Friday, 17 July 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము



వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము.. గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము... తెలుగు తాత్పర్యము .. 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక / సేకరణ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గారు .  (1) 
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

నారదుడు వచించెను - ధర్మరాజా! బ్రాహ్మణులలో కొందరు యజ్ఞాది కర్మలయందును, మరికొందరు తపశ్చర్యలయందును,ఇంకను కొందరు స్వాధ్యాయ ప్రవచనములయందును, మరికొందరు ఆత్మజ్ఞాన ప్రాప్తియందును, ఇంకను కొందరు యోగమునందును నిష్ఠను కలిగియుందురు.

గృహస్థులు తమ కర్మలద్వారా అక్షయ ఫలములను పొందుటకై శ్రాద్ధము, లేక దేవపూజా సమయమునందు జ్ఞాననిష్ఠగల పురుషునకు హవ్య-కవ్యములను దానము చేయవలెను. అట్టి పురుషుడు దొరకనిచో, ఇతరులకు అనగా - యోగి, ప్రవచనము చేయువాడు మొదలగువారికి యథా యోగ్యముగ యథాక్రమములో దానము చేయవలెను.

దేవకార్యమునందు ఇద్దరికి, పితృకార్యమునందు ముగ్గురుకి లేదా, రెండు కార్యములయందు ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను. ఎంతటి ధనవంతుడైనను శ్రాద్ధకర్మయందు భోక్తల సంఖ్యలను పెంచరాదు. ఎందులకనగా, తన బంధువులను, స్వజనులను భుజింపజేసి శ్రాద్ధ కర్మను విస్తారమొనర్చుట వలన దేశకాలోచితమైన శ్రద్ధ, పదార్థములు, పాత్రసామానులు, పూజా ద్రవ్యములు సరిగా సమకూర్ప లేక పోవచ్చును.

యోగ్యమగు దేశమునందు, కాలమునందు లభించెడు ఋషి, మునులు భుజించునట్టి నీవార, వ్రీహి మున్నగు బియ్యముతో వండిన పవిత్రమగు హవిష్యాన్నమును భగవంతునకు నివేదించి, శ్రద్ధతో విధ్యుక్తముగ యోగ్యుడైన బ్రాహ్మణుని భుజింపజేయవలెను. అట్లు చేయుటవలన సమస్తమైన కోరికలు సంపూర్ణముగా, అక్షయముగా సిద్ధించును.

గృహస్థుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర ప్రాణులకు, తనకు, తనవారికి గూడ అన్నమును విభజించి, సమర్ఫించు సమయమున వారందరిని పరమాత్మస్వరూపులుగ దర్శింపలెను.

ధర్మము యొక్క మర్మమును ఎరిగిన పురుషుడు శ్రాద్ధకర్మయందు మాంసమును అర్పింపరాదు. తానును మాంసాహారమును భుజింపరాదు. ఏలయన ఇతరులు ఋషులు, మునులు యోగ్యమైన హవిష్యాన్నముచే తృప్తులగుదురుగాని, పశుహింసచే తృప్తులుగారు.

స్వద్ధర్మమును పాటించుటకు అభిలాషగలవారు ఏ ప్రాణికిని మనస్సుచే, వాక్కుచే, శరీరముచే ఏ విధముగను కష్టమును కలిగింపరాదు. అంతకంటెను ఉత్తమమైన ధర్మము మరియొకటి లేదు.

యజ్ఞతత్త్వమును ఎరిగిన కొందరు జ్ఞానులు తమ జ్ఞానము ద్వారా ప్రజ్వలితమైన ఆత్మ సంయమరూప- అగ్నియందు కర్మమయ యజ్ఞములను హవనము చేయుదురు. వారు బాహ్యకర్మకలాపములను విరమించెదరు (మానివేసెదరు).

ఎవడైనను ద్రవ్య యజ్ఞముల ద్వారా అనగా - పశుహింసాదులతో హోమము చేయదలచినచో, అతనిని జూచి ప్రాణులన్నియును ఈ మూర్ఖుడు తన ప్రాణములను రక్షించుకొనుటకై నిర్దయుడై మనుష్యులను తప్పక చంపివేయును అని భావించి, భయపడును.

అందువలన ధర్మజ్ఞుడు ప్రతిదినము తమ ప్రారబ్ధము ద్వారా లభించిన ముని జనోచితమైన హవిష్యాన్నము చేతనే తన నిత్యనైమిత్తిక కర్మలను చేసి, దానివలన సర్వదా సంతుష్టుడగుట యుక్తము.

అధర్మమునకు ఐదు శాఖలు గలవు. అవి విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపమ, ఛలము. ధర్మజ్ఞుడు అధర్మమునువలె వీటిని గూడ త్యజింపవలెను.

ధర్మబుద్ధితో చేసినను, తన ధర్మమునకు ముప్పు కలిగించు కార్యము విధర్మము అనబడును. ఇతరుల ద్వారా ఇతరులకొరకు ఉపదేశింపబడిన ధర్మమును పరధర్మము అందురు. పాఖండత్వము, దంభము అను వాటినే ఉపధర్మము లేదా ఉపమ అని యందురు. శాస్త్రవచనమునకు మరొకవిధముగా అర్థము చెప్పుటను ఛలము అని యందురు.

మనుష్యుడు తన ఆశ్రమమునకు విరుద్ధముగా తన ఇష్టప్రకారము చేయుదానిని ధర్మమని భావించినచో, అది అభాసము అనబడును. తమ స్వభావమునకు అనుకూలముగా చేయబడు వర్ణాశ్రమోచిత ధర్మములు శాంతిని కలిగించును. అందువలన అవి ఆదరణీయములు అని గ్రహింపవలెను.

ధర్మాత్ముడు నిర్ధనుడైనను ధర్మముకొరకై లేక శరీరపోషణమునకై ధనమును సంపాదించుటకై ఎక్కువగా ఆరాటపడరాదు. ఏలయన, అజగరమువలె ఎట్టి ప్రయత్నమును  చేయని నివృత్తి పరాయణుడైన మానవునకు ఆ నివృత్తి మార్గమే అతని జీవిత పోషణమునకు తోడ్పడును.

ఆత్మారాముడై నష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము, పెక్కు కోరికలతో లోభియై  ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు.

కాళ్ళకు పాదరక్షలను ధరించి నడచు వానికి కంకరరాళ్ళవలన, ముండ్లవలన ఎట్టి భయమూ ఉండదు. అట్లే సంతుష్టమనస్కుడైన వానికి సర్వదా అన్ని చోట్ల, సుఖమే యుండును.

ధర్మరాజా! ఒకవేళ అన్నము లభించనిచో, మానవుడు కేవలము జలపానముచే సంతుష్టుడై జీవితమును గడుపవచ్చును. కాని, రసనేంద్రియ, జననేంద్రియ సుఖముల కొరకు ఆరాటపడువానికి ఇంటికి కాపలాకాయు కుక్కవంటి గతి పట్టును.

బ్రాహ్మణుడు అసంతుష్టుడై ఇంద్రియ సుఖలౌల్యము వలన తన తేజస్సును, విద్యను, తపస్సును, యశస్సును కోల్ఫోవును. అతని వివేకము గూడా నశించును.

భోజనము చేయుటవలన ఆకలి చల్లారును. నీటిని త్రాగుటవలన దాహము శాంతించును. తన అభిలాష నెరవేరిన పిదప కోపముగూడ శాంతించును. కాని భూమండలములో దశదిశలను జయించి సుఖించినప్పటికిని మానవుని లోభము తీరిపోదు.


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము.. గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము... తెలుగు తాత్పర్యము .. 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక / సేకరణ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గారు .  (2) 
ఓం నమో భగవతే వాసుదేవాయ


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
మహారాజా! పెక్కు విషయములను తెలిసినవారు విద్వత్సభలయందు సభాపతులుగ యుండు విద్వాంసులు చక్కగా సకల సందేహములకు సమాధానములను  ఇచ్చి, శాస్త్రార్థములను చక్కగా వివరింపగలరు. కాని, అట్టి విద్వాంసులు గొప్ప గొప్ప పండితులుకూడా తమలోగల అసంతృప్తి కారణముగా పతనమగుచుందురు.

ధర్మరాజా! సంకల్పములను పరిత్యజించుట వలన క్రోధమును జయింపవలెను. సాంసారికులు అర్థము అను దానిని అనర్థముగా భావించుట ద్వారా లోభమును నశింపజేయవలెను.  తత్త్వ విచారమువలన భయమును  జయింపవలెను.

అధ్యాత్మవిద్యవలన శోక మోహముల పైనను, సాధుపురుషులను సేవించుటవలన దంభము మీదను, మౌనము ద్వారా యోగమునందలి విఘ్నముల పైనను, శరీరము, ప్రాణములు మొదలగు వానిని నిశ్చేష్టములుగా చేయుటవలన హింసమీదను విజయమును సాధింపవలెను.

ఆధిభౌతిక దుఃఖములను దయచూపుటవలనను, ఆధిదైవిక వేదనలను సమాధిద్వారా జయింపవలెను. ఆధ్యాత్మిక దుఃఖములను యోగబలముతో దూరము చేయవలెను. అట్లే నిద్రను సాత్త్విక భోజనము వలన, సత్స్థానము, సత్సాంగత్యము మొదలగు వాటిని సేవించుటవలన జయింపవలెను.


రజస్తమోగుణములను సత్త్వగుణముద్వారాను, సత్త్వగుణమును ఉపరతి ద్వారాను జయింపవలెను. గురుదేవునియందుగల భక్తివలన సాధకుడు ఈ దోషములు అన్నింటి పైనను సులభముగా విజయములను పొందగలడు.

హృదయమునందు జ్ఞానమనెడి దీపమును వెలిగించు గురుదేవుడు సాక్షాత్తుగ భగవంతుడే. అట్టి గురువును సామాన్య మానవునిగా భావించు బుద్ధిహీనుడు చేయు శాస్త్రశ్రవణము అంతయును గజస్నానమువలె వ్యర్థమగును.

ప్రకృతి, పురుషులకు అధీశ్వరుడైన భగవానుని పాదాబ్జములను మహాయోగీశ్వరులు తమ హృదయములయందు ధ్యానించుచుందురు. అట్టి భగవంతుని ప్రతిరూపమే గురుదేవుడు. మానవులు భ్రమకారణముగా అట్టి గురుదేవుని సామాన్య మానవునిగా భావింతురు.

మానవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లనెడి ఆరు శత్రువులపై విజయమును సాధించుటయే. లేదా ఐదు ఇంద్రియములు, ఒక మనస్సును వశపరచుకొనుటయే శాస్త్రములలో ఆదేశింపబడిన నియమముల సారాంశముగ తెలియవలెను. ఈ నియమములను పాటించినప్పటికిని భగవంతునిపై ధ్యానము కుదురుకొననిచో, అతనికి కేవలము శ్రమయే మిగులును.

వ్యవసాయము, వ్యాపారము మొదలగు కర్మలు యోగసాధనఫలమైన భగవత్ప్రాప్తిని లేదా, ముక్తిని కలిగింపజాలవు. అట్లే అరిషడ్వర్గమును జయించనివాడు చేసిన శ్రౌతస్మార్తకర్మలు గూడ శుభ ప్రదములు కానేరవు. పైగా అవి విరుద్ధఫలములను ఇచ్చును.


మనస్సుపై విజయమును సాధించుటకు ప్రయత్నము చేయు పురుషుడు ఆసక్తులను, పరిగ్రహమును త్యజించి సన్న్యాసమును స్వీకరింపవలెను. ఏకాంతముగా ఒంటరిగనే ఉండవలెను. భిక్షావృత్తిద్వారా శరీర పోషణమునకు కావలసినంత స్వల్పమైన, పరిమితమైన భోజనము చేయవలెను.



🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము.. గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము... తెలుగు తాత్పర్యము .. 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక / సేకరణ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గారు .  (3) 
ఓం నమో భగవతే వాసుదేవాయ


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ధర్మరాజా! సాధకుడు పవిత్రమైన, సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై నిటారుగా, నిశ్చలముగా, సుఖముగా కూర్చొనవలెను. పిదప ఓంకారమును జపింపవలెను.

మనస్సుసంకల్ప వికల్పములను విడిచిపెట్టనంత వరకు సాధకుడు తననాసికాగ్రమున దృష్టిని నిలుపవలెను. పిమ్మట పూరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమింపవలెను. (గాలిని నిండుగా తీసికొనుట పూరకము. నింపి కొంత సేపు నిలిపి ఉంచుట కుంభకము. బయటకు వదలుట రేచకము)

కామవాసనలచే కొట్టబడి, అటునిటు పరుగులు దీయుచున్న చిత్తమును విద్వాంసులు మఱలవెనుకకు మరల్చి, మెల్లమెల్లగా హృదయము నందు నిలుపవలెను.

సాధకుడు ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేసినచో, ఇంధనము లేని అగ్నివలె అతని చిత్తము స్వల్పకాలములోనే ప్రశాంతమగును.

ఈ విధముగా కామవాసనల తాకిడిని నిరోధించి నప్పుడు, అతని వృత్తులు అన్నియును శాంతించును. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందముతో మునిగిపోవును. మరల ఆ వృత్తులు ఎన్నడును తలయెత్తవు.

ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమమును పరిత్యజించి, సన్న్యాసమును స్వీకరించినవాడు తిరిగి గృహస్దాశ్రమమును స్వీకరించినచో, వాడు తాను వమనమును (వాంతిని) చేసికొనిన ఆహారమును, మరల భుజించినట్టీ కుక్కతో సమానుడగును.

తన శరీరమును అనాత్మయనియు, మృత్యుగ్రస్తమై, మలము, క్రిములు, బూడిదకు నిలయమని భావించినవాడు, తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో, నిజముగా అతడు మూఢుడే.

కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామములో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్న్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెచ్చెదరు. వారు ఆయా ఆశ్రమములలో ఉన్నట్లు కపట నాటకమును ఆడుచున్నవారగుదురు. కావున, భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలిచూపి, వారిని ఉపేక్షింపవలెను.

ఆత్మజ్ఞానమును సాధించినవానికి అంతఃకరణము నిర్మలమగును. అట్టి జ్ఞానికి దేహాభిమానము ఉండదు. కావున, అట్టి జ్ఞానియైనవాడు తిరిగి ఇంద్రియలౌల్యము నందుగాని, దేహాసక్తియందుగాని ఏల చిక్కుకొనును?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము.. గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము... తెలుగు తాత్పర్యము .. 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక / సేకరణ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గారు .  (4) 
ఓం నమో భగవతే వాసుదేవాయ


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పితృయానము, దేవయానము అను ఈ రెండును వేదోక్త మార్గములే. శాస్త్రీయ దృష్టితో వీటి తత్త్వమును ఎరిగినవాడు శరీరముతో ఉన్నను మోహితుడుగాడు.

జన్మను ధరించునట్టి శరీరమునకు పూర్వమున కారణరూపముతోడను, అంతమైన మీదటకూడా అవనిరూపముతోడను, ఆత్మ స్వయముగా విరాజిల్లుచుండును. ఇది భోగ రూపమున వెలుపలను ఉండును. ఇది ఉచ్చ, నీచజన్మలు కలిగియుండును. జ్ఞానము, జ్ఞేయము, వాణి, వాచ్యము, అంధకారము, ప్రకాశము మొదలగువాటి రూపములో లభించునది అంతయును ఈ ఆత్మయే.

అద్దము మొదలగు వాటిలో కనబడు ప్రతి బింబమును యుక్తి యుక్తముగా విచారించినచో, అది వాస్తవము కాదు. ఐనను అది వస్తువు యొక్క రూపములో కనబడును. అట్లే ఇంద్రియముల ద్వారా గోచరించు దృశ్యపదార్థము లన్నియూ మాయద్వారా కల్పితములు. అవి సత్యములు కావు.  కాని, సత్యమువలెనే ప్రతీతమగుచుండును.

ఈ విధముగా మాయయొక్క కార్యమగుటవలన వాస్తవమునకు ఇదంతా మిథ్యయే. పృథ్వి మొదలగు పంచమహాభూతములు మాయాకార్యములు. విషయభోగములు, పంచతన్మాత్రలు ఇవన్నియూ మాయయే. నీడకూడా మిథ్యయే. వాస్తవికదృష్టితో చూచినప్పుడు పంచభూతముల సంఘాతమగు దేహము, వాటి వికారము, పరిణామము ఇవన్నియు మాయా కార్యములగుట వలన మిథ్య మాత్రమే. అనగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య అను సిద్ధాంతమును అనుసరించి తెలియవలెను.

పంచమహా భూతములు అను ఈ రెండును ఒకటియే. ఇందులో స్థూల పంచమహాభూతములు  అవయవి అనబడును. సూక్ష్మ భూతముల తన్మాత్రలు అవయవములు అనబడును. సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడు అవయవములు లేకుండా అవయవి యొక్క అస్తిత్వము సిద్ధింపదు. చివరగా అవయవి లేనప్పుడు అవయవముల యొక్క అస్తిత్వము చెల్లదు.

వాస్తవమునకు పరమాత్మ సత్తాయే సమస్త ప్రాణులలో, పదార్థములలో నిండియుండును. మాయచే నిర్మింపబడిన వస్తువులన్నింటిలో కనిపించే నానాత్వము యొక్క కల్పనకు అజ్ఞానమే ముఖ్యకారణము. స్వప్నమునందు వ్యక్తి వివిధములగు దృశ్యములను గాంచును. ఆ స్వప్నమునందే అతడు ఒకసారి జాగ్రద్దశను అనుభవించును. మరియొకసారి స్వప్నమును గాంచినట్లు, వేరొకసారి గాఢనిద్రలో మునిగినట్లు అనుభవించును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రాంతి కలుగును. అట్లే స్వప్నమునుండి మేల్కొనిన పిదప జాగ్రద్దశలో అదంతా మిథ్య, అసత్యము అనే అనుభవము కలుగుచుండును. ఇదేవిధముగా మాయచే నిర్మింపబడిన ఈ జగత్తు అసత్యమే  ఐనప్పటికినీ, పరమాత్మసత్తా ఇందుకు ఆధారమగుటచే సత్యమను భ్రాంతి కలుగుచుండును. అజ్ఞానము ఉండునంతవరకు శాస్త్రముల యొక్క విధినిషేధముల వాక్యములు వర్తించును. తత్త్వజ్ఞానము కలిగినమీదట పరమాత్మ సత్తా ఒక్కటే మిగిలియుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము.. గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము... తెలుగు తాత్పర్యము .. 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక / సేకరణ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గారు .  (5) 
ఓం నమో భగవతే వాసుదేవాయ


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క మూడు విధములైన అద్వైతములు గోచరించును. అవి జాగ్రత్స్వప్నసుషుప్తులు, మరియు ద్రష్టదర్శన దృశ్యములు భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము మూడు రకములు - అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము.


వస్త్రము దారములకంటె వేరుగాదు. అట్లే కార్యము గూడ కారణముకంటె వేరుగాదు. ఈ భేదభావము వాస్తవముగూడ కాదు. అనగా - కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండింటియొక్క ఏకత్వభావనయే భావాద్వైతము. ఈ విధముగా అన్నిటి యందును ఏకత్వము దర్శించుటయే భావాద్వైతము.

హరిరేవ జగత్ జగదేవ హరిః హరితో జగతో న హి భిన్నతనుః|
ఇతి యస్య మతిః పరమార్థగతిః స సరో భవసాగరముత్తరతి॥ (శ్రీమధుసూదన సరస్వతీస్వామి)

ధర్మరాజా! మనోవాక్కాయములచే చేయబడు కర్మలన్నియును సాక్షాత్తుగా పరమాత్మకొరకే, పరమాత్మద్వారా జరుగుచున్నవనెడు భావముతో సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పణము చేయుట క్రియాద్వైతము అనబడును.


భార్యాపుత్రులు మొదలగు బంధువులు, అట్లే ఇతర ప్రాణులు అన్నింటి యొక్కయు, మరియు తన స్వార్థ భోగములు ఒకటియే అని భావించుట - అనగా స్వ, పర అను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడును.


రాజా! శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధముగానట్టి ద్రవ్యమును ఏ సమయమునందు, ఏ ఉపాయముద్వారా, ఏ వ్యక్తికొరకు, ఎవరిద్వారా తీసికొసవలయునో, అట్టి ద్రవ్యమును, అట్లే తీసికొని, తద్ద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయును. ఇది కేవలము ఆపత్కాలమునందు తప్ప మరొకవిధముగా, మరెప్పుడునూ చేయకూడదు.


ధర్మరాజా! భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను, ఇతర స్వధర్మములను తమ గృహమునందే యుండి అనుష్ఠించినచో, శ్రీహరియొక్క పరమపదమును పొందగలడు.


మహారాజా! నీవు నీ స్వామియైన శ్రీకృష్ణభగవానుని కృపచే, సహాయముచే ఎవ్వరికిని దాట శక్యముగాని ఆపదనుండి గట్టెక్కితివి. ఆ స్వామి పాదపద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి, రాజసూయము మొదలగు గొప్పయాగములను ఆచరించితివి. ఇదేవిధముగా అతని  కృపచే ఇతర జనులందరు సంసారసాగరమునుండి తరించెదరు.


మునుపటి మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హణుడు అను పేరుగల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మాననీయుడను.

నా సౌందర్యము, సౌకుమార్యము, మధురభాషణము అపూర్వములు. నా శరీరమునుండి వెలువడు పరిమళము మిక్కిలి మనోజ్ఞము. స్త్రీలు నన్ను మిగుల ప్రేమించుటచే నేను వారి వ్యామోహములో పడి విషయలంపటుడనైతిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319



17.7.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


నారద ఉవాచ

15.1 (ప్రథమ శ్లోకము)

కర్మనిష్ఠా ద్విజాః కేచిత్తపోనిష్ఠా నృపాపరే|

స్వాధ్యాయేఽన్యే ప్రవచనే యే కేచిజ్జ్ఞానయోగయోః॥6246॥

నారదుడు వచించెను - ధర్మరాజా! బ్రాహ్మణులలో కొందరు యజ్ఞాది కర్మలయందును, మరికొందరు తపశ్చర్యలయందును,ఇంకను కొందరు స్వాధ్యాయ ప్రవచనములయందును, మరికొందరు ఆత్మజ్ఞాన ప్రాప్తియందును, ఇంకను కొందరు యోగమునందును నిష్ఠను కలిగియుందురు.

15.2 (రెండవ శ్లోకము)

జ్ఞాననిష్ఠాయ దేయాని కవ్యాన్యానంత్యమిచ్ఛతా|

దైవే చ తదభావే స్యాదితరేభ్యో యథార్హతః॥6247॥

గృహస్థులు తమ కర్మలద్వారా అక్షయ ఫలములను పొందుటకై శ్రాద్ధము, లేక దేవపూజా సమయమునందు జ్ఞాననిష్ఠగల పురుషునకు హవ్య-కవ్యములను దానము చేయవలెను. అట్టి పురుషుడు దొరకనిచో, ఇతరులకు అనగా - యోగి, ప్రవచనము చేయువాడు మొదలగువారికి యథా యోగ్యముగ యథాక్రమములో దానము చేయవలెను.

15.3 (మూడవ శ్లోకము)

ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైకముభయత్ర వా|

భోజయేత్సుసమృద్ధోఽపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరమ్॥6248॥

15.4 (నాలుగవ శ్లోకము)

దేశకాలోచితశ్రద్ధా ద్రవ్యపాత్రార్హణాని చ|

సమ్యగ్భవంతి నైతాని విస్తరాత్స్వజనార్పణాత్॥6249॥

దేవకార్యమునందు ఇద్దరికి, పితృకార్యమునందు ముగ్గురుకి లేదా, రెండు కార్యములయందు ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను. ఎంతటి ధనవంతుడైనను శ్రాద్ధకర్మయందు భోక్తల సంఖ్యలను పెంచరాదు. ఎందులకనగా, తన బంధువులను, స్వజనులను భుజింపజేసి శ్రాద్ధ కర్మను విస్తారమొనర్చుట వలన దేశకాలోచితమైన శ్రద్ధ, పదార్థములు, పాత్రసామానులు, పూజా ద్రవ్యములు సరిగా సమకూర్ప లేక పోవచ్చును.

15.5 (ఐదవ శ్లోకము)

దేశే కాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతమ్|

శ్రద్ధయా విధివత్పాత్రే న్యస్తం కామధుగక్షయమ్॥6250॥

యోగ్యమగు దేశమునందు, కాలమునందు లభించెడు ఋషి, మునులు భుజించునట్టి నీవార, వ్రీహి మున్నగు బియ్యముతో వండిన పవిత్రమగు హవిష్యాన్నమును భగవంతునకు నివేదించి, శ్రద్ధతో విధ్యుక్తముగ యోగ్యుడైన బ్రాహ్మణుని భుజింపజేయవలెను. అట్లు చేయుటవలన సమస్తమైన కోరికలు సంపూర్ణముగా, అక్షయముగా సిద్ధించును.

15.6 (ఆరవ శ్లోకము)

దేవర్షిపితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ|

అన్నం సంవిభజన్ పశ్యేత్సర్వం తత్పురుషాత్మకమ్॥6251॥

గృహస్థుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర ప్రాణులకు, తనకు, తనవారికి గూడ అన్నమును విభజించి, సమర్ఫించు సమయమున వారందరిని పరమాత్మస్వరూపులుగ దర్శింపలెను.

15.7 (ఏడవ శ్లోకము)

న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ధర్మతత్త్వవిత్|

మున్యన్నైః స్యాత్పరా ప్రీతిర్యథా న పశుహింసయా॥6252॥

ధర్మము యొక్క మర్మమును ఎరిగిన పురుషుడు శ్రాద్ధకర్మయందు మాంసమును అర్పింపరాదు. తానును మాంసాహారమును భుజింపరాదు. ఏలయన ఇతరులు ఋషులు, మునులు యోగ్యమైన హవిష్యాన్నముచే తృప్తులగుదురుగాని, పశుహింసచే తృప్తులుగారు.

15.8 (ఎనిమిదవ శ్లోకము)

నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్ఛతామ్|

న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః॥6253॥

స్వద్ధర్మమును పాటించుటకు అభిలాషగలవారు ఏ ప్రాణికిని మనస్సుచే, వాక్కుచే, శరీరముచే ఏ విధముగను కష్టమును కలిగింపరాదు. అంతకంటెను ఉత్తమమైన ధర్మము మరియొకటి లేదు.

15.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏకే కర్మమయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాః|

ఆత్మసంయమనేఽనీహా జుహ్వతి జ్ఞానదీపితే॥6254॥

యజ్ఞతత్త్వమును ఎరిగిన కొందరు జ్ఞానులు తమ జ్ఞానము ద్వారా ప్రజ్వలితమైన ఆత్మ సంయమరూప- అగ్నియందు కర్మమయ యజ్ఞములను హవనము చేయుదురు. వారు బాహ్యకర్మకలాపములను విరమించెదరు (మానివేసెదరు).

15.10 (పదియవ శ్లోకము)

ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి|

ఏష మాకరుణో హన్యాదతజ్జ్ఞో హ్యసుతృప్ ధ్రువమ్॥6255॥

ఎవడైనను ద్రవ్య యజ్ఞముల ద్వారా అనగా - పశుహింసాదులతో హోమము చేయదలచినచో, అతనిని జూచి ప్రాణులన్నియును ఈ మూర్ఖుడు తన ప్రాణములను రక్షించుకొనుటకై నిర్దయుడై మనుష్యులను తప్పక చంపివేయును అని భావించి, భయపడును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

15.11 (పదకొండవ శ్లోకము)

తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్|

సంతుష్టోఽహరహః కుర్యాన్నిత్యనైమిత్తికీః క్రియాః॥6256॥

అందువలన ధర్మజ్ఞుడు ప్రతిదినము తమ ప్రారబ్ధము ద్వారా లభించిన ముని జనోచితమైన హవిష్యాన్నము చేతనే తన నిత్యనైమిత్తిక కర్మలను చేసి, దానివలన సర్వదా సంతుష్టుడగుట యుక్తము.

15.12 (పండ్రెండవ శ్లోకము)

విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమా ఛలః|

అధర్మశాఖాః పంచేమా ధర్మజ్ఞోఽధర్మవత్త్యజేత్॥6257॥

అధర్మమునకు ఐదు శాఖలు గలవు. అవి విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపమ, ఛలము. ధర్మజ్ఞుడు అధర్మమునువలె వీటిని గూడ త్యజింపవలెను.

15.13 (పదమూడవ శ్లోకము)

ధర్మబాధో విధర్మః స్యాత్పరధర్మోఽన్యచోదితః|

ఉపధర్మస్తు పాఖండో దంభో వా శబ్దభిచ్ఛలః॥6258॥

ధర్మబుద్ధితో చేసినను, తన ధర్మమునకు ముప్పు కలిగించు కార్యము విధర్మము అనబడును. ఇతరుల ద్వారా ఇతరులకొరకు ఉపదేశింపబడిన ధర్మమును పరధర్మము అందురు. పాఖండత్వము, దంభము అను వాటినే ఉపధర్మము లేదా ఉపమ అని యందురు. శాస్త్రవచనమునకు మరొకవిధముగా అర్థము చెప్పుటను ఛలము అని యందురు.

15.14 (పదునాలుగవ శ్లోకము)

యస్త్విచ్ఛయా కృతః పుంభిరాభాసో హ్యాశ్రమాత్పృథక్|

స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే॥6259॥

మనుష్యుడు తన ఆశ్రమమునకు విరుద్ధముగా తన ఇష్టప్రకారము చేయుదానిని ధర్మమని భావించినచో, అది అభాసము అనబడును. తమ స్వభావమునకు అనుకూలముగా చేయబడు వర్ణాశ్రమోచిత ధర్మములు శాంతిని కలిగించును. అందువలన అవి ఆదరణీయములు అని గ్రహింపవలెను.

15.15 (పదునైదవ శ్లోకము)

ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాధనో ధనమ్|

అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా॥6260॥

ధర్మాత్ముడు నిర్ధనుడైనను ధర్మముకొరకై లేక శరీరపోషణమునకై ధనమును సంపాదించుటకై ఎక్కువగా ఆరాటపడరాదు. ఏలయన, అజగరమువలె ఎట్టి ప్రయత్నమును  చేయని నివృత్తి పరాయణుడైన మానవునకు ఆ నివృత్తి మార్గమే అతని జీవిత పోషణమునకు తోడ్పడును.

15.16 (పదునారవ శ్లోకము)

సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖమ్|

కుతస్తత్కామలోభేన ధావతోఽర్థేహయా దిశః॥6261॥

ఆత్మారాముడై నష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము, పెక్కు కోరికలతో లోభియై  ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు.

15.17 (పదునేడవ శ్లోకము)

సదా సంతుష్టమనసః సర్వాః సుఖమయా దిశః|

శర్కరాకంటకాదిభ్యో యథోపానత్పదః శివమ్॥6262॥

కాళ్ళకు పాదరక్షలను ధరించి నడచు వానికి కంకరరాళ్ళవలన, ముండ్లవలన ఎట్టి భయమూ ఉండదు. అట్లే సంతుష్టమనస్కుడైన వానికి సర్వదా అన్ని చోట్ల, సుఖమే యుండును.

15.18 (పదునెనిమిదవ శ్లోకము)

సంతుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారిణా|

ఔపస్థ్యజైహ్వ్యకార్పణ్యాద్గృహపాలాయతే జనః॥6263॥

ధర్మరాజా! ఒకవేళ అన్నము లభించనిచో, మానవుడు కేవలము జలపానముచే సంతుష్టుడై జీవితమును గడుపవచ్చును. కాని, రసనేంద్రియ, జననేంద్రియ సుఖముల కొరకు ఆరాటపడువానికి ఇంటికి కాపలాకాయు కుక్కవంటి గతి పట్టును.

15.19 (పందొమ్మిదవ శ్లోకము)

అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపో యశః|

స్రవంతీంద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే॥6264॥

బ్రాహ్మణుడు అసంతుష్టుడై ఇంద్రియ సుఖలౌల్యము వలన తన తేజస్సును, విద్యను, తపస్సును, యశస్సును కోల్ఫోవును. అతని వివేకము గూడా నశించును.

15.20 (ఇరువదియవ శ్లోకము)

కామస్యాంతం చ క్షుత్తృడ్భ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్|

జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః॥6265॥

భోజనము చేయుటవలన ఆకలి చల్లారును. నీటిని త్రాగుటవలన దాహము శాంతించును. తన అభిలాష నెరవేరిన పిదప కోపముగూడ శాంతించును. కాని భూమండలములో దశదిశలను జయించి సుఖించినప్పటికిని మానవుని లోభము తీరిపోదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.7.2020   సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము


గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము


ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


పండితా బహవో రాజన్ బహుజ్ఞాః సంశయచ్ఛిదః|


సదసస్పతయోఽప్యేకే అసంతోషాత్పతంత్యధః॥6266॥


మహారాజా! పెక్కు విషయములను తెలిసినవారు విద్వత్సభలయందు సభాపతులుగ యుండు విద్వాంసులు చక్కగా సకల సందేహములకు సమాధానములను  ఇచ్చి, శాస్త్రార్థములను చక్కగా వివరింపగలరు. కాని, అట్టి విద్వాంసులు గొప్ప గొప్ప పండితులుకూడా తమలోగల అసంతృప్తి కారణముగా పతనమగుచుందురు.


15.22 (ఇరువది రెండవ శ్లోకము)


అసంకల్పాజ్జయేత్కామం క్రోధం కామవివర్జనాత్|


అర్థానర్థేక్షయా లోభం భయం తత్త్వావమర్శనాత్॥6267॥


ధర్మరాజా! సంకల్పములను పరిత్యజించుట వలన క్రోధమును జయింపవలెను. సాంసారికులు అర్థము అను దానిని అనర్థముగా భావించుట ద్వారా లోభమును నశింపజేయవలెను.  తత్త్వ విచారమువలన భయమును  జయింపవలెను.


15.23 (ఇరువది మూడవ శ్లోకము)


ఆన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయా|


యోగాంతరాయాన్ మౌనేన హింసాం కాయాద్యనీహయా॥6268॥


అధ్యాత్మవిద్యవలన శోక మోహముల పైనను, సాధుపురుషులను సేవించుటవలన దంభము మీదను, మౌనము ద్వారా యోగమునందలి విఘ్నముల పైనను, శరీరము, ప్రాణములు మొదలగు వానిని నిశ్చేష్టములుగా చేయుటవలన హింసమీదను విజయమును సాధింపవలెను.


15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)


కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా|


ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషేవయా॥6269॥


ఆధిభౌతిక దుఃఖములను దయచూపుటవలనను, ఆధిదైవిక వేదనలను సమాధిద్వారా జయింపవలెను. ఆధ్యాత్మిక దుఃఖములను యోగబలముతో దూరము చేయవలెను. అట్లే నిద్రను సాత్త్విక భోజనము వలన, సత్స్థానము, సత్సాంగత్యము మొదలగు వాటిని సేవించుటవలన జయింపవలెను.


15.25 (ఇరువది ఐదవ శ్లోకము)


రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ|


ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్॥6270॥


రజస్తమోగుణములను సత్త్వగుణముద్వారాను, సత్త్వగుణమును ఉపరతి ద్వారాను జయింపవలెను. గురుదేవునియందుగల భక్తివలన సాధకుడు ఈ దోషములు అన్నింటి పైనను సులభముగా విజయములను పొందగలడు.


15.26 (ఇరువది ఆరవ శ్లోకము)


యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ|


మర్త్యాసద్ధీః శ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్॥6271॥


హృదయమునందు జ్ఞానమనెడి దీపమును వెలిగించు గురుదేవుడు సాక్షాత్తుగ భగవంతుడే. అట్టి గురువును సామాన్య మానవునిగా భావించు బుద్ధిహీనుడు చేయు శాస్త్రశ్రవణము అంతయును గజస్నానమువలె వ్యర్థమగును.


15.27 (ఇరువది ఏడవ శ్లోకము)


ఏష వై భగవాన్ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః|


యోగేశ్వరైర్విమృగ్యాంఘ్రిర్లోకో యం మన్యతే నరం॥6272॥


ప్రకృతి, పురుషులకు అధీశ్వరుడైన భగవానుని పాదాబ్జములను మహాయోగీశ్వరులు తమ హృదయములయందు ధ్యానించుచుందురు. అట్టి భగవంతుని ప్రతిరూపమే గురుదేవుడు. మానవులు భ్రమకారణముగా అట్టి గురుదేవుని సామాన్య మానవునిగా భావింతురు.


15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)


షడ్వర్గసంయమైకాంతాః సర్వా నియమచోదనాః|


తదంతా యది నో యోగానావహేయుః శ్రమావహాః॥6273॥


మానవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లనెడి ఆరు శత్రువులపై విజయమును సాధించుటయే. లేదా ఐదు ఇంద్రియములు, ఒక మనస్సును వశపరచుకొనుటయే శాస్త్రములలో ఆదేశింపబడిన నియమముల సారాంశముగ తెలియవలెను. ఈ నియమములను పాటించినప్పటికిని భగవంతునిపై ధ్యానము కుదురుకొననిచో, అతనికి కేవలము శ్రమయే మిగులును.


15.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)


యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి|


అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథాసతః॥6274॥


వ్యవసాయము, వ్యాపారము మొదలగు కర్మలు యోగసాధనఫలమైన భగవత్ప్రాప్తిని లేదా, ముక్తిని కలిగింపజాలవు. అట్లే అరిషడ్వర్గమును జయించనివాడు చేసిన శ్రౌతస్మార్తకర్మలు గూడ శుభ ప్రదములు కానేరవు. పైగా అవి విరుద్ధఫలములను ఇచ్చును.


15.30 (ముప్పదియవ  శ్లోకము)


యశ్చిత్తవిజయే యత్తః స్యాన్నిఃసంగోఽపరిగ్రహః|


ఏకో వివిక్తశరణో భిక్షుర్భిక్షామితాశనః॥6275॥


మనస్సుపై విజయమును సాధించుటకు ప్రయత్నము చేయు పురుషుడు ఆసక్తులను, పరిగ్రహమును త్యజించి సన్న్యాసమును స్వీకరింపవలెను. ఏకాంతముగా ఒంటరిగనే ఉండవలెను. భిక్షావృత్తిద్వారా శరీర పోషణమునకు కావలసినంత స్వల్పమైన, పరిమితమైన భోజనము చేయవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)



🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

19.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః|

స్థిరం సమం సుఖం తస్మిన్నాసీతర్జ్వంగ ఓమితి॥6276॥

ధర్మరాజా! సాధకుడు పవిత్రమైన, సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై నిటారుగా, నిశ్చలముగా, సుఖముగా కూర్చొనవలెను. పిదప ఓంకారమును జపింపవలెను.

15.32 (ముప్పది రెండవ శ్లోకము)

ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్పూరకుంభకరేచకైః|

యావన్మనస్త్యజేత్కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః॥6277॥

మనస్సుసంకల్ప వికల్పములను విడిచిపెట్టనంత వరకు సాధకుడు తననాసికాగ్రమున దృష్టిని నిలుపవలెను. పిమ్మట పూరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమింపవలెను. (గాలిని నిండుగా తీసికొనుట పూరకము. నింపి కొంత సేపు నిలిపి ఉంచుట కుంభకము. బయటకు వదలుట రేచకము)

15.33 (ముప్పది మూడవ శ్లోకము)

యతో యతో నిఃసరతి మనః కామహతం భ్రమత్|

తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుధః॥6278॥

కామవాసనలచే కొట్టబడి, అటునిటు పరుగులు దీయుచున్న చిత్తమును విద్వాంసులు మఱలవెనుకకు మరల్చి, మెల్లమెల్లగా హృదయము నందు నిలుపవలెను.

15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః|

అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్॥6279॥

సాధకుడు ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేసినచో, ఇంధనము లేని అగ్నివలె అతని చిత్తము స్వల్పకాలములోనే ప్రశాంతమగును.

15.35 (ముప్పది ఐదవ శ్లోకము)

కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిలవృత్తి యత్|

చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్॥6280॥

ఈ విధముగా కామవాసనల తాకిడిని నిరోధించి నప్పుడు, అతని వృత్తులు అన్నియును శాంతించును. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందముతో మునిగిపోవును. మరల ఆ వృత్తులు ఎన్నడును తలయెత్తవు.

15.36 (ముప్పది ఆరవ శ్లోకము)

యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః|

యది సేవేత తాన్ భిక్షుః స వై వాంతాశ్యపత్రపః॥6281॥

ధర్మార్థకామములకు మూలమైన గృహస్థాశ్రమమును పరిత్యజించి, సన్న్యాసమును స్వీకరించినవాడు తిరిగి గృహస్దాశ్రమమును స్వీకరించినచో, వాడు తాను వమనమును (వాంతిని) చేసికొనిన ఆహారమును, మరల భుజించినట్టీ కుక్కతో సమానుడగును.

15.37 (ముప్పది ఏడవ శ్లోకము)

యైః స్వదేహః స్మృతో నాత్మా మర్త్యో విట్కృమిభస్మసాత్|

త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః॥6282॥

తన శరీరమును అనాత్మయనియు, మృత్యుగ్రస్తమై, మలము, క్రిములు, బూడిదకు నిలయమని భావించినవాడు, తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో, నిజముగా అతడు మూఢుడే.

15.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి|

తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలతా॥6283॥

15.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడంబకాః|

దేవమాయావిమూఢాంస్తానుపేక్షేతానుకంపయా॥6284॥

కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామములో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్న్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెచ్చెదరు. వారు ఆయా ఆశ్రమములలో ఉన్నట్లు కపట నాటకమును ఆడుచున్నవారగుదురు. కావున, భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలిచూపి, వారిని ఉపేక్షింపవలెను.

15.48 (నలుబదియవ శ్లోకము)

ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః|

కిమిచ్ఛన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లంపటః॥6285॥

ఆత్మజ్ఞానమును సాధించినవానికి అంతఃకరణము నిర్మలమగును. అట్టి జ్ఞానికి దేహాభిమానము ఉండదు. కావున, అట్టి జ్ఞానియైనవాడు తిరిగి ఇంద్రియలౌల్యము నందుగాని, దేహాసక్తియందుగాని ఏల చిక్కుకొనును?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

20.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


15.50 (ఏబదియవ శ్లోకము)

ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః|

అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః|6295॥

15.51 (ఏబది ఒకటవ శ్లోకము)

అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః|

ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే॥6296॥

ఈ విధముగ ప్రవృత్తిపరాయణుడగు వ్యక్తి చనిపోయిన పిదప, చరు-పురోడాశాది యజ్ఞ సంబంధమైన ద్రవ్యములయొక్క సూక్ష్మభాగముచే నిర్మితమైన శరీరమును ధరించి ధూమాభిమాన దేవతలకడకు చేరుకొనును. పిమ్మట క్రమముగా రాత్రి, కృష్ణ పక్షము, దక్షిణాయనముల అభిమాన దేవతల వద్దకు వెళ్ళి, చంద్రలోకమునకు చేరును. అతని పుణ్యకార్యఫలమును అనుభవించిన పిమ్మట, అమావాస్య చంద్రునివలె క్షీణమై వర్షము ద్వారా క్రమముగ ఓషధులు, లతలు, అన్నము, వీర్యము యొక్క రూపములలో మార్పుచెంది, పితృయాన మార్గము  ద్వారా మరల ఈ జగత్తున జన్మించును.

15.52 (ఏబది రెండవ శ్లోకము)

నిషేకాదిశ్మశానాంతైః సంస్కారైః సంస్కృతో ద్విజః|

ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి॥6297॥

ఇప్పుడు నివృత్తిమార్గ పరాయణులను గూర్చి వివరింపబడును-- ధర్మరాజా! గర్భాధానమునుండి అంత్యేష్టివరకుగల సంస్కారము లన్నింటిని చక్కగా జరుపబడినవాడు ద్విజుడు అనబడును. నివృత్తిపరాయణులగు సాధకులు జ్ఞానజ్యోతితో ప్రకాశించెడు ఇంద్రియములయందు సమస్తకర్మలనెడు యజ్ఞములను హవనము చేయుదురు. అనగా వారిద్వారా చేయబడిన ఇష్టా-పూర్తములనెడు సమస్తకర్మలు భగవత్ప్రీత్యర్థముగా జరుగును.

15.53 (ఏబది మూడవ శ్లోకము)

ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః|

వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్|

ఓంకారం బిందౌ నాదే తం తం తు ప్రాణే మహత్యముమ్॥6298॥

ఇంద్రియముల సంకల్పవికల్పములను మనస్సునందు హవనము చేయుదురు. వికారములను పొందు మనస్సును మౌనమును వహించి వాక్కునందు హవనము చేసెదరు. వాక్కును అక్షరసముదాయము నందు హవనము చేయుదురు. ఇట్టి  అక్షరసముదాయమును ఓంకారమునందు హోమము చేయుదురు. ఓంకారమును, బిందువునందు, బిందువును నాదమునందు హవనము చేయుదురు. నాదమును సమిష్టిప్రాణమునందు అనగా సూత్రాత్మ - హిరణ్యగర్భుని యందు హవనము చేయుదురు. ఈ సూత్రాత్మను చిట్టచివరగా పరబ్రహ్మలో విలీనము చేయవలెను.

15.54 (ఏబది నాలుగవ శ్లోకము)

అగ్నిః సూర్యో దివా ప్రాహ్ణః శుక్లో రాకోత్తరం స్వరాట్|

విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్॥6299॥

ఇట్టి నివృత్తిపరాయణుడగు యోగి క్రమముగా అగ్ని అభిమానియగు దేవతద్వారా సూర్యుని అభిమాన దేవతను చేరి, తదుపరి పగటి దేవతను చేరును. అచటినుండి ప్రాతఃకాల అభిమాన దేవతను తర్వాత, శుక్లపక్ష అభిమాన దేవతను చేరును. పిమ్మట పూర్ణిమ అభిమాన దేవతను చేరుకుని ఉత్తరాయణ కాలాభిమాని దేవతద్వారా బ్రహ్మలోకమును చేరుకొనును. విశ్వ-తైజస-ప్రాజ్ఞులనగా జాగ్రత్ - స్వప్న - సుషుప్తి అను మూడు అవస్థలు జీవునియందు కలుగును. ఈ మూడింటికి సాక్షిగా ఉండునది ఆత్మ ఒక్కటే. ఈ మూడు అవస్థలు జీవునికి ఉపాధిగత శరీరములు అనబడును. అతడు ఈ మూడు అవస్థలను దాటి, తన సాక్షియగు ఆత్మసత్తాయందు ఐక్యమగును.

15.55 (ఏబది ఐదవ శ్లోకము)

దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః|

ఆత్మయాజ్యుపశాంతాత్మా హ్యాత్మస్థో న నివర్తతే॥6300॥

దీనిని దేవయాన మార్గమందురు. ఈ మార్గము ద్వారా వెళ్ళునట్టి ఆత్మోపాసకుడు సంసారము నుండి నివృత్తుడై క్రమముగ ఒక దేవతనుండి మరియొక దేవత కడకు వెళ్ళుచు బ్రహ్మలోకమును జేరును. అచట తన స్వరూపమునందు స్థితుడగును. ప్రవృత్తి మార్గమును అనుసరించు వానివలె అతడు మరల జనన మరణ చక్రములో పరిభ్రమింపడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

20.7.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

15.56 (ఏబది ఆరవ శ్లోకము)

య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే|

శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోఽపి న ముహ్యతి॥6301॥

పితృయానము, దేవయానము అను ఈ రెండును వేదోక్త మార్గములే. శాస్త్రీయ దృష్టితో వీటి తత్త్వమును ఎరిగినవాడు శరీరముతో ఉన్నను మోహితుడుగాడు.

15.57 (ఏబది ఏడవ శ్లోకము)

ఆదావంతే జనానాం సద్బహిరంతః పరావరమ్|

జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయమ్॥6302॥

జన్మను ధరించునట్టి శరీరమునకు పూర్వమున కారణరూపముతోడను, అంతమైన మీదటకూడా అవనిరూపముతోడను, ఆత్మ స్వయముగా విరాజిల్లుచుండును. ఇది భోగ రూపమున వెలుపలను ఉండును. ఇది ఉచ్చ, నీచజన్మలు కలిగియుండును. జ్ఞానము, జ్ఞేయము, వాణి, వాచ్యము, అంధకారము, ప్రకాశము మొదలగువాటి రూపములో లభించునది అంతయును ఈ ఆత్మయే.

15.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

ఆబాధితోఽపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః|

దుర్ఘటత్వాదైంద్రియకం తద్వదర్థవికల్పితమ్॥6303॥

అద్దము మొదలగు వాటిలో కనబడు ప్రతి బింబమును యుక్తి యుక్తముగా విచారించినచో, అది వాస్తవము కాదు. ఐనను అది వస్తువు యొక్క రూపములో కనబడును. అట్లే ఇంద్రియముల ద్వారా గోచరించు దృశ్యపదార్థము లన్నియూ మాయద్వారా కల్పితములు. అవి సత్యములు కావు.  కాని, సత్యమువలెనే ప్రతీతమగుచుండును.

15.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

క్షిత్యాదీనామిహార్థానాం ఛాయా న కతమాపి హి|

న సంఘాతో వికారోఽపి న పృథఙ్ నాన్వితో మృషా॥6304॥

ఈ విధముగా మాయయొక్క కార్యమగుటవలన వాస్తవమునకు ఇదంతా మిథ్యయే. పృథ్వి మొదలగు పంచమహాభూతములు మాయాకార్యములు. విషయభోగములు, పంచతన్మాత్రలు ఇవన్నియూ మాయయే. నీడకూడా మిథ్యయే. వాస్తవికదృష్టితో చూచినప్పుడు పంచభూతముల సంఘాతమగు దేహము, వాటి వికారము, పరిణామము ఇవన్నియు మాయా కార్యములగుట వలన మిథ్య మాత్రమే. అనగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య అను సిద్ధాంతమును అనుసరించి తెలియవలెను.

15.60 (అరువదియవ శ్లోకము)

ధాతవోఽవయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా|

న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవోఽన్తతః॥6305॥

పంచమహా భూతములు అను ఈ రెండును ఒకటియే. ఇందులో స్థూల పంచమహాభూతములు  అవయవి అనబడును. సూక్ష్మ భూతముల తన్మాత్రలు అవయవములు అనబడును. సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడు అవయవములు లేకుండా అవయవి యొక్క అస్తిత్వము సిద్ధింపదు. చివరగా అవయవి లేనప్పుడు అవయవముల యొక్క అస్తిత్వము చెల్లదు.

15.61 (అరువది ఒకటవ శ్లోకము)

స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః|

జాగ్రత్స్వాపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా॥6306॥

వాస్తవమునకు పరమాత్మ సత్తాయే సమస్త ప్రాణులలో, పదార్థములలో నిండియుండును. మాయచే నిర్మింపబడిన వస్తువులన్నింటిలో కనిపించే నానాత్వము యొక్క కల్పనకు అజ్ఞానమే ముఖ్యకారణము. స్వప్నమునందు వ్యక్తి వివిధములగు దృశ్యములను గాంచును. ఆ స్వప్నమునందే అతడు ఒకసారి జాగ్రద్దశను అనుభవించును. మరియొకసారి స్వప్నమును గాంచినట్లు, వేరొకసారి గాఢనిద్రలో మునిగినట్లు అనుభవించును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రాంతి కలుగును. అట్లే స్వప్నమునుండి మేల్కొనిన పిదప జాగ్రద్దశలో అదంతా మిథ్య, అసత్యము అనే అనుభవము కలుగుచుండును. ఇదేవిధముగా మాయచే నిర్మింపబడిన ఈ జగత్తు అసత్యమే  ఐనప్పటికినీ, పరమాత్మసత్తా ఇందుకు ఆధారమగుటచే సత్యమను భ్రాంతి కలుగుచుండును. అజ్ఞానము ఉండునంతవరకు శాస్త్రముల యొక్క విధినిషేధముల వాక్యములు వర్తించును. తత్త్వజ్ఞానము కలిగినమీదట పరమాత్మ సత్తా ఒక్కటే మిగిలియుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
21.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

15.62 (అరువది రెండవ శ్లోకము)

భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాఽఽత్మనః|

వర్తయన్ స్వానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే మునిః॥6307॥

విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క మూడు విధములైన అద్వైతములు గోచరించును. అవి జాగ్రత్స్వప్నసుషుప్తులు, మరియు ద్రష్టదర్శన దృశ్యములు భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము మూడు రకములు - అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము.

15.63 (అరువది మూడవ శ్లోకము)

కార్యకారణవస్త్వైక్యమర్శనం పటతంతువత్|

అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే॥6308॥

వస్త్రము దారములకంటె వేరుగాదు. అట్లే కార్యము గూడ కారణముకంటె వేరుగాదు. ఈ భేదభావము వాస్తవముగూడ కాదు. అనగా - కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండింటియొక్క ఏకత్వభావనయే భావాద్వైతము. ఈ విధముగా అన్నిటి యందును ఏకత్వము దర్శించుటయే భావాద్వైతము.

హరిరేవ జగత్ జగదేవ హరిః హరితో జగతో న హి భిన్నతనుః|
ఇతి యస్య మతిః పరమార్థగతిః స సరో భవసాగరముత్తరతి॥ (శ్రీమధుసూదన సరస్వతీస్వామి)

15. 64 (అరువది నాలుగవ శ్లోకము)

యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్|

మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే॥6309॥

ధర్మరాజా! మనోవాక్కాయములచే చేయబడు కర్మలన్నియును సాక్షాత్తుగా పరమాత్మకొరకే, పరమాత్మద్వారా జరుగుచున్నవనెడు భావముతో సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పణము చేయుట క్రియాద్వైతము అనబడును.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వధా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥ (గీత. 6.31)

15.65 (అరువది ఐదవ శ్లోకము)

ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్|

యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే॥6310॥

భార్యాపుత్రులు మొదలగు బంధువులు, అట్లే ఇతర ప్రాణులు అన్నింటి యొక్కయు, మరియు తన స్వార్థ భోగములు ఒకటియే అని భావించుట - అనగా స్వ, పర అను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడును.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥ (గీత. 6.32)

15.66 (అరువది ఆరవ శ్లోకము)

యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప|

స తేనేహేత కార్యాణి నరో నాన్యైరనాపది॥6311॥

రాజా! శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధముగానట్టి ద్రవ్యమును ఏ సమయమునందు, ఏ ఉపాయముద్వారా, ఏ వ్యక్తికొరకు, ఎవరిద్వారా తీసికొసవలయునో, అట్టి ద్రవ్యమును, అట్లే తీసికొని, తద్ద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయును. ఇది కేవలము ఆపత్కాలమునందు తప్ప మరొకవిధముగా, మరెప్పుడునూ చేయకూడదు.

15.67 (అరువది ఏడవ శ్లోకము)

ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానః స్వకర్మభిః|

గృహేఽప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాఙ్ నరః॥6312॥

ధర్మరాజా! భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను, ఇతర స్వధర్మములను తమ గృహమునందే యుండి అనుష్ఠించినచో, శ్రీహరియొక్క పరమపదమును పొందగలడు.

15.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)

యథా హి యూయం నృపదేవ దుస్త్యజాదాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః|

యత్పాదపంకేరుహసేవయా భవానహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్॥6313॥

మహారాజా! నీవు నీ స్వామియైన శ్రీకృష్ణభగవానుని కృపచే, సహాయముచే ఎవ్వరికిని దాట శక్యముగాని ఆపదనుండి గట్టెక్కితివి. ఆ స్వామి పాదపద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి, రాజసూయము మొదలగు గొప్పయాగములను ఆచరించితివి. ఇదేవిధముగా అతని  కృపచే ఇతర జనులందరు సంసారసాగరమునుండి తరించెదరు.

15.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)

అహం పురాభవం కశ్చిద్గంధర్వ ఉపబర్హణః|

నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః॥6314॥

మునుపటి మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హణుడు అను పేరుగల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మాననీయుడను.

15.70 (డెబ్బదియవ శ్లోకము)

రూపపేశల మాధుర్యసౌగంధ్యప్రియదర్శనః|

స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తః స్వపురులంపటః॥6315॥

నా సౌందర్యము, సౌకుమార్యము, మధురభాషణము అపూర్వములు. నా శరీరమునుండి వెలువడు పరిమళము మిక్కిలి మనోజ్ఞము. స్త్రీలు నన్ను మిగుల ప్రేమించుటచే నేను వారి వ్యామోహములో పడి విషయలంపటుడనైతిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

No comments:

Post a Comment