వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు వచించెను- యుధిష్ఠిర మహారాజా! హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఈ విధముగా అత్యంతదుర్లభములైన వరములను కోరెను. అతని తపస్సునకు మిక్కిలి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు, ఆ వరములను అన్నింటిని ప్రసాదించెను.
బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను - నాయనా! నీవు జీవులకు దుర్లభములైన వరములను నా నుండి కోరితివి. అవి దుర్లభములే యైనను వాటిని నీకు ప్రసాదించుచున్నాను.
నారదుడు ఇట్లు వివరించెను- "బ్రహ్మదేవుడు సర్వ సమర్థుడైన భగవత్స్వరూపుడు. అతడు ప్రసాదించిన వరములు ఎన్నడును అసత్యములుకావు. వరములను పొందిన పిదప హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజించెను. అనంతరము ప్రజాపతులు తనను స్తుతించుచుండగా బ్రహ్మదేవుడు (తన) సత్యలోకమునకు చేరెను".
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
"బ్రహ్మదేవుని నుండి ఇట్లు వరములను పొందిన యహిరణ్యకశిపుని శరీరము బలిష్ఠమై బంగారు కాంతులీనుచుండెను. అతడు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధను గూర్చి స్మరించుచు శ్రీహరియెడ ద్వేష భావమును పెంచుకొనెను"
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
పిమ్మట అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపుడు సకల దిక్కులను, ముల్లోకములను, జయించెను. దేవతలను, అనుచరులను, మహరాజులను, గంధర్వులను, గరుడజాతికి చెందిన ప్రముఖులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరులను, ఋషులను, పితరులను, మనువులను, యక్షరాక్షసులను, పిశాచప్రభువులను, ప్రేతములను, భూతపతులను, సమస్తప్రాణులను జయించెను. ఈ విధముగా విశ్వవిజేతయైన ఆ హిరణ్యకశిపుడు లోకపాలుర స్థానములను, తేజస్సులను హరించెను.
"నందనవనము మొదలగు దివ్య-ఉద్యానములతో శోభిల్లునట్టి, స్వర్గము నందు అతడు నివసింపసాగెను. సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మితమైన ఇంద్ర భవనమే అతని నివాసస్థానమాయెను. ఆ భవనమునందు ముల్లోకముల సౌందర్యము రాశీభూతమై యుండెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు సకల సంపదలతో తులతూగెను"
ఆ ఇంద్రభవనము నందలి మెట్లు పగడములతో చెక్కబడెను. నేలకు మరకతమణులు తాపబడి యుండెను. గోడలు స్ఫటికములతో నిర్మింపబడి యుండెను. స్తంభములు వైడూర్యఖచితములు. అందు చిత్రవిచిత్రములైన తెరలు, పద్మరాగముల ఆసనములు, పాలనురుగుల వంటి తెల్లని శయ్యలపై ముత్యాలకంబళ్ళు శోభాయమానముగ నుండెను.
సర్వాంగ సుందరులైన అప్సరసలు రత్నఖచితములైన నేలలపై అటునిటు తిరుగుచుండగా వారి కాలి అందెల ధ్వనులు వినసొంపుగా నుండెను. వారు ఆ రత్నములలో తమ ముఖముల ప్రతిబింబమును చూచుకొనుచుండిరి.
మహాబలశాలి, మహామనస్వియు ఐన ఆ హిరణ్యకశిపుడు ముల్లోకములను జయించి, ఏకచ్ఛత్రాధిపతియై, మహేంద్రభవనమును స్వేచ్ఛగా విహరించుచుండెను. అతని కఠోర శాసనమునకు భీతిల్లి, దేవదానవులు ఆయన పాదముల కడ మోకరిల్లుచుండిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ధర్మరాజా! ఘాటైన వాసన గల మధ్యమును సేవించి అతడు మత్తిల్లియుండెను. అతని కనులు కైపెక్కి ఎర్రబారియుండెను. అతడు తపస్సుతో, యోగముతో, శారీరక దారుఢ్యముతో, మనోబలముతో ఒప్పుచుండెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప మిగిలిన దేవతలు అందరును కానుకలను చేబూని, అతనిని సేవించుచుండిరి.
ధర్మరాజా! అతడు తన బలపరాక్రమములచే ఇంద్రుని సింహాసనమును ఆక్రమించెను. అప్పుడు విశ్వావసువు, తుంబురుడు, మేము అందరము అతనియెదుట నిలిచి, గానము చేయుచుంటిమి. గంధర్వులు, సిద్ధులు, ఋషిగణములు, విద్యాధరులు, అప్సరసలు పదేపదే అతనిని స్తుతించుచుండిరి.
వర్ణాశ్రమ ధర్మములను పాటించువారు దక్షిణలతో గూడిన యజ్ఞములను ఆచరించుచుండిరి. మహాతేజస్వియైన హిరణ్యకశిపుడు , ఆ యజ్ఞముల హవిర్భాగములను తానే బలవంతముగా లాగికొనుచుండెను.
సప్తద్వీపములతో గూడిన భూమండలము అతని అధీనములో ఉండెను. దున్నకుండగనే భూములు పంటలను ఇచ్చుచుండెను. అంతరిక్షమునుండి అతడు కోరుకొనిన వస్తువులు అన్నియును లభించుచుండెను. ఆకాశము పలు విధములైన ఆశ్చర్యకరమైన వస్తువులను అందజేయుచు, అతని మనస్సును రంజింపజేయుచుండెను.
ఉప్పునీరు, మద్యము, నేయి, చెఱకురసము, పెరుగు, పాలు, తీయని జలములు గల సముద్రములు గూడ తమ పత్నులైన నదులతోగూడి తరంగముల ద్వారా రత్న రాసులను అతనికడకు చేర్చుచుండెను.
పర్వతములు, తమ లోయలయందు అతనికి క్రీడా స్థలములను ఏర్పరచు చుండెను. వృక్షములు అన్ని ఋతువులయందును పుష్పములతో ఫలములతో శోభిల్లుచుండెను. లోకపాలుర అధికారములను, అన్నింటిని అతడు ఒక్కడే చేపట్టుచుండెను.
ఆ హిరణ్యకశిపుడు సకల దిక్కులను జయించి, ఏకచ్ఛత్రాధిపతి యయ్యెను. తనకు ఇష్టమైన విషయములను అన్నింటిని యధేచ్ఛగా అనుభవించు చుండెను. ఐనను, ఇంద్రియనిగ్రహము లేనియతడు విషయ భోగములతో తృప్తి పడకుండెను.
సనకాదిమునుల శాపప్రభావమున శ్రీహరిపార్షదుడే హిరణ్యకశిపుడుగ జన్మించెను. అతడు ఐశ్వర్యముచే మత్తిల్లి గర్వితుడై యుండెను. శాస్త్రమర్యాదలను ఉల్లంఘించు చుండెను. ఈ విధముగా అతని జీవితములో చాలాభాగము గడచిపోయెను.
హిరణ్యకశిపుని కఠోరశాసనము వలన సమస్తలోకముల వారును, లోకపాలురును చాల భయపడుచుండిరి. వారిని రక్షించువారు ఎవ్వరును లేకుండిరి. అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి.
వారు తమ మనస్సులలో ఇట్లు భావింపసాగిరి- "సకల ప్రాణులకును ఆత్మ సర్వేశ్వరుడు ఐన శ్రీహరినివాసము పరంధామము. పవిత్రులై ప్రశాంతచిత్తులైన సన్న్యాసులు ఆ పరంధామమునకు చేరి, ఈ లోకమునకు తిరిగిరారు. అట్టి పరంధామమునకు నమస్కారము.
ఇట్లు భావించుచు, వారు ఇంద్రియనిగ్రహము గలవారై ఏకాగ్ర చిత్తములతో, నిర్మల హృదయములతో నిద్రాహారములను మాని, వాయువునే భక్షించుచు భగవంతుని ఆరాధించిరి".
ఒకనాడు మేఘగంభీరరవముతో వారికి ఆకాశవాణి వినబడెను. ఆ ధ్వనికి దిక్కులన్నియును మారుమ్రోగెను. సత్పురుషులకు అభయమునిచ్చు ఆ వాణి యిట్లు పలికెను-
ఆకాశవాణి ఇట్లనుచుండెను
"దేవతా శ్రేష్ఠులారా! భయపడకుడు. మీకు అందరికిని మేలగుగాక! నా దర్శనమే సకల ప్రాణులకు పరమ శ్రేయస్కరము. నీచుడైన ఈ దైత్యుని దుర్మార్గములను నేను ఎరుగుదును. వాటిని అన్నింటిని అరికట్టెదను. కొంతకాలము వేచియుండుడు. ఎవ్వడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, సాధుపురుషులను, ధర్మములను, నన్ను ద్వేషించినచో వానికి శీఘ్రముగా వినాశము తప్పదు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు ఏ ప్రాణిని గూడ ద్వేషింపడు. అతడు ప్రశాంతచిత్తుడు. మహాత్ముడు. అట్టి ప్రహ్లాదునకు హాని తలపెట్టినపుడు, వరప్రభావమున ఆ హిరణ్యకశిపుడు శక్తిసంపన్నుడైనను నేను అతనిని తప్పక వధించెదను".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపునకు విలక్షణులైన నలుగురు కుమారులుండిరి. వారిలో ప్రహ్లాదుడు అందరికంటెను చిన్నవాడు. కాని, సుగుణములలో మిన్నయైనవాడు. సత్పురుషులను సేవించువాడు. అతడు బ్రాహ్మణులయెడ భక్తితత్పరుడు. సౌమ్యస్వభావుడు. సత్యసంధుడు, జితేంద్రియుడు. సకల ప్రాణులను తనతో సమానముగా చూచుకొనువాడు. అందరికిని ప్రియమును గూర్చువాడు. అందరియెడ అవ్యాజమైన సుహృద్భావము గలవాడు. పెద్దలయెడ సేవకునివలె వినమ్రుడై ఉండెడివాడు. దీనులయెడ తండ్రివలె వాత్సల్యమును చూపువాడు. సమవయస్కులయెడ సోదరభావము నెరపుచుండెడివాడు. గురుజనులను దైవసమానులుగ భావించుచుండువాడు. విద్య, సంపదలు, సౌందర్యము, ఉత్తమ వంశములలో జన్మ మొదలగు సుగుణములు ఉన్నను, అతనిలో అభిమానము, గర్వము మచ్చునకైనను లేకుండెను..
ఎన్ని కష్టములు వచ్చినను ఉద్వేగరహితుడు (ఏమాత్రమూ తొణకనివాడు). తాను చూచిన, వినిన ఇహపరలోకవిషయములను నిస్సారముగ, అసత్యములుగా భావించువాడు. కనుక, అతని మనస్సులో ఎట్టి ఏ వస్తువు మీదను కోరిక లేకుండెను. ఇంద్రియములు, ప్రాణములు, శరీరము, మనస్సు సర్వదా అతని అదుపులో నుండెను. అతని చిత్తములో ఎట్టి కోరికలును తలయెత్తకుండెను. అసురవంశములో జన్మించినను అసుర లక్షణములు ఏమాత్రమూ లేకుండెను.
భగవంతుని యందువలె ప్రహ్లాదుని యందు సుగుణములు అనంతములు. వాటిని మహాత్ములు ఎల్లప్పుడును వర్ణించుచు, వాటిని అలవరచుకొనుచుండిరి. అయినను నేటివరకు అవి మొక్కవోని రీతిలో విరాజిల్లుచున్నవి.
మహారాజా! దేవతలు అసురులకు శత్రువులేయైనను వారు భగవద్భక్తుల గాధలను చర్చించు సభలయందు ప్రహ్లాదునే దృష్టాంతముగా తీసికొనుచుండెడివారు. ఇక మీవంటి భగవద్భక్తులు అతనిని ఆదర్శవ్యక్తిగా భావించుటలో ఆశ్చర్యము ఏముండును?
ప్రహ్లాదుని గుణగణములు ఇన్ని అని చెప్పుటకు వలను పడదు. అతని మహత్త్వమును వర్ణించుటకు అలవికాదు. ఇంతయేల? భగవంతుడైన వాసుదేవునియందు అతనికిగల భక్తి స్వాభావికమైనది. పుట్టుకతోడనే అబ్బినది. అది మహత్త్వపూర్ణమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
ధర్మరాజా! ప్రహ్లాదుడు బాల్యము నుండియే ఆటపాటలు మాని భగవద్ధ్యానములో జడునివలె తన్మయుడు అగుచుండెడివాడు. శ్రీహరి అనుగ్రహము అతని హృదయములో నిండారియుండెను. కనుక, ఈ జగత్తుపై అతనికి ధ్యాసయే లేకుండెను.
భగవంతుడే అతనిని తన యొడిలో చేర్చుకొని ఆలింగన మొనర్చుకొనియున్నట్లు తలపోయుచుండెడి వాడు. కనుక, కూర్చున్నను, పరుండినను, ఇటునటు సంచరించుచున్నను, అన్నపానాదులను స్వీకరించుచున్నను, సంభాషించుచున్నను ఆ విషయములపై అతనికి ధ్యాసయే ఉండెడిదికాదు.
ఒక్కొక్కసారి భగవంతుడు తనకు దూరమైనట్లు భావించి దుఃఖములో మునిగి బిగ్గరగా ఏడ్చుచుండెడివాడు. మరియొకప్పుడు శ్రీహరి తనయెదుటనే ఉన్నట్లు భావించుచు ఆనందాతిరేకమున నవ్వుచుండెడి వాడు. ఎప్పుడైనను భగవద్భావనలో ఆనందానుభవమును పొంది, గానము చేయుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు ఉత్సాహముతో కేకలు పెట్టుచుండెడివాడు. కొన్ని సమయములయందు బిడియమును వీడి నాట్యము చేయుచుండెడి వాడు. భగవంతుని లీలలను గూర్చి ఆలోచించుచు తనను తానే మరచిపోయి, ఆ లీలలను అనుకరించుచుండెడివాడు. ఒక్కొక్కసారి భగవంతుని కోమల స్పర్శను అనుభవించుచు, మౌనముగా ఉండెడివాడు అప్పుడు అతడు పులకాంకితుడై కనులనుండి ఆనందాశ్రువులు స్రవించుచుండ నిమీలిత నేత్రుడగుచుండెడివాడు.
సర్వసంగ పరిత్యాగులైన భగవద్భక్తుల సాంగత్యముచే అతనికి శ్రీహరి పాదారవిందములపై భక్తి ప్రగాఢమగు చుండెను. అందువలన తాను పరమాత్మమీద లగ్నమగుటయేగాక, దుస్సాంగత్యకారణముగా దీనులైనవారి మనస్సులయందు కూడ శాంతిని చేకూర్చుచుండెను.
ధర్మరాజా! ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు. భాగ్యశాలి. మహితాత్ముడు. అట్టి సత్పుత్రునిగూడ అపరాధిగా భావించి, హిరణ్యకశిపుడు అతనిని ఇడుములపాలు చేయుటకు ప్రయత్నించెను.
యుధిష్ఠిర ఉవాచ
యుధిష్ఠిరుడు వచించెను- దేవర్షీ! నియమనిష్ఠలు గలవాడగు హిరణ్యకశిపుడు సత్పురుషుడైన ప్రహ్లాదునకు తండ్రియే యైనను పవిత్రాత్ముడైన సుతుని కష్టముల పాలు చేయుటకు కారణమేమిటో తెలిసికొనగోరుచున్నాను? తండ్రి సహజముగనే పుత్రులయెడ ప్రేమకలిగి యుండును. పుత్రులు ఒకవేళ ఏదైనను దుష్కార్యమొనర్చినచో, అతనిని దండించెదనని మందలించును. కాని, శత్రువుని వలె అతనిని ఎన్నడును వైరభావముతో చూడడు కదా! ఇంక సత్పురుషుడు, పవిత్రహృదయుడు, పెద్దలను దైవమును వలె భావించువాడు, ఐన ప్రహ్లాదుని వంటి మహాత్ముని ఎట్లు ద్వేషించును? మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు. తండ్రి తన తనయుని ద్వేషించి చంపగోరుటకు కారణమేమి? దయతో నా ఈ సందేహమును దీర్చుడు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్థోఽధ్యాయః (4)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు నాలుగవ అధ్యాయము (4)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
23.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
4.1 (ప్రథమ శ్లోకము)
ఏవం వృతః శతధృతిర్హిరణ్యకశిపోరథ|
ప్రాదాత్తత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్॥5722॥
నారదుడు వచించెను- యుధిష్ఠిర మహారాజా! హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఈ విధముగా అత్యంతదుర్లభములైన వరములను కోరెను. అతని తపస్సునకు మిక్కిలి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు, ఆ వరములను అన్నింటిని ప్రసాదించెను.
4.2 (రెండవ శ్లోకము)
బ్రహ్మోవాచ
తాతేమే దుర్లభాః పుంసాం యాన్ వృణీషే వరాన్ మమ|
తథాపి వితరామ్యంగ వరాన్ యదపి దుర్లభాన్॥5723॥
బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను - నాయనా! నీవు జీవులకు దుర్లభములైన వరములను నా నుండి కోరితివి. అవి దుర్లభములే యైనను వాటిని నీకు ప్రసాదించుచున్నాను.
4.3 (మూడవ శ్లోకము)
తతో జగామ భగవానమోఘానుగ్రహో విభుః|
పూజితోఽసురవర్యేణ స్తూయమానః ప్రజేశ్వరైః॥5724॥
నారదుడు ఇట్లు వివరించెను- "బ్రహ్మదేవుడు సర్వ సమర్థుడైన భగవత్స్వరూపుడు. అతడు ప్రసాదించిన వరములు ఎన్నడును అసత్యములుకావు. వరములను పొందిన పిదప హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజించెను. అనంతరము ప్రజాపతులు తనను స్తుతించుచుండగా బ్రహ్మదేవుడు (తన) సత్యలోకమునకు చేరెను".
4.4 (నాలుగవ శ్లోకము)
ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమమయం వపుః|
భగవత్యకరోద్ద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్॥5725॥
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
"బ్రహ్మదేవుని నుండి ఇట్లు వరములను పొందిన యహిరణ్యకశిపుని శరీరము బలిష్ఠమై బంగారు కాంతులీనుచుండెను. అతడు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధను గూర్చి స్మరించుచు శ్రీహరియెడ ద్వేష భావమును పెంచుకొనెను"
4.5 (ఐదవ శ్లోకము)
స విజిత్య దిశః సర్వాః లోకాంశ్చ త్రీన్ మహాసురః|
దేవాసురమనుష్యేంద్రాన్ గంధర్వగరుడోరగాన్॥5726॥
4.6 (ఆరవ శ్లోకము)
సిద్ధచారణవిద్యాధ్రానృషీన్ పితృపతీన్ మనూన్|
యక్షరక్షఃపిశాచేశాన్ ప్రేతభూతపతీనథ॥5727॥
4.7 (ఏడవ శ్లోకము)
సర్వసత్త్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజిత్|
జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా॥5728॥
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
పిమ్మట అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపుడు సకల దిక్కులను, ముల్లోకములను, జయించెను. దేవతలను, అనుచరులను, మహరాజులను, గంధర్వులను, గరుడజాతికి చెందిన ప్రముఖులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరులను, ఋషులను, పితరులను, మనువులను, యక్షరాక్షసులను, పిశాచప్రభువులను, ప్రేతములను, భూతపతులను, సమస్తప్రాణులను జయించెను. ఈ విధముగా విశ్వవిజేతయైన ఆ హిరణ్యకశిపుడు లోకపాలుర స్థానములను, తేజస్సులను హరించెను.
4.8 (ఎనిమిదవ శ్లోకము)
దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రివిష్టపం|
మహేంద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణా|
త్రైలోక్యలక్ష్మ్యాయతనమధ్యువాసాఖిలర్ద్ధిమత్॥5729॥
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
"నందనవనము మొదలగు దివ్య-ఉద్యానములతో శోభిల్లునట్టి, స్వర్గము నందు అతడు నివసింపసాగెను. సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మితమైన ఇంద్ర భవనమే అతని నివాసస్థానమాయెను. ఆ భవనమునందు ముల్లోకముల సౌందర్యము రాశీభూతమై యుండెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు సకల సంపదలతో తులతూగెను"
4.9 (తొమ్మిదవ శ్లోకము)
యత్ర విద్రుమసోపానాః మహామారకతా భువః|
యత్ర స్ఫాటికకుడ్యాని వైదూర్యస్తంభపంక్తయః॥5730॥
4.10 (పదియవ శ్లోకము)
యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చ|
పయఃఫేననిభాః శయ్యా ముక్తాదామపరిచ్ఛదాః॥5731॥
ఆ ఇంద్రభవనము నందలి మెట్లు పగడములతో చెక్కబడెను. నేలకు మరకతమణులు తాపబడి యుండెను. గోడలు స్ఫటికములతో నిర్మింపబడి యుండెను. స్తంభములు వైడూర్యఖచితములు. అందు చిత్రవిచిత్రములైన తెరలు, పద్మరాగముల ఆసనములు, పాలనురుగుల వంటి తెల్లని శయ్యలపై ముత్యాలకంబళ్ళు శోభాయమానముగ నుండెను.
4.11 (పదకొండవ శ్లోకము)
కూజద్భిర్నూపురైర్దేవ్యః శబ్దయంత్య ఇతస్తతః|
రత్నస్థలీషు పశ్యంతి సుదతీః సుందరం ముఖమ్॥5732॥
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
సర్వాంగ సుందరులైన అప్సరసలు రత్నఖచితములైన నేలలపై అటునిటు తిరుగుచుండగా వారి కాలి అందెల ధ్వనులు వినసొంపుగా నుండెను. వారు ఆ రత్నములలో తమ ముఖముల ప్రతిబింబమును చూచుకొనుచుండిరి.
4.12 (పండ్రెండవ శ్లోకము)
తస్మిన్ మహేంద్రభవనే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్|
రేమేఽభివంద్యాంఘ్రియుగః సురాదిభిః ప్రతాపితైరూర్జితచండశాసనః॥5733॥
నారదుడిట్లు ఇంకను వివరించుచుండెను:-
మహాబలశాలి, మహామనస్వియు ఐన ఆ హిరణ్యకశిపుడు ముల్లోకములను జయించి, ఏకచ్ఛత్రాధిపతియై, మహేంద్రభవనమును స్వేచ్ఛగా విహరించుచుండెను. అతని కఠోర శాసనమునకు భీతిల్లి, దేవదానవులు ఆయన పాదముల కడ మోకరిల్లుచుండిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
24.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
4.13 (పదమూడవ శ్లోకము)
తమంగ మత్తం మధునోరుగంధినా వివృత్తతామ్రాక్షమశేషధిష్ణ్యపాః|
ఉపాసతోపాయనపాణిభిర్వినా త్రిభిస్తపోయోగబలౌజసాం పదమ్॥5734॥
ధర్మరాజా! ఘాటైన వాసన గల మధ్యమును సేవించి అతడు మత్తిల్లియుండెను. అతని కనులు కైపెక్కి ఎర్రబారియుండెను. అతడు తపస్సుతో, యోగముతో, శారీరక దారుఢ్యముతో, మనోబలముతో ఒప్పుచుండెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప మిగిలిన దేవతలు అందరును కానుకలను చేబూని, అతనిని సేవించుచుండిరి.
4.14 (పదునాలుగవ శ్లోకము)
జగుర్మహేంద్రాసనమోజసా స్థితం విశ్వావసుస్తుంబురురస్మదాదయః|
గంధర్వసిద్ధా ఋషయోఽస్తువన్ ముహుర్విద్యాధరాశ్చాప్సరసశ్చ పాండవ॥5735॥
ధర్మరాజా! అతడు తన బలపరాక్రమములచే ఇంద్రుని సింహాసనమును ఆక్రమించెను. అప్పుడు విశ్వావసువు, తుంబురుడు, మేము అందరము అతనియెదుట నిలిచి, గానము చేయుచుంటిమి. గంధర్వులు, సిద్ధులు, ఋషిగణములు, విద్యాధరులు, అప్సరసలు పదేపదే అతనిని స్తుతించుచుండిరి.
4.15 (పదునైదవ శ్లోకము)
స ఏవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరిదక్షిణైః|
ఇజ్యమానో హవిర్భాగానగ్రహీత్స్వేన తేజసా॥5734॥
వర్ణాశ్రమ ధర్మములను పాటించువారు దక్షిణలతో గూడిన యజ్ఞములను ఆచరించుచుండిరి. మహాతేజస్వియైన హిరణ్యకశిపుడు , ఆ యజ్ఞముల హవిర్భాగములను తానే బలవంతముగా లాగికొనుచుండెను.
4.16 (పదునారవ శ్లోకము)
అకృష్టపచ్యా తస్యాసీత్సప్తద్వీపవతీ మహీ|
తథా కామదుఘా ద్యౌస్తు నానాశ్చర్యపదం నభః॥5737॥
సప్తద్వీపములతో గూడిన భూమండలము అతని అధీనములో ఉండెను. దున్నకుండగనే భూములు పంటలను ఇచ్చుచుండెను. అంతరిక్షమునుండి అతడు కోరుకొనిన వస్తువులు అన్నియును లభించుచుండెను. ఆకాశము పలు విధములైన ఆశ్చర్యకరమైన వస్తువులను అందజేయుచు, అతని మనస్సును రంజింపజేయుచుండెను.
2.17 (పదిహేడవ శ్లోకము)
రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్పత్న్యశ్చోహురూర్మిభిః|
క్షారసీధుఘృతక్షౌద్రదధిక్షీరామృతోదకాః॥5738॥
ఉప్పునీరు, మద్యము, నేయి, చెఱకురసము, పెరుగు, పాలు, తీయని జలములు గల సముద్రములు గూడ తమ పత్నులైన నదులతోగూడి తరంగముల ద్వారా రత్న రాసులను అతనికడకు చేర్చుచుండెను.
4.18 (పదునెనిమిదవ శ్లోకము)
శైలా ద్రోణీభిరాక్రీడం సర్వర్తుషు గుణాన్ ద్రుమాః|
దధార లోకపాలానామేక ఏవ పృథగ్గుణాన్॥5739॥
పర్వతములు, తమ లోయలయందు అతనికి క్రీడా స్థలములను ఏర్పరచు చుండెను. వృక్షములు అన్ని ఋతువులయందును పుష్పములతో ఫలములతో శోభిల్లుచుండెను. లోకపాలుర అధికారములను, అన్నింటిని అతడు ఒక్కడే చేపట్టుచుండెను.
4.19 (పందొమ్మిదవ శ్లోకము)
స ఇత్థం నిర్జితకకుబేకరాడ్ విషయాన్ ప్రియాన్|
యథోపజోషం భుంజానో నాతృప్యదజితేంద్రియః॥5740॥
ఆ హిరణ్యకశిపుడు సకల దిక్కులను జయించి, ఏకచ్ఛత్రాధిపతి యయ్యెను. తనకు ఇష్టమైన విషయములను అన్నింటిని యధేచ్ఛగా అనుభవించు చుండెను. ఐనను, ఇంద్రియనిగ్రహము లేనియతడు విషయ భోగములతో తృప్తి పడకుండెను.
4.20 (ఇరువదియవ శ్లోకము)
ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః|
కాలో మహాన్ వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః॥5741॥
సనకాదిమునుల శాపప్రభావమున శ్రీహరిపార్షదుడే హిరణ్యకశిపుడుగ జన్మించెను. అతడు ఐశ్వర్యముచే మత్తిల్లి గర్వితుడై యుండెను. శాస్త్రమర్యాదలను ఉల్లంఘించు చుండెను. ఈ విధముగా అతని జీవితములో చాలాభాగము గడచిపోయెను.
4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
తస్యోగ్రదండసంవిగ్నాః సర్వే లోకాః సపాలకాః|
అన్యత్రాలబ్ధశరణాః శరణం యయురచ్యుతం॥5742॥
హిరణ్యకశిపుని కఠోరశాసనము వలన సమస్తలోకముల వారును, లోకపాలురును చాల భయపడుచుండిరి. వారిని రక్షించువారు ఎవ్వరును లేకుండిరి. అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణుజొచ్చిరి.
4.22 (ఇరువది రెండవ శ్లోకము)
తస్యై నమోఽస్తు కాష్ఠాయై యత్రాత్మా హరిరీశ్వరః|
యద్గత్వా న నివర్తంతే శాంతాః సన్న్యాసినోఽమలాః॥5743॥
వారు తమ మనస్సులలో ఇట్లు భావింపసాగిరి- "సకల ప్రాణులకును ఆత్మ సర్వేశ్వరుడు ఐన శ్రీహరినివాసము పరంధామము. పవిత్రులై ప్రశాంతచిత్తులైన సన్న్యాసులు ఆ పరంధామమునకు చేరి, ఈ లోకమునకు తిరిగిరారు. అట్టి పరంధామమునకు నమస్కారము.
4.23 (ఇరువది మూడవ శ్లోకము)
ఇతి తే సంయతాత్మానః సమాహితధియోఽమలాః|
ఉపతస్థుర్హృషీకేశం వినిద్రా వాయుభోజనాః॥5744॥
ఇట్లు భావించుచు, వారు ఇంద్రియనిగ్రహము గలవారై ఏకాగ్ర చిత్తములతో, నిర్మల హృదయములతో నిద్రాహారములను మాని, వాయువునే భక్షించుచు భగవంతుని ఆరాధించిరి".
4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తేషామావిరభూద్వాణీ అరూపా మేఘనిఃస్వనా|
సన్నాదయంతీ కకుభః సాధూనామభయంకరీ॥5745॥
ఒకనాడు మేఘగంభీరరవముతో వారికి ఆకాశవాణి వినబడెను. ఆ ధ్వనికి దిక్కులన్నియును మారుమ్రోగెను. సత్పురుషులకు అభయమునిచ్చు ఆ వాణి యిట్లు పలికెను-
4.25 (ఇరువది ఐదవ శ్లోకము)
మా భైష్ట విబుధశ్రేష్ఠాః సర్వేషాం భద్రమస్తు వః|
మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే॥5746॥
4.26 (ఇరువది ఆరవ శ్లోకము)
జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయాపసదస్య చ|
తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ప్రతీక్షత॥5747॥
4.27 (ఇరువది ఏడవ శ్లోకము)
యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు|
ధర్మే మయి చ విద్వేషః స వా ఆశు వినశ్యతి॥5748॥
4.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే|
ప్రహ్లాదాయ యదా ద్రుహ్యేద్ధనిష్యేఽపి వరోర్జితం॥5749॥
ఆకాశవాణి ఇట్లనుచుండెను
"దేవతా శ్రేష్ఠులారా! భయపడకుడు. మీకు అందరికిని మేలగుగాక! నా దర్శనమే సకల ప్రాణులకు పరమ శ్రేయస్కరము. నీచుడైన ఈ దైత్యుని దుర్మార్గములను నేను ఎరుగుదును. వాటిని అన్నింటిని అరికట్టెదను. కొంతకాలము వేచియుండుడు. ఎవ్వడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, సాధుపురుషులను, ధర్మములను, నన్ను ద్వేషించినచో వానికి శీఘ్రముగా వినాశము తప్పదు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు ఏ ప్రాణిని గూడ ద్వేషింపడు. అతడు ప్రశాంతచిత్తుడు. మహాత్ముడు. అట్టి ప్రహ్లాదునకు హాని తలపెట్టినపుడు, వరప్రభావమున ఆ హిరణ్యకశిపుడు శక్తిసంపన్నుడైనను నేను అతనిని తప్పక వధించెదను".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
24.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
4.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
ఇత్యుక్తా లోకగురుణా తం ప్రణమ్య దివౌకసః
న్యవర్తంత గతోద్వేగా మేనిరే చాసురం హతమ్॥5750॥
4.30 (ముప్పదియవ శ్లోకము)
తస్య దైత్యపతేః పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః|
ప్రహ్లాదోఽభూన్మహాంస్తేషాం గుణైర్మహదుపాసకః॥5751॥
4.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
బ్రహ్మణ్యః శీలసంపన్నః సత్యసంధో జితేంద్రియః|
ఆత్మవత్సర్వభూతానామేకః ప్రియసుహృత్తమః॥5752॥
4.32 (ముప్పది రెండవ శ్లోకము)
దాసవత్సన్నతార్యాంఘ్రిః పితృవద్దీనవత్సలః|
భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుష్వీశ్వరభావనః|
విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తంభవివర్జితః॥5753॥
అసురశ్రేష్ఠుడగు హిరణ్యకశిపునకు విలక్షణులైన నలుగురు కుమారులుండిరి. వారిలో ప్రహ్లాదుడు అందరికంటెను చిన్నవాడు. కాని, సుగుణములలో మిన్నయైనవాడు. సత్పురుషులను సేవించువాడు. అతడు బ్రాహ్మణులయెడ భక్తితత్పరుడు. సౌమ్యస్వభావుడు. సత్యసంధుడు, జితేంద్రియుడు. సకల ప్రాణులను తనతో సమానముగా చూచుకొనువాడు. అందరికిని ప్రియమును గూర్చువాడు. అందరియెడ అవ్యాజమైన సుహృద్భావము గలవాడు. పెద్దలయెడ సేవకునివలె వినమ్రుడై ఉండెడివాడు. దీనులయెడ తండ్రివలె వాత్సల్యమును చూపువాడు. సమవయస్కులయెడ సోదరభావము నెరపుచుండెడివాడు. గురుజనులను దైవసమానులుగ భావించుచుండువాడు. విద్య, సంపదలు, సౌందర్యము, ఉత్తమ వంశములలో జన్మ మొదలగు సుగుణములు ఉన్నను, అతనిలో అభిమానము, గర్వము మచ్చునకైనను లేకుండెను..
4.33 (ముప్పది మూడవ శ్లోకము)
నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిఃస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వవస్తుదృక్|
దాంతేంద్రియప్రాణశరీరధీః సదా ప్రశాంతకామో రహితాసురోఽసురః॥5754॥
ఎన్ని కష్టములు వచ్చినను ఉద్వేగరహితుడు (ఏమాత్రమూ తొణకనివాడు). తాను చూచిన, వినిన ఇహపరలోకవిషయములను నిస్సారముగ, అసత్యములుగా భావించువాడు. కనుక, అతని మనస్సులో ఎట్టి ఏ వస్తువు మీదను కోరిక లేకుండెను. ఇంద్రియములు, ప్రాణములు, శరీరము, మనస్సు సర్వదా అతని అదుపులో నుండెను. అతని చిత్తములో ఎట్టి కోరికలును తలయెత్తకుండెను. అసురవంశములో జన్మించినను అసుర లక్షణములు ఏమాత్రమూ లేకుండెను.
4.34 (ముప్పది నాలుకవ శ్లోకము)
యస్మిన్ మహద్గుణా రాజన్ గృహ్యంతే కవిభిర్ముహుః|
న తేఽధునాపిధీయంతే యథా భగవతీశ్వరే॥5755॥
భగవంతుని యందువలె ప్రహ్లాదుని యందు సుగుణములు అనంతములు. వాటిని మహాత్ములు ఎల్లప్పుడును వర్ణించుచు, వాటిని అలవరచుకొనుచుండిరి. అయినను నేటివరకు అవి మొక్కవోని రీతిలో విరాజిల్లుచున్నవి.
4.35 (ముప్పది ఐదవ శ్లోకము
యం సాధుగాథాసదసి రిపవోఽపి సురా నృప|
ప్రతిమానం ప్రకుర్వంతి కిముతాన్యే భవాదృశాః॥5756॥
మహారాజా! దేవతలు అసురులకు శత్రువులేయైనను వారు భగవద్భక్తుల గాధలను చర్చించు సభలయందు ప్రహ్లాదునే దృష్టాంతముగా తీసికొనుచుండెడివారు. ఇక మీవంటి భగవద్భక్తులు అతనిని ఆదర్శవ్యక్తిగా భావించుటలో ఆశ్చర్యము ఏముండును?
4.36 (ముప్పది ఆరవ శ్లోకము)
గుణైరలమసంఖ్యేయైర్మాహాత్మ్యం తస్య సూచ్యతే|
వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతిః॥5757॥
ప్రహ్లాదుని గుణగణములు ఇన్ని అని చెప్పుటకు వలను పడదు. అతని మహత్త్వమును వర్ణించుటకు అలవికాదు. ఇంతయేల? భగవంతుడైన వాసుదేవునియందు అతనికిగల భక్తి స్వాభావికమైనది. పుట్టుకతోడనే అబ్బినది. అది మహత్త్వపూర్ణమైనది.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
25.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - నాలుగవ అధ్యాయము
హిరణ్యకశిపుని యొక్క దుష్కార్యములు - ప్రహ్లాదుని గుణగణములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
4.37 (ముప్పది ఏడవ శ్లోకము)
న్యస్తక్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా|
కృష్ణగ్రహగృహీతాత్మా న వేద జగదీదృశం॥5758॥
ధర్మరాజా! ప్రహ్లాదుడు బాల్యము నుండియే ఆటపాటలు మాని భగవద్ధ్యానములో జడునివలె తన్మయుడు అగుచుండెడివాడు. శ్రీహరి అనుగ్రహము అతని హృదయములో నిండారియుండెను. కనుక, ఈ జగత్తుపై అతనికి ధ్యాసయే లేకుండెను.
4.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
ఆసీనః పర్యటన్నశ్నన్ శయానః ప్రపిబన్ బ్రువన్|
నానుసంధత్త ఏతాని గోవిందపరిరంభితః॥5759॥
భగవంతుడే అతనిని తన యొడిలో చేర్చుకొని ఆలింగన మొనర్చుకొనియున్నట్లు తలపోయుచుండెడి వాడు. కనుక, కూర్చున్నను, పరుండినను, ఇటునటు సంచరించుచున్నను, అన్నపానాదులను స్వీకరించుచున్నను, సంభాషించుచున్నను ఆ విషయములపై అతనికి ధ్యాసయే ఉండెడిదికాదు.
4.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
క్వచిద్రుదతి వైకుంఠచింతాశబలచేతనః|
క్వచిద్ధసతి తచ్చింతాహ్లాద ఉద్గాయతి క్వచిత్॥5760॥
4.40 (నలుబదియవ శ్లోకము)
నదతి క్వచిదుత్కంఠో విలజ్జో నృత్యతి క్వచిత్|
క్వచిత్తద్భావనాయుక్తస్తన్మయోఽనుచకార హ॥5761॥
4.41 (నలుబది యొకటవ శ్లోకము)
క్వచిదుత్పులకస్తూష్ణీమాస్తే సంస్పర్శనిర్వృతః|
అస్పందప్రణయానందసలిలామీలితేక్షణః॥5762॥
ఒక్కొక్కసారి భగవంతుడు తనకు దూరమైనట్లు భావించి దుఃఖములో మునిగి బిగ్గరగా ఏడ్చుచుండెడివాడు. మరియొకప్పుడు శ్రీహరి తనయెదుటనే ఉన్నట్లు భావించుచు ఆనందాతిరేకమున నవ్వుచుండెడి వాడు. ఎప్పుడైనను భగవద్భావనలో ఆనందానుభవమును పొంది, గానము చేయుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు ఉత్సాహముతో కేకలు పెట్టుచుండెడివాడు. కొన్ని సమయములయందు బిడియమును వీడి నాట్యము చేయుచుండెడి వాడు. భగవంతుని లీలలను గూర్చి ఆలోచించుచు తనను తానే మరచిపోయి, ఆ లీలలను అనుకరించుచుండెడివాడు. ఒక్కొక్కసారి భగవంతుని కోమల స్పర్శను అనుభవించుచు, మౌనముగా ఉండెడివాడు అప్పుడు అతడు పులకాంకితుడై కనులనుండి ఆనందాశ్రువులు స్రవించుచుండ నిమీలిత నేత్రుడగుచుండెడివాడు.
4.42 (నలుబది రెండవ శ్లోకము)
స ఉత్తమశ్లోకపదారవిందయో- ర్నిషేవయాకించనసంగలబ్ధయా|
తన్వన్ పరాం నిర్వృతిమాత్మనో ముహు- ర్దుఃసంగదీనాన్యమనఃశమం వ్యధాత్॥5763॥
సర్వసంగ పరిత్యాగులైన భగవద్భక్తుల సాంగత్యముచే అతనికి శ్రీహరి పాదారవిందములపై భక్తి ప్రగాఢమగు చుండెను. అందువలన తాను పరమాత్మమీద లగ్నమగుటయేగాక, దుస్సాంగత్యకారణముగా దీనులైనవారి మనస్సులయందు కూడ శాంతిని చేకూర్చుచుండెను.
4.43 (నలుబది మూడవ శ్లోకము)
తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని|
హిరణ్యకశిపూ రాజన్నకరోదఘమాత్మజే॥5764॥
ధర్మరాజా! ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు. భాగ్యశాలి. మహితాత్ముడు. అట్టి సత్పుత్రునిగూడ అపరాధిగా భావించి, హిరణ్యకశిపుడు అతనిని ఇడుములపాలు చేయుటకు ప్రయత్నించెను.
యుధిష్ఠిర ఉవాచ
4.44 (నలుబదినాలుగవ శ్లోకము)
దేవర్ష ఏతదిచ్ఛామో వేదితుం తవ సువ్రత|
యదాత్మజాయ శుద్ధాయ పితాదాత్సాధవే హ్యఘమ్॥5765॥
4.45 (నలుబది ఐదవ శ్లోకము)
పుత్రాన్ విప్రతికూలాన్ స్వాన్ పితరః పుత్రవత్సలాః|
ఉపాలభంతే శిక్షార్థం నైవాఘమపరో యథా॥5766॥
4.46 (నలుబది ఆరవ శ్లోకము)
కిముతానువశాన్ సాధూంస్తాదృశాన్ గురుదేవతాన్|
ఏతత్కౌతూహలం బ్రహ్మన్నస్మాకం విధమ ప్రభో|
పితుః పుత్రాయ యద్ద్వేషో మరణాయ ప్రయోజితః॥5767॥
యుధిష్ఠిరుడు వచించెను- దేవర్షీ! నియమనిష్ఠలు గలవాడగు హిరణ్యకశిపుడు సత్పురుషుడైన ప్రహ్లాదునకు తండ్రియే యైనను పవిత్రాత్ముడైన సుతుని కష్టముల పాలు చేయుటకు కారణమేమిటో తెలిసికొనగోరుచున్నాను? తండ్రి సహజముగనే పుత్రులయెడ ప్రేమకలిగి యుండును. పుత్రులు ఒకవేళ ఏదైనను దుష్కార్యమొనర్చినచో, అతనిని దండించెదనని మందలించును. కాని, శత్రువుని వలె అతనిని ఎన్నడును వైరభావముతో చూడడు కదా! ఇంక సత్పురుషుడు, పవిత్రహృదయుడు, పెద్దలను దైవమును వలె భావించువాడు, ఐన ప్రహ్లాదుని వంటి మహాత్ముని ఎట్లు ద్వేషించును? మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు. తండ్రి తన తనయుని ద్వేషించి చంపగోరుటకు కారణమేమి? దయతో నా ఈ సందేహమును దీర్చుడు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్థోఽధ్యాయః (4)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు నాలుగవ అధ్యాయము (4)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
No comments:
Post a Comment