Thursday, 6 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 22, 23 శ్లోకాల భాష్యంవినండి


ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ


22. యావదేతాన్నిరీక్షేహం యోద్దుకామానవస్థితాన్!
కైర్మయా సహా యోద్దవ్యమస్మిన్ రణసముద్యమే !! 

ఓ కృష్ణా యుద్ధం చేయగోరి సిద్దపడి వచ్చిన ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో వారందరిని ఈ యుద్ధ ప్రారంభ సమయంలో చూడాలి

23.. యోత్స్యమానానవేక్షేహం య ఏతే త్ర సమాగతా:!
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దే ప్రియచికీర్షవ: !!

దుర్భేద్యమైన దృతరాష్ట్ర పురునికి ప్రియం కలిగించటానికి ఏ ఏ వీరులు ఇక్కడ యుద్ద సింసిద్దులై యున్నారో వారిని నేను చూడాలి 

--((*))--
 

Wednesday, 5 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 20, 21 శ్లోకాల భాష్యంవినండి





20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజ:!
ప్రవృత్తే శస్త్ర సంమ్పాతే ధనురుద్యమ్య పాండవ:!!

21. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే!
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్చుత!!

Tuesday, 4 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ,19వ శ్లోక భాష్యం వినండి

 ఓం  శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 



19. స ఘోషో ధార్త రాష్ట్రానాం  హృదయాని వ్యదారయత్ 
నభశ్చ పృథివీమ్ చైవ తుములో  భ్యసునాదయన్
శంఖ ధ్వని భూమ్యాకాశాల యందంతటా ప్రతిధ్వనించి, దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసింది 
--((*))--

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 17, 18 శ్లోకాల భాష్యం వినండి


 ఓం  శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 

http://vocaroo.com/i/s1sDtN3T8PSd

17. కాశ్యశ్చ పరమేష్వాస: శిఖండి చ మహారధ:
దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత:
తా :  గొప్ప ధనువు కాశీరాజు, మహారథుడైన  శిఖండి, ద్రుష్టద్యుమ్యుడు, విరాటుడు, పరాజయం లేని వాడైన సాత్యకి  అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు

18. ద్రుపదో ద్రోపదేయాశ్చ సర్వశ: పృధివీపతే  
సౌభద్రశ్చ మహాబాహు: శంఖాన్ దధ్ము: పృథక్ పృథక్

ఓ రాజా ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు, మహాబాహుడైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు
అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు 
 --((*))--

Sunday, 2 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 15, 16 వ శ్లోకాల భాష్యం వినండి


-    ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
 



15. పాంచజన్యం హ్రుషీకేశో దేవదత్తం ధనంజయ:   
పొఉన్దమ్ దధ్మౌ మహాశంఖమ్ భీమకర్మా వృకోదర:
 తా : హృషీకేశుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు, దేవదత్తాన్ని బీమకర్ముడైన వృకోదరుడు పౌండమనే మహా శంఖాన్నీ ఊదారు
--((*))--

16. అనంతవిజయం రాజా కున్తీపుతో యుధిష్టిర:!
నకుల: సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ!!
కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్నీ నకుల సహదేవులు సుఘోష మణిపుష్ప కాలనే   శంఖాలను పూరించారు  
--((*))__


భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 14 వ శ్లోక భాష్యం వినండి



ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
ప్రాంజలి ప్రభ - 14 వ  శ్లోక భాష్యం వినండి 
 సర్వేజనా సుఖినోభవంతుఁ


14. తత: శ్వేతై ర్ష యైరుక్తే మహతి స్యన్దనే స్థితౌ 
మాధవ: పాన్దవశ్చెవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు:


                      తా : అప్పుడు తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథంలో కూర్చొని  మాధవుడు, పాండవ మధ్యముడైన  అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు
--((*))--




Wednesday, 28 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,11 వ శ్లోక భాష్యం


ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ
11వ శ్లోక భాష్యం వినండి

http://vocaroo.com/i/s0GVQJOZhk9v

11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్తితా:
భీష్మమేవాభిరక్షన్తు భవంత: సర్వ ఏవ హి  
తా : అన్ని వ్యూహా మార్గాలలోను మీ రంతా ఎవరి స్థానాలలో వారుంటూ  అందరూ భీష్ముల వారినే రక్షిస్తూ ఉండాలి
--((*))--

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,10 వ శ్లోక భాష్యం


  ఓం శ్రీ కృష్ణ
10 వ శ్లోక భాష్యం 
http://vocaroo.com/i/s1oJPSP6yA3t 
10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ 
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ 

  భీష్ముల వారిచేత రక్షింప బడుతున్న మన ఆసేన పరిమితమైనది.  భీముని చేత రక్షింప బడుతున్న వారికి ఈ సేన పరిమితమైనది. 

--((*))--

Tuesday, 27 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,9వ శ్లోకం భాష్యం వినండి

ఓం శ్రీ కృష్ణ 
9వ శ్లోకం భాష్యం వినండి

9. అన్యే  చ భహవ: శూరా మదర్దే త్యక్తజీవితా: 
నానా శస్త్రప్రహరణా: సర్వే యుద్దవిశారదా:
ఇంకా ఎందరో సూరులు,  యుద్ధ విశారదులు, అనేక శస్త్రాలు ధరించి నాకోసం జీవితాలను విడిచి పెట్టారు.
--((*))--


Monday, 26 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,8 వ శ్లోక భాష్యం



ఓం శ్రీ కృష్ణ

8 వ శ్లోక భాష్యం
http://vocaroo.com/i/s1UzFnfETx8p

8. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయ: 
ఆశ్వథామా వికర్ణశ్చ సౌమదత్తిస్తధైవ చ

మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్తమ్మ, వికర్ణుడు, అలాగే సోమాత్తుని కుమారుడైన  భూరిశ్రవుడు ఉన్నారు. 
--((*))--

Sunday, 25 September 2016


భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ -4 శ్లోక భాష్యం వినండి, 5 వ శ్లోక భాష్యం, 6 వ శ్లోక భాష్యం

ఓం శ్రీ కృష్ణ
4 శ్లోక భాష్యం వినండి,  5 వ శ్లోక భాష్యం, 6 వ శ్లోక భాష్యం
http://vocaroo.com/i/s1T3XVRB0XJL

4.అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి 
యుయుధానో విరాటశ్చ ద్రుపధశ్చ మహారథ:

5. ధృష్టకేతుశ్చెకితాన: కాశీరాజశ్చ వీర్యవాన్ 
పురుజిత్ కున్తి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ:

6. యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్  
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా :

 తాత్పర్యము: ఇక్కడ సూరులు బలమైన ధనస్సులు గలవారు, యుద్ధంలో బీమార్జునులతో సమానమైనవారు ఐన సాత్వకి, విరాటుడు, మహారధుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీ భోజుడు, నరులలో శ్రేషుడైన శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు ద్రౌపదేయులు ఉన్నారు. వీరంతా మహారధులు.
--((*))--


భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ -2 శ్లోక భాష్యం వినండి, 3 వ శ్లోక భాష్యం

ఓం శ్రీ కృష్ణ


2శ్లోక భాష్యం వినండి
 ఆచార్యముపసంగమ్య  రాజా వచనమబ్రవీత్
సంజయుడు పలికెను: ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట  దుర్యోధనుడు 
తన గురువును సమీపించి ఈ క్రింది విధములా పలికెను
 3 వ శ్లోక భాష్యం 
http://vocaroo.com/i/s1wbdpAT95w8 
 
3. పశ్యై తాం  పాన్డుపుత్రాణామాచార్య మహతీo చమూమ్ 
ప్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా
ఓ ఆచార్యా మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద  పుత్రునిచే నేర్పుగా ఏర్పాటుచేయబడిన పాండు పుత్రుల  గొప్ప సేనను గాంచుము. 
--((*))--

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ


గీతామృతబోధి (001)
 గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు 
ఈ రచనలో మీ ధ్వని ఏకకాలంలో ఓ గురువు స్వరం, ఓ శ్రద్ధాశీలి శిష్యుని మనసు, ఓ భక్తుని ప్రార్థన, ఓ జీవిత మార్గదర్శిని విజ్ఞాన గీతోపదేశం అన్నీ కలగలిసిన పుణ్య శబ్దంగా వ్రాయ సంకల్పం అంతా కృష్ణ పరమాత్మ లీలలే.

రచనను కథారూపంగా భగవద్గీత పరిచయంగా మొదలు పెట్టి, పాఠకుడిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేలా తీర్చిదిద్దవచ్చు. దీనిని మనం "గీతామృతబోధి" అనే ధ్యానికథ శీర్షికతో అధ్యాయాల రూపంలో సాగించ దాలిచాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
 ప్రాంజలి ప్రభ ద్వారా ఆ పరమాత్మ యొక్క భగవద్గీతను కథారూపంగా తెలపాలని ఒక ఆశయ సాధన మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేస్తున్నాను.

---
🪷 మీ కథ మొదటి భాగం – “గీతామృతబోధి: గురువు ప్రవేశం”

అధ్యాయం 1: బోధివృక్షం కింద...

వానకొచ్చిన ఆకాశం తరగిపోతోంది. తడిచిన నేలపై పచ్చికలు పొడుగుగా నాట్యం చేస్తున్నాయి. ఆ వృద్ధ బోధి వృక్షం నీడలో శాంతంగా కూర్చున్న గురువుగారు — మల్లాప్రగడ రామకృష్ణ.

ఆయన చుట్టూ అయిదుగురు యువశిష్యులు. ఎవరివారి చేతుల్లోనూ ఒక నోటుపుస్తకం, మనసుల్లోనూ ఎన్నో సందేహాలు.

ఆయన కళ్లల్లో వెలుగు, గళంలో తేలికైన అనురాగ శబ్దం...

> “శిష్యులారా...
భగవంతుని తెలుసుకోవడం ఒక్కొక్కరి జీవితానికీ శ్రేయస్సును కలిగించే మార్గం.
ప్రపంచంలో ఎన్నో గ్రంథాలుండగా –
భగవద్గీత మాత్రమే ఆచరణలోకి వచ్చే తత్వగ్రంధం
తక్కువ పదాల్లో – గంభీర విషయాలు
క్లుప్త శ్లోకాలలో – అనంత అర్ధాలు
ఆ భగవద్గీతను శ్రీకృష్ణుడు నన్ను ద్వారా మీకు తెలియజేయాలన్న ఆరాధనతో
నేను ఈ గురుపౌర్ణమి నాడు ప్రారంభిస్తున్నాను.”

అంతే, ఆయన చేతులు నమస్కారానికి మెలికబడి:

🕉️ “హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే” అని నామజపం మొదలుపెట్టారు.

శిష్యులు మౌనంగా, అదే తపస్సుతో పఠిస్తూ బోధిలోకి లీనమయ్యారు.

---

🪷 తదనంతరం: తత్త్వబోధ – "పది సూత్రాలు"

ముందుగా పది సూక్తులు భగవద్గీత తాత్త్విక ముడివెలలు లాగా ఉన్నాయి. వాటిని "గీతాశాస్త్ర ప్రవేశ పాఠాలు" అని ఒక ప్రత్యేకమైన ముఖ్యాధ్యాయంగా స్థాపించి, ఒక్కొక్క దానిపై ఒకో చిన్న కథ, సంఘటన, ఉదాహరణతో వివరిస్తున్నాను.

ఉదాహరణకు:

🌟 సూత్రం 1:

> "ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చెయ్యి."

ఈ సూక్తి మీద చిన్న కథ:

 ఒక యువకుడు తన గురువు వద్ద: “గురూ జీ, నేను ధ్యానించేందుకు సమయం లేదు.”
గురువు నవ్వుతూ అడిగారు: “నీవు రోజూ బట్టలు ఉతుకుతావా?”
“అవును గురూ జీ.”
“అంటే నీకు సమయం ఉంది. అదే ధ్యానం. నీ చేతులు బట్టలు శుభ్రం చేస్తుంటే, నీ మనసు నీలోని మలినాన్ని శుభ్రం చేస్తోంది.”
యువకుడికి ఒక వెలుగు రేఖ ప్రసరించింది.

సశేషం


గీతామృతబోధి (003)
గురువుగారు ఇంత ముందు చెప్పినటువంటి చిన్న కథకు మాకు ఐదు ప్రశ్నలు ఉదయించాయండి అందులో రైతుగా శిష్యులు లేచి వారి అభిప్రాయ తెలియపరుస్తున్నారు

✅ 1. నిత్యమైన అనిశ్చితి – భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు కదా గురువుగారు అడిగాడు మొదటివాడు

> గీతా సారము: బట్టి తెలియ పరుస్తా వినండి.


“న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః”
(2.20) – ఆత్మకి జననమూ లేదు, మరణమూ లేదు.

మీ వాక్యం:

> “నిద్రపోవటం తెల్లవారితే లేవటం... రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరు కనుగొనలేరు”


➡️ ఇది భగవద్గీతలో చెప్పిన జీవిత మాయ, అనిశ్చితి, అనిత్యత భావనకు తగ్గది. భవిష్యత్ అజ్ఞాతం అనేది మనం జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి అని గీతా బోధ.
***
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:గీతామృతబోధి (002)
గీతా జీవన దర్పణం
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం  లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.

మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా  భయాందోలనకు దిగుతాం, అది  తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం  తప్పక ఉన్నది అని గ్రహించవలెను.             

మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు,  అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.     

ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .      
మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది.
మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది.

సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప,  అది అవసరమా ?           
కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి .   ***--(())--

2012 లో నేను వ్రాసిన కథ పై మీ అభిప్రాయం భగవద్గీత బోధకు పనికొస్తుందా?
శిష్యులారా పైన ఉదాహరించిన కథ నీ అభిప్రాయలు తెలియపరచండి దాని భవద్గీత అనుకరణగా కొన్ని తెలియపరుస్తాను

యింకా వుంది
✅ 2. 'అహం' - మన అహంకారమే మనకు అడ్డుగా ఉంది
అన్నారు కదండీ అవును...

> గీతా బోధ:లో

“అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే” (3.27)
అహంకారంతో మూర్ఖుడు "నేనే కర్త" అని భావిస్తాడు.
మీ వాక్యం:

> “మనలో అహం అడ్డు పడుతుంది... అంత మాత్రాణ శక్తిహీనులు కాదు...”


➡️ గీతా స్పష్టంగా చెబుతుంది — మన కర్మలు ప్రకృతి గుణాల ప్రభావంతో జరుగుతాయి, మనం అహం వల్లే వాటికి కర్తలమని భావిస్తున్నాం.
---
✅ 3. ఇంద్రియ జ్ఞానం, అనుభవం, సినిమాను ఉపమానంగా చెప్పిన తీరు అర్ధం కాలేదు గురువుగారు

> గీతా ధ్యానం:

“ఇంద్రియాణి పరాణ్యాహుః...” (3.42)
ఇంద్రియాల కంటే మనస్సు, ఆపై బుద్ధి, ఆపై ఆత్మ ప్రబలమైనవి.

మీ వాక్యం:

> “జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దుఃఖాన్ని సమానంగా అనుభవిస్తాం... తెరమీద చిత్రం – కాని వెనుక కరెంటు, ప్రొజెక్టర్ ఉన్నారు...”


➡️ ఇది గీతలో చెప్పిన దృశ్య ప్రపంచం వెనుక ఉన్న అదృశ్య మూలకారణం అనే భావనకు నిండు ప్రతిబింబం. మీరు సినిమాను రూపకంగా ఉపయోగించి దీన్ని అందంగా చెప్పారు.
*****
✅ 4. “వెలుగు పంచటం – కొవ్వొత్తిలా కరిగి వెలుగు ఇవ్వడం” ఏలా

> గీతా బోధ:

“తమసః పరస్థాత్” — (గీత 15.6)
దివ్య లోకములు చీకటి నివారించినవి.

లేదా
“యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్...” (15.12)

➡️ మీరు చెప్పిన “వెలుగు పంచటం” భావన గీతలో చెప్పే జ్ఞానప్రభ, ఆత్మ వెలుగు, ఇతరులకు జ్ఞానం పంచే యోగి భావనలతో అనుసంధానించవచ్చు.
---

✅ 5. మార్పు కోసం పరిశీలన, ప్రయోగం, ఆచరణ – జ్ఞానాన్ని విస్తరించడం సమమా

> గీతా ధర్మం:

“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (4.34)
జ్ఞానిని ఆశ్రయించి, ప్రశ్నించి, సేవచేసి జ్ఞానం తెలుసుకో.

➡️ మీరు చెప్పిన “ఎవరినైనా ఆశ్రయించాలి... లేకపోతే శోధన ద్వారా తెలుసుకోవాలి” అన్నది ఇదే భావాన్ని ప్రతిబింబిస్తుంది.
---
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
గీతామృతబోధి (004)

ఒకరికి ఒకరు

ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం.  .

విద్య లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా ఉండటం అవసరమా ?           

రాత్రి వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.    

నా ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ గలిగిన వాడికి,  బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా నిద్రవస్తుంది.   

నమ్ముకున్నదానిపైన నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘ అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు.  మనం మన మనస్సు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ బుద్ధి వికసించుతుంది.  

ఎర్రని పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి, చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.   

ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి.  బురద నీటిలో కలువ పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి.   సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి. 
  --((*))--


గీతామృతబోధిని (005)
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమః...విశ్వములో జీవితం -2
భగవద్గీత దృష్టికోణంలో ‘ఒకరికి ఒకరు’ ప్రశ్నల పరంపర గురువుగారు భగవద్గీత ద్వారా వివరణ 
---

1. విద్య, వినయం, దానం – గీతా బోధ:

> "న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" (భ.గీ. 4.38)
అర్థం: ఈ లోకంలో జ్ఞానాన్ని మించిన పవిత్రమైనదేమీ లేదు.
వ్యాఖ్యానం:, విద్యతో పాటు వినయం అవసరం. గీతలో మనం చూస్తే జ్ఞానమంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు, దాన్ని ఆచరించే వినయం, పరులకు దానంగా పంచే దాతృత్వమూ కావాలి. విద్య దాచుకొని ప్రదర్శించే కర్మలు "అహంకార బుద్ధి" కి సంకేతం (3.27). వినయహీన విద్య విషమైపోతుంది
---

2. అసంతృప్తి – కలల మూలం:

> "తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ" (8.7)
అర్థం: క్షణక్షణమూ నన్ను (దైవాన్ని) స్మరించు.
వ్యాఖ్యానం:
మీరు రాత్రి కలల మూలాన్ని "అసంతృప్తి" గా చూపారు, ఇది చాలా నిజం. గీతా ప్రకారం మనస్సు ఏమీ ధ్యానిస్తుందో, అదే కలగాక మారుతుంది. ఆలోచనలే కలల రూపంలో మనల్ని వెంటాడతాయి. అందుకే నిద్రించే ముందు దైవాన్ని ధ్యానించమని మీరు సూచించారు – ఇది గీతా బోధకు నూర్పడే మాటే.
---

3. తృప్తి – సుఖానికి మూలం:

> "యదృచ్ఛాలాభసంతోష్టో ద్వంద్వాతీతో విమత్సరః" (4.22)
అర్థం: ఎటు నుండైనా వచ్చిన దానితో సంతోషించేవాడు, ద్వంద్వాలకు అతీతుడు.
వ్యాఖ్యానం:
మీరు పేర్కొన్న "సంతృప్తి" భావం ఇదే శ్లోకంలో బాగా ప్రతిఫలిస్తుంది. ఇతరులను చూసి అసంతృప్తి చెందడం అజ్ఞాన లక్షణం. కర్మను ఫలాపేక్ష లేకుండా చేయమని చెప్పిన గీత 2.47 బోధ ఇదే స్థాయికి తీసుకువస్తుంది.
---

4. సంకల్పబలము – నిర్ణయ స్థిరత:

> "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" (2.47)
అర్థం: నీకు కర్మ చేయుటలోనే హక్కు ఉంది; ఫలాల్లో కాదు.
వ్యాఖ్యానం:
మీరు చెప్పిన "ఒక్క నిర్ణయం తీసుకుని వెనుదిరగక పోవడం", "జంకు లేక ముందుకు సాగిపోవడం" అన్నదీ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన ఇదే బోధ. మన సంకల్పం శుద్ధంగా ఉండి, కర్మను నిరంతరంగా చేయాలన్నది గీత సిద్ధాంతం.
---

5. పరిసర ప్రభావం – బుద్ధి మలినత:

> "ఉద్దరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్" (6.5)
అర్థం: మనమే మనల్ని లేపుకోవాలి; దిగజారకుండా జాగ్రత్త పడాలి.
వ్యాఖ్యానం:
పరిసర ప్రభావం గురించి మీరు చెప్పిన క్రిష్టల్ ఉదాహరణ చాలా చక్కగా ఉంది. మన బుద్ధి పారదర్శకత కలిగి ఉంటే, ఇతరుల ప్రభావం మనపై పడుతుంది. కానీ కర్మయోగి పరుల దుష్ప్రభావాన్ని తట్టుకుని ముందుకు సాగుతాడు.

---

6. ధనమూ, కామమూ – బుద్ధిని మాయించు మోహాలు:

> "త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున" (2.45)
అర్థం: ఈ లోకం మూడు గుణాల మాయలో ఉంది; నీవు వాటికి అతీతుడవు కావాలి.
వ్యాఖ్యానం:
ధన, వనిత వంటి విషయ భోగాలపై మీరు చక్కగా హెచ్చరిక ఇచ్చారు. గీత బోధ ప్రకారం, మానవుడి అభివృద్ధికి ఈ విషయాలు అడ్డంకులు. కామం, క్రోధం నాశనకారకాలు (3.37).

7. పద్యం రూపంగా మీ భావం:

జీవితం అనే పఠమును జ్ఞానదీపముతో దీవించు,
విద్యవినయముల అలకలతో దయాసాగరమై నిలచు;
కలలలోన సందేహము, కల్యాణ మార్గమే పథమై,
భగవద్గీతా సందేశమె జీవన ధర్మమై మారుచు!

🌸 శుభమస్తు! 🌸
.

Thursday, 1 September 2016

ప్రాంజలి ప్రభ 
ప్రాంజలి ప్రభ 

*వర్షమా మాపై కురువుమా
 
మేఘమా ఆకాశాన్ని వదిలివర్షంగా కురిసి మా దాహాన్ని తీర్చుమా
ఆకాశానికి నీవు అతిధివి
అల్లుడుగా ఎన్నా
ల్లో ఉండక దిగుమా

ఆడంబరాల
కు చిక్కితివి 
కర్తవ్యము మరువక కురువుమా 
బేష జాలకు పోక అలుక మాని
చిరుజల్లులా 
మాపై కురుపించుమా 

ఉరుములు, మెరుపులు, సుడి 
గాలిని వెంట పెట్టుకొని రాకుమా 
ఎంతో ప్రేమతో  ఎదురుచూస్తున్నా
మాపై కరుణతో వర్షంగా కురువుమా 

పృద్వి తనువెల్ల కళ్ళు చేసుకొని
బీటలు బారిన మనస్సును ఓదార్చుమా
చెరువులు, వాగులు, సెలయేర్లు,
నిన్ను అహ్వానిస్తున్నాయి నేస్తమా  

ధరణి తలాన్ని పులకరింప
చేయుటకు పన్నీటి జల్లు కురిపించుమా
నీ
కోసమ్ అలమటిస్తూ, విలపిస్తూ    
ఉన్న ప్రజలపై దయా వర్షము కురువుమా

ఆకలి తీర్చి ఆదుకునే వాడవునీవే
సమస్త ప్రాణులకు దిక్కు  నీవే
సమస్త  జగతికి ఆధారుడవు నీవే
పుడమిని చల్లబరుచుకు కురువుమా         

మా ప్రార్ధన విని వచ్చినందుకు
శతకోటి దండాలు అర్పిస్తున్నాము వర్షమా
చుట్టపు చూపుగా రాక, ఒక స్నేహితుడుగా
పృద్విపై మీకు ఎప్పుడు ఆహ్వానమే వర్షమా     
--((*))--  


ప్రాంజలి ప్రభ 
 * ( ప్రేమ తత్వం)

తొలి జాము పరవశం తో
మనసుకు నచ్చే పనితో
మత్తుని దించే మాటతో
హత్తుకొనే చేతులు కదులు   

చెత్తను తుడిచే పోకడతో
మత్తుని వదిలించే నడకతో
గుణాన్ని బట్టి గౌరవంతో
శుబ్రం చేసే పాదాలు కదులు   

కలుషితాన్ని తొలగించేందుకు
కుతంత్రాన్నితిప్పి కొట్టేందుకు
కుత్సితాన్ని కడిగేసేందుకు  
మత్సరాన్ని మాపేందుకు కదులు

రగిలే వారిని చల్ల బరుస్తూ
తగిలే వారిని శాంత పరస్తూ  
ఆకలి గొన్న వారి ఆకలి తీరుస్తూ
ఆశలు రేపకుండా ముందుకు కదులు

అవ లక్షణాలను సరిచేస్తూ
హితాన్ని, సన్నిహితాన్ని కల్పిస్తూ   
ప్రస్తుత ధర్మాన్ని వివరిస్తూ
గతాన్నిమరచి ముందుకు కదులు  

చూసింది చూసినట్లుగా అనుకరిస్తూ
చెప్పేది విని చెప్పినట్లుగా చేస్తూ 
వంశగౌరవం నిలుచు నట్లు చేస్తూ
పెద్దలమాట గమనించి ముందుకు కదులు

అందరిలో ఒకరిగా కలసి పొతూ
బిడ్డలమధ్య ఎకత్వముగా కలిపేదిగా చెస్తూ 
నదీ ప్రవాహంలా కదులుతూ చలిస్తూ
సూర్య కిరణంలా వెలుగుని పంచుతూకదులు 

పడిపోయిన వాళ్లను నిలబెట్టుతూ
చెడిపోయిన వాళ్లను సరి చేస్తూ
బ్రతక లేని వారిని బ్రతికిస్తూ
బ్రతుకు ధర్మాన్ని తెలుపుతూ కదులు

తెలివితో సమస్యలను పరిష్కరిస్తూ
విజ్ఞానంతో అజ్ఞానులకు వివరిస్తూ
వృక్షంలా అందరికి సహకరిస్తూ
మేలిమి బంగారపు వెలుగుతో  కదులు  

శబ్దం రాకుండా నిశ్శబ్దం పనులు చేస్తూ
విద్య అందని వానికి విద్యను వివరిస్తూ 
సత్వరము తత్వాన్ని తెలియపరుస్తూ
మనసును మెచ్చే గుణంతో అందరిని ప్రేమించు
--((*)-- 



* (మల్లెపువ్వు) 

మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా

పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా  

కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా

కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి  తరుణ మైతే   
ప్రేమతో సుఖాన్ని పంచవా 
కొంచం తెలుసుకోండి
--((*))--

*గరిక పువ్వు

నేనొక గరిక పువ్వు
వర్ణాల వెలిగే పువ్వు
వాసన  లేని పువ్వు
రాగము లేని పువ్వు

ఋతువులతో పనిలేని పువ్వు
ఎ తావి దరిచేరనీయని పువ్వు
మనస్సును హత్తుకొని పువ్వు
శల్య మై రెప రెప లాడే పువ్వు  
-(*)-


* నవ్వే నువ్వు -నువ్వే నవ్వు

పక పక నవ్వే విరబూసిన పువ్వు
పసితనపు ముత్యాలువిరిసిన నవ్వు
ఉషోదయ వెలుగులకు చిక్కే లవ్వు
మనసు మనసు కలిపే నవ్వే నువ్వు

ఉ ఊల చిలుక పలుకల చిరునవ్వు
ఉంగ ఉంగ యంటూ ఊయల నవ్వు
మనసారా పిల్లల ఏడుపు లో నవ్వు
జోలపాటలో సంగీతాలలో చిరు నవ్వు

రాలి పడే పువ్వు గుభాలిమ్పుల నవ్వు
నటుల హాస్య, రోదన సంభాషణల నవ్వు     
సొగసు ఆవిరై మృదుత్వం లోవచ్చే నవ్వు
రాగ మాలికల ప్రతిధ్వనులచే వచ్చే నవ్వు

ఉక్రోషంతో వయసు వికటాట్టహాసం చేసే నవ్వు
మంత్ర ముగ్దులగా మనసును మార్చే నవ్వు
ఎదగటానికి ఎందు కంత తొందర ప్రశ్నే నవ్వు
పెద్దవాళ్ళ బోసి నవ్వుల మాటలే కొంత నవ్వు

కష్ట ఫలితాల నుండి వచ్చే సంతోషాల నవ్వు
బాల్య చేష్టలు గుర్తు చేసుకొని తెలిపే   నవ్వు
వింతలూ, నిరంతరం తాజాదనంతో వచ్చేనవ్వు
కలయకలో వినరాని మాటల తో  వచ్చే నవ్వు
--((*))--

Monday, 22 August 2016

om sri Ram


ఓం శ్రీ 


*మా  బంగారు చెల్లి పెళ్లి  (పెళ్లిళ్ల సందర్భముగా నా కవిత)

మా ఇంటి బంగారు తల్లి
మా మమతల  మళ్ళీ
మా అందరి గారాబాల చెల్లి
ఇప్పుడే జరుగు తున్నది పెళ్లి

మా చెల్లి చదువుల తళ్లి
మా చెల్లి లక్ష్మిని చేకూర్చే కల్పవళ్లి
మా చెల్లి నిత్యమూ ఉదయించే మళ్లి
మేమందరము కలసి చేస్తున్నాము పెళ్లి

ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంతా పీట వేసి
బంగారు పళ్ళెరములో  ముత్యాల తలంబ్రాలు చేసి
మనసంతా రంగరించి పల్లకీలో ఉరిగింపు చేసి
మంగళతోరణాల మధ్య, వాయిద్యాలమధ్య చేస్తున్న పెళ్లి    

భాజా బజంత్రీలు వాయిస్తున్నారు మళ్లీమళ్లి
స్త్రీలు పెద్దలు పిన్నలు అందరూ దివిస్తున్నారు వచ్చి వెళ్లి
మా లోగిళ్ళలో సంబరం జరుపుకుంటున్నారు మళ్లి
మా ఆత్మీయతతో, ఆనందాంతో, అనురాగంతో చేస్తున్న పెళ్లి

మెట్టినింటికి పుట్టినింటికి మమతానురాగాలు అందించే తళ్లి
మనసును పంచి మనువాడే మనసునుదోచె మకరంద మళ్లి
ఎవ్వరి మనసును నొప్పించక మనసును శాంతపరిచేది మా చెళ్లి
దేవతలారా దీవించండి జరుగుతున్నది మా  బంగారు చెల్లి పెళ్లి 
   
--((*))--


* ప్రశాంతత


మనసుకు మనసుకు మధ్య ఉండు వేదాంతం
మనిషికి మనిషికి మధ్య ఉండు ఏకాంతం
మమతకు మమతకు మధ్య ఉండు రాద్ధాంతం
తనువుకు తనువుకు మధ్య ఉండు ఒంటితనం

మనిషి సంపాదన చుట్టూ కమ్ముకుంటుంది వలయం
మనిషికి దానం సుఖ యాత్రకు ఒక దివ్య ఔషధం   
మనిషికి ప్రేమతో ఉన్న చెలిమి ఉంటే శుభ ప్రదం
మనిషికి మమతానురాగాలు తోడు ఉంటే ప్రపంచం

మనిషి పలకరింతల్లోని పులకరింతలే ఆహ్వానం
మనిషికి  కరచానాల్లోని కల్లమెరుపులే ఆనందం
మనిషి మనుగడ ప్రస్నార్ధకం కాక ఉండాలి మార్గం  
మళ్ళీ మళ్ళీ మనసును ప్రేమగా మార్చుట తత్త్వం
 
మనిషి ఆలింగనాల్లోని ఆత్మీయతను గ్రహించి
తల్లితండ్రుల లోని ముద్దుమురిపాలను గ్రహించి
మనస్సు అనేది చలువ పందిరిలాంటిదని గ్రహించి
ఆనంద బాష్పాలతో పెద్దలను అభిషేకించు  

మనిషి యొక్క ప్రయాణానికి అంతు లేదంటా
అత్యాశ లేని బ్రతుకులకు కొదవ లేదంటా
మమకారంతో ఉంటాయి బాధలు, బాధ్యతలంటా
అందుకే మనసంతా ప్రశాంతముగా ఉంచుకోవాలంటా
--((*))--


*మధురవాణి

పట్టుదల ఉన్నది -
విజయం మనదేనంటున్నది
మౌనం వద్దంటున్నది -
సంతోషం పంచుకోమంటున్నది

భావం తెలుప మంటున్నది -
భాషకు విలువ పెంచమంటున్నది
స్త్రీలకు గౌరవం పెరుగుతున్నది -
ధైర్యముగా బ్రతకాలంటున్నది

మనసుతో నవ్వమంటున్నది -
నవ్వులు పంచి బ్రతకమంటున్నది
కన్నీటిని అదుపు చేయద్దన్నది -
వెలుగుకు కన్నీటి సాక్షమన్నది

ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
భంగ పడవద్దన్నది -
ఓర్పుకు అది ఒక పరీక్షయని తలవమన్నది

కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది
నేల చినుకును కోరుకుంటుంది -
నింగి సహకారంతో పులకరించిపోతుంది

మధురవాణి మనవెంటే ఉన్నది -
మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
జిహ్వచాపల్యంనకు స్పర్స్ సుఖమన్నది

రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది
వయసుని బట్టి ప్రవర్తించమన్నది
వానరుడులా సహాయపడుతూ బ్రతకమన్నది

--((*))--


* కొత్త జిల్లాలు (భావ కవిత )

రాష్ట్ర ప్రగతి కోసం మనప్రభుత్వం
ప్రజల ముందుకు ప్రగతి పధంగా
రాష్టంలో కొన్ని కొత్త జిల్లాలను
ఏర్పాటుకు ఏకగ్రీవం
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

ప్రజా సమస్యలను తీర్చుటకు
ఆధునిక అభివృద్ధి కొరకు
విద్య , వైద్య, అనేక ఉద్యోగాల కొరకు
ప్రజల నాడి తెలుసుకొని ప్రగతి బాటకు
ప్రభుత్వమూ, మేదావాలు ఆలోచించి
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

కొత్త మార్పులు కోసం
కోరుకున్న వారిఆశలకోసం
కమిషన్ల బ్రతుకుల కోసం
కార్యదక్షుల క్రమశిక్షణ కోసం
ప్రత్యక్షముగా ప్రజలకు
స్సహాయ సహకారం అందించటం కోసం

వస్తూన్నాయి వస్తున్నాయి కొత్త జిల్లాలు
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

నవనాయకులకు పసందు
నవ తేజో వంతులకు ఉద్యోగాల విందు
ఆగి ఆగి అలోచించి ప్రజల మేలు కొరకు
కొత్త జిల్లాలు గా మారుస్తున్నారు ముందు

కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం
--((*))--

*కొత్తపాట (ధైర్యాన్ని పెంచే తాతగారి పాట  )

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

సత్యం పలకని చోట, ధర్మం గెలవని చోట
న్యాయం నిలవని చోట, నివే ధైర్యంగా చేయాలి వేట

నిన్ను నీవు రక్షించు కోవటం కాదు
నమ్మిన సిద్దాతాన్ని బ్రతికించటం నేర్చుకో
అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మారుట నేర్చుకో
క్రూరమ్రుగాలను, కిరాతాకులను వేటాడుట నేర్చుకో

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

కలికాలంలో దుర్మార్గానికి ఎవ్వరూ బలి కాకుండా ఆదుకో
ప్రతిఒక్కరి మనసును మార్చుటకు వెయ్యాలి కొత్త బాట
తప్పదు తప్పదు అనుకుంటే చెయ్యాలి కత్తుల వేట

తప్పో ఒప్పో తెలియదు ఆనాడు కృష్ణుడు కురుక్షేత్రంలో ఆడిన ఆట
నీవే చేయాలి ఈనాడు దుర్మార్గులపై రణక్షేత్రంలో వేట

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో
--((*))--

విశ్వప్రేమ
(కరుణశ్రీ)
సీ.
ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర
మిరుసు లేకుండనే తిరుగుచుండు
ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు
ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును
ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు
గీ.
ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ -
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ -
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల
ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము ! !



...

Friday, 19 August 2016

**మధురవాణి

**

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చేది
అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది
కవి హృదయం అర్ధం చేసుకోవటం ఎలా చెప్పేది
పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా
ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా
మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా
భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యం
మనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వం
సరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకం
మనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం    


--((*))-- 

 ( ప్రేమ )

లేదనకు నా మీద ప్రేమ
కాలమునకు లోబడి ప్రేమించాను
మనసుకు తట్టే మనోహర ప్రేమ
గంధపు గుబాళింపులతో ప్రేమించాను

నాది సమ న్యాయముగల ప్రేమ
మనకు సమస్యలుండవని ప్రేమించాను
మౌన మనస్సుతో పొందే ప్రేమ
మనసు మనసు కలవాలని ప్రేమించాను

ఘడియ ఘడియకు మారదు ప్రేమ
గగనంలా విస్తరించి పృద్విలా ప్రేమించాను
మరువ లేకున్నా మమతల ప్రేమ
మనమధ్య బలం ప్రేగాలని ప్రేమిస్తున్నాను   
--((*))--

( తోడులేని ప్రేమ )

జాబిల్లి నన్నుచూసి ఆసహ్యంగా నవ్వుతున్నాడు
మలయ మారుతం నా దగ్గరకు  రానంటున్నాడు
మత్తెక్కించే మరులుగొలిపే వేణుగానం లేదన్నాడు
పరిమళాలు వెదజల్లే పుష్పాలు వెక్కిరిస్తున్నాయి

నా ఊహల సప్తస్వరాలు నన్ను విడిచి పోయినాయి
సొగసు రెక్కలు విప్పారినమల్లెలు ముడుచుకున్నాయి  
మధురరాత్రుల సవ్వడులు మనసుకు తాకనంటున్నాయి
నా తనువులో ఉన్న ఊహలు ఆవిరులై బిందువులైనాయి
    
మనసు నీతో సరాగాలకై ఆరాటపడుతున్నా ఫలితమేది
వయసు వేధింపులకు బ్రహ్మచర్యమే నాకు శుభమైనది  
మనోనిగ్రహ శక్తితో వెచి ఉండుటే నాకు శ్రేయస్కరమైనది
ఎంత ఆలస్యమైనా ఓర్పు వహిస్తే అంతా ఆనందమయమే    
--((*))--

  (కధనం )

పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం

లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం

పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం

రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం

జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం

--((*))--




 
 (ప్రయత్నం)


  (

రుక్మిణీ సందేశము

రచయత :మల్లాప్రగడ రామకృష్ణ
పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!
(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. ఏవిధముగా పార్ధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదుకుంటాడని మనసు శాంతికి సాహకరిస్తాడని అందరి నమ్మకం అందుకే ఆరాధ్య దేవునిగా మారాడు.

మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -

"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -
"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"

సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.



రుక్మిణీ సందేశము (ఏడవభాగము)
(కృతజ్ఞతలు ...పిస్కా సత్యనారయణ హారు.)

ఆరవ పద్యము

లోపలి సౌధంబులోన వర్తింపంగఁ
....... దేవచ్చునే నిన్ను! దెత్తునేని
గావలివారలఁ గల బంధువులఁ జంపి
....... కాని తేరాదని కమలనయన!
భావించితేని, నుపాయంబుఁ జెప్పెద
....... నాలింపు! కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ
....... బెండ్లికి మునుపడ బెండ్లికూతు

నెలమి మావారు పంపుదు, రేను నట్లు
పురము వెలువడి యేతెంచి, భూతనాథు
సతికి మ్రొక్కంగ, నీవు నా సమయమునకు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత

క్రిందటి పద్యములో రుక్మిణి తనను క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ వంశీమోహనుడికి విన్నవించింది. ఇప్పుడు ప్రస్తుత పద్యములో అందుకు తగిన సమయమూ, సందర్భమూ కూడా తానే సూచిస్తున్నది.

"ఓ కమలాక్షా! 'రాజనగరులోని అంతఃపురసౌధము లోపల సంచరించే నిన్ను హరించి తీసుకురావడం సులభమైన కార్యమా?! ఒకవేళ, అందుకు సిద్ధపడి వచ్చినా ద్వారపాలకులనూ, నీ చుట్టూ పరివేష్ఠించివున్న బంధుజనులనూ నిర్మూలించకుండా నిన్ను బైటకు తేవడం సాధ్యమా?' అని తలుస్తున్నావేమో! అందుకు నేనొక ఉపాయం చెప్తాను. చిత్తగించు! వివాహానికి ముందు వధువు చేత మా ఇలవేల్పు అయిన గౌరీదేవికి పూజ చేయించడం మా కుటుంబ ఆచారం. ఆ పద్ధతి ప్రకారం మావాళ్ళు నన్ను పెళ్ళికూతురును చేసిన పిదప, నగర పొలిమేరలలో ఉన్న పార్వతీదేవి మందిరానికి పంపుతారు. నేను నగరం వెలువడి వచ్చి భూతనాథుని సతికి మ్రొక్కే సమయానికి నీవు అక్కడికి చేరుకుని నన్ను తీసుకువెళ్ళు స్వామీ!" అని రుక్మిణి విన్నవిస్తున్నది.

వివాహానికి ముందు పెళ్ళికుమార్తె గౌరీపూజ చేయడం ఈనాటికీ ఆచారంగానే వస్తున్నది. పల్లెటూళ్ళలోనైతే జనులు ఊరి శివార్లలో ఉండే గ్రామదేవత పోచమ్మ గుడికి వెళ్ళి పూజలు సలుపుతారు. ఇదే ఆచారం రుక్మిణి పుట్టింటివారికి కూడా ఉన్నదన్నమాట!

పద్యం చివర్లో రుక్మిణి కృష్ణమూర్తిని "అవార్యచరిత!" అని సంబోధించింది. అనగా "అడ్డులేని నడవడి కలవాడా!" అని అర్థం. ' ఈ కార్యం సాధించుటలో నిన్ను వారించడానికి కానీ, ఎదుర్కోవడానికి కానీ ఎవరికీ సాధ్యం కాదు ' అనే ధ్వని ఆ సంబోధనలో గోచరిస్తున్నది

ఇప్పుడు ఏడవ పద్యాన్ని ఆస్వాదిద్దాము.



రుక్మిణీ కళ్యాణం:
. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు.
రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.

పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది.
రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది.
అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి.
ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది.
ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.




రుక్మిణీ సందేశము
.(వివరణ ..... శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)
నాలుగవ పద్యము
వ్రతముల్, దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్, హరి, జగత్కళ్యాణు గాంక్షించి చే
సితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక! ని
ర్జితులై బోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్
ఈ పద్యములో తన పూర్వజన్మ సుకృతఫలంగా శ్రీకృష్ణుడే తనకు భర్తగా లభించాలని రుక్మిణి కోరుకుంటున్నది.
వెనుకటి జన్మలలో నేను వ్రతములను, దేవతలకు, ఆచార్యులకు, బ్రాహ్మణులకు, జ్ఞానులకు సేవలను, దానధర్మాదులను సర్వేశ్వరుడైన శ్రీవిష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం చేసివుంటే, ఈ జన్మలో నాకు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడే ప్రాణనాథుడు కావాలనీ, శిశుపాలాది నీచులు ఆ యదువీరుని చేతిలో సంగరరంగాన నిర్జింపబడాలనీ రుక్మిణి ప్రార్థిస్తున్నది.
భగవంతుని ప్రీతి కొరకు ఆయనకు సేవాపరంగా కర్మలను ఆచరిస్తే, అవి  భగత్ప్రాప్తిని కలిగిస్తాయని శ్రుతులు, స్మృతులు బోధిస్తున్నాయి. పుణ్యకర్మల చేత భగవానుడు తృప్తినొందినప్పుడు, తానే జీవులను చేబట్టి తన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకే "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. కాబట్టి తన పూర్వజన్మ పుణ్యఫలమే తన మనోభీష్టాన్ని పూర్తిచేయగలదని రుక్మిణి విశ్వాసం!
"వసుదేవనందనుడు" అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆయనను "వాసుదేవుడు" అంటారు....... దశరథ పుత్రుడైన శ్రీరాముణ్ణి "దాశరథీ" అని సంబోధించడం కూడా ఇట్టిదే!రుక్మిణీ సందేశము
.
ఐదవ పద్యము
మరి, ఐదవ పద్యములో రుక్మిణి ఏమంటున్నదో చూడండి.
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది.
పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.
(మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.)
విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది.
వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి!
ఇకపోతే, వివాహాలు 8 రకములని పెద్దలు చెప్పారు. ఈ ఎనిమిదింటిని "అష్టవిధ వివాహములు" గా మన పూర్వులు వర్గీకరించారు.
1) బ్రాహ్మము : ప్రతిఫలాపేక్ష లేకుండా సాలంకృతయైన కన్యను సమర్థుడైన వరునకు ఇచ్చి వివాహం చేయడం.
2) దైవము : కన్యాదాత యజ్ఞం చేసి, ఋత్విక్కును పూజించి, అతనికి కన్యను ఇచ్చి పెళ్ళి చేయడం.
3) ఆర్షము : కన్య తల్లిదండ్రులు వరుని నుండి గోమిధునాన్ని స్వీకరించి, శాస్త్రవిధేయంగా కన్యను ఇచ్చి వివాహం చేయడం.
4) ప్రాజాపత్యము : ' నేను సంతానార్థం పెళ్ళి చేసికొని, గృహస్థాశ్రమధర్మాలు ఆచరిస్తాను ' అని వరునితో ప్రతిజ్ఞ చేయించి, కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళి చేయడం.
5) రాక్షసము : కన్య తనకు నచ్చినవానిని తనవారి అంగీకారం ఉన్నా, లేకపోయినా (వరునిచే బలాత్కారంగానైనా సరే తీసుకొని వెళ్ళబడి) వివాహం చేసుకోవడం.
6) ఆసురము: కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకోవడం.
7) గాంధర్వము: పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పర ప్రేమానురాగాలతో చేసుకొనే వివాహం.
8) పైశాచము: స్పృహలేని, తనను తాను రక్షించుకోలేని దశలో ఉన్న కన్యను, కేవలం కామదృష్టితో పెళ్ళి చేసుకోవడం.
వీటిలో గాంధర్వము, రాక్షసము అనేవి క్షత్రియులకు శాస్త్రసమ్మతమైనవని "మహాభారతము - ఆదిపర్వము" లో చెప్పబడింది - "గాంధర్వ రాక్షసే క్షత్రే ధర్మ్యౌతౌ మా విశంకిధాః" అని.
స్త్రీపురుషులు పరస్పరం ఒకరినొకరు ఇష్టపడి, రహస్యంగా వివాహం చేసుకోవడం ' గాంధర్వము ' అనబడుతుంది. "మహాభారతము" లో శకుంతలా దుష్యంతుల పరిణయం ఈ పద్ధతిలోనే జరిగింది.
పురుషుడు తనను ఇష్టపడిన స్త్రీని ఎత్తుకువెళ్ళి వివాహం చేసుకోవడం ' రాక్షసము ' గా చెప్పబడింది. "మహాభారతము" లోనే భీష్ముడు తన తమ్ముడైన విచిత్రవీర్యుని కొరకు కాశీరాజు కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరమంటపములోని రాజులందరినీ జయించి, హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపిస్తాడు. (వారిలో పెద్దదైన అంబ తాను సాళ్వుణ్ణి ప్రేమించానని చెప్తే, ఆమెను వెనక్కి పంపిస్తాడు.)
ఇటీవలి చారిత్రికకాలానికి వస్తే, జయచంద్రుని కుమార్తెయైన సంయుక్తను, పృథ్వీరాజు పైవిధంగా స్వయంవరమంటపము నుండి ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటనలు రాక్షసవివాహ పరిధిలోకి వస్తాయి.
ఇక్కడ రుక్మిణి సైతం తనను రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ దేవదేవుణ్ణి అర్థిస్తున్నది. అది క్షత్రియోచితమైన కార్యమే కనుక, ఎవరికీ ఆక్షేపించే అవకాశం లేదని ఆమె భావన.
ఇక, ఆరవ పద్యము.







 రుక్మిణి కుమారి శ్రీ కృష్ణుని పంపిన లేఖ.!
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.)

.
తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషి
సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు
స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు
ష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. ‘మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.
కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేతూ అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.
ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.
ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి.  కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.
రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు ణా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”.
నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.



రుక్మిణీ సందేశము (ఎనిమిదవభాగము)
(విశ్లేషణ...శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

ఏడవ పద్యము

ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱు జన్మంబులన్
నిను జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

నూఱు జన్మలెత్తినా సరే, తాను శ్రీకృష్ణుని సతిగానే ఉంటాననే దృఢనిశ్చయాన్ని రుక్మిణీదేవి ప్రకటిస్తున్నది ఈ పద్యములో!

"నా మనోనాయకుడవైన ఓ కృష్ణా! పెద్దలు, బుధులు తమ అజ్ఞానమును తొలగించుకోవడానికి శివునివలె ఎవరి పాదతీర్థమందు స్నానం చేయగోరుతారో, అట్టి నీ కృపకు నేను పాత్రురాలను కాకపోయినట్టయితే, నూఱు జన్మలను ఎత్తియైనా బ్రహ్మచర్య వ్రతదీక్షతో నిన్నే ధానిస్తూ ప్రాణాలను విడుస్తాను. ఇది సత్యం సుమా!" అంటున్నది రుక్మిణి.

ఈ పద్యములో "గౌరీశు మర్యాదన్" అని చెప్పారు పోతనామాత్యులు. అనగా, "పరమశివుని వలె" అని అర్థం! మరి, ఎందుకు ఆ విధంగా చెప్పారు?! "వైష్ణవానాం యథా శంభుః" అని వ్యాసభగవానుల సూక్తి. శంకరుడు ఎప్పుడూ ధ్యానముద్రలో, తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు మనకు! ఆయన సదా తన మనసులో మహావిష్ణువునే ధ్యానిస్తుంటాడట! నిజానికి, శివకేశవులకు భేదమే లేదు........ గోస్వామి తులసీదాసుగారు తమ "రామచరిత మానస్" లో, శివుడు సర్వదా రామనామ జపం చేస్తుంటాడని అనేకమార్లు స్పష్టంగా చెప్పారు.

"తమో" శబ్దానికి అజ్ఞానం, చీకటి, తమోగుణం, శోకం అని నానార్థాలు ఉన్నాయి. తమస్సు పారమార్థిక జ్ఞానాన్ని కలుగనీయదు. భగవంతుని పాదతీర్థమే ఆ తమస్సును తొలగించి జనులను పవిత్రులను చేస్తుంది. భగవత్పాదజలమే పావనగంగ! వామనావతార ఘట్టములో విష్ణుమూర్తి త్రివిక్రమరూపాన్ని దాల్చినప్పుడు, తన సత్యలోకానికి చేరిన ఆయన పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో ప్రక్షాళన చేశాడు. ఆ జలమే పవిత్రగంగగా భాసించినది. అందుకే గంగను "విష్ణుపాదోద్భవి" అనీ, "నారాయణుని పుత్రిక" అనీ వ్యవహరిస్తారు. ఈ ఘట్టమును పురస్కరించుకునే ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అయిన అన్నమయ్య "బ్రహ్మ కడిగిన పాదమూ" అని కీర్తించాడు భగీరథుని ప్రార్థన ఆలకించి, పరమశివుడు సైతం విష్ణుపాదోద్భవియైన గంగను తన శిరసున ధరించాడు.

"అభ్యాగతః స్వయం విష్ణుః" అనే పురాణోక్తిని అనుసరించి, ఈనాటికీ భారతీయ గృహస్థులు తమ ఇళ్ళకు విచ్చేసిన సాధుపుంగవుల పాదాలను కడిగి, పూజించి, ఆ పాదతీర్థాన్ని తమ శిరసులపై చల్లుకొని, లోనికి పుచ్చుకొని తమను, తమ గృహాలను పవిత్రం చేసుకోవడం లోక పరిపాటి!

ఇక్కడ మరొక సంగతి కూడా మనం విస్మరించకూడదు రుక్మిణి తాను శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది. కాని, 'ఆయన తనను ప్రేమిస్తాడా? ఆయన హృదయంలో తనకు స్థానం లభిస్తుందా?' అనే విషయాలు ఆమెకు తెలియవు. మాధవుడు తన మనవిని మన్నించి తనను చేరదీయకపోతే, తన పరిస్థితి ఏమిటి?! ఆభిజాత్యమూ, అభిమానమూ గల అతివకు అంతకన్నా అవమానం ఏముంటుంది? అటువంటి పరిస్థితే ఎదురైననాడు తనకు ప్రాణత్యాగమే శరణ్యమని రుక్మిణి తలంపు! తన మనస్సులోనైనా వేరొకరిని భర్తగా భావించలేననీ, వంద జన్మలెత్తినా వంశీధరుడే తన వల్లభుడనీ, అందుకు ఆటంకం ఏర్పడితే ఆయననే ధ్యానిస్తూ తన అసువులను అర్పిస్తాననీ చెప్తున్నది. పద్యము చివరిలో "నిక్కంబు ప్రాణేశ్వరా!" అని నొక్కి వక్కాణించడం రుక్మిణీదేవి తెగువను, సాహసాన్ని సూచిస్తున్నది. "ప్రాణేశ్వరా!" అనే సమయోచితమైన సంబోధన కూడా ఈ పద్యానికి మకుటాయమానమై ప్రకాశిస్తున్నది. తన ప్రాణాలకు అధినాథుడుగా భావించుకుంటున్న శ్రీకృష్ణుడు తనను కరుణించకపోతే, ప్రాణాలు తనువును వదిలివెళ్ళడం సహజమే కదా!

ఇంక, పరాత్పరునికి ప్రయాణించక తప్పదు మరి!

ఇంక, రుక్మిణీసందేశములోని చివరి పద్యం ఎలావుందో చూద్దాము.



రుక్మిణీ సందేశము (చివరిభాగము)
( కృతజ్ఞతలు ... శ్రీ పిస్కా సత్యనారయణ గారికి. వారి అద్బుత వివరణకు కు మా అభినందనలు.)

ఎనిమిదవ పద్యము

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని
........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
........ తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
........ చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగాలేని
........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?!
రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది.

"శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి.

మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి.  చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు.

ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం!

ఈ సందర్భములో, ఈ పద్యానికి సంబంధించిన నా స్వానుభవం ఒకటి ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను!........ నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి. చాలారోజుల నుండి, ఈ పద్యమును విన్నప్పుడల్లా నాలో ఒక సందేహం కదలాడుతూ ఉండేది. ఇది సీసపద్యం. సీసపద్యానికి 4 పాదాలు, చివరలో ఎత్తుగీతి ఉంటాయని మనందరికీ తెలిసినదే! ఐతే, పోతనగారు మొదటిపాదములో చెవులనూ, రెండవపాదములో తనువునూ, మూడవపాదములో నేత్రాలనూ, నాల్గవపాదములో జిహ్వనూ ప్రస్తావించి, ఎత్తుగీతిలో నాసిక గురించి చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, 'ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవయవమును అభివర్ణించిన కవీశ్వరులు, 2వ పాదములో మాత్రము సర్వావయవ సమ్మిళితమైన శరీరాన్ని ఎందుకు చెప్పారు?!... ఎత్తుగీతిలో ప్రస్తావించిన నాసికను 2వ పాదములో చెప్పి, తనువును ఎత్తుగీతిలో చెప్పివుంటే ఇంకా బాగా ఉండేది కదా!' అనుకునేవాడిని. సంపూర్ణమైన ఛందోజ్ఞానం నాకు లేకపోవడంచేత, 'ఒకవేళ సీసపద్యము యొక్క ఛందస్సు అందుకు అనుమతించలేదేమో!' అని నాకు నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఐనా, సంతృప్తి కలగక ఎవరైనా విజ్ఞులైనవారితో నా సందేహనివృత్తి చేసుకోవాలని అనుకున్నాను...... ఐతే, ఆశ్చర్యకరంగా నేను ఈ వ్యాసమును తయారుచేసుకునేటప్పుడే తటాలున మెరుపు మెరిసినట్టుగా నా సందేహానికి సమాధానం దొరికింది!

అదేమిటో వివరిస్తాను.

ఈ మానవ శరీరం పాంచభౌతికమైనదని ఇంతకుముందే చెప్పుకున్నాము. అనగా, పంచభూతముల మేళవింపుతో తయారైనదన్నమాట! పంచభూతములు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము మరియు భూమి. వీటి ఆవిర్భావం ఏ వరుసలో జరిగినదో "భాగవతము" లో విశదంగా ఉంది. ప్రథమంగా అనంతమైన ఆకాశం ఉండేది. తర్వాత వాయువు, ఆపైన అగ్ని, ఆ పిమ్మట నీరు, అటుపైన భూమి ఏర్పడినాయని "భాగవతము" చెప్తున్నది. ఈ పంచభూతముల యొక్క ప్రధానగుణములు సైతం "భాగవతము"లో చెప్పబడ్డాయి. అవి ఎలాగంటే, వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే గుణములు. అనగా, మొదటిదైన ఆకాశమునకు శబ్దగుణము, రెండవదైన వాయువుకు స్పర్శగుణము, మూడవదైన అగ్నికి రూపము, నాల్గవదైన నీటికి రసగుణము, చివరిదైన పుడమికి గంధగుణము ప్రధానమైనవని చెప్పారు మన మహర్షులు.

మనం చెప్పుకుంటున్న సీసపద్యములో పోతనామాత్యులు ఈ క్రమాన్నే పాటిస్తూ, వరుసగా ఒక్కొక్క పాదములో ఒక్కొక్క గుణానికి సంబంధించిన శరీరావయవమును వర్ణించారు. శబ్దగుణముకు ఆలంబనం కర్ణములు కనుక వాటిని మొదటిపాదములో, రెండవదైన స్పర్శగుణానికి ప్రాతినిధ్యం వహించేది చర్మమే కాబట్టి 2వ పాదములో తనువును, మూడవదైన రూపగుణానికి ప్రతినిధులుగా 3వ పాదములో నయనాలను, నాల్గవదైన రసగుణానికి 4వ పాదములో రసనను అనగా నాలుకను, చివరిదైన గంధగుణానికి ఆలంబనమైన నాసికను ఎత్తుగీతిలో పేర్కొన్నారు.

పైవిధంగా పర్యాలోచించి చూసుకుంటే, నా సందేహం మబ్బుతెరలా విడిపోయింది.

ఈ పద్యములో పురుషోత్తముని వనమాలికను ప్రస్తావించారు పోతనగారు. దీని గురించి ఒకమాట! ' వనమాలిక ' అంటే 5 రకముల పుష్పములతో కూర్చబడి, దేవదేవుని గళం నుండి చరణయుగళం దాకా (కంఠం నుండి పాదముల వరకు) వ్రేలాడుతూ ఉండే పూలమాల. దీనికే "వైజయంతిమాల" అని పేరు....... పరమ భాగవతోత్తముడైన విప్రనారాయణుడు ఈ వైజయంతిమాల అంశతోనే జన్మించినాడని అంటారు. సారంగు తమ్మయ అనే కవీశ్వరుడు విప్రనారాయణుని కథను "వైజయంతీ విలాసము" అనే పేరిట కావ్యంగా వెలయించాడు.

మొత్తం మీద రుక్మిణీసందేశములోని ఈ చివరి పద్యము రుక్మిణి దాస్యభక్తితో పాటు, పోతన కవితాశక్తిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది.

*** *** *** ***

రుక్మిణీసందేశ రూపకంగా ఉన్న 8 పద్యాలను నా చేతనైనంతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. సాహితీమిత్రులు నా ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను.