॥

8.30 (ముప్పదియవ శ్లోకము)

సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః|

బుద్ధీంద్రియమనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః॥5089॥

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

1.6.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్|

సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః॥5090॥


8.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|

భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా॥5091॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః|

పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః॥5092॥


8.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః|

ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః॥5093॥


8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్|

విజేష్యస్యఽంజసా యేన దంశితోఽసురయూథపాన్॥5094॥


8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|

పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే॥5095॥


8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్|

రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్॥5096॥

8.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఇమాం  విద్యాం పురా కశ్చిత్ ధారయన్ ద్విజః|

యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని॥5097॥

8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|

యయౌ చిత్రరథః స్త్రీభిర్వతో యత్ర ద్విజక్షయః॥5098॥

8.40 (నలుబదియవ శ్లోకము)

గగనాన్న్యపతత్సద్యః సవిమానో  హ్యవాక్ఛిరాః|

స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|

ప్రాస్య ప్రాచీనరస్వత్యాం స్నాత్వాధామ స్వమన్వగాత్॥5099॥

శ్రీ శుక ఉవాచ

8.41 (నలుబది ఒకటవ శ్లోకము)

య ఇదం శ్రుణుయత్కాలే యో ధారయతి చాదృతః|

తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్॥5100॥

8.42 (నలుబది రెండవ శ్లోకము)

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|

త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్॥5101॥

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోఽధ్యాయః (8)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


30.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.1 (ప్రథమ శ్లోకము)

యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|

క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్॥5060॥

8.2 రెండవ శ్లోకము)

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|

యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే॥5061॥

పరీక్షిన్మహారాజు నుడివెను - మహాత్మా! శుకయోగీ! నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగబలములను అవలీలగా జయించి, త్రైలోక్య రాజ్యసంపదను అనుభవించెనని నీవు తెలిపియుంటివి. ఆ నారాయణ కవచమును నాకు ఉపదేశింపుము. దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానమును వివరింపుము.

శ్రీ శుక ఉవాచ

8.3 (మూడవ శ్లోకము)

వృతః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే|

నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు॥5062॥

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు త్వష్టపుత్రుడగు విశ్వరూపుని పురోహతునిగా చేసికొనిన పిమ్మట, దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకు నారాయణ కవచమును ఉపదేశించెను. దానిని సావధానుడవై వినుము.

విశ్వరూప ఉవాచ

8.4 (నాలుగవ శ్లోకము)

ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః|

కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః॥5063॥

8.5 (ఐదవ శ్లోకము)

నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే|

పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి॥5064॥

8.6 (ఆరవ శ్లోకము)

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్|

ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా॥5065॥

విశ్వరూపుడు వచించెను- దేవేంద్రా! భయావహ పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ కవచమును పఠించి, తమ శరీరమును రక్షించుకొనవలెను. దాని విధానమును తెలిపెదను- కాళ్ళు, చేతులను ప్రక్షాళనమొనర్చుకొని, ఆచమింపపవలెను. పవిత్రమును చేతియందు ధరించి, ఉత్తరముఖముగా కూర్చొనవలెను. అనంతరము కవచధారణ పర్యంతము మౌనము వహించుటకు నిశ్చయించుకొని, శుచియై ఓమ్ నమో నారాయణాయ, ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముల ద్వారా హృదయాది అంగన్యాసమును, అంగుష్ఠాది కరన్యాసములను ఆచరింపవలెను. ఓమ్ నమోనారాయణాయ - అను అష్టాక్షరి మంత్రము యొక్క ఓమ్ మొదలుకొని ఎనిమిది అక్షరములను క్రమముగా కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, ముఖము, శిరస్సు అను అంగముల యందు న్యాసము చేయవలెను (ఎనిమిది అంగములను స్పృశించుచు మంత్రము నందలి ఎనిమిది అక్షరములను జపించవలెను). లేదా ఇదే మంత్రమును యకారమునుండి ఓంకార పర్యంతము ఎమిమిది అక్షరములను శిరస్సుతో ప్రారంభించి పాదములవరకు, ఎనిమిది అంగములయందు విపరీత (సంహార) క్రమములో న్యాసము చేయవలెను.

8.7 (ఏడవ శ్లోకము)

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా|

ప్రణవాదియకారాస్తమంగుళ్యంగుష్ఠపర్వసు॥5066॥

అనంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మంత్రముయొక్క ఓం మొదలుకొని పన్నెండు అక్షరముల మంత్రముతో, ఓంకారమును మొదలుకొని, యకారము వరకు ఒక్కొక్క అక్షరమునకు ఓంకారమును జోడించి రెండు చేతుల ఎనిమిది వ్రేళ్ళయందు (బొటన వ్రేళ్ళను మినహాయించి), రెండు బొటన వ్రేళ్ళు యొక్క నాలుగు కణుపులయందు, వెరసి పన్నెండు స్థానములలో కరన్యాసమును చేయవలెను.

8.8 (ఎనిమిదవ శ్లోకము)

న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని|

షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్॥5067॥

8.9 (తొమ్మిదవ శ్లోకము)

వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు|

మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః॥5068॥

8.10 (పదియవ శ్లోకము)

సవిసర్గం షదంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్|

ఓం విష్ణవే నమ ఇతి॥5069॥

పిమ్మట ఓం విష్ణవే నమః అనుమంత్రము యొక్క ఓంకారమును హృదయమునందును, వి కారమును బ్రహ్మరంధ్రమున, ష కారమును కనుబొమల మధ్యయందును, ణ కారమును శిఖయందును, వే కారముసు రెండుకనుల యందును, స కారమును అన్ని కీళ్ళయందును వ్యాసము చేయవలెను. ఓం, మః, అస్త్రాయఫట్ అని చెప్పి దిగ్బంధము చేయవలెను. ఈ విధముగా వివేకియైన సాధకుడు ఓం విష్ణవే నమః అను మంత్రస్వరూపుడగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.5.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

ఆత్మానం పరమం ధ్యాయేద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్|

విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్॥5070॥

అనంతరము సమగ్రమగు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను  సద్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానింపవలెను. తనను గూడ ఆ రూపములోనే చింతింపవలెను. పిదప విద్య, తేజస్సు,తపస్స్వరూపమైన ఈకవచమునుపఠింపవలెను.

8.12 (పండ్రెండవ శ్లోకము)

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్టే|

దరారిచర్మాసిగదేషుచాపపాశాన్ దధానోఽష్టగుణోఽష్టబాహుః॥5071॥

ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. ఎనిమిది చేతుల యందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనుస్సు, పాశము ధరించియున్నాడు. ఓంకారస్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక.

8.13 (పదమూడవ శ్లోకము)

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదోగణేభ్యో వరుణస్య పాశాత్|

స్థలేషు మాయావటువామనోఽవ్యాత్ త్రివిక్రమః భేఽవతు విశ్వరూపః॥5072॥

శ్రీహరి మత్స్యమూర్తియై, జలముల యందలి జలజంతువుల నుండియు, వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక. మాయాబ్రహ్మచారి రూపమునగల వామనమూర్తి భూతలము నందును, విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక.

8.14 (పదునాలుగవ శ్లోకము)

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోఽసురయూథపారిః|

విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః॥5073॥

శ్రీహరి, నృసింహప్రభువుగా అవతరించి రాక్షససైన్యములను హతమార్చెను. దిక్కులు పిక్కటిల్లునట్లు ఆ స్వామి యొనర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్యస్త్రీలయొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్దానములయందు కాపాడుగాక!

8.15 (పదునైదవ శ్లోకము)

రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః|

రామోఽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోఽవ్యాద్భరతాగ్రజోఽస్మాన్॥5074॥

శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి, పృథ్విని తన దంతములపై ధరించెను. అట్టి ఆ ప్రభువు మార్గములయందు నన్ను కాపాడుగాక! పర్వతశిఖరములపై పరశురాముడుగను, ప్రవాసకాలముల యందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడుగను నన్ను రక్షించుగాక!

8.16 (పదునారవ శ్లోకము)

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదాత్  నారాయణః పాతు నరశ్చ హాసాత్|

దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్॥5075॥

శ్రీమన్నారాయణుడు అభిచారహోమముల వంటి భయంకరమైన మారణ హోమములనుండియు, అన్నివిధమలైన ప్రమాదముల నుండియు, నన్ను రక్షించుగాక! ఋషిశ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమును దూరము చేయుగాక! యోగ విఘ్నములనుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక! త్రిగుణాధిపతియైన కపిలభగవానుడుగా కర్మబంధముల నుండి నన్ను రక్షించుగాక!

8.17 (పదునేడవ శ్లోకము)

సనత్కుమరోఽవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్|

దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్॥5076॥

మహర్షియైన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక! హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించుచున్నప్పుడు, దేవతామూర్తులకు నమస్కారములు చేయకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుచుందురుగాక! దేవర్షియైన నారదుడు నేను ఒనర్చెడి సేవాపరాధములనుండి నన్ను రక్షించుచుండుగాక! కూర్మావతారుడైన శ్రీహరి వివిధములగు నరక బాధలనుండి రక్షించుచుండుగాక!

8.18 (పదునెనిమిదవ శ్లోకము)

ధన్వన్తరిర్భగవాన్ పాత్వపథ్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా|

యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః॥5077॥

ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక! జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖదుఃఖాది భయంకర బాధలనుండి నన్ను కాపాడుగాక!  యజ్ఞ పురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండియు, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండియు, ఆదిశేషుడు క్రోధమును సర్పగణములనుండియు నన్ను రక్షించు చుండునుగాక!

8.19 (పందొమ్మిదవ శ్లోకము)

ద్వైపాయనో భగవానప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్|

కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః|

వ్యాసభగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యములనుండి రక్షించుచుండుగాక! బుద్ధుడు పాషండగణముల నుండియును, ప్రమాదముల నుండియు నాకు రక్షణను ప్రసాదించుచుండుగాక! ధర్మరక్షణకొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాపసంకులమైన కలికాల దోషములనుండి నన్ను కాపాడుచుండుగాక!

8.20 (ఇరువదియవ శ్లోకము)

మాం కేశవో గదయా ప్రాతరన్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః|

నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిః మధ్యందినే విష్ణురరీంద్రపాణిః॥5079॥

కేశవభగవానుడు ప్రాతఃకాలమున తన గదాయుధము తోడను, ఆసంగవకాలమున (సూర్యోదయానంతర కాలమున) వేణుగానలోలుడగు గోవిందుడు, పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు, మధ్యాహ్న కాలమున విష్ణుభగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు, నన్ను రక్షించుచుండుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

31.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

దేవోఽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్|

దోషీ హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోఽవతు పద్మనాభః॥5080॥

అపరాహ్ణకాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనుస్సుతోడను, సాయంకాలము నందు మాధవుడు బ్రహ్మవిష్ణుమహేశ్వర రూపము తోడను, సూర్యాస్తమయమైన పిదప హృషీకేశునిగను, అర్ధరాత్రముస పద్మనాభునిగను నన్ను కాపాడుగాక!

8.22 (ఇరువది రెండవ శ్లోకము)

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోఽసిధరో జనార్దనః|

దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః॥5081॥

అపరరాత్రి యందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు, ఉషఃకాలమున ఖడ్గధారియైన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషఃకాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక!

8.23 (ఇరువది మూడవ శ్లోకము)

చక్రం యుగాన్తానల తిగ్మనేమి భ్రమత్ సమంతాద్భగవత్ప్రయుక్తమ్|

దందగ్థి దందగ్ధ్యరి సైన్యమాశు కక్ష్యం యథా వాతసభో హుతాశః॥5082॥

తీవ్రమైన అంచులు గల సుదర్శనచక్రము ప్రళయాగ్నిని విరజిమ్ముచు, భగవత్ప్రేరణచే అన్ని వైపుల తిరుగుచుండును. వాయువు తోడగుటతో అగ్ని ఎండుగడ్డిని కాల్చివైచినట్లు ఆ సదర్శనచక్రము మా శత్రుసైన్యములను వెంటనే దగ్ధమొనర్చుగాక!

8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢీ నిష్పింఢ్యజితప్రియాసి|

కూష్మాండవైనాయక యక్షరక్షోభూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయాదీన్॥5083॥

కౌమోదకీ గదాయుధమా! నీనుండి వెలువడు అగ్ని కణముల స్పర్శ వజ్రాయుధమువలె దుర్భరమైనవిగా నుండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ ప్రభువునకు సేవకుడను. కనుక, నీవు కూష్మాండ వినాయక, యక్షరాక్షసభూత ప్రేతాది గణములను ఇప్పుడే నుగ్గు నుగ్గు చేయుము. అట్లే నాశత్రువులను పిండి, పిండిగావింపుము.

8.25 (ఇరువది ఐదవ శ్లోకము)

త్వం యాతుధానప్రమథ ప్రేతమాతృపిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్|

దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోఽరేర్హృదయాని కంపయన్॥5084॥

శ్రేష్ఠమైన శంఖమా! పాంచజన్యమా! శ్రీకృష్ణభగవానునిచే పూరింపబడి, భీకరమైన శబ్దమొనర్చుచు శత్రువుల హృదయములను కంపింపజేయుదువు. అట్లే రాక్షసులు, ప్రమథగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోలుము.

8.26 (ఇరువది ఆరవ శ్లోకము)

త్వం తిగ్మధారాసివరారిసైన్యమ్ ఈశప్రయుక్తో మమ ఛింధి ఛింధి|

చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్॥5085॥

శ్రీహరికి ప్రీతి పాత్రమైన ఓ ఖడ్గమా! నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలు గావింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీయందు వందలకొలది చంద్రునివంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము.

8.27 (ఇరువది ఏడవ శ్లోకము)

యన్నో భయం గ్రహేభ్యోఽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ|

సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోఽంహోభ్య ఏవ వా॥5086॥

8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్|

ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయః ప్రతీపకాః॥5087॥

సూర్యాదిగ్రహములు, ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోఱలుగల క్రూరమృగములు, భూతప్రేతాదులు, అట్లే పాపాత్ములైన ప్రాణులనుండియు నన్ను రక్షింఫుము. మా శ్రేయస్సునకు వీరు అందరు విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తించుటవలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక!

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః|

రక్షత్వశేషకృఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః॥5088॥

పూజ్యుడు, వేదమూర్తియు అగు గరుత్మంతుడు బృహద్రధంతరము మొదలగు సామములచే స్తుతింపబడు చుండును. ఆ ప్రభువు అన్ని కష్టములనుండియు మమ్ము కాపాడుచుండుగాక! పార్షదుడైన విష్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావముచే నన్ను రక్షించుగాక!

8.30 (ముప్పదియవ శ్లోకము)

సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః|

బుద్ధీంద్రియమనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః॥5089॥

శ్రీహరియొక్క నామ, రూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు, మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను, సకల ఆపదలనుండి  కాపాడుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

1.6.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్|

సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః॥5090॥

కార్యకారణరూపమగు ఈ సకలజగత్తు వాస్తవముగా భగవత్స్వరూపమే. ఇట్టి సత్యప్రభావముచే  ఉపద్రవములు అన్నియును నశించిపోవుగాక!

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|

భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా॥5091॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః|

పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః॥5092॥

బ్రహ్మ-ఆత్మల ఏకత్వమును (అద్వైతస్థితిని) అనుభవించిన వారికి వారి దృష్టిలో భగవత్స్వరూపము సమస్త వికార, భేదరహితము. ఐనను, భగవంతుడు తన మాయాశక్తి ద్వారా భూషణములును, ఆయుధములను, నామ, రూపములను,శక్తులను ధరించుచుండును. ఇది నిశ్చయముగా సత్యము. ఈ కారణము వలన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన శ్రీహరి సదా సర్వత్ర అన్ని రూపములతో మమ్ము రక్షించుచుండుగాక!

8.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః|

ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః॥5093॥

నృసింహభగవానుడు తన భయంకర అట్టహాసముచే జనులు భీతిల్లి పారిపోవునట్లు చేయును. తన దివ్యతేజస్సుతో అందరి తేజస్సులను గ్రహించును. అట్టి శ్రీహరి దశదిశలయందును, పైన, క్రింద, లోపల, వెలుపలను, అంతటను మమ్ము రక్షించుచుండుగాక.

8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్|

విజేష్యస్యఽంజసా యేన దంశితోఽసురయూథపాన్॥5094॥

దేవేంద్రా! నేను నీకు ఈ నారాయణ కవచమును వినిపించితిని. దీనివలన నీవు సురక్షితుడవు అగుదువు. ఇంక నీవు సులభముగా దైత్య సేనాపతులందరిని జయింపగలవు.

8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|

పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే॥5095॥

ఈ నారాయణ కవచమును ధరించినవాడు, నేత్రములతో ఎవరిని చూచినను, తన పాదములతో ఎవరిని తాకినను అతడు కూడా వెంటనే సమస్త భయములనుండి విముక్తుడగును.

8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్|

రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్॥5096॥

ఈ వైష్ణవీ విద్యను ధరించిన వానిని రాజులవలన, దొంగలవలన, ప్రేత పిశాచాదుల వలన, వ్యాఘ్రాది క్రూరమృగముల వలన ఎట్టి భయమూ ఉండదు.

8.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఇమాం  విద్యాం పురా కశ్చిత్ ధారయన్ ద్విజః|

యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని॥5097॥

దేవేంద్రా! పూర్వకాలమున కౌశిక గోత్రమునకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ విద్యసు (నారాయణ కవచమును) ధరించి, యోగధారణచే ఒక మరుభూమియందు తన దేహమును త్యజించెను.

8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|

యయౌ చిత్రరథః స్త్రీభిర్వతో యత్ర ద్విజక్షయః॥5098॥

ఒకప్పుడు గంధర్వరాజైస చిత్రరథుడు, తన స్త్రీలతో గూడి విమానమును అధిష్ఠించి, ఆకాశమున వెళ్ళుచుండెను. ఆ విమానము ఆ విప్రుని శరీరము పడిన చోటునకు మీదుగా వెళ్ళుచుండెను.

8.40 (నలుబదియవ శ్లోకము)

గగనాన్న్యపతత్సద్యః సవిమానో  హ్యవాక్ఛిరాః|

స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|

ప్రాస్య ప్రాచీనరస్వత్యాం స్నాత్వాధామ స్వమన్వగాత్॥5099॥

అంతట ఆ గంధర్వరాజు విమానముతో గూడ తలక్రిందులుగా భూమిపై బడెను. ఈ సంఘటన ఆయనకు ఆశ్చర్యమును కలిగించెను. వాలఖిల్యమహర్షులు అది నారాయణ కవచమును ధరించిన బ్రాహ్మణుని యొక్క మహత్త్వము అని తెలిపిరి. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముని అస్థులను తీసికొనిపోయి పూర్వవాహిన ఐన సరస్వతీ నది యందు కలిపెను. పిమ్మట అతడు స్నానమాచరించి తన లోకమునకు వెళ్ళెను.

శ్రీ శుక ఉవాచ

8.41 (నలుబది ఒకటవ శ్లోకము)

య ఇదం శ్రుణుయత్కాలే యో ధారయతి చాదృతః|

తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్॥5100॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఈ నారాయణ కవచమును ఎప్పుడైనను వినిన వానికి, సాదరముగా దీనిని గ్రహించిన వానికి సకలప్రాణులు గౌరవముగా నమస్కరించును. వారు సమస్త భయముల నుండియు విముక్తులగుదురు.

8.42 (నలుబది రెండవ శ్లోకము)

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|

త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్॥5101॥

ఇంద్రుడు తన పురోహితుడైన విశ్వరూపుని ద్వారా ఈ నారాయణ కవచము అను విద్యను పొంది, రణభూమియందు అసురులను జయించెను. ముల్లోకములయందలి సంపదలను అనుభవించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోఽధ్యాయః (8)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


Friday, 29 May 2020

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము




పరీక్షిన్మహారాజు పలికెను-మహాత్మా! దేవగురువైన బృహస్పతి తన ప్రియ శిష్యులైన దేవతలను పరిత్యజించుటకు కారణమేమి? దేవతలు ఆయనయెడ చేసిన అపచారమేమి? దయతో తెలుపుము.

శ్రీశుక ఉవాచ

శ్రీ శుకుడు నుడివెను- ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యములను పొందుటచే గర్వితుడయ్యెను. అందువలన ధర్మమర్యాదలను, సదాచారములను ఉల్లంఘింపసాగెను. ఒకానొకనాడు అతడు తనపత్నియైన శచీదేవితో గూడి నిండుసభలో సింహాసనముపై  ఆసీనుడైయుండెను. నలుబది తొమ్మిది మంది మరుద్గణములు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ-ఆదిత్యులు, ఋభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, అశ్వినీకుమారులు అతనిని సేవించు చుండిరి. సిద్ధులు,  చారణులు, గంధర్వులు, బ్రహ్మవాదులైన మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పక్షిగణములు, నాగులు అతనిని సేవించుచు స్తుతించుచుండిరి.

వారు అందరును మధురమైన స్వరములతో ఇంద్రుని కీర్తించుచుండిరి. చంద్రమండలము వలె సుందరమైన శ్వేతచ్ఛత్రము శోభిల్లుచుండెను. వింజామరలు, వీవనలు మొదలగు మహారాజోచితమైన మర్యాదలు నిర్వహింపబడు చుండెను.

ఆ సమయమున దేవేంద్రాదిదేవతలకు పరమగురువైన బృహస్పతి అచటికి ఏతెంచెను. అతనికి సురాసురులందరునూ నమస్కరింతురు. అయితే, సురాసురులందరకును పూజ్యుడైన బృహస్పతి సభలో ప్రవేశించుటను ఇంద్రుడు చూచెను. ఐనను, అతడు సింహాసనము నుండి లేచుట గాని, గురువును సత్కరించుటగాని చేయక అటుఇటు కదలకుండా కూర్చొనియుండెను.

త్రికాలదర్శి, సమర్థుడు ఐన బృహస్పతి, ఇదీ ఐశ్వర్యమద దోషము అని భావించి, వెంటనే అతడు అచటి నుండి మౌనముగా వెను దిరిగి, తన ఇంటికి చేరెను.

అంతట ఇంద్రుడు తనవలన బృహస్పతికి అవమానము జరిగినదను విషయమును గ్రహించెను. అప్పుడు నిండు సభలో తనను తాను నిందించుకొనసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

బృహస్పతికి నిండుసభలో జరిగిన అవమానమునకు దేవేంద్రుడు తనను తానిట్లు నిందించుకొనసాగెను:

అయ్యో! నేడు ఈ నిండుసభలో నేను ఎంతటి అపరాధమొనర్చితిని? ఐశ్వర్యభమదోన్మత్తుడనై మూర్ఖముగ ప్రవర్తించి గురువునెడ తీరని అపరాధమొనర్చితిని. వాస్తవముగా నేను ఇట్లు వ్యవహరించుట మిగుల గర్హణీయము.

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

బుద్ధిమంతుడైన వాడెవడు ఈ స్వర్గరాజ్య సంపదలను పొందుటకు ఇష్టపడడు. చూడుడు! నేడు ఈ సంపదయే దేవతలకు ప్రభువైన నన్ను గూడ అనుచరులవలె రజోగుణ భావమునకు గురిచేసినది.

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనసాగెను:

'సార్వభౌమ అధికారముతో రాజ్యసభ సింహాసనముపై కూర్చున్న చక్రవర్తి ఎవరు వచ్చిననూ సింహాసనమునుండి లేవగూడదు' అని కొందరు చెప్ఫెదరు. వారు వాస్తవముగా ధర్మస్వరూపమును ఎరుగనివారే.

॥5033॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

ఏలయన, ఇట్లు ఉపదేశించువారు జనులను చెడు మార్గములలో తీసికొనిపోవుదురు. అట్టివారు స్వయముగా ఘోర నరకమున పడుదురు. వారి పలుకులను విశ్వసించినవారు రాతిపడవవలె నీటిలో మునిగిపోవుదురు.

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

నా గురువైన బృహస్పతి అగాధమైన జ్ఞానసముద్రుడు. అట్టి వానియెడ నేను గొప్ప అపరాధమొనర్చితిని. ఇప్పుడు నేను ఆ మహాత్ముని పాదములపై వ్రాలి ఆయనను ప్రసన్నుని చేసికొనుటయే నా కర్తవ్యము".

అని దేవేంద్రుడు ఈ విధముగా అనుకొనుచుండగనే మహాత్ముడైన బృహస్పతి తన ఇంటినుండి వెడలి యోగబలముచే అంతర్హితుడయ్యెను. 


దేవేంద్రుడు తన గురువును తాను స్వయముగ వెదకుటయేగాక, ఇతరులచే వెదకించెను. కాని, ఆయన ఆ చూకీ దొరకలేదు. గురువులేకుండా తనకు రక్షణ యుండదని ఇంద్రుడు భావించెను. అంతట ఇతర దేవతలతో గూడి స్వర్గ రక్షణకై తగిన ఉపాయము కొరకై ఆలోచించెను. కాని, వారి నుండి ఎట్టి ఉపాయము లభింపకుండుటచే అతడు అశాంతికి గురియయ్యెను.

దేవగురువైన బృహస్పతి దేవతలను వదలివెళ్ళిన సమాచారము దైత్యులకు తెలిసెను. అప్ఫుడు మదోన్మత్తులు, ఆతతాయులు ఐన దైత్యులు శుక్రాచార్యుని ఆదేశానుసారము దేవతలను జయించుటకు ఉద్యమించిరి.

ఆ దైత్యులు దేవతలపై తీవ్రమైన బాణములను వర్షింపజేసి, వారి మస్తకములు, ఊరువులు, బాహువులు మొదలగు అంగములను భేదింపసాగిరి. అప్పుడు ఇంద్రాదిదేవతలు వినమ్రులై బ్రహ్మదేవుని శరశుజొచ్చిరి.

సర్వసమర్థుడు, స్వయంభువు ఐన బ్రహ్మదేవుడు వాస్తవముగ దేవతలకు దుర్దశ ఏర్పడినదని గ్రహించెను. అందుకు అతని హృదయము దయార్ద్రమయ్యెను. అంతట దేవతలకు ధైర్యము గొలుపుటకై అతడు ఇట్లు పలికెను.

బ్రహ్మదేవుడు ఇట్లనెను- దేవతలారా! వాస్తవముగా మీరు గొప్ప తప్పుపని చేసితిరి. ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను గానక బ్రహ్మజ్ఞాని జితేంద్రియుడు ఐన బ్రాహ్మణశ్రేష్ఠుని నిరాదరించితిరి. ఇది మిగుల శోచనీయము. మీరొనర్చిన అపరాధమునకు ఇది ఫలితము. మీరు సంపదలతో తులతూగుచున్నను దుర్భలులైన శత్రువులచే పరాభవమును ఎదుర్కొనవలసి వచ్చినది.

ఇంద్రా! చూడుము. నీ శత్రువులు గూడ మొదట తమకు గురువైన శుక్రాచార్యుని అవమాన పరచినందులకు మిక్కిలి బలహీనులైరి. కాని భక్తి భక్తిభావముతో అతనిని ఆరాధించి ధనముతోను, బలముతోను తులతూగిరి. శుక్రుని తమ ఆరాధ్యదైవముగా భావించునట్టి ఈ దైత్యులు కొలది దినములలో నా బ్రహ్మలోకములను గూడ ఆక్రమించెదరని నాకు తోచుచున్నది. భృగువంశీయులు వీరికి అర్థశాస్త్రమునందు పూర్తిగ శిక్షణను ఇచ్చినది. వారి పన్నాగములను త్రిప్పికొట్టు మార్గములు మీకు గూడ తెలియవు. అవి చాల గుప్తముగా ఉండును. ఇట్టి స్థితిలో స్వర్గమునే గాదు, వారు ఏ లోకమునైనను జయింపగలరు. బ్రాహ్మణులను, గోవిందుని, గోవులను తమ సర్వస్వముగా భావించెడు రాజులకు ఎన్నిటికినీ, అశుభము కలుగదు.

కనుక, ఇప్పుడు మీరు వెంటనే త్వష్టపుత్రుడైన విశ్వరూపునికడకేగి, ఆయనను సేవింపుడు. అతడు విప్రోత్తముడు, తపస్సంపన్నుడు, జితేంద్రియుడు. కాని, అతని తల్లి అసురకులమునకు చెందినది. కనుక, మీరు అసురులను ప్రేమతో క్షమింఛి, అతనిని గౌరవించినచో, అతడు మీకార్యమును నెరవేర్చగలడు.

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహాజా! బ్రహ్మదేవుడు ఈ విధముగ సూచించిన పిమ్మట దేవతలకు చింతతొలగి ధైర్యము వచ్చెను. వెంటనే వారు విశ్వరూపమహర్షి కడకేగి, ఆయనను అక్కున జేర్చుకొని ఇట్లు నుడివిరి.

దేవా ఊచుః

దేవతలు ఇట్లనిరి- నాయనా! విశ్వరూపా! నీకు శుభమగుగాక! మేము నీ ఆశ్రమమునకు అతిథులమై వచ్చితిమి. ఒక విధముగా మేము నీకు పితృతుల్యులము. కనుక సమయోచితమైన మా అభిలాషను నెరవేర్చుము.

బ్రాహ్మణోత్తమా! సంతానవంతులైన సత్పుత్రులు తమ తల్లిదండ్రులసు, ఇతర గురుజనులను సేవించుటయే పరమధర్మమని భావింతురు. ఇక బ్రహ్మచారిగా ఉన్న నీ విషయము చెప్పనేల?

గురువు వేదస్వరూపుడు. తండ్రి బ్రహ్మదేవుని వంటివాడు. సోదరుడు ఇంద్రునితో సమానము. ఇంక తల్లి సాక్షాత్తు భూదేవి స్వరూపము. చెల్లెలు దయామూర్తి. అతిథి, సాక్షాత్తు ధర్మమూర్తియే. అభ్యాగతుడు అగ్నితో సమానుడు. జగత్తునందలి సకల ప్రాణులు ఆత్మ స్వరూపులే.నాయనా! విశ్వరూపా! మేము నీకు పితృసమానులము. ఇప్పుడు శత్రువులు మమ్ము జయించిరి. మేము ఆపదలపాలైయున్నాము నీవు నీ తపోబలముతో మా దుఃఖమును, దారిద్ర్యమును, పరాజయమును పారద్రోలుము. మా అభిప్రాయమును ఆలకించి, మాకు మేలు చేయుము.

నీవు బ్రహ్మనిష్ఠాపరుడవైన (వేదధర్మజ్ఞుడవైన) విప్రవరుడవు. కావున, జన్మతః మాకు గురుడవు. నిన్ను మేము మా ఆచార్యునిగా ఎన్నుకొనుచున్నాము. నీ తపోబలముతో మేము సులభముగ మా శత్రువులపై విజయమును సాధింపగలము.

మహాత్మా! సందర్భమును బట్టి తమకంటెను చిన్నవారిపదములకు నమస్కరించుట తప్పుగాదని విజ్ఞులందురు. పెద్దరికము వయస్సునుబట్టిగాక వేదజ్ఞానముబట్టి నిర్ణయింపవలెను. కావున, వయస్సునుబట్టి పెద్దరికము లభింపదు. నీవు వేదజ్ఞానసంపన్నుడవు ఐనందున, మా అందరికి నీవు పెద్దవాడవు ఐతివి.

ఋషిరువాచ

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఈ విధముగా విశ్వరూపుని తమకు పురోహితునిగా ఉండుమని ప్రార్థించిరి. అప్పుడు పరమతపస్వియైన విశ్వరూపుడు ప్రసన్నుడై వారితో ప్రియముగా, మధురముగా ఇట్లనెను-

విశ్వరూప ఉవాచ

విశ్వరూపుడు పలికెను "పెద్దలారా! పౌరోహిత్యము బ్రహ్మతేజస్సును క్షీణింప జేయును. కనుక, అది గర్హింపదగినది అని ధర్మజ్ఞులు నుడువుదురు. కాని, మీరు నాకు పితృతుల్యులు, లోకపాలురు. ఐనను, మీరు నన్ను పురోహితునిగా ఉండుమని వేడుకొనుచున్నారు. ఇట్టి స్థితిలో నా వంటి వాడు మీ కోరికను ఎట్లు తిరస్కరింపగలడు? నేను మీ సేవకుడను. మీ ఆజ్ఞను పాటించుటయే నా ధర్మము.

దేవతలారా! మేము అకించనులము. పొలములో పైర్లు కోసిన పిదప రాలిన ధాన్యములను ఏరుకొందుము. దానితో దేవకార్యమును, పితృకార్యమును ఆచరించుచుందుము. ఆ విధముగా శిలోంఛవృత్తితో జీవితమును గడుపునట్టి నేను నింద్యమగు పౌరోహిత్యమును ఎట్లు చేయగలను? అట్టి వృత్తిచే సంతోషించువారు బుద్ధిహీనులు.

ఐనను, నేను మీ కోరికను తిరస్కరింపజాలను. మీ ప్రార్థన మిగుల స్వల్పమైనది. నా ప్రాణమును, తపోబలమును ఒడ్డియైనను మీ మనోరథమును నెరవేర్చెదను".

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! మహాతపస్వియైన  విశ్వరూపుడు దేవతలకు ఇట్లు ప్రతిజ్ఞ చేసి, వారిప్రార్థన మేరకు పౌరోహిత్య వృత్తిని చేపట్టెను. మిక్కిలి ఏకాగ్రతతో తన వృత్తిధర్మమును నెరవేర్చెను.

శుక్రాచార్యుడు తన నీతి బలముతో అసురుల సంపదను సురక్షితముగా భద్రపరచెను. ఐనను, సర్వసమర్థుడైన విశ్వరూపుడు తన వైష్ణవ విద్య (నారాయణ కవచ) ప్రభావముచే ఆ సంపదలను మరల గ్రహించి, దేవేంద్రునకు అప్పగించెను.

రాజా! ఉదారశీలుడైన విశ్వరూపుడు ఆ వైష్ణవి విద్యను దేవేంద్రునకు బోధించెను. తత్ప్రభావమున వేయికన్నుల వేల్పుడగు దేవేంద్రుడు అసురసైన్యములపై విజయమును సాధించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తమోఽధ్యాయః (7)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



Tuesday, 26 May 2020

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము



షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.

దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను. 

మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.

ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.

మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.

కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.

విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.

మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.

ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.

సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, 
అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.

కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.

వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.

విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.

దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.

ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.

కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.

తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.  

వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.

పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.

చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.

సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.

క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.

అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-

ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.

స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.

దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.


ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో  ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.

విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.

రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.

అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.

వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.

వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.

అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.

పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.

త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.

ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించెను. అప్ఫుడు దేవతలు  దైత్యులకు మేనల్లుడాయెనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసికొనిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్డోఽధ్యాయః (6)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



Sunday, 24 May 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము






విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట
శ్రీ శుకుడు వచించెను

శ్రీ శుకుడు ఉవాచ- పరీక్షిన్మహారాజా! నీతికోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవారు. వారు యమదూతలయొక్క వచనములను ఆలకించి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః

విష్ణుదూతలు పలికిరి- యమదూతలారా! ధర్మజ్ఞుల సభయందు అధర్మము ప్రవేశించు చున్నది. అచట నిరపరాధులు, శిక్షింపదగని వారుగూడ దండింపబడుచున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము.

ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు ఐన వారే ప్రజలయెడ విపరీతముగా ప్రవర్తించినచో, ఇంక ఆ ప్రజలకు దిక్కెవ్వరు?

సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలుగూడ అనుసరింతురు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలముగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటినే ప్రమాణముగా స్వీకరింతురు.

సామాన్యజనులు పశువులవలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కాని, వారు సత్పురుషులను విశ్వసించి, వారి యొడిలో తలులుంచి, నిర్భయముగా నిశ్చింతగా ఉందురు.

దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమహితైషులుగా భావించిన జీవులు మిత్రభావముతో ఆత్మసమర్పణ చేయుదురు. కనుక, దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఏల వమ్ము చేయుదురు?

యమదూతలారా! ఈ అజామిళుడు బుద్ధి పూర్వకముగా కాకున్నను, పరమశుభప్రదమైన (మోక్షదాయకమైన) శ్రీహరి నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతడు కోటిజన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసికొనినట్లే, నారాయణ అను నాలుగు అక్షరములను ఉచ్చరించినంతనే, ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లైనది.

దొంగతనము చేసినవాడు, మద్యపాన మొనర్చినవాడు, మిత్ర ద్రోహి, బ్రాహ్మణహంతకుడు, గురుపత్నిని గోరినవాడు. ఇట్టివారితో జత కట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడి గట్టినవాడైనను సరే! అట్టి వానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్ద్వారా, అతని సకల పాపములును ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్ఛారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతమగును. తద్ద్వారా గుణములయందు, పరమాత్ముని. లీలలయందు, స్వరూపమునందు తల్లీనుడు అగును. అతనియెడ పరమాత్మకుగూడ ఆత్మీయత కల్గును.

బ్రహ్మజ్ఞానులైన ఋషులు క్రచ్ఛ్ర, చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని, తెలిపియుండిరి. కాని, ఇట్టి వ్రతాదులను ఆచరించుటవలన మనుజులకు పూర్తిగా పాపవిమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపములనుండి విముక్తి కలుగును. పవిత్రకీర్తిగల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును.

మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసికొనిన తరువాత గూడ వారి మనస్సు మరల చెడుమార్గములవైపు పరుగెత్తినచో, అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక, వాటికి మూలములైన వాసనలుగూడ తొలగిపోవలెను. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములగును.

కావున, యమదూతలారా! మీరు ఇతనిని నరకమునకు తీసికొనిపోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఈతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే.

ఇతరులను ఉద్దేశించిగాని, పరిహాసమునకుగాని, గీతాలాపమునందుగాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమునగాని ఎవ్వరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నియు తొలగిపోవునని మహాత్ములు ఎఱుగుదురు.

మనుజుడు క్రిందపడినప్పుడు గాని, జాఱిపడిపోయినప్పుడుగాని, అవయవములు విరిగినప్పుడుగాని, సర్పాదులు కాటు వేసినప్పుడుగాని, మంటలలో చిక్కుపడినప్పుడుగాని, దెబ్బ తగిలినప్పుడుగాని, అవశుడై హరిహరీ అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు.

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

మానవులు తాము చేసిన పాపకర్మలను బట్టి ప్రాయశ్చిత్తమును చేసికొనవలెనని మహర్షులు చక్కగా ఆలోచించి తెలిపిరి.

తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములు తొలగిపోవును. అందులకు సందేహములేదు. కాని ఆ పాపముచే మలినమైన వాని హృదయము మాత్రము పరిశుద్ధముగాదు. భగవంతుని పాదములను సేవించుట వలన అంతఃకరణము పవిత్రమగును.

యమదూతలారా! తెలిసిగాని, తెలియకగాని పవిత్రకీర్తియగు భగవంతుని నామమును సంకీర్తనము చేసినచో, అతని పాపములు అన్నియును నిప్ఫు, కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా, భస్మీపటలము అగుట నిశ్చయము.

శక్తిమంతమైన అమృతము యొక్క ప్రభావము తెలియకున్నను దానిని త్రాగినవాడు అవశ్యముగా అమరుడగును. అట్లే భగవన్నామ ప్రభావము తెలియకున్నను ఆ నామమును ఉచ్చరించుటవలన అది సత్ఫలమును ఇచ్చియే తీరును (వస్తుశక్తి శ్రద్ధను గూర్చి ఆలోచింపదు).

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! శ్రీహరి పార్షదులు ఈ విధముగా భాగవత ధర్మములను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తుని గావంచిరి. అంతేగాక, అతనిని మృత్యుముఖమునుండియు కాపాడిరి.

శత్రుసూధనా! శ్రీహరిపార్షదుల యొక్క మాటలను విన్నపిదప యమదూతలును ధర్మరాజు కడకు వెళ్ళిరి. జరిగిన వృత్తాంతమును అంతయు యమునకు వివరించిరి.

అజామిళుడు యమదూతల పాశములనుండి విముక్తుడై, భయరహితుడయ్యెను, అతనికి స్వస్థత చేకూరెను. శ్రీహరి పార్షదులను దర్శించి. అతడు ఆనంద మగ్నుడాయెను. వారికి శిరసా ప్రణమిల్లెను.

పుణ్యాత్మా! పరీక్షిన్మహారాజా! అజామిళుడు ఏదో చెప్పదలచు కొన్నాడని పార్షదులు గ్రహించిరి. వెంటనే వారు అచటినుండి అంతర్ధానమైరి.

అజామిళుడు శ్రీహరి పార్షదుల వలన పవిత్రమైన భాగవతధర్మములను, యమదూతలద్వారా వేదోక్తములైన సగుణ (ప్రవృతి విషయకములైన) ధర్మములను వినియుండెను.

సర్వపాపములను హరించునట్టి  భగవన్మహిమలను వినుటవలన అజామిళుని హృదయమున శీఘ్రముగా భక్తిభావము ఉదయించెను. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని, పశ్చాత్తాపపడసాగెను.

అజామిళుడు తన మనస్సులో ఇట్లు అనుకొనసాగెను - 'అరెరే! నేను ఇంద్రియములకు దాసుడనైతిని కదా! ఒక వేశ్య గర్భమున పుత్రులను పుట్టించి, నా బ్రాహ్మణత్వమును మంట గలిపితిని. ఇది మిక్కిలి శోచనీయము'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'అయ్యోయ్యో! నా ప్రవర్తన గర్హణియము. పాపాత్ముడనైన నన్ను సత్ఫురుషులు నిందించెదరు. నా వంశమునకు కళంకమును దెచ్చితిని. పరమసాధ్వియు, అమాయకురాలు ఐన నాధర్మపత్నిని పరిత్యజించితిని. మద్యపానము చేయు కులటతో సంసారము చేసితిని'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నా తల్లిదండ్రులు వృద్ధులు, తపస్సంపన్నులు. వారికి సేవలొనర్చుటకు బంధువులు ఎవ్వరును లేరు. అట్టి దిక్కులేనివారిని త్యజించిన కృతఘ్నుడను, నీచుడను'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్ఫుడు నాకు భయంకరమైన (దుర్భరమైన) నరకము తప్పదు. విషయలోలురై, ధర్మము తప్పిన పాపాత్ములు నరకము నుండి పెక్కు విధములైన యమయాతనలను అనుభవింతురు'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను ఇప్పుడు చూచిన ఈ అద్భుత దృశ్యము స్వప్నమా? లేక జాగ్రదవస్థలోనే ప్రత్యక్షముగా అనుభవించితినా! చేతులలో పాశములను ధరించి, నన్ను లాగికొనిపోవుచుండెడివారు ఎక్కడికి వెళ్ళినట్లు?'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్పటికి ఇప్పుడే వారు నన్ను పాశములచే బంధించి, అధోలోకమునకు తీసుకొనిపోవుచుండిరి. కాని, అత్యంత సుందరులై నలుగురు సిద్ధులు వచ్చి, నన్ను విడిపించిరి. వారెక్కడికి పోయిరి'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఈ జన్మలో నేను మహాపాపిని. ఐనను, పూర్వజన్మలో తప్పక సత్కర్మలను ఆచరించి యుంటినేమో? అందువలననే కాబోలు, నాకు ఉత్తమదేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినంతనే నా హృదయము ఆనందముతో పొంగిపోవుచున్నది'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను వేశ్యతో జీవితమును గడపితిని. అత్యంతపాపిని. పూర్వజన్మలో నేను ఏదైనను సుకృతమును చేసియుండనిచో, మరణసమయమున నా నోట ఆ భగవంతుని నామము ఎట్లు వచ్చియుండెడిది?'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'మహాకపటిని, పాపిని, లజ్జాహీనుడను, బ్రాహ్మణత్వమును మంటగల్పిన వాడను అయిన నేనెక్కడ? పరమశ్రేయస్కరమైన భగవంతుని నారాయణ నామమెక్కడ?'

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియంత్రించుటకు ప్రయత్నించెదను. దాని వలన అంధకారమయమైన ఘోర నరకమునందు పడవలసిన స్థితి మరల సంభవింపదు.

అజ్ఞానవశమున శరీరమే నేను అని భావించి, కోరికలకు బానిసనైతిని. వాటిని అనుభవించు నేను పెక్కుదుష్కర్మలను ఆచరించితిని. వాటి ఫలితమే ఈ బంధనము. ఇప్పుడు దీనిని ఛేదించి సకల ప్రాణులకును హితమొనర్తును. వాసనలను శాంతపరతును. అందరితోను మైత్రి సలిపెదను. దుఃఖితులపై దయచూపెదను. పూర్తిగా జితేంద్రియుడనై యుందును.

భగవంతుని మాయయే స్త్రీరూపమును ధరించి, అధముడనైన నన్ను వేశ్యగా వశపరచుకొనినది. నన్ను ఒక తోలు బొమ్మను జేసి ఆడించినది. ఇప్పుడు నేను ఆ మాయనుండి విముక్తుడనయ్యెదను.

నేను నిత్యసత్య స్వరూఫుడనై భగవంతుని గూర్చి తెలిసికొంటిని. కనుక, శరీరాదులందు అహంకార, మమకార భావములను త్యజించెదను. భగవంతుని నామ కీర్తనాదులచే నా మనస్సును పవిత్ర మొనర్చుకొని, దానిని ఆ పరమాత్మునియందే నిలుపుకొందును.

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! అజామిళునకు మహర్షులైన శ్రీహరి పార్షదులుతోడి సాంగత్యము జరిగినది క్షణకాలము మాత్రమే. దాని ఫలితముగా అతనిలో వైరాగ్యము ఏర్పడినది. సమస్త బంధములను, మోహమును త్యజించి, అతడు హరిద్వారము చేరెను.

ఆ దివ్యస్థలమునందు భగవంతుని మందిరమున ఆసీనుడయ్యెను. యోగమార్గమును ఆశ్రయించి, ఇంద్రియములను విషయములనుండి మరల్చెను. ఏకాగ్ర చిత్తముతో మనస్సును ఆత్మయందు నిలిపెను.

అనంతరము ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయములనుండి వేరు చేసెను. అప్ఫుడు ఏకాగ్రమొనర్చిన బుద్ధిని జ్ఞానస్వరూపము, సచ్చిదానందాత్మకము అగు పరబ్రహ్మయందు నిలిపెను.

ఈ విధముగా అజామిళుని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి, భగవత్స్వరూపమునందు స్థితమయ్యెను. అప్పుడు ఇదివరలో అతడు చూచిన నలుగురు పార్షదులు తన యెదుట నిలిచియున్నట్లు గమనించెను. అంతట అతడు వారికి శిరసా ప్రణమిల్లెను.

పార్హదుల దర్శనము లభించిన పిదప , అజామిళుడు హరిద్వారమున గంగయందు తనదేహమును త్యజించెను. వెంటనే అతనికి పార్షదుల స్వరూపము ప్రాప్తించెను.

అజామిళుడు శ్రీహరి పార్షదులతో గూడి బంగారు విమానమందు ఆరూఢుడయ్యెను. ఆకాశమార్గముస లక్ష్మీపతికి స్థానమైన వైకుంఠమును జేరెను.

పరీక్షిన్మహారాజా! అజామిళుడు వేశ్యతోడి సాంగత్యము వలన సకల ధార్మిక కార్యక్రమములను విడిచిపెట్టెను. నింద్యమైన కర్మల కారణముగా పతితుడాయెను. నియమములను ఉల్లంఘించుటవలన నరకమునందు పడవలసిన దుస్థితి ఎదురయ్యెను. కాని, భగవన్నామమును ఉచ్చరించుటచే వెంటనే ముక్తిని పొందెను.

సంసారబంధములనుండి ముక్తులు కాగోరువారు తీర్థములను కూడా మరింత పవిత్రములను జేయునట్టి భగవంతుని పవిత్రపాదములను స్పృశించుటకంటెను, నామసంకీర్తన  చేయుటకంటెను మరియొక గొప్ప ఉపాయము ఏదియును లేదు. ఏలయన, భగవన్నామమును ఆశ్రయించుట వలన మానవుని మనస్సు మరల లౌకిక కర్మల యందు తగుల్కొనదు. భగవన్నామము కాక వేరొక ప్రాయశ్చిత్త సాధనమును ఆశ్రయించినచో, మనస్సు, రజస్తమోగుణములకు వశమగును. అప్పుడు అతని పాపములు పూర్థిగా నశింపవు.

పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసము అత్యంత గోప్యమైనది. సమస్త పాపములను హరించునది. భక్తిశ్రద్ధలతో దీనిని వినువాడు, కీర్తించినవాడు నరకమునకు ఎన్నడును పోడు. యమదూతలు అతనివైపు కన్నత్తియైనను చూడజాలరు. ఆ మనుజుని జీవనము ఎంత పాపమయమైనను, అతడు వైకుంఠమున సమ్మానింపబడును.

మహారాజా! అజామిళుని వంటి పాపాత్ముడుగూడ మరణ సమయమున పుత్రుని పిలిచెడి నెపముతో భగవన్నామమును ఉచ్చరించెను. అందువలన అతనికి గూడ పరమపదప్రాప్తి గలిగినది. ఇంక, భక్తి శ్రద్ధలతో పరమాత్ముని నామమును ఉచ్చరించిన వాని సంగతి చెప్పనేల?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--


21.5.2020    ప్రాత:కాల భాగవతం  

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ శుకుడు వచించెను

2.1 (ప్రథమ శ్లోకము)

ఏవం తే భగవద్దూతా యమదూతాభిభాషితమ్|

ఉపధార్యాథ తాన్ రాజన్ ప్రత్యాహుర్నయ కోవిదాః॥4793॥

శ్రీ శుకుడు ఉవాచ- పరీక్షిన్మహారాజా! నీతికోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవారు. వారు యమదూతలయొక్క వచనములను ఆలకించి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః

2.2 (రెండవ శ్లోకము)

అహో కష్టం ధర్మదృశామధర్మః స్పృశతే సభామ్|

యత్రాదండ్యేష్వపాపేషు దండో యైర్ధ్రియతే వృథా॥4794॥

విష్ణుదూతలు పలికిరి- యమదూతలారా! ధర్మజ్ఞుల సభయందు అధర్మము ప్రవేశించుచున్నది. అచట నిరపరాధులు, శిక్షింపదగని వారుగూడ దండింపబడుచున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము.

2.3 (మూడవ శ్లోకము)

ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధనః సమాః|

యది సాక్త్యేషు వైషమ్యం కం యాంతి శరణం ప్రజాః॥4795॥

ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు ఐన వారే ప్రజలయెడ విపరీతముగా ప్రవర్తించినచో, ఇంక ఆ ప్రజలకు దిక్కెవ్వరు?

2.4 (నాలుగవ శ్లోకము)

యద్యదాచరతి శ్రేయోనితరస్తత్తదీహతే|

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥4796॥

సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలుగూడ అనుసరింతురు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలముగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటినే ప్రమాణముగా స్వీకరింతురు.

2.5 (ఐదవ శ్లోకము)

యస్యాంకే శిర ఆధాయ లోకః స్వపితి నిర్వృతః|

స్వయం ధర్మమధర్మం వా న హి వేద యథా పశుః॥4797॥

సామాన్యజనులు పశువులవలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కాని, వారు సత్పురుషులను విశ్వసించి, వారి యొడిలో తలులుంచి, నిర్భయముగా నిశ్చింతగా ఉందురు.

2.6 (ఆరవ శ్లోకము)

స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనమ్|

విస్రంభణీయో భూతానాం సఘృణో ద్రోగ్ధుమర్హతి॥4798॥

దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమహితైషులుగా భావించిన జీవులు మిత్రభావముతో ఆత్మసమర్పణ చేయుదురు. కనుక, దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఏల వమ్ము చేయుదురు?

2.7 (ఏడవ శ్లోకము)

అయం హి కృతనిర్వేశో జన్మకోట్యంహసామపి|

యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః॥4799॥

2.8 (ఎనిమిదవ శ్లోకము)

ఏతేనైవ హ్యఘోనోఽస్య కృతం స్యాదఘనిష్కృతమ్|

యదా నారాయణాయేతి జగాద చతురక్షరమ్॥4800॥ 

యమదూతలారా! ఈ అజామిళుడు బుద్ధి పూర్వకముగా కాకున్నను, పరమశుభప్రదమైన (మోక్షదాయకమైన) శ్రీహరి నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతడు కోటిజన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసికొనినట్లే, నారాయణ అను నాలుగు అక్షరములను ఉచ్చరించినంతనే, ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లైనది.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

స్తేనః సురాపో మిత్రధ్రుగ్బ్రహ్మహా గురుతల్పగః|

స్త్రీరాజపితృగోహంతా యే చ పాతకినోఽపరే॥4801॥

2.10 (పదియవ శ్లోకము)

సర్వేషామప్యఘవతామిదమేవసునిష్కృతమ్|

నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః॥4802॥

దొంగతనము చేసినవాడు, మద్యపాన మొనర్చినవాడు, మిత్ర ద్రోహి, బ్రాహ్మణహంతకుడు, గురుపత్నిని గోరినవాడు. ఇట్టివారితో జత కట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడి గట్టినవాడైనను సరే! అట్టి వానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్ద్వారా, అతని సకల పాపములును ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్ఛారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతమగును. తద్ద్వారా గుణములయందు, పరమాత్ముని. లీలలయందు, స్వరూపమునందు తల్లీనుడు అగును. అతనియెడ పరమాత్మకుగూడ ఆత్మీయత కల్గును.

2.11 (పదకొండవ శ్లోకము)

న నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిః తథా విశుధ్యత్యఘవాన్ వ్రతాదిభిః|

యథా హరేర్నామపదైరుదాహృతైః తదుత్తమశ్లోకగుణోపలంభకమ్॥4803॥

బ్రహ్మజ్ఞానులైన ఋషులు క్రచ్ఛ్ర, చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని, తెలిపియుండిరి. కాని, ఇట్టి వ్రతాదులను ఆచరించుటవలన మనుజులకు పూర్తిగా పాపవిమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపములనుండి విముక్తి కలుగును. పవిత్రకీర్తిగల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును.

2.12 (పండ్రెండవ శ్లోకము)

నైకాంతికం తద్ధి కృతేఽపి నిష్కృతే మనః పునర్ధావతి చేదసత్పథే|

తత్కర్మనిర్హారమభీప్సతాం హరేః గుణానువాదః ఖలు సత్త్వభావనః॥4804॥

మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసికొనిన తరువాత గూడ వారి మనస్సు మరల చెడుమార్గములవైపు పరుగెత్తినచో, అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక, వాటికి మూలములైన వాసనలుగూడ తొలగిపోవలెను. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములగును.

2.13 (పదమూడవ శ్లోకము)

అథైనం మాపనయత కృతాశేషాఘనిష్కృతమ్|

యదసౌ భగవన్నామ మ్రియమాణః సమగ్రహీత్॥4805॥

కావున, యమదూతలారా! మీరు ఇతనిని నరకమునకు తీసికొనిపోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఈతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే.

2.14 (పదునాలుగవ శ్లోకము)

సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా|

వైకుంఠ నామగ్రహణ  మశేషాఘహరం విదుః॥4806॥

ఇతరులను ఉద్దేశించిగాని, పరిహాసమునకుగాని, గీతాలాపమునందుగాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమునగాని ఎవ్వరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నియు తొలగిపోవునని మహాత్ములు ఎఱుగుదురు.

2.15 (పదునైదవ శ్లోకము)

పతితః స్ఖలితో భగ్నుః సందష్టస్తప్త ఆహతః|

హరిరిత్యవశేనాహ పుమాన్ నార్హతి యాతనామ్॥4807॥

మనుజుడు క్రిందపడినప్పుడు గాని, జాఱిపడిపోయినప్పుడుగాని, అవయవములు విరిగినప్పుడుగాని, సర్పాదులు కాటు వేసినప్పుడుగాని, మంటలలో చిక్కుపడినప్పుడుగాని, దెబ్బ తగిలినప్పుడుగాని, అవశుడై హరిహరీ అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

--(())--


22.5.2020    ప్రాత: కాల మహాభాగవతం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

2.16 (పదునారవ శ్లోకము)

గురూణాం చ లఘూనా చ గురూణి చ లఘూని చ|

ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః॥4808॥

మానవులు తాము చేసిన పాపకర్మలను బట్టి ప్రాయశ్చిత్తమును చేసికొనవలెనని మహర్షులు చక్కగా ఆలోచించి తెలిపిరి.

2.17 (పదునేడవ శ్లోకము)

తైస్తాన్యఘాని పూయంతే తపోదానజపాదిభిః|

నాధర్మజం తద్ధృదయం తదపీశాంఘ్రిసేవయా॥4809॥

తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములు తొలగిపోవును. అందులకు సందేహములేదు. కాని ఆ పాపముచే మలినమైన వాని హృదయము మాత్రము పరిశుద్ధముగాదు. భగవంతుని పాదములను సేవించుట వలన అంతఃకరణము పవిత్రమగును.

2.18 (పదునెనిమిదవ శ్లోకము)

అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్|

సంకీర్తతమఘం పుంసో దహేదేధో యథానలం॥4810॥

యమదూతలారా! తెలిసిగాని, తెలియకగాని పవిత్రకీర్తియగు భగవంతుని నామమును సంకీర్తనము చేసినచో, అతని పాపములు అన్నియును నిప్ఫు, కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా, భస్మీపటలము అగుట నిశ్చయము.

2.19 (పందొమ్మిదవ శ్లోకము)

యథాగదం వీర్యతమముపయుక్తం యదృచ్ఛయా|

అజానతోఽప్యాత్మగుణం కుర్యాన్మంత్రోఽప్యుదాహృతః॥4811॥

శక్తిమంతమైన అమృతము యొక్క ప్రభావము తెలియకున్నను దానిని త్రాగినవాడు అవశ్యముగా అమరుడగును. అట్లే భగవన్నామ ప్రభావము తెలియకున్నను ఆ నామమును ఉచ్చరించుటవలన అది సత్ఫలమును ఇచ్చియే తీరును (వస్తుశక్తి శ్రద్ధను గూర్చి ఆలోచింపదు).

శ్రీ శుక ఉవాచ

2.20 (ఇరువదియవ శ్లోకము)

త ఏవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప|

తం యామ్యపాశాన్నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్॥4812॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! శ్రీహరి పార్షదులు ఈ విధముగా భాగవత ధర్మములను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తుని గావంచిరి. అంతేగాక, అతనిని మృత్యుముఖమునుండియు కాపాడిరి.

2.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఇతి ప్రత్యుదితా యామ్యా దూశా యాశ్వా యమాంతికే|

యమరాజ్ఞే యథా సర్వమాచచక్షురరిందమ॥4813॥

శత్రుసూధనా! శ్రీహరిపార్షదుల యొక్క మాటలను విన్నపిదప యమదూతలును ధర్మరాజు కడకు వెళ్ళిరి. జరిగిన వృత్తాంతమును అంతయు యమునకు వివరించిరి.

2.22 (ఇరువది రెండవ శ్లోకము)

ద్విజః పాశాద్వినిర్ముక్తో గతభీః ప్రకృతిం గతః|

వవందే శిరసా విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః॥4814॥

అజామిళుడు యమదూతల పాశములనుండి విముక్తుడై, భయరహితుడయ్యెను, అతనికి స్వస్థత చేకూరెను. శ్రీహరి పార్షదులను దర్శించి. అతడు ఆనంద మగ్నుడాయెను. వారికి శిరసా ప్రణమిల్లెను.

2.23 (ఇరువది మూడవ శ్లోకము)

తం వివక్షుమభిప్రేత్య మహాపురుషకింకరాః|

సహసా పశ్యతస్తస్య తత్రాంతర్థధిరేఽనఘ॥4815॥

పుణ్యాత్మా! పరీక్షిన్మహారాజా! అజామిళుడు ఏదో చెప్పదలచు కొన్నాడని పార్షదులు గ్రహించిరి. వెంటనే వారు అచటినుండి అంతర్ధానమైరి.

2.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

అజామిళోఽప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః|

ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయమ్॥4816॥

అజామిళుడు శ్రీహరి పార్షదుల వలన పవిత్రమైన భాగవతధర్మములను, యమదూతలద్వారా వేదోక్తములైన సగుణ (ప్రవృతి విషయకములైన) ధర్మములను వినియుండెను.

2.25 (ఇరువది ఐదవ శ్లోకము)

భక్తిమాన్ భగవత్యాశు మహాత్మ్యశ్రవణాద్ధరేః|

అనుతాపో మహానాసీత్ స్మరతోఽశుభమాత్మనః॥4817॥

సర్వపాపములను హరించునట్టి  భగవన్మహిమలను వినుటవలన అజామిళుని హృదయమున శీఘ్రముగా భక్తిభావము ఉదయించెను. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని, పశ్చాత్తాపపడసాగెను.

2.26 (ఇరువదియారవ శ్లోకము)

అహో మే పరమం కష్టమభుదవిజితాత్మనః|

యేన విప్లావితం బ్రహ్మ వృషళ్యాం జాయతాఽఽత్మనా॥4818॥

అజామిళుడు తన మనస్సులో ఇట్లు అనుకొనసాగెను - 'అరెరే! నేను ఇంద్రియములకు దాసుడనైతిని కదా! ఒక వేశ్య గర్భమున పుత్రులను పుట్టించి, నా బ్రాహ్మణత్వమును మంట గలిపితిని. ఇది మిక్కిలి శోచనీయము'.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ధిఙ్మాం విగర్హితం సద్భిర్దుష్కృతం  కులకజ్జలమ్|

హిత్వా బాలాం సతీం యోఽహం సురాపామసతీమగామ్॥4819॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'అయ్యోయ్యో! నా ప్రవర్తన గర్హణియము. పాపాత్ముడనైన నన్ను సత్ఫురుషులు నిందించెదరు. నా వంశమునకు కళంకమును దెచ్చితిని. పరమసాధ్వియు, అమాయకురాలు ఐన నాధర్మపత్నిని పరిత్యజించితిని. మద్యపానము చేయు కులటతో సంసారము చేసితిని'.

2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

వృద్ధావనాథౌ పితరౌ నాన్యబంధూ తపస్వినౌ|

అహో మయాధునా త్యక్తావకృతజ్ఞేన నీచవత్॥4820॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నా తల్లిదండ్రులు వృద్ధులు, తపస్సంపన్నులు. వారికి సేవలొనర్చుటకు బంధువులు ఎవ్వరును లేరు. అట్టి దిక్కులేనివారిని త్యజించిన కృతఘ్నుడను, నీచుడను'.

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సోఽహం వ్యక్తం పతిష్యామి నరకే భృశదారుణే|

ధర్మఘ్నాః కామినో యత్ర విందంతి యమయాతనాః॥4821॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్ఫుడు నాకు భయంకరమైన (దుర్భరమైన) నరకము తప్పదు. విషయలోలురై, ధర్మము తప్పిన పాపాత్ములు నరకము నుండి పెక్కు విధములైన యమయాతనలను అనుభవింతురు'.

2.30 (ముప్పదియవ శ్లోకము)

కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతమ్|

క్వ యాతా అద్య తే యే మాం వ్యకర్షన్ పాశపాణయః॥4822॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను ఇప్పుడు చూచిన ఈ అద్భుత దృశ్యము స్వప్నమా? లేక జాగ్రదవస్థలోనే ప్రత్యక్షముగా అనుభవించితినా! చేతులలో పాశములను ధరించి, నన్ను లాగికొనిపోవుచుండెడివారు ఎక్కడికి వెళ్ళినట్లు?'

2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అథ తే క్వ గతాః సిద్ధాశ్చత్వారశ్చారుదర్శనాః|

వ్యమోచయన్నీయమానం బధ్వా పాశైరధో భువః॥4823॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్పటికి ఇప్పుడే వారు నన్ను పాశములచే బంధించి, అధోలోకమునకు తీసుకొనిపోవుచుండిరి. కాని, అత్యంత సుందరులై నలుగురు సిద్ధులు వచ్చి, నన్ను విడిపించిరి. వారెక్కడికి పోయిరి'.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

అథాపి మే దుర్భగస్య విబుధోత్తమదర్శనే|

భవితవ్యం మంగళేన యేనాత్మ మే   ప్రసీదతి॥4824॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఈ జన్మలో నేను మహాపాపిని. ఐనను, పూర్వజన్మలో తప్పక సత్కర్మలను ఆచరించి యుంటినేమో? అందువలననే కాబోలు, నాకు ఉత్తమదేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినంతనే నా హృదయము ఆనందముతో పొంగిపోవుచున్నది'

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

అన్యథా మ్రియమాణస్య నాశుచేర్వృషలీపతేః|

వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి॥4825॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను వేశ్యతో జీవితమును గడపితిని. అత్యంతపాపిని. పూర్వజన్మలో నేను ఏదైనను సుకృతమును చేసియుండనిచో, మరణసమయమున నా నోట ఆ భగవంతుని నామము ఎట్లు వచ్చియుండెడిది?'

2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

క్వ చాహం కితవః పాపో బ్రహ్మఘ్నో నిరపత్రపః|

క్వ చ నారాయణేత్యేతద్భగవన్నామ మంగళమ్॥4826॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను


'మహాకపటిని, పాపిని, లజ్జాహీనుడను, బ్రాహ్మణత్వమును మంటగల్పిన వాడను అయిన నేనెక్కడ? పరమశ్రేయస్కరమైన భగవంతుని నారాయణ నామమెక్కడ?'

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



23.5.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

2.35 (ముప్పది ఐదవ శ్లోకము)

సోఽహం తథా యతిష్యామి యతచిత్తేంద్రియయానిలః|

యథా న భూయ ఆత్మానమంధే తమసి మజ్జయే॥4827॥

ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియంత్రించుటకు ప్రయత్నించెదను. దాని వలన అంధకారమయమైన ఘోర నరకమునందు పడవలసిన స్థితి మరల సంభవింపదు.

2.36 (ముప్పది ఆరవ శ్లోకము)

విముచ్య తమిమం బంధమవిద్యాకామకర్మజమ్|

సర్వభూతసుహృచ్ఛాంతో మైత్రః కరుణ ఆత్మవాన్॥4828॥

అజ్ఞానవశమున శరీరమే నేను అని భావించి, కోరికలకు బానిసనైతిని. వాటిని అనుభవించు నేను పెక్కుదుష్కర్మలను ఆచరించితిని. వాటి ఫలితమే ఈ బంధనము. ఇప్పుడు దీనిని ఛేదించి సకల ప్రాణులకును హితమొనర్తును. వాసనలను శాంతపరతును. అందరితోను మైత్రి సలిపెదను. దుఃఖితులపై దయచూపెదను. పూర్తిగా జితేంద్రియుడనై యుందును.

2.37 (ముప్పది ఏడవ శ్లోకము)

మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాఽఽత్మ మాయయా|

విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః॥4829॥

భగవంతుని మాయయే స్త్రీరూపమును ధరించి, అధముడనైన నన్ను వేశ్యగా వశపరచుకొనినది. నన్ను ఒక తోలు బొమ్మను జేసి ఆడించినది. ఇప్పుడు నేను ఆ మాయనుండి విముక్తుడనయ్యెదను.

2.38 (ముప్పది ఎనీమిదవ శ్లోకము)

మమాహమితి దేహిదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిమ్|

ధాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః॥4830॥

నేను నిత్యసత్య స్వరూఫుడనై భగవంతుని గూర్చి తెలిసికొంటిని. కనుక, శరీరాదులందు అహంకార, మమకార భావములను త్యజించెదను. భగవంతుని నామ కీర్తనాదులచే నా మనస్సును పవిత్ర మొనర్చుకొని, దానిని ఆ పరమాత్మునియందే నిలుపుకొందును.

శ్రీ శుక ఉవాచ

2.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఇతి జాతసునిర్వేదః క్షణసంగేన సాధుషు|

గంగాద్వారముపేయాయ ముక్తాసర్వానుబంధనః॥4831॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! అజామిళునకు మహర్షులైన శ్రీహరి పార్షదులుతోడి సాంగత్యము జరిగినది క్షణకాలము మాత్రమే. దాని ఫలితముగా అతనిలో వైరాగ్యము ఏర్పడినది. సమస్త బంధములను, మోహమును త్యజించి, అతడు హరిద్వారము చేరెను.

2.40 (నలుబదియవ శ్లోకము)

స తస్మిన్ దేవసదనే ఆసీనో యోగమాశ్రితః|

ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయోజ మన ఆత్మని॥4832॥

ఆ దివ్యస్థలమునందు భగవంతుని మందిరమున ఆసీనుడయ్యెను. యోగమార్గమును ఆశ్రయించి, ఇంద్రియములను విషయములనుండి మరల్చెను. ఏకాగ్ర చిత్తముతో మనస్సును ఆత్మయందు నిలిపెను.

2.41 (నలుబది  యొకటవ శ్లోకము)

తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మసమాధినా|

యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని॥4833॥

అనంతరము ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయములనుండి వేరు చేసెను. అప్ఫుడు ఏకాగ్రమొనర్చిన బుద్ధిని జ్ఞానస్వరూపము, సచ్చిదానందాత్మకము అగు పరబ్రహ్మయందు నిలిపెను.

2.42 (నలుబది రెండవ శ్లోకము)

యర్హ్యుపారతధీస్తస్మిన్నద్రాక్షీత్పురుషాన్ పురః|

ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వవందే శిరసా ద్విజః॥4834॥

ఈ విధముగా అజామిళుని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి, భగవత్స్వరూపమునందు స్థితమయ్యెను. అప్పుడు ఇదివరలో అతడు చూచిన నలుగురు పార్షదులు తన యెదుట నిలిచియున్నట్లు గమనించెను. అంతట అతడు వారికి శిరసా ప్రణమిల్లెను.

2.43 (నలుబది మూడవ శ్లోకము)

హిత్వా కళేబరం తీర్థే గంగాయాం దర్శనాదను|

సద్యః స్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినామ్॥4835॥

పార్హదుల దర్శనము లభించిన పిదప , అజామిళుడు హరిద్వారమున గంగయందు తనదేహమును త్యజించెను. వెంటనే అతనికి పార్షదుల స్వరూపము ప్రాప్తించెను.

2.44 (నలుబది నాలుగవ శ్లోకము)

సాకం విహాయసా విప్రో మహాపురుషకింకరైః|

హైమం విమానమారుహ్య యయౌ  యత్ర శ్రియః పతిః॥4836॥

అజామిళుడు శ్రీహరి పార్షదులతో గూడి బంగారు విమానమందు ఆరూఢుడయ్యెను. ఆకాశమార్గముస లక్ష్మీపతికి స్థానమైన వైకుంఠమును జేరెను.

2.45 (నలుబది ఐదవ శ్లోకము)

ఏవం స విప్లావితసర్వధర్మా దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణా|

నిపాత్యమానో నిరయే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్॥4837॥

పరీక్షిన్మహారాజా! అజామిళుడు వేశ్యతోడి సాంగత్యము వలన సకల ధార్మిక కార్యక్రమములను విడిచిపెట్టెను. నింద్యమైన కర్మల కారణముగా పతితుడాయెను. నియమములను ఉల్లంఘించుటవలన నరకమునందు పడవలసిన దుస్థితి ఎదురయ్యెను. కాని, భగవన్నామమును ఉచ్చరించుటచే వెంటనే ముక్తిని పొందెను.

2.46 (నలుబదియారవ శ్లోకము)

నాతః పరం కర్మనిబంధకృంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్|

న యత్పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోఽన్యథా॥4838॥

సంసారబంధములనుండి ముక్తులు కాగోరువారు తీర్థములను కూడా మరింత పవిత్రములను జేయునట్టి భగవంతుని పవిత్రపాదములను స్పృశించుటకంటెను, నామసంకీర్తన  చేయుటకంటెను మరియొక గొప్ప ఉపాయము ఏదియును లేదు. ఏలయన, భగవన్నామమును ఆశ్రయించుట వలన మానవుని మనస్సు మరల లౌకిక కర్మల యందు తగుల్కొనదు. భగవన్నామము కాక వేరొక ప్రాయశ్చిత్త సాధనమును ఆశ్రయించినచో, మనస్సు, రజస్తమోగుణములకు వశమగును. అప్పుడు అతని పాపములు పూర్థిగా నశింపవు.

2.47 (నలుబది ఏడవ శ్లోకము)

య ఏవం పరమం గుహ్యమితిహాసమఘాపహమ్|

శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్॥4839॥

2.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

న వై స నరకం యాతి నేక్షితో యమకింకరైః|

యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే॥4840॥

పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసము అత్యంత గోప్యమైనది. సమస్త పాపములను హరించునది. భక్తిశ్రద్ధలతో దీనిని వినువాడు, కీర్తించినవాడు నరకమునకు ఎన్నడును పోడు. యమదూతలు అతనివైపు కన్నత్తియైనను చూడజాలరు. ఆ మనుజుని జీవనము ఎంత పాపమయమైనను, అతడు వైకుంఠమున సమ్మానింపబడును.

2.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితమ్|

అజామిళోఽప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్॥4841॥

మహారాజా! అజామిళుని వంటి పాపాత్ముడుగూడ మరణ సమయమున పుత్రుని పిలిచెడి నెపముతో భగవన్నామమును ఉచ్చరించెను. అందువలన అతనికి గూడ పరమపదప్రాప్తి గలిగినది. ఇంక, భక్తి శ్రద్ధలతో పరమాత్ముని నామమును ఉచ్చరించిన వాని సంగతి చెప్పనేల?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--




10-04,05-గీతా మకరందము 
      విభూతియోగము
🕉🌞🌎🌙🌟🚩

బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః 
క్షమా సత్యం దమశ్శమః | 
సుఖం దుఃఖం భవోఽభావో 
భయం చాభయమేవ చ || 

అహింసా సమతా తుష్టిః
తపో దానం యశోఽయశః | 
భవన్తి భావా భూతానాం 
మత్తఏవ పృథగ్విధాః || 

తా:- బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియనిగ్రహము, అంతరింద్రియనిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక (ఉత్పత్తి), నాశము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నావలననే కలుగుచున్నవి. 


వ్యాఖ్య:- ఈ రెండుశ్లోకములందును బుద్ధి, జ్ఞానము మున్నగు 16 అనుకూలగుణములున్ను; దుఃఖము, నాశము, భయము, అపకీర్తియను 4 ప్రతికూల గుణములున్ను చెప్పబడినవి. ఇవియన్నియు భగవంతుని వలననే కలుగుచున్నవని పేర్కొనబడినది. దీని భావమేమి?భగవానుడు వాస్తవముగ ప్రతికూలభావములను జీవులకు కలుగజేయుటలేదు. జీవుల ఆ యా కర్మములకు ఫలమొసంగువాడే ఈశ్వరుడు.


 ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. జీవులు కర్మకర్తలు. కొందఱికి కీర్తి, మఱికొందఱికి అపకీర్తి, కొందఱికి సుఖము, మఱికొందఱికి దుఃఖము వారివారి పూర్వకృత కర్మలవలననే కలుగుచున్నవి. ఏ విత్తనము వారు నాటిన ఆ ఫలితము వారికి కలుగుచుండును. ఈశ్వరుడు నిమిత్తమాత్రుడు. దుష్కర్మలు చేసినవారికి దుఃఖము, సత్కర్మలు చేసినవారికి సుఖము భగవన్నియతివలననే కలుగుచుండును. ఈ దృష్టితోనే ఆ సుఖదుఃఖాదులన్నియు భగవంతునివలన కలుగుచున్నవని చెప్పబడినది. 


    మఱియు  ఇప్పుడు చెప్పబడిన వికారములన్నియు మనస్సునందు ఉద్భవమగుచుండును.  మనస్సు స్వతః జడమైనది. దానికి ఆధారముగ చైతన్యమగు ఆత్మవస్తువు కలదు.


 సూదంటురాయిసమీపమున సూది కదలునట్లు చైతన్యాత్మయొక్క సన్నిధానమున మనస్సు క్రియాత్మకమగుచున్నది. ఈ ప్రకారముగ మనస్సునకును తద్గతవికారములకును పరమాత్మయే ఆధారముగనుక ఇట్టి దృష్టితోనే - అవి యన్నియును పరమాత్మవలననే కలిగినవని ఇచట చెప్పబడినది. అంతియేకాని వాని సంబంధమైన కర్తృత్వముగాని, ప్రేరకత్వముగాని ఆత్మకు (భగవంతునకు) లేదు. (సూర్యునకు జగత్క్రియలందుగాని, నాటకదీపమునకు నాటకమందుగాని కర్తృత్వములేనట్లు).

🕉🌞🌎🌙🌟🚩