Thursday, 29 October 2020

నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

 ప్రాంజలి ప్రభ.... సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 

నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

22.1 నుండి 19 శ్లోకాల భావము 

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ముద్గలుని కుమారుడైన దివోదాసునకు మిత్రేయుడు అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు - అను నలుగురు సుతులు కలిగిరి. వారిలో సోమకునకు వందమంది తనయులు జన్మించిరి. ఆ నూరుగురిలో జంతుడు అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులును కలిగిరి.

ధృష్టద్యుమ్నుని తనయుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్యుని వంశమునకు చెందిన వీరు అందరును పాంచాలురు అని పిలువబడిరి. అజమీఢుని మరియొక పుత్రుడు ఋక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు తపతి అను కన్యను వివాహమాడెను. సంవరణునివలన తపతియందు కురువు అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, విషధాశ్వుడు అను నలుగురు పుత్రులు కలిగిరి.

సుధస్వుని కుమారుడు సుహోత్రుడు, అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సుతుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచరవసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను ఐదుగురు కొడుకులు కలిగిరి. వారు అందరును చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు, అతని తనూజుడు వృషభుడు.

వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు (సత్యవంతుడు). అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భమునుండి రెండు శకలములు ఉద్భవించెను. ఆ  రెండు ఖండములను తల్లి బయట పడవేసెను. జర అను రాక్షసి ఆ రెండు ముక్కలను వినోదముగా జతపరచి జీవింపుము-జీవింపుము అని పలికెను. అట్లు జతపరచబడిన ఆ శరీరము సజీవమయ్యెను. ఆ బాలకుడే జరాసందుడు. జర అను రాక్షసిచే సంధింపబడినాడు కావున, అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను.

జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి. సోమాపి తనయుడు శ్రుతశ్రవుడు. కురువు యొక్క పెద్దకుమారుడగు పరీక్షిత్తునకు ఎట్టి సంతానమూ లేకుండెను. కురువుయొక్క మూడవ కుమారుడైైన జహ్నునకు సురథుడు అనువాడు జన్మించెను. అతని సుతుడు విదూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతిని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు ఆయుతుడు.

22.11 (పదకొండవ శ్లోకము)

ఆయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథియొక్క తనయుడు ఋష్యుడు (ఋక్షుడు). ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రతీపుడు. అతని వలన దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రివలన తనకు లభించిన రాజ్యమును (రాజ్యాధికారమును) త్యజించి వనములకు వెళ్ళెను.

దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడగు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యెను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై, శాంతిని పొందును. కనుక, అతడు శంతనుడు గా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా పన్నెండు సంవత్సరములూ వానలు పడకపోవుటచే తీవ్రమైన కరవు ఏర్పడెను.

కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో  ఇట్లనిరి - "నీవు నీ అన్నయగు దేవాసి బ్రతికియుండగనే వివాహము చేసికొని, రాజ్యాధికారమును పొందితివి. కనుక నీవు పరివేత్త అనబడుదువు. 

అన్నకంటెను ముందుగా పెండ్లి చేసికొని, అగ్నికార్యములను ఆచరించినవాడు పరివేత్త అని యనబడును. ఆ స్థితిలో ఉన్న అగ్రజుడు (అన్న) పరివిత్తి అని వ్యవహరింపబడును.

కనుక నీ నగరము, రాష్ట్రము (రాజ్యము) అభివృద్ధిని పొందవలెనని భావించినచో, నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయుము. అనగా రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లొనర్చినచో, నీ రాజ్యము సుభిక్షముగా ఉండును.

బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు (వనములకు) వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కాని, శంతనునియొక్క మంత్రియైన అశ్మరావ అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేదవిరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు (దేవాపి) వైదిక సంప్రదాయమును అనుసరించి, గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందింపదొడగెను. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతట శంతనుని  రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట దేవాపి యోగసాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా, అతడు (దేవాపి) కృతయుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లికుమారుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, శలుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకలధర్మములను బాగుగా ఎఱిగినవాడు. పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞానసంపన్నుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము

భీష్ముడు వీరశిరోమణి, కురుక్షేత్ర యుద్ధమున సైన్యాధిపత్యము వహించినవాడు.

🌹🌹🌹
భీష్ముని పూర్వజన్మము భీష్ముడు పూర్వజన్నలో ప్రభాసుడు. ప్రభాసుడు అష్టవసువులలో ఎనిమిదవవాడు. అష్టవసువులు ఒకసారి వసిష్ఠుని కడకేగిరి. వసిష్ఠుని యొక్క హోమధేనువు పాలు త్రాగిన వారికి జరామరణములు ఉండవని వారికి తెలిసెను. అప్ఫుడు ప్రభాసుని భార్య ఆ ధేనువునకై ఆశపడెను. ఆమె కోరికమేరకు అష్టవసువులు ఆ ధేనువును దొంగిలించిరి. అందులకు వసిష్ఠుడు 'మీరు మనుష్యులై జన్మింపుడు' అని వారిని శపించెను. వారిలో పెద్ద తప్పు చేసినవాడు ప్రభాసుడు. కావున వసిష్ఠుడు 'నీవు మనుష్యుడవై పుట్టుటయేకాదు, సంతానము లేనివాడవు అగుదువు.  జీవితాంతము మనుష్యుడవై యుందువు'. అని ప్రభాసుని శపించెను. ఈ అష్టవసువులు శంతనుని వలన గంగాదేవియందు మానవులై జన్మించిరి. వారిలో మొదటి ఏడుగురును నరజన్మనెత్తి వెంటనే మరణించి, శాపవిముక్తి పొందిరి. ప్రభాసుడు మాత్రము భీష్మునిగా పుట్టి జీవితాంతము అనపత్యుడై (బ్రహ్మచారిగనే) ఉండెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

భీష్ముడు పరశురాముని కడ అస్త్రవిద్యలను నేర్చెను. ఒకానొక సందర్భమున భీష్ముడు తన గురువగు పరశురామునితో యుద్ధమొనర్చి, తన యుద్ధకౌశలముచే గురువునే మెప్పించెను. శంతనుని వలన దాశకన్య (సత్యవతి) యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించిరి. ( దాశకన్య - ఈమెకు మత్స్యగంధి, యోజనగంధి, సత్యవతి అను పేర్లుగలవు. ఉపరిచర వసువుయొక్క వీర్యమును చేప భక్షింపగా, ఆ మత్స్యగర్భమున జన్మించి మత్స్యగంధి యయ్యెను. ఈమె దాశరాజు పోషణలో పెరిగినందున దాశకన్యగా ప్రసిద్ధికెక్కెను) చిత్రాంగదుడు యుద్ధమున ఒక గంధర్వుని చేతిలో హతుడయ్యెను. పరాశరమహర్షి వలన ఆ దాశకన్యయందు వేదవ్యాస మహాముని శ్రీహరియంశ కలిగి కృష్ణవర్ణముతో జన్మించెను. అతడు వేదములను రక్షించి లోకప్రశస్తి గన్నవాడు. పరీక్షిన్మహారాజా! ఆ మహాత్ముని నుండియే నేను (శుకుడు) ఈ భాగవతమును అభ్యసించితిని. పూజ్యుడైన ఆ బాదరాయణుడు (వ్యాసుడు) పరమగోప్యమైన ఈ భాగవతమును తన శిష్యులైన పైలుడు మొదలగు వారికి బోధింపలేదు. తనకు పుత్రుడను, పైగా శాంతస్వభావము గలవాడను ఐన నన్ను భాగవతమును అధ్యయనము చేయుటకు అర్హునిగా భావించి, దానిని నాకు బోధించెను. కాశిరాజు కుమార్తెయైన అంబిక, అంబాలిక అను వారిని స్వయంవర మండపమునుండి బలాత్కారముగా తీసికొనివచ్చి, భీష్ముడు విచిత్రవీర్యునకు (సత్యవతి రెండవ కుమారునకు) ఇచ్చి వివాహమొనర్చెను. విచిత్రవీర్యుడు తన ఇరువురి భార్యలయందు అమితమైన ఆసక్తిగలవాడై సుఖలోలుడయ్యెను. క్రమముగా క్షయరోగమునకు లోనై మృతి చెందెను.

విచిత్రవీర్యుడు మరణించు నాటికి అతని భార్యలగు అంబిక, అంబాలిక అనువారికి సంతానము లేకుండెను. వంశాభివృద్ధికై తల్లియగు సత్యవతియొక్క ఆదేశమును అనుసరించి, వ్యాసమహర్షి తన తమ్ముని భార్యలైన అంబికయందు ధృతరాష్ట్రునకును, అంబాలికయందు పాండురాజునకును జన్మమిచ్చెను. పిమ్మట ఒక దాసియందు విదురునకు జన్మమిచ్చెన

పరీక్షిన్మహారాజా! ధృతరాష్త్రుని వలన గాంధారియందు నూరుగురు కుమారులును, దుశ్శల (దుస్సల) అను కుమార్తెయు కలిగిరి. వారిలో దుర్యోధనుడు పెద్దవాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము

'భార్యా సంగమము జరిపినచో నీవు మృతి చెందెదవు' అని పాండురాజును కిందమహాముని శపించెను. అందువలన ఆయన పెద్దభార్యయగు కుంతియందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు (ధర్మరాజు), వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు జన్మించిరి. అట్లే పాండురాజుయొక్క రెండవ భార్యయైన మాద్రియందు అశ్వినీదేవతల (అశ్వినీకుమారుల) వలన నకుల సహదేవులు పుట్టిరి. వీరు అందఱును మహారథులు. ఈ పంచపాండవులవలన ద్రౌపదియందు ఐదుగురు సుతులు కలిగిరి. వీరందరును నీకు (పరీక్షిన్మహారాజునకు) పెదతండ్రులు. రాజా! యుధిష్ఠిరునివలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, అర్జునుని వలన శ్రుతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శ్రుతకర్మ అనువారు ద్రౌపదియందు జన్మించిరి. ఇంకను ధర్మరాజునకు పౌరవి అను నామెయందు దేవకుడు, భీమునకు హిడింబియందు ఘటోత్కచుడు, కాళి అను నామెయందు సర్వగతుడు అనువారు జన్మించిరి. అట్లే సహదేవుని వలన పర్వతుని కూతురైన విజయ అను నామెయందు సుహోత్రుడు పుట్టెను.

నకులుని వలన కరేణుమతి అనునామె యందు నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వలన నాగకన్యయైన ఉలూపియందు ఇరావంతుడు, మణిపూరమహారాజు యొక్క పుత్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించెను. ఇతడు తన తాతయైన మణిపూరమహారాజు కడనే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజుచే పుత్రుడుగా పరిగణింపబడెను.

మీ తాతయగు అర్జునునివలన సుభద్రయందు మీ తండ్రియగు అభిమన్యుడు జన్మించెను. ఆ అభిమన్యుడు మహావీరుడు. అతిరథులను అందరిని జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వలననే ఉత్తరయందు నీవు పుట్టితివి.

కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనాది కౌరవులు ఎల్లరును మరణించుటచే  కృద్ధుడైన అశ్వత్థామ మాతృ గర్భములో నున్న నీపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కాని, శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహమున నీవు మృత్యువునుండి రక్షింపబడి సజీవుడవైతివి.

నాయనా! పరీక్షిన్మహారాజా! జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను నీ కుమారులు ఇచ్చటనే యున్నారు. వీరు అందరును మిక్కిలి పరాక్రమవంతులు.

ఇక మున్ముందు జరుగబోవు విషయములను గూడ చెప్పెదను వినుము. నీవు తక్షకుని కాటునకు గుఱియై మృత్యువు పాలగుదువు. అంతట జనమేజయుడు మిగుల క్రుద్ధుడై సర్పయాగమొనర్చి, ఆ అగ్నియందు సర్పములను అన్నింటిని ఆహుతి యొనర్చు

పిదప జనమేజయుడు కవష (కలష) తనయుడగు తురుని పురోహితునిగా జేసికొని అశ్వమేధయాగమును ఆచరించును. అనంతరము సమస్త భూమండలమును జయించి, యజ్ఞములద్వారా భగవంతుని ఆరాధించును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ

జనమేజయుని కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహామునినుండి ఋగ్యజుస్సామ వేదములను, కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రములను అభ్యసించును. కృపాచార్యుని కడ అస్త్రవిద్యయందు శిక్షణను పొందును. అట్లే శౌనకునివలన ఆత్మజ్ఞానమును సాధించి, తద్ద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడగును.

శతానీకుని పుత్రుడు సహాస్రానీకుడు. అతని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధజుని తనయుడు అసీమ కృష్ణుడు. అతని  సుతుడు నేమిచక్రుడు.

హస్తినాపురము గంగానదియందు మునిగిపోయినప్పుడు నేమి చక్రుడు తన నివాసమును కౌశాంబి నగరమునకు మార్చుకొని, అచట సుఖముగా ఉండును. నేమిచక్రునకు చిత్రరథుడు అను తనయుడు కలుగును. అతనికి కవిరథుడు అను కొడుకు పుట్టును.

కవిరథునకు వృష్టిమంతుడు, అతనికి సుషేణుడు కలుగుదురు. సుషేణుడు గొప్ప పరిపాలకుడు అగును. సుషేణుని తనయుడు సునీథుడు. అతని పుత్రుడు నృచక్షువు. నృచక్షుని కుమారుడు సుఖీనలుడు.

సుఖీనలునకు పరిప్లవుడు, పరిప్లవునకు సునయుడు, అతనికి మేధాని తనయులగుదురు. మేధాని కుమారుడు నృపంజయుడు, అతని సుతుడు దూర్వుడు. దూర్వునకు తిమి అను తనూజుడు కలుగును. 

తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు; అతని కుమారుడు సుదాసుడు. సుదాసుని తనయుడు శతానీకుడు. అతనికి దుర్దమనుడు అను తనయుడు కలుగును. అతని సుతుడు బహీనరుడు.

బహీనరునకు దండపాణి అను సుతుడు కలుగును. అతని కుమారుడు నిమి. నిమికి క్షేమకుడు పుట్టును. అతడు మహారాజుగా ఖ్యాతి వహించును. పరీక్షిన్మహారాజా! ఇంతవరకును చంద్రవంశము నందలి బ్రాహ్మణ, క్షత్రియ గోత్రజులను గూర్చి వివరించితిని. వీరందరును ధర్మనిరతులైనందున దేవతలయొక్క, ఋషులయొక్క అనుగ్రహములకు పాత్రులైరి. వారినుండి ఆశీస్సులను, సత్కారములను పొందిరి.

కలియుగమునందు సోమ (చంద్ర) వంశజుల పరంపరలో క్షేమకుడే చివరివాడు. అతడు మహారాజుగా ప్రసిద్ధి వహించును. ఇక భవిష్యత్తులో మగధదేశమును పరిపాలించెడి రాజులను గూర్చి తెలిపెదను వినుము.

జరాసంధుని కుమారుడైన సహదేవునకు మార్జారి అనువాడు కలుగును. మార్జారి తనూజుడు శ్రుతశ్రవుడు. అతని సుతుడు అయుతాయువు. అయుతాయువునకు నిరమిత్రుడు అను కొడుకు పుట్టును.

నిరమిత్రుని తనయుడు సునక్షత్రుడు. అతని సూనుడు బృహత్సేనుడు. అతనికి కర్మజిత్తు అను కుమారుడు జన్మించును. కర్మజిత్తునకు సుతంజయుడు, అతనికి విప్రుడు, విప్రునకు శుచి అను వారు పుత్రులు అగుదురు.

శుచివలన క్షేముడు, అతని వలన సువ్రతుడు, అతనికి ధర్మసూత్రుడు అనువారు జన్మింతురు. ధర్మసూత్రునకు శముడు, అతనికి ద్యుమత్సేనుడు, అతనివలన సుమతి, సుమతికి సుబలుడు కలుగుదురు.

సుబలుని కుమారుడు సునీథుడు. అతని తనయుడు సత్యజిత్తు. అతని తనూజుడు విశ్వజిత్తు. అతనికి రిపుంజయుడు పుట్టును. వీరు అందరును బృహద్రథుని పరంపరకు చెందిన రాజులు, వీరు రాబోవు వేయి సంవత్సరములవరకును కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుదురు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వావింశోఽధ్యాయః (22)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  ఇరువది రెండవ అధ్యాయము (22)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

సేకరణ

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

22.1 (ప్రథమ శ్లోకము)

మిత్రేయుశ్చ దివోదాసాచ్చ్యవనస్తత్సుతో నృప|

సుదాసః సహదేవోఽథ సోమకో జంతుజన్మకృత్॥8065॥

22.2 (రెండవ శ్లోకము)

తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతః సుతః|

(స తస్మాద్ద్రుపదో జజ్ఞే సర్వసంపత్సమన్వితః)

ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయః సుతాః॥8066॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ముద్గలుని కుమారుడైన దివోదాసునకు మిత్రేయుడు అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు - అను నలుగురు సుతులు కలిగిరి. వారిలో సోమకునకు వందమంది తనయులు జన్మించిరి. ఆ నూరుగురిలో జంతుడు అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులును కలిగిరి.

22.3 (మూడవ శ్లోకము)

ధృష్టద్యుమ్నాద్ధృష్టకేతుర్భార్మ్యాః పంచాలకా ఇమే|

యోఽజమీఢసుతో హ్యన్య ఋక్షః సంవరణస్తతః॥8067॥

22.4 (నాలుగవ శ్లోకము)

తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతిః కురుః|

పరీక్షిత్సుధనుర్జహ్నుర్నిషధాశ్వః కురోః సుతాః॥8068॥

ధృష్టద్యుమ్నుని తనయుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్యుని వంశమునకు చెందిన వీరు అందరును పాంచాలురు అని పిలువబడిరి. అజమీఢుని మరియొక పుత్రుడు ఋక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు తపతి అను కన్యను వివాహమాడెను. సంవరణునివలన తపతియందు కురువు అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, విషధాశ్వుడు అను నలుగురు పుత్రులు కలిగిరి.

22.5 (ఐదవవ శ్లోకము)

సుహోత్రోఽభూత్సుధనుషశ్చ్యవనోఽథ తతః కృతీ|

వసుస్తస్యోపరిచరో బృహద్రథముఖాస్తతః॥8069॥

22.6 (ఆరవ శ్లోకము)

కుశాంబమత్స్యప్రత్యగ్రచేదిపాద్యాశ్చ చేదిపాః|

బృహద్రథాత్కుశాగ్రోఽభూదృషభస్తస్య తత్సుతః॥8070॥

సుధస్వుని కుమారుడు సుహోత్రుడు, అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సుతుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచరవసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను ఐదుగురు కొడుకులు కలిగిరి. వారు అందరును చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు, అతని తనూజుడు వృషభుడు.

22.4 (ఏడవ శ్లోకము)

జజ్ఞే సత్యహితోఽపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః|

అన్యస్యాం చాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్॥8071॥

22.8 (ఎనిమిదవ శ్లోకము)

తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే|

జీవ జీవేతి క్రీడంత్యా జరాసంధోఽభవత్సుతః॥8012॥

వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు (సత్యవంతుడు). అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భమునుండి రెండు శకలములు ఉద్భవించెను. ఆ  రెండు ఖండములను తల్లి బయట పడవేసెను. జర అను రాక్షసి ఆ రెండు ముక్కలను వినోదముగా జతపరచి జీవింపుము-జీవింపుము అని పలికెను. అట్లు జతపరచబడిన ఆ శరీరము సజీవమయ్యెను. ఆ బాలకుడే జరాసందుడు. జర అను రాక్షసిచే సంధింపబడినాడు కావున, అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను.

22.9 (తొమ్మిదవ శ్లోకము)

తతశ్చ సహదేవోఽభూత్సోమాపిర్చ్ఛ్రుతశ్రవాః|

పరీక్షిదనపత్యోఽభూత్సురథో నామ జాహ్నవః॥8073॥

22.10 (పదియవ శ్లోకము)

తతో విదూరథస్తస్మాత్సార్వభౌమస్తతోఽభవత్|

జయసేనస్తత్తనయో రాధికోఽతోఽయుతో హ్యభూత్॥8074॥

జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి. సోమాపి తనయుడు శ్రుతశ్రవుడు. కురువు యొక్క పెద్దకుమారుడగు పరీక్షిత్తునకు ఎట్టి సంతానమూ లేకుండెను. కురువుయొక్క మూడవ కుమారుడైైన జహ్నునకు సురథుడు అనువాడు జన్మించెను. అతని సుతుడు విదూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతిని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు ఆయుతుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

22.11 (పదకొండవ శ్లోకము)

తతశ్చ క్రోధనస్తస్మాద్దేవాతిథిరముష్య చ|

ఋష్యస్తస్య దిలీపోఽభూత్ప్రతీపస్తస్య చాత్మజః॥8075॥

22.12 (పండ్రెండవ శ్లోకము)

దేవాపిః శంతనుస్తస్య బాహ్లీక ఇతి చాత్మజాః|

పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః॥8076॥

ఆయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథియొక్క తనయుడు ఋష్యుడు (ఋక్షుడు). ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రతీపుడు. అతని వలన దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రివలన తనకు లభించిన రాజ్యమును (రాజ్యాధికారమును) త్యజించి వనములకు వెళ్ళెను.

22.13 (పదమూడవ శ్లోకము)

అభవచ్ఛంతనూ రాజా ప్రాఙ్మహాభిషసంజ్ఞితః|

యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః॥8077॥

22.14 (పదునాలుగవ శ్లోకము)

శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణా తేన శంతనుః|

సమా ద్వాదశ తద్రాజ్యే న వవర్ష యదా విభుః॥8078॥

దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడగు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యెను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై, శాంతిని పొందును. కనుక, అతడు శంతనుడు గా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా పన్నెండు సంవత్సరములూ వానలు పడకపోవుటచే తీవ్రమైన కరవు ఏర్పడెను.

22.15 (పదిహేనవ శ్లోకము)

శంతనుర్బ్రాహ్మణైరుక్తః పరివేత్తాయమగ్రభుక్|

రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్రవివృద్ధయే॥8079॥

కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో  ఇట్లనిరి - "నీవు నీ అన్నయగు దేవాసి బ్రతికియుండగనే వివాహము చేసికొని, రాజ్యాధికారమును పొందితివి. కనుక నీవు పరివేత్త అనబడుదువు. 

దారాగ్నిహోత్ర సంయోగం కురుతే యోఽగ్రజేస్థితే|

పరివేత్తా సవిజ్ఞేయః పరివిత్తిస్తు పూర్వజః॥ (స్మృతి)

అన్నకంటెను ముందుగా పెండ్లి చేసికొని, అగ్నికార్యములను ఆచరించినవాడు పరివేత్త అని యనబడును. ఆ స్థితిలో ఉన్న అగ్రజుడు (అన్న) పరివిత్తి అని వ్యవహరింపబడును.

కనుక నీ నగరము, రాష్ట్రము (రాజ్యము) అభివృద్ధిని పొందవలెనని భావించినచో, నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయుము. అనగా రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లొనర్చినచో, నీ రాజ్యము సుభిక్షముగా ఉండును.

22.16 (పదహారవ శ్లోకము)

ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోఽబ్రవీత్|

తన్మంత్రిప్రహితైర్విప్రైర్వేదాద్విభ్రంశితో గిరా॥8080॥

22.17 (పదిహేడవ శ్లోకము)

వేదవాదాతివాదాన్ వై తదా దేవో వవర్ష హ|

దేవాపిర్యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రితః॥8081॥

22.18 (పదునెనిమిదవ శ్లోకము) 

సోమవంశే కలౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి|

బాహ్లీకాత్సోమదత్తోఽభూద్భూరిర్భూరిశ్రవాస్తతః॥8082॥

22.19 (పందొమ్మిదవ శ్లోకము)

శలశ్చ శంతనోరాసీద్గంగాయాం భీష్మ ఆత్మవాన్|

సర్వధర్మవిదాం శ్రేష్ఠో మహాభాగవతః కవిః॥8083॥

బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు (వనములకు) వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కాని, శంతనునియొక్క మంత్రియైన అశ్మరావ అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేదవిరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు (దేవాపి) వైదిక సంప్రదాయమును అనుసరించి, గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందింపదొడగెను. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతట శంతనుని  రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట దేవాపి యోగసాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా, అతడు (దేవాపి) కృతయుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లికుమారుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, శలుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకలధర్మములను బాగుగా ఎఱిగినవాడు. పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞానసంపన్నుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

22.20 (ఇరువదియవ శ్లోకము)

వీరయూథాగ్రణీర్యేన రామోఽపి యుధి తోషితః|

శంతనోర్దాశకన్యాయాం జజ్ఞే చిత్రాంగదః సుతః॥8084॥

22.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

విచిత్రవీర్యశ్చావరజో నామ్నా చిత్రాంగదో హతః|

యస్యాం పరాశరాత్సాక్షాదవతీర్ణో హరేః కలా॥8085॥

22.22 (ఇరువది రెండవ శ్లోకము)

వేదగుప్తో మునిః కృష్ణో యతోఽహమిదమధ్యగామ్|

హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః॥8086॥

22.23 (ఇరువది మూడవ శ్లోకము)

మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ|

విచిత్రవీర్యోఽథోవాహ కాశిరాజసుతే బలాత్॥8087॥

22.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే|

తయోరాసక్తహృదయో గృహీతో యక్ష్మణా మృతః॥8089॥

భీష్ముడు వీరశిరోమణి, కురుక్షేత్ర యుద్ధమున సైన్యాధిపత్యము వహించినవాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భీష్ముని పూర్వజన్మము భీష్ముడు పూర్వజన్నలో ప్రభాసుడు. ప్రభాసుడు అష్టవసువులలో ఎనిమిదవవాడు. అష్టవసువులు ఒకసారి వసిష్ఠుని కడకేగిరి. వసిష్ఠుని యొక్క హోమధేనువు పాలు త్రాగిన వారికి జరామరణములు ఉండవని వారికి తెలిసెను. అప్ఫుడు ప్రభాసుని భార్య ఆ ధేనువునకై ఆశపడెను. ఆమె కోరికమేరకు అష్టవసువులు ఆ ధేనువును దొంగిలించిరి. అందులకు వసిష్ఠుడు 'మీరు మనుష్యులై జన్మింపుడు' అని వారిని శపించెను. వారిలో పెద్ద తప్పు చేసినవాడు ప్రభాసుడు. కావున వసిష్ఠుడు 'నీవు మనుష్యుడవై పుట్టుటయేకాదు, సంతానము లేనివాడవు అగుదువు.  జీవితాంతము మనుష్యుడవై యుందువు'. అని ప్రభాసుని శపించెను. ఈ అష్టవసువులు శంతనుని వలన గంగాదేవియందు మానవులై జన్మించిరి. వారిలో మొదటి ఏడుగురును నరజన్మనెత్తి వెంటనే మరణించి, శాపవిముక్తి పొందిరి. ప్రభాసుడు మాత్రము భీష్మునిగా పుట్టి జీవితాంతము అనపత్యుడై (బ్రహ్మచారిగనే) ఉండెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భీష్ముడు పరశురాముని కడ అస్త్రవిద్యలను నేర్చెను. ఒకానొక సందర్భమున భీష్ముడు తన గురువగు పరశురామునితో యుద్ధమొనర్చి, తన యుద్ధకౌశలముచే గురువునే మెప్పించెను. శంతనుని వలన దాశకన్య (సత్యవతి) యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించిరి. ( దాశకన్య - ఈమెకు మత్స్యగంధి, యోజనగంధి, సత్యవతి అను పేర్లుగలవు. ఉపరిచర వసువుయొక్క వీర్యమును చేప భక్షింపగా, ఆ మత్స్యగర్భమున జన్మించి మత్స్యగంధి యయ్యెను. ఈమె దాశరాజు పోషణలో పెరిగినందున దాశకన్యగా ప్రసిద్ధికెక్కెను) చిత్రాంగదుడు యుద్ధమున ఒక గంధర్వుని చేతిలో హతుడయ్యెను. పరాశరమహర్షి వలన ఆ దాశకన్యయందు వేదవ్యాస మహాముని శ్రీహరియంశ కలిగి కృష్ణవర్ణముతో జన్మించెను. అతడు వేదములను రక్షించి లోకప్రశస్తి గన్నవాడు. పరీక్షిన్మహారాజా! ఆ మహాత్ముని నుండియే నేను (శుకుడు) ఈ భాగవతమును అభ్యసించితిని. పూజ్యుడైన ఆ బాదరాయణుడు (వ్యాసుడు) పరమగోప్యమైన ఈ భాగవతమును తన శిష్యులైన పైలుడు మొదలగు వారికి బోధింపలేదు. తనకు పుత్రుడను, పైగా శాంతస్వభావము గలవాడను ఐన నన్ను భాగవతమును అధ్యయనము చేయుటకు అర్హునిగా భావించి, దానిని నాకు బోధించెను. కాశిరాజు కుమార్తెయైన అంబిక, అంబాలిక అను వారిని స్వయంవర మండపమునుండి బలాత్కారముగా తీసికొనివచ్చి, భీష్ముడు విచిత్రవీర్యునకు (సత్యవతి రెండవ కుమారునకు) ఇచ్చి వివాహమొనర్చెను. విచిత్రవీర్యుడు తన ఇరువురి భార్యలయందు అమితమైన ఆసక్తిగలవాడై సుఖలోలుడయ్యెను. క్రమముగా క్షయరోగమునకు లోనై మృతి చెందెను.

22.25 (ఇరువది ఐదవ శ్లోకము)

క్షేత్రేఽప్రజస్య వై భ్రాతుర్మాత్రోక్తో బాదరాయణః|

ధృతరాష్ట్రం చ పాండుం చ విదురం చాప్యజీజనత్॥8089॥

విచిత్రవీర్యుడు మరణించు నాటికి అతని భార్యలగు అంబిక, అంబాలిక అనువారికి సంతానము లేకుండెను. వంశాభివృద్ధికై తల్లియగు సత్యవతియొక్క ఆదేశమును అనుసరించి, వ్యాసమహర్షి తన తమ్ముని భార్యలైన అంబికయందు ధృతరాష్ట్రునకును, అంబాలికయందు పాండురాజునకును జన్మమిచ్చెను. పిమ్మట ఒక దాసియందు విదురునకు జన్మమిచ్చెను.

22.26 (ఇరువది ఆరవ శ్లోకము)

గాంధార్యాం ధృతరాష్ట్రస్య జజ్ఞే పుత్రశతం నృప|

తత్ర దుర్యోధనో జ్యేష్ఠో దుఃశలా చాపి కన్యకా॥8090॥

పరీక్షిన్మహారాజా! ధృతరాష్త్రుని వలన గాంధారియందు నూరుగురు కుమారులును, దుశ్శల (దుస్సల) అను కుమార్తెయు కలిగిరి. వారిలో దుర్యోధనుడు పెద్దవాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


22.27 (ఇరువది ఏడవ శ్లోకము)

శాపాన్మైథునరుద్ధస్య పాండోః కుంత్యాం మహారథాః|

జాతా ధర్మానిలేంద్రేభ్యో యుధిష్ఠిరముఖాస్త్రయః॥8091॥

 22.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

నకులః సహదేవశ్చ మాద్ర్యాం నాసత్యదస్రయోః|

ద్రౌపద్యాం పంచ పంచభ్యః పుత్రాస్తే పితరోఽభవన్॥8092॥

 22.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యుధిష్ఠిరాత్ప్రతివింధ్యః శ్రుతసేనో వృకోదరాత్|

అర్జునాచ్ఛ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః॥8093॥

 22.30 (ముప్పదియవ శ్లోకము)

సహదేవసుతో రాజన్ శ్రుతకర్మా తథాపరే|

యుధిష్ఠిరాత్తు పౌరవ్యాం దేవకోఽథ ఘటోత్కచః॥8094॥

 22.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

భీమసేనాద్ధిడింబాయాం కాల్యాం సర్వగతస్తతః|

సహదేవాత్సుహోత్రం తు విజయాసూత పార్వతీ॥8095॥

'భార్యా సంగమము జరిపినచో నీవు మృతి చెందెదవు' అని పాండురాజును కిందమహాముని శపించెను. అందువలన ఆయన పెద్దభార్యయగు కుంతియందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు (ధర్మరాజు), వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు జన్మించిరి. అట్లే పాండురాజుయొక్క రెండవ భార్యయైన మాద్రియందు అశ్వినీదేవతల (అశ్వినీకుమారుల) వలన నకుల సహదేవులు పుట్టిరి. వీరు అందఱును మహారథులు. ఈ పంచపాండవులవలన ద్రౌపదియందు ఐదుగురు సుతులు కలిగిరి. వీరందరును నీకు (పరీక్షిన్మహారాజునకు) పెదతండ్రులు. రాజా! యుధిష్ఠిరునివలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, అర్జునుని వలన శ్రుతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శ్రుతకర్మ అనువారు ద్రౌపదియందు జన్మించిరి. ఇంకను ధర్మరాజునకు పౌరవి అను నామెయందు దేవకుడు, భీమునకు హిడింబియందు ఘటోత్కచుడు, కాళి అను నామెయందు సర్వగతుడు అనువారు జన్మించిరి. అట్లే సహదేవుని వలన పర్వతుని కూతురైన విజయ అను నామెయందు సుహోత్రుడు పుట్టెను.

 22.32 (ముప్పది రెండవ శ్లోకము)

కరేణుమత్యాం నకులో నరమిత్రం తథార్జునః|

ఇరావంతములుప్యాం వై సుతాయాం బభ్రువాహనమ్|

మణిపూరపతేః సోఽపి తత్పుత్రః పుత్రికాసుతః॥8096॥

నకులుని వలన కరేణుమతి అనునామె యందు నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వలన నాగకన్యయైన ఉలూపియందు ఇరావంతుడు, మణిపూరమహారాజు యొక్క పుత్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించెను. ఇతడు తన తాతయైన మణిపూరమహారాజు కడనే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజుచే పుత్రుడుగా పరిగణింపబడెను.

 22.33 (ముప్పది మూడవ శ్లోకము)

తవ తాతః సుభద్రాయామభిమన్యురజాయత|

సర్వాతిరథజిద్వీర ఉత్తరాయాం తతో భవాన్॥8097॥

మీ తాతయగు అర్జునునివలన సుభద్రయందు మీ తండ్రియగు అభిమన్యుడు జన్మించెను. ఆ అభిమన్యుడు మహావీరుడు. అతిరథులను అందరిని జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వలననే ఉత్తరయందు నీవు పుట్టితివి.

 22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

పరిక్షీణేషు కురుషు ద్రౌణేర్బ్రహ్మాస్త్రతేజసా|

త్వం చ కృష్ణానుభావేన సజీవో మోచితోఽన్తకాత్॥8098॥

కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనాది కౌరవులు ఎల్లరును మరణించుటచే  కృద్ధుడైన అశ్వత్థామ మాతృ గర్భములో నున్న నీపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కాని, శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహమున నీవు మృత్యువునుండి రక్షింపబడి సజీవుడవైతివి.

  22.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తవేమే తనయాస్తాత జనమేజయపూర్వకాః|

శ్రుతసేనో భీమసేన ఉగ్రసేనశ్చ వీర్యవాన్॥8099॥

నాయనా! పరీక్షిన్మహారాజా! జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను నీ కుమారులు ఇచ్చటనే యున్నారు. వీరు అందరును మిక్కిలి పరాక్రమవంతులు.

 22.36 (ముప్పది ఆరవ శ్లోకము)

జనమేజయస్త్వాం విదిత్వా తక్షకాన్నిధనం గతమ్|

సర్పాన్ వై సర్పయాగాగ్నౌ స హోష్యతి రుషాన్వితః॥8100॥

ఇక మున్ముందు జరుగబోవు విషయములను గూడ చెప్పెదను వినుము. నీవు తక్షకుని కాటునకు గుఱియై మృత్యువు పాలగుదువు. అంతట జనమేజయుడు మిగుల క్రుద్ధుడై సర్పయాగమొనర్చి, ఆ అగ్నియందు సర్పములను అన్నింటిని ఆహుతి యొనర్చును.

 22.37 (ముప్పది ఏడవ శ్లోకము)

కావషేయం పురోధాయ తురం తురగమేధయాట్|

సమంతాత్పృథివీం సర్వాం జిత్వా యక్ష్యతి చాధ్వరైః॥8101॥

పిదప జనమేజయుడు కవష (కలష) తనయుడగు తురుని పురోహితునిగా జేసికొని అశ్వమేధయాగమును ఆచరించును. అనంతరము సమస్త భూమండలమును జయించి, యజ్ఞములద్వారా భగవంతుని ఆరాధించును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.10.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

22.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తస్య పుత్రః శతానీకో యాజ్ఞవల్క్యాత్త్రయీం పఠన్|

అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్పరమేష్యతి॥8102॥

జనమేజయుని కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహామునినుండి ఋగ్యజుస్సామ వేదములను, కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రములను అభ్యసించును. కృపాచార్యుని కడ అస్త్రవిద్యయందు శిక్షణను పొందును. అట్లే శౌనకునివలన ఆత్మజ్ఞానమును సాధించి, తద్ద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడగును.

22.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

సహస్రానీకస్తత్పుత్రస్తతశ్చైవాశ్వమేధజః|

అసీమకృష్ణస్తస్యాపి నేమిచక్రస్తు తత్సుతః॥8103॥

శతానీకుని పుత్రుడు సహాస్రానీకుడు. అతని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధజుని తనయుడు అసీమ కృష్ణుడు. అతని  సుతుడు నేమిచక్రుడు.

22.40 (నలుబదియవ శ్లోకము)

గజాహ్వయే హృతే నద్యా కౌశాంబ్యాం సాధు వత్స్యతి|

ఉక్తస్తతశ్చిత్రరథస్తస్మాత్కవిరథః సుతః॥8104॥

హస్తినాపురము గంగానదియందు మునిగిపోయినప్పుడు నేమి చక్రుడు తన నివాసమును కౌశాంబి నగరమునకు మార్చుకొని, అచట సుఖముగా ఉండును. నేమిచక్రునకు చిత్రరథుడు అను తనయుడు కలుగును. అతనికి కవిరథుడు అను కొడుకు పుట్టును.

22.41 (నలుబది ఒకటవ శ్లోకము)

తస్మాచ్చ వృష్టిమాంస్తస్య సుషేణోఽథ మహీపతిః|

సునీథస్తస్య భవితా నృచక్షుర్యత్సుఖీనలః॥8105॥

కవిరథునకు వృష్టిమంతుడు, అతనికి సుషేణుడు కలుగుదురు. సుషేణుడు గొప్ప పరిపాలకుడు అగును. సుషేణుని తనయుడు సునీథుడు. అతని పుత్రుడు నృచక్షువు. నృచక్షుని కుమారుడు సుఖీనలుడు.

22.42 (నలుబది రెండవ శ్లోకము)

పరిప్లవః సుతస్తస్మాన్మేధావీ సునయాత్మజః|

నృపంజయస్తతో దూర్వస్తిమిస్తస్మాజ్జనిష్యతి॥8106॥

సుఖీనలునకు పరిప్లవుడు, పరిప్లవునకు సునయుడు, అతనికి మేధాని తనయులగుదురు. మేధాని కుమారుడు నృపంజయుడు, అతని సుతుడు దూర్వుడు. దూర్వునకు తిమి అను తనూజుడు కలుగును. 

22.43 (నలుబది మూడవ శ్లోకము)

తిమేర్బృహద్రథస్తస్మాచ్ఛతానీకః సుదాసజః|

శతానీకాద్దుర్దమనస్తస్యాపత్యం మహీనరః॥8107॥

తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు; అతని కుమారుడు సుదాసుడు. సుదాసుని తనయుడు శతానీకుడు. అతనికి దుర్దమనుడు అను తనయుడు కలుగును. అతని సుతుడు బహీనరుడు.

22.44 (నలుబది నాలుగవ శ్లోకము)

దండపాణిర్నిమిస్తస్య క్షేమకో భవితా నృపః|

బ్రహ్మక్షత్రస్య వై ప్రోక్తో వంశో దేవర్షిసత్కృతః॥8108॥

బహీనరునకు దండపాణి అను సుతుడు కలుగును. అతని కుమారుడు నిమి. నిమికి క్షేమకుడు పుట్టును. అతడు మహారాజుగా ఖ్యాతి వహించును. పరీక్షిన్మహారాజా! ఇంతవరకును చంద్రవంశము నందలి బ్రాహ్మణ, క్షత్రియ గోత్రజులను గూర్చి వివరించితిని. వీరందరును ధర్మనిరతులైనందున దేవతలయొక్క, ఋషులయొక్క అనుగ్రహములకు పాత్రులైరి. వారినుండి ఆశీస్సులను, సత్కారములను పొందిరి.

22.45 (నలుబది ఐదవ శ్లోకము)

క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ|

అథ మాగధరాజానో భవితారో వదామి తే॥8109॥

కలియుగమునందు సోమ (చంద్ర) వంశజుల పరంపరలో క్షేమకుడే చివరివాడు. అతడు మహారాజుగా ప్రసిద్ధి వహించును. ఇక భవిష్యత్తులో మగధదేశమును పరిపాలించెడి రాజులను గూర్చి తెలిపెదను వినుము.

22.46 (నలుబది యారవ శ్లోకము)

భవితా సహదేవస్య మార్జారిర్యచ్ఛ్రుతశ్రవాః|

తతోఽయుతాయుస్తస్యాపి నిరమిత్రోఽథ తత్సుతః॥8110॥

జరాసంధుని కుమారుడైన సహదేవునకు మార్జారి అనువాడు కలుగును. మార్జారి తనూజుడు శ్రుతశ్రవుడు. అతని సుతుడు అయుతాయువు. అయుతాయువునకు నిరమిత్రుడు అను కొడుకు పుట్టును.

22.47 (నలుబది మూడవ శ్లోకము)

సునక్షత్రః సునక్షత్రాద్బృహత్సేనోఽథ కర్మజిత్|

తతః సుతంజయాద్విప్రః శుచిస్తస్య భవిష్యతి॥8111॥

నిరమిత్రుని తనయుడు సునక్షత్రుడు. అతని సూనుడు బృహత్సేనుడు. అతనికి కర్మజిత్తు అను కుమారుడు జన్మించును. కర్మజిత్తునకు సుతంజయుడు, అతనికి విప్రుడు, విప్రునకు శుచి అను వారు పుత్రులు అగుదురు.

22.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

క్షేమోఽథ సువ్రతస్తస్మాద్ధర్మసూత్రః శమస్తతః|

ద్యుమత్సేనోఽథ సుమతిః సుబలో జనితా తతః॥8112॥

శుచివలన క్షేముడు, అతని వలన సువ్రతుడు, అతనికి ధర్మసూత్రుడు అనువారు జన్మింతురు. ధర్మసూత్రునకు శముడు, అతనికి ద్యుమత్సేనుడు, అతనివలన సుమతి, సుమతికి సుబలుడు కలుగుదురు.

22.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

సునీథః సత్యజిదథ విశ్వజిద్యద్రిపుంజయః|

బార్హద్రథాశ్చ భూపాలా భావ్యాః సాహస్రవత్సరమ్॥8113॥

సుబలుని కుమారుడు సునీథుడు. అతని తనయుడు సత్యజిత్తు. అతని తనూజుడు విశ్వజిత్తు. అతనికి రిపుంజయుడు పుట్టును. వీరు అందరును బృహద్రథుని పరంపరకు చెందిన రాజులు, వీరు రాబోవు వేయి సంవత్సరములవరకును కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుదురు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వావింశోఽధ్యాయః (22)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  ఇరువది రెండవ అధ్యాయము (22)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235

18.1


శ్రీశుక ఉవాచ

18.1 (ప్రథమ శ్లోకము)

శ్రీశుకుడు నుడివెను దేహికి షడింద్రియములవలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను ఆరుగురు పుత్రులు విలసిల్లిరి.

నహుషుడు తన పెద్దకుమారుడైన యతి కి రాజ్యపాలన భారమును అప్పగించదలచెను. కాని, అతడు (యతి) అందులకు సమ్మతించలేదు. 'రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో, దుఃఖములే దప్ప సుఖములు సున్న, అంతేగాక, ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసివచ్చును' అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు. 

ఇంద్రుని పట్టమహిషియైన శచీదేవిపై మోహపడి, దౌష్ట్యమునకు  పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురియై, తన ఇంద్రపదవిని కోల్పోవుటయే గాక కొండచిలువయై పోయెను. అనంతరము యయాతి తన తండ్రిస్థానములో మహారాజయ్యెను.

ఆయువుయొక్క కుమారుడు నహుషుడు. ఇతని తల్లిపేరు స్వర్భానవి. ఇతని భార్య ప్రియంవద. ఇతడు నూరు యజ్ఞములను ఆచరించెను. బ్రహ్మహత్యయొనర్చిన (విశ్వరూపుని చంపిన) కారణముగా ఇంద్రుడు తన పదవిని (స్వర్గాధిపత్యమును) కోల్పోయెను.  అప్పుడు నహుషుడు ఇంద్రపదవిని (స్వర్గాధిపత్యమును) పొందెను. అంతట అతడు గర్వోన్మత్తుడై శచీదేవిపై మోహితు డయ్యెను. బృహస్పతితో ఆలోచించిన పిమ్మట శచీదేవి అందులకు ఆమోదించెను. బ్రహ్మరథముపై తన భవనమునకు వచ్చినచోనహుషుని పొందుదునని అని తెలిపెను. బ్రహ్మరథముపై బయలుదేరిన నహుషుడు 'త్వరగా నడువుడు' అనుచు ('సర్ప సర్ప' అని పలుకుచు) రథమును మోయుచున్న అగస్త్యుని కాలితో తన్నెను. వెంటనే అగస్త్యమహర్షి అతనిని "సర్పోభవ' అనుచు (సర్పమై పొమ్ము అని) శపించెను. ఆ శాపఫలితముగా నహుషుడు కొండచిలువ అయ్యెను. (బ్రహ్మరథము = బ్రాహ్మణులు లాగెడి రథము).

యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను నలుగురిని నాలుగు దిక్కులకు (నాలుగు దిక్కులయందుగల రాజ్యములకు) పరిపాలకులనుగా జేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్యప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పాలింపసాగెను.

రాజోవాచ

పరీక్షిన్మహారాజు అడిగెను- "మునీంద్రా! పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రహ్మర్షి (బ్రాహ్మణుడు), యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్యయైన (శుక్రాచార్యుని కూతురైన) దేవయానిని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా! అది ఎట్లు సంభవించెను?

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు - అను నాలుగు వర్ణముల వారిలో అగ్రకుల కన్యతో వివాహము ప్రతిలోమ విధానము.

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు పలికెను దానవరాజైన  వృషపర్వునకు శర్మిష్ఠ అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయానితోడను, ఇంకను వేలకొలది చెలులతోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూలచెట్లతో నిండియుండెను. ఆ వనమునగల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి.

ఆ చక్కనిచుక్కలు (శర్మిష్ఠ మొదలగు కన్యలు) సరోవరమును సమీపించి,తమ వస్త్రములను ఒడ్డున ఉంచి, నీళ్ళలోనికి దిగి, పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో గూడి నందివాహనముపై అటునుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నీళ్ళలోనుండి బయటికి వచ్చి, త్వరత్వరగా తమవస్త్రములను ధరించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.10 (పదియవ శ్లోకము)

ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే యనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితయై ఇట్లు పలికెను "చెలులారా!  ఈ దాసి (శర్మిష్ఠ) చేసిన అనుచితమైన పనిని చూచితిరా? యజ్ఞమునందలి హవ్యమును కుక్క తినినట్లుగా, ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రమూ క్షమింపరానిపని.

ఈ (మా) బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తపఃప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖమునుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయములయందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు (బ్రాహ్మణులు) నిర్దేశించిన వైదికమార్గము లోకమునకు (సకలప్రాణులకును) శుభంకరమైనది. దిక్పాలురును, ఇంద్రాదిదేవతలును బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు. వారిని సేవించుచుందురు. అంతేగాదు, పరమపావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు ఐన ఆ రమాపతికి గూడ బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణులలో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మాకు (మా తండ్రికి)  శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది".

గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తూలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయెను. దెబ్బతిన్న ఆడుపామువలె బుసలు కొట్టసాగెను. అంతట పండ్లు పటపట కొఱుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను-

"ఓ భిక్షుకీ! నీ స్దాయిని తెలిసికొనక (విస్మరించి) నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు, కుక్కలవలె నీవు నాలుగు మెతుకులు కొఱకు (ఉదరపోషణకై)  మా ఇంటిచుట్టును తిరుగుచున్నదానవు కావా?"

శర్మిష్ఠ ఈ విధముగా ఇంకను పలువిధములగు దురుసుమాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమెనుండి తన వస్త్రములను లాగికొని, ఆమెను ఒక బావిలో పడద్రోసెను.

పిదప శర్మిష్ఠ (తన చెలులతో గూడి) ఇంటికి చేరెను. కొంతతడవునకు యయాతి మహారాజు వేటాడి, అలసిపోవుటతో మిగుల దప్పికగొనియుండెను. నీటికొఱకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావిసమీపమునకు వచ్చి, ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదుస్వభావముగల యయాతి, ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేసెను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి (ఆమె చేతిని తన చేతితో పట్టుకొని) ఆమెను ఆ బావినుండి పైకితీసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.20 (ఇరువదియవ శ్లోకము)

అంతట దేవయాని ప్రేమ పరవశయై , వీరుడగు యయాతితో మృదుమధురముగా ఇట్లనెను - "అజేయుడవైన ఓ మహారాజా! మొదఠిసారిగా ఇటుల నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరియొకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమాశాలీ! బావిలో పడియున్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన (మన ఇరువురి సంబంధము) దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినదికాదు. మహాబాహూ! నేనును, బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాపకారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు.

కచుడు బృహస్పతి కుమారుడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యునికడ మృతసంజీవని అను విద్య నభ్యసించెను. దేవయాని కచునిపై మనసు పడియుండెను. అతడు చదువు పూర్తిచేసికొని ఇంటికి వెళ్ళునప్పుడు దేవయాని తనను పెండ్లియాడుమని అతనిని కోరెను. గురుపుత్రియగు దేవయానిని వివాహము చేసికొనుటకు అతడు తిరస్కరించెను. అందులకు కుపితయైన దేవయాని "నీవు నేర్చిన విద్య నీకు పనిచేయకుండుగాక" అని అతనికి శాపమిచ్చెను. అంతట కచుడును 'బ్రాహ్మణుడెవ్వడును నిన్ను పత్నిగా స్వీకరించకుండునుగాక' అని ఆమెకు ప్రతిశాపమిచ్చెను.

అంతట యయాతి 'ఈ వివాహము శాస్త్రవిరుద్ధమే యైనను విధినిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సుగూడ ఆమె వైపు ఆకర్షితమైనది' అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను.

వీరుడైన యయాతి అచటినుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచు తన తండ్రి కడకు వెళ్ళెను. అనంతరము శర్మిష్ఠ చేసిన దష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపెను.

తన గారాలపట్టియగు దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడగు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యెను. పిమ్మట అతడు 'వృషపర్వునికడ పౌరోహిత్యమొనర్చుటకంటె, ఉంఛవృత్తి ద్వారా జీవించుటయే మేలు' అని తలంచెను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని, తన కుమార్తెతోగూడి అచటినుండి బయలుదేరెను. ఈ విషయము వృషపర్వునకు తెలిసెను. అప్పుడు అతడు 'ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో? తద్ద్వారా తనను శత్రువులు జయింతురేమో? లేదా ఆయన నన్ను శపించునేమో?'  అని శంకించెను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయనకడకు చేరి, ఆయనను ప్రసన్నుని జేసికొనుటకై పాదములపై బడెను.

ఉంఛవృత్తి = ధాన్యందంపుడు రోళ్ళవద్ద పడిన గింజలు ఏరుకొని అవి తిని బ్రతుకుట. లేదా పంట కోసిన తరువాత పంట అక్కడనుండి తీసికొనిపోయిన తరువాత పొలంలో పడిన గింజలు ఏరుకుని భుక్తి గడపుట.

అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణకాలములోనే శాంతించెను. పిమ్మట పూజ్యుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను. "రాజా! నా ముద్దులపట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను. కనుక, ఆమె కోరినరీతిగా నడచుకొనవలెను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చెదను' అందులకు వృషపర్వుడు ఆమోదించెను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించెను. 'మా తండ్రి నన్ను ఎవరికైనను ఇచ్చి పెండ్లిచేసినను, లేక, నేను ఎచటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను".

అంతట శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకటపరిస్థితిని గమనించెను. దేవయాని కోరినట్లు చేయుటవలన కలిగెడి ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించెను. పిమ్మట ఆమె తన వేయిమంది పరిచారికలతోగూడి దేవయానికి సేవలు చేయసాగెను.

అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమెతో శర్మిష్ఠను గూడ దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను. "రాజా! శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోను తల్పముపై చేరనీయరాదు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పరీక్షిన్మహారాజా! కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యెను. అంతట ఒకనాడు శర్మిష్ఠ తన  ఋతుకాలమున రహస్యముగా యయాతిని పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించెను.

అంతట ధర్మజ్లుడైన యయాతి రాజపుత్రికయైన శర్మిష్ఠయొక్క అభ్యర్థన (సంతానప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన) సముచితమైనదే యని భావించెను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష (ఎట్టి పరిస్థితిలోను నీవు ఈమెను చేరదీయరాదు - అను వచనములు) గుర్తునకు వచ్చినను, 'ప్రారబ్ధము ప్రకారము జరుగవలసినది జరుగును' అని భావించి, ఆమె కోరికనుదీర్చెను. (కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లొనర్చెను. దైవప్రాపితమేవ తత్సంగమ్ - అభ్యపద్యత - నతు కామతః (వీరరాఘవీయ వ్యాఖ్య)

దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని  కూతురైన శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అను ముగ్గురు కుమారులు కలిగిరి.

రాక్షస రాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతివలననే సంతానము ప్రాప్తించినట్లు ఎఱింగి, అహంకారవతియైన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి (తండ్రి కడకు) వెళ్ళెను. కామియైన (స్త్రీ లోలుడైన) యయాతియు తనకు ప్రాణప్రియయైన దేవయానిని అనుసరించి వెళ్ళెను. పిమ్మట అతడు ఆమె కాళ్ళుపట్టుకొని అనునయవచనములతో ప్రసన్నురాలిని చేసికొనుటకై ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యెను.

పిమ్మట శుక్రాచార్యుడు కుపితుడై "యయాతీ! నీవు స్త్రీ లోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి. ముసలితనము వలన మానవుని రూపము కళావిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించుగాక" అని పలికెను.

యయాతిరువాచ

అప్పుడు యయాతి ఇట్లు పలికెను - బ్రాహ్మణోత్తమా! మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించినవాడను కాను (దేవయానితో నేను ఇంకను దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగునుగదా!"  అంతట  శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను- "యయాతీ! ఎవ్వరైనను  మనస్ఫూర్తిగా తన యౌవనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి, నీవు సుఖముసు పొందవచ్చును".

శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్దకుమారుడగు యదువుతో ఇట్లనెను- "నాయనా! మీ మాతామహుని (తల్లియొక్క తండ్రి) వలన ప్రాప్తించిన నా ముసలితనమును దీసికొని, నీ యౌవనమును నాకు ఇమ్ము. నేను ఇంకను విషయసుఖములయందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసికొనిన యౌవనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను.

యదురువాచ

యదువు పలికెను - "తండ్రీ! నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్థక్యమును తీసికొనుటకు నేను సిద్ధముగా లేను. ఏలయన, మానవుడు విషయ సుఖములను అనుభవింపకముందే వైరాగ్యమును  పొందజాలడు గదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


18.41 (నలుబది ఒకటవ శ్లోకము)


పరీక్షిన్మహారాజా! యయాతి తన పుత్రులైన తుర్వసుని, ద్రుహ్యుని, అనువును గూడ ఇట్లే అర్థించెను. కాని అనిత్యమైన యౌవనమును శాశ్వతమని భావించుచున్న  అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి.

అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికిని, గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరుని పిలిచి యయాతి ఇట్లడిగెను- "నాయనా! నీ అన్నలవలె నీవును నా కోరికను తిరస్కరింపవు గదా!"

పూరురువాచ

పూరువు పలికెను "తండ్రీ! మహారాజా!పుత్రునియొక్క శరీరము (జన్మ) నిజముగా తండ్రినుండియే లభించినది. పైగా, తండ్రి అనుగ్రహము ఉన్నచో (సుతునకు) పరమపదము గూడ ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రియొక్క మనస్సెరిగి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రియాజ్ఞ యైనంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరసావహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలోని స్థితిలో అశ్రద్ధతో ఆచరించువాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించువాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పికొనుటకే అర్హుడు కాడు. యదార్థముగా అతడు పురీషప్రాయుడు.

పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతట యయాతియు తన కుమారుడగు పూరుడు ఇచ్చిన యౌవనముతో తనివితీర సుఖములను అనుభవించెను.

అప్పుడు సప్తద్వీపాధిపతియైన యయాతి ప్రజలను తన కన్న బిడ్డలవలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియపటుత్వము కలిగియున్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోర్కెను దీర్చుకొనెను.


అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడగు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలొనర్చుచు, ఏకాంతముస ముద్దుమురిపెములతో సంతోషింపజేయుచుండెను.

వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాడ్రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు. ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలప్రదాత. అంతేగాదు తనను ఆరాధించిన వారియొక్క సకలబాధలను తొలగించువాడు ఆ పరమాత్మ.

క్రతుభిః సర్వదేవతా శరీరకం, ఆరాధక - ఆర్తిహరం, సర్వయజ్ఞారాధ్యం, తత్ఫలదం, తద్భోక్తారం భగవంతమ్  అయజత్ - (ఆరాధితవాన్) (వీరరాఘవీయ వ్యాఖ్య)

అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణల నొసంగి తృప్తి పరచెను.

హతో యజ్ఞస్త్వదక్షిణః = దక్షిణలను ఒసంగకుండ చేసెడి యజ్ఞము నిష్ఫలము (నీతిశాస్త్రము)

ఒక్కొక్కప్పుడు  మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండును. మరియొకప్పుడు అవి అదృశ్యములగు చుండును. అట్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలోభాసిల్లుచుండును. మరియొకప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా - పాలనదశలో దేవమనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతమగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై, అవ్యక్తమగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథములవలె చంచలము, కల్పితము. శ్రీమన్నారాయణుడు సకలప్రాణుల హృదయములలో విరాజమానుడై యుండును. ఆస్వామి స్వరూపము సూక్ష్మాతిసూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి ఐన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామభావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను ఒనర్చెను.

ఈ విధముగా యయాతి, చంచలములైన షడింద్రియములచే వేయి సంవత్సరములపాటు మానసిక భోగములను అనుభవించుచున్నను అతనికి తనివిదీరకుండెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  పదునెనిమిదవ అధ్యాయము (18)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

--(())--

శ్రీశుక ఉవాచ

18.1 (ప్రథమ శ్లోకము)

యతిర్యయాతిః సంయాతిరాయతిర్వియతిః కృతిః|

షడిమే నహుషస్యాసన్నింద్రియాణీవ దేహినః॥7910॥

శ్రీశుకుడు నుడివెను దేహికి షడింద్రియములవలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను ఆరుగురు పుత్రులు విలసిల్లిరి.

18.2 (రెండవ శ్లోకము)

రాజ్యం నైచ్ఛద్యతిః పిత్రా దత్తం తత్పరిణామవిత్|

యత్ర ప్రవిష్టః పురుష ఆత్మానం నావబుధ్యతే॥7911॥

నహుషుడు తన పెద్దకుమారుడైన యతి కి రాజ్యపాలన భారమును అప్పగించదలచెను. కాని, అతడు (యతి) అందులకు సమ్మతించలేదు. 'రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో, దుఃఖములే దప్ప సుఖములు సున్న, అంతేగాక, ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసివచ్చును' అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు. 

18.3 (మూడవ శ్లోకము)

పితరి భ్రంశితే స్థానాదింద్రాణ్యా ధర్షణాద్ద్విజైః|

ప్రాపితేఽజగరత్వం వై యయాతిరభవన్నృపః॥7912॥

ఇంద్రుని పట్టమహిషియైన శచీదేవిపై మోహపడి, దౌష్ట్యమునకు  పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురియై, తన ఇంద్రపదవిని కోల్పోవుటయే గాక కొండచిలువయై పోయెను. అనంతరము యయాతి తన తండ్రిస్థానములో మహారాజయ్యెను.

ఆయువుయొక్క కుమారుడు నహుషుడు. ఇతని తల్లిపేరు స్వర్భానవి. ఇతని భార్య ప్రియంవద. ఇతడు నూరు యజ్ఞములను ఆచరించెను. బ్రహ్మహత్యయొనర్చిన (విశ్వరూపుని చంపిన) కారణముగా ఇంద్రుడు తన పదవిని (స్వర్గాధిపత్యమును) కోల్పోయెను.  అప్పుడు నహుషుడు ఇంద్రపదవిని (స్వర్గాధిపత్యమును) పొందెను. అంతట అతడు గర్వోన్మత్తుడై శచీదేవిపై మోహితు డయ్యెను. బృహస్పతితో ఆలోచించిన పిమ్మట శచీదేవి అందులకు ఆమోదించెను. బ్రహ్మరథముపై తన భవనమునకు వచ్చినచోనహుషుని పొందుదునని అని తెలిపెను. బ్రహ్మరథముపై బయలుదేరిన నహుషుడు 'త్వరగా నడువుడు' అనుచు ('సర్ప సర్ప' అని పలుకుచు) రథమును మోయుచున్న అగస్త్యుని కాలితో తన్నెను. వెంటనే అగస్త్యమహర్షి అతనిని "సర్పోభవ' అనుచు (సర్పమై పొమ్ము అని) శపించెను. ఆ శాపఫలితముగా నహుషుడు కొండచిలువ అయ్యెను. (బ్రహ్మరథము = బ్రాహ్మణులు లాగెడి రథము).

18.4 (నాలుగవ శ్లోకము)

చతసృష్వాదిశద్దిక్షు భ్రాతౄన్ భ్రాతా యవీయసః|

కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణః॥7913॥

యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను నలుగురిని నాలుగు దిక్కులకు (నాలుగు దిక్కులయందుగల రాజ్యములకు) పరిపాలకులనుగా జేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్యప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పాలింపసాగెను.

రాజోవాచ

18.5  (ఐదవ శ్లోకము)

బ్రహ్మర్షిర్భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః|

రాజన్యవిప్రయోః కస్మాద్వివాహః ప్రతిలోమకః॥7914॥

పరీక్షిన్మహారాజు అడిగెను- "మునీంద్రా! పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రహ్మర్షి (బ్రాహ్మణుడు), యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్యయైన (శుక్రాచార్యుని కూతురైన) దేవయానిని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా! అది ఎట్లు సంభవించెను?

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు - అను నాలుగు వర్ణముల వారిలో అగ్రకుల కన్యతో వివాహము ప్రతిలోమ విధానము.

శ్రీశుక ఉవాచ

18.6 (ఆరవ శ్లోకము)

ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా|

సఖీసహస్రసంయుక్తా గురుపుత్ర్యా చ భామినీ॥7915॥

18.7  (ఏడవ శ్లోకము)

దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమసంకులే|

వ్యచరత్కలగీతాలినలినీపులినేఽబలా॥7916॥

శ్రీశుకుడు పలికెను దానవరాజైన  వృషపర్వునకు శర్మిష్ఠ అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయానితోడను, ఇంకను వేలకొలది చెలులతోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూలచెట్లతో నిండియుండెను. ఆ వనమునగల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి.

18.8 (ఎనిమిదవ శ్లోకము)

తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః|

తీరే న్యస్య దుకూలాని విజహ్రుః సించతీర్మిథః॥7917॥

18.9 (తొమ్మిదవ శ్లోకము)

వీక్ష్య వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితమ్|

సహసోత్తీర్య వాసాంసి పర్యధుర్వ్రీడితాః స్త్రియః॥7918॥

ఆ చక్కనిచుక్కలు (శర్మిష్ఠ మొదలగు కన్యలు) సరోవరమును సమీపించి,తమ వస్త్రములను ఒడ్డున ఉంచి, నీళ్ళలోనికి దిగి, పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో గూడి నందివాహనముపై అటునుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నీళ్ళలోనుండి బయటికి వచ్చి, త్వరత్వరగా తమవస్త్రములను ధరించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.10 (పదియవ శ్లోకము)

శర్మిష్ఠాజానతీ వాసో గురుపుత్ర్యాః సమవ్యయత్|

స్వీయం మత్వా ప్రకుపితా దేవయానీదమబ్రవీత్॥7919॥

 18.11 (పదకొండవ శ్లోకము)

అహో నిరీక్ష్యతామస్యా దాస్యాః కర్మ హ్యసాంప్రతమ్|

అస్మద్ధార్యం ధృతవతీ శునీవ హవిరధ్వరే॥7920॥

ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే యనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితయై ఇట్లు పలికెను "చెలులారా!  ఈ దాసి (శర్మిష్ఠ) చేసిన అనుచితమైన పనిని చూచితిరా? యజ్ఞమునందలి హవ్యమును కుక్క తినినట్లుగా, ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రమూ క్షమింపరానిపని.

18.12 (పండ్రెండవ శ్లోకము)

యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్య యే|

ధార్యతే యైరిహ జ్యోతిః శివః పంథాశ్చ దర్శితః॥7921॥

18.13 (పదమూడవ శ్లోకము)

యాన్ వందంత్యుపతిష్ఠంతే లోకనాథాః సురేశ్వరాః|

భగవానపి విశ్వాత్మా పావనః శ్రీనికేతనః॥7922॥

18.14 (పదునాలుగవ శ్లోకము)

వయం తత్రాపి భృగవః శిష్యోఽస్యా నః పితాసురః|

అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతీ॥7923॥

ఈ (మా) బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తపఃప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖమునుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయములయందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు (బ్రాహ్మణులు) నిర్దేశించిన వైదికమార్గము లోకమునకు (సకలప్రాణులకును) శుభంకరమైనది. దిక్పాలురును, ఇంద్రాదిదేవతలును బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు. వారిని సేవించుచుందురు. అంతేగాదు, పరమపావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు ఐన ఆ రమాపతికి గూడ బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణులలో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మాకు (మా తండ్రికి)  శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది".

18.15 (పదునైదవ శ్లోకము)

ఏవం శపంతీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత|

రుషా శ్వసంత్యురంగీవ ధర్షితా దష్టదచ్ఛదా॥7924॥

గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తూలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయెను. దెబ్బతిన్న ఆడుపామువలె బుసలు కొట్టసాగెను. అంతట పండ్లు పటపట కొఱుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను-

18.16 (పదహారవ శ్లోకము)

ఆత్మవృత్తమవిజ్ఞాయ కత్థసే బహు భిక్షుకి|

కిం న ప్రతీక్షసేఽస్మాకం గృహాన్ బలిభుజో యథా॥7925॥

"ఓ భిక్షుకీ! నీ స్దాయిని తెలిసికొనక (విస్మరించి) నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు, కుక్కలవలె నీవు నాలుగు మెతుకులు కొఱకు (ఉదరపోషణకై)  మా ఇంటిచుట్టును తిరుగుచున్నదానవు కావా?"

18.17 (పదిహేడవ శ్లోకము)

ఏవంవిధైః సుపరుషైః క్షిప్త్వాచార్యసుతాం సతీమ్|

శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాస ఆదాయ మన్యునా॥7926॥

శర్మిష్ఠ ఈ విధముగా ఇంకను పలువిధములగు దురుసుమాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమెనుండి తన వస్త్రములను లాగికొని, ఆమెను ఒక బావిలో పడద్రోసెను.

18.18 (పదునెనిమిదవ శ్లోకము)

తస్యాం గతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్|

ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్థీ తాం దదర్శ హ॥7927॥

18.19 (పందొమ్మిదవ శ్లోకము)

దత్త్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే|

గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః॥7928॥

పిదప శర్మిష్ఠ (తన చెలులతో గూడి) ఇంటికి చేరెను. కొంతతడవునకు యయాతి మహారాజు వేటాడి, అలసిపోవుటతో మిగుల దప్పికగొనియుండెను. నీటికొఱకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావిసమీపమునకు వచ్చి, ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదుస్వభావముగల యయాతి, ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేసెను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి (ఆమె చేతిని తన చేతితో పట్టుకొని) ఆమెను ఆ బావినుండి పైకితీసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

యయాతి చరిత్రము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.20 (ఇరువదియవ శ్లోకము)

తం వీరమాహౌశనసీ ప్రేమనిర్భరయా గిరా|

రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయ॥7929॥

 18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

హస్తగ్రాహోఽపరో మాభూద్గృహీతాయాస్త్వయా హి మే|

ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః|

యదిదం కూపలగ్నాయా భవతో దర్శనం మమ॥7930॥

 18.22 (ఇరువది రెండవ శ్లోకము)

న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ|

కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా॥7931॥

అంతట దేవయాని ప్రేమ పరవశయై , వీరుడగు యయాతితో మృదుమధురముగా ఇట్లనెను - "అజేయుడవైన ఓ మహారాజా! మొదఠిసారిగా ఇటుల నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరియొకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమాశాలీ! బావిలో పడియున్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన (మన ఇరువురి సంబంధము) దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినదికాదు. మహాబాహూ! నేనును, బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాపకారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు.

కచుడు బృహస్పతి కుమారుడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యునికడ మృతసంజీవని అను విద్య నభ్యసించెను. దేవయాని కచునిపై మనసు పడియుండెను. అతడు చదువు పూర్తిచేసికొని ఇంటికి వెళ్ళునప్పుడు దేవయాని తనను పెండ్లియాడుమని అతనిని కోరెను. గురుపుత్రియగు దేవయానిని వివాహము చేసికొనుటకు అతడు తిరస్కరించెను. అందులకు కుపితయైన దేవయాని "నీవు నేర్చిన విద్య నీకు పనిచేయకుండుగాక" అని అతనికి శాపమిచ్చెను. అంతట కచుడును 'బ్రాహ్మణుడెవ్వడును నిన్ను పత్నిగా స్వీకరించకుండునుగాక' అని ఆమెకు ప్రతిశాపమిచ్చెను.

 18.23 (ఇరువది రెండవ శ్లోకము)

యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః|

మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః॥7932॥

అంతట యయాతి 'ఈ వివాహము శాస్త్రవిరుద్ధమే యైనను విధినిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సుగూడ ఆమె వైపు ఆకర్షితమైనది' అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను.

 18.24(ఇరువది నాలుగవ శ్లోకము)

గతే రాజని సా వీరే తత్ర స్మ రుదతీ పితుః|

న్యవేదయత్తతః సర్వముక్తం శర్మిష్ఠయా కృతమ్॥7933॥

వీరుడైన యయాతి అచటినుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచు తన తండ్రి కడకు వెళ్ళెను. అనంతరము శర్మిష్ఠ చేసిన దష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపెను.

18.25(ఇరువది ఐదవ శ్లోకము)

దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్|

స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్॥7934॥

18.26 (ఇరువది ఆరవ శ్లోకము)

వృషపర్వా తమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితమ్|

గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయోః పతితః పథి॥7935॥

తన గారాలపట్టియగు దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడగు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యెను. పిమ్మట అతడు 'వృషపర్వునికడ పౌరోహిత్యమొనర్చుటకంటె, ఉంఛవృత్తి ద్వారా జీవించుటయే మేలు' అని తలంచెను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని, తన కుమార్తెతోగూడి అచటినుండి బయలుదేరెను. ఈ విషయము వృషపర్వునకు తెలిసెను. అప్పుడు అతడు 'ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో? తద్ద్వారా తనను శత్రువులు జయింతురేమో? లేదా ఆయన నన్ను శపించునేమో?'  అని శంకించెను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయనకడకు చేరి, ఆయనను ప్రసన్నుని జేసికొనుటకై పాదములపై బడెను.

ఉంఛవృత్తి = ధాన్యందంపుడు రోళ్ళవద్ద పడిన గింజలు ఏరుకొని అవి తిని బ్రతుకుట. లేదా పంట కోసిన తరువాత పంట అక్కడనుండి తీసికొనిపోయిన తరువాత పొలంలో పడిన గింజలు ఏరుకుని భుక్తి గడపుట.

18.27 (ఇరువది ఏడవ శ్లోకము)

క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః|

కామోఽస్యాః క్రియతాం రాజన్ నైనాం త్యక్తుమిహోత్సహే॥7936॥

18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతమ్|

పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను॥7937॥

అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణకాలములోనే శాంతించెను. పిమ్మట పూజ్యుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను. "రాజా! నా ముద్దులపట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను. కనుక, ఆమె కోరినరీతిగా నడచుకొనవలెను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చెదను' అందులకు వృషపర్వుడు ఆమోదించెను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించెను. 'మా తండ్రి నన్ను ఎవరికైనను ఇచ్చి పెండ్లిచేసినను, లేక, నేను ఎచటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను".

18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవమ్|

దేవయానీం పర్యచరత్స్త్రీసహస్రేణ దాసవత్॥7938॥

అంతట శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకటపరిస్థితిని గమనించెను. దేవయాని కోరినట్లు చేయుటవలన కలిగెడి ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించెను. పిమ్మట ఆమె తన వేయిమంది పరిచారికలతోగూడి దేవయానికి సేవలు చేయసాగెను.

18.30 (ముప్పదియవ శ్లోకము)

నాహుషాయ సుతాం దత్త్వా సహ శర్మిష్ఠయోశనా|

తమాహ రాజన్ శర్మిష్ఠామాధాస్తల్పే న కర్హిచిత్॥7939॥

అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఆమెతో శర్మిష్ఠను గూడ దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను. "రాజా! శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోను తల్పముపై చేరనీయరాదు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

యయాతి చరిత్రము

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

విలోక్యౌశనసీం రాజంఛర్మిష్ఠా సప్రజాం క్వచిత్|

తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ॥7940॥

పరీక్షిన్మహారాజా! కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యెను. అంతట ఒకనాడు శర్మిష్ఠ తన  ఋతుకాలమున రహస్యముగా యయాతిని పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించెను.

18.32 (ముప్పది రెండవ శ్లోకము)

రాజపుత్ర్యార్థితోఽపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్|

స్మరన్ఛుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత॥7941॥

అంతట ధర్మజ్లుడైన యయాతి రాజపుత్రికయైన శర్మిష్ఠయొక్క అభ్యర్థన (సంతానప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన) సముచితమైనదే యని భావించెను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష (ఎట్టి పరిస్థితిలోను నీవు ఈమెను చేరదీయరాదు - అను వచనములు) గుర్తునకు వచ్చినను, 'ప్రారబ్ధము ప్రకారము జరుగవలసినది జరుగును' అని భావించి, ఆమె కోరికనుదీర్చెను. (కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లొనర్చెను. దైవప్రాపితమేవ తత్సంగమ్ - అభ్యపద్యత - నతు కామతః (వీరరాఘవీయ వ్యాఖ్య)

18.33 (ముప్పది మూడవ శ్లోకము)

యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత|

ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ॥7942॥

దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని  కూతురైన శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అను ముగ్గురు కుమారులు కలిగిరి.

18.34 (ముప్పది నాలుగ శ్లోకము)

గర్భసంభవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానినీ|

దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛితా॥7943॥

18.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ప్రియామనుగతః కామీ వచోభిరుపమంత్రయన్|

న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః॥7944॥

రాక్షస రాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతివలననే సంతానము ప్రాప్తించినట్లు ఎఱింగి, అహంకారవతియైన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి (తండ్రి కడకు) వెళ్ళెను. కామియైన (స్త్రీ లోలుడైన) యయాతియు తనకు ప్రాణప్రియయైన దేవయానిని అనుసరించి వెళ్ళెను. పిమ్మట అతడు ఆమె కాళ్ళుపట్టుకొని అనునయవచనములతో ప్రసన్నురాలిని చేసికొనుటకై ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యెను.

18.36 (ముప్పది ఆరవ శ్లోకము)

శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష|

త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణామ్॥7945॥

పిమ్మట శుక్రాచార్యుడు కుపితుడై "యయాతీ! నీవు స్త్రీ లోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి. ముసలితనము వలన మానవుని రూపము కళావిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించుగాక" అని పలికెను.

యయాతిరువాచ

18.37 (ముప్పది ఏడవ శ్లోకము)

అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరి స్మ తే|

వ్యత్యస్యతాం యథాకామం వయసా యోఽభిధాస్యతి॥7946॥

అప్పుడు యయాతి ఇట్లు పలికెను - బ్రాహ్మణోత్తమా! మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించినవాడను కాను (దేవయానితో నేను ఇంకను దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగునుగదా!"  అంతట  శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను- "యయాతీ! ఎవ్వరైనను  మనస్ఫూర్తిగా తన యౌవనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి, నీవు సుఖముసు పొందవచ్చును".

18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత|

యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయః॥7947॥

18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహమ్|

వయసా భవదీయేన రంస్యే కతిపయాః సమాః॥7948॥

శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్దకుమారుడగు యదువుతో ఇట్లనెను- "నాయనా! మీ మాతామహుని (తల్లియొక్క తండ్రి) వలన ప్రాప్తించిన నా ముసలితనమును దీసికొని, నీ యౌవనమును నాకు ఇమ్ము. నేను ఇంకను విషయసుఖములయందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసికొనిన యౌవనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను.

యదురువాచ

18.40  (నలుబదియవ శ్లోకము)

నోత్సహే జరసా స్థాతుమంతరా ప్రాప్తయా తవ|

అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః॥7949॥

యదువు పలికెను - "తండ్రీ! నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్థక్యమును తీసికొనుటకు నేను సిద్ధముగా లేను. ఏలయన, మానవుడు విషయ సుఖములను అనుభవింపకముందే వైరాగ్యమును  పొందజాలడు గదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


18.41 (నలుబది ఒకటవ శ్లోకము)

తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత|

ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయః॥7950॥

పరీక్షిన్మహారాజా! యయాతి తన పుత్రులైన తుర్వసుని, ద్రుహ్యుని, అనువును గూడ ఇట్లే అర్థించెను. కాని అనిత్యమైన యౌవనమును శాశ్వతమని భావించుచున్న  అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి.

18.42 (నలుబది రెండవ శ్లోకము)

అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికమ్| 

న త్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి॥7951॥

అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికిని, గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరుని పిలిచి యయాతి ఇట్లడిగెను- "నాయనా! నీ అన్నలవలె నీవును నా కోరికను తిరస్కరింపవు గదా!"

పూరురువాచ

18.43 (నలుబది ఒకటవ శ్లోకము)

కో ను లోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్|

ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరమ్॥7952॥

18.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఉత్తమశ్చింతితం కుర్యాత్ప్రోక్తకారీ తు మధ్యమః|

అధమోఽశ్రద్ధయా కుర్యాదకర్తోచ్చరితం పితుః॥7953॥

పూరువు పలికెను "తండ్రీ! మహారాజా!పుత్రునియొక్క శరీరము (జన్మ) నిజముగా తండ్రినుండియే లభించినది. పైగా, తండ్రి అనుగ్రహము ఉన్నచో (సుతునకు) పరమపదము గూడ ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రియొక్క మనస్సెరిగి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రియాజ్ఞ యైనంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరసావహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలోని స్థితిలో అశ్రద్ధతో ఆచరించువాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించువాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పికొనుటకే అర్హుడు కాడు. యదార్థముగా అతడు పురీషప్రాయుడు.

 18.45 (నలుబది  ఐదవ శ్లోకము)

ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః|

సోఽపి తద్వయసా కామాన్ యథావజ్జుజుషే నృప॥7954॥

పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతట యయాతియు తన కుమారుడగు పూరుడు ఇచ్చిన యౌవనముతో తనివితీర సుఖములను అనుభవించెను.

18.46 (నలుబది ఆరవ శ్లోకము)

సప్తద్వీపపతిః సంయక్ పితృవత్పాలయన్ ప్రజాః|

యథోపజోషం విషయాంజుజుషేఽవ్యాహతేంద్రియః॥7955॥

అప్పుడు సప్తద్వీపాధిపతియైన యయాతి ప్రజలను తన కన్న బిడ్డలవలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియపటుత్వము కలిగియున్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోర్కెను దీర్చుకొనెను.

18.47 (నలుబది ఏడవ శ్లోకము)

దేవయాన్యప్యనుదినం మనోవాగ్దేహవస్తుభిః|

ప్రేయసః పరమాం ప్రీతిమువాహ ప్రేయసీ రహః॥7956॥

అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడగు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలొనర్చుచు, ఏకాంతముస ముద్దుమురిపెములతో సంతోషింపజేయుచుండెను.

18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః|

సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిమ్॥7957॥

వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాడ్రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు. ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలప్రదాత. అంతేగాదు తనను ఆరాధించిన వారియొక్క సకలబాధలను తొలగించువాడు ఆ పరమాత్మ.

క్రతుభిః సర్వదేవతా శరీరకం, ఆరాధక - ఆర్తిహరం, సర్వయజ్ఞారాధ్యం, తత్ఫలదం, తద్భోక్తారం భగవంతమ్  అయజత్ - (ఆరాధితవాన్) (వీరరాఘవీయ వ్యాఖ్య)

అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణల నొసంగి తృప్తి పరచెను.

హతో యజ్ఞస్త్వదక్షిణః = దక్షిణలను ఒసంగకుండ చేసెడి యజ్ఞము నిష్ఫలము (నీతిశాస్త్రము)

18.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః|

నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః॥7958॥

18.50 (ఏబదియవ శ్లోకము)

తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయమ్|

నారాయణమణీయాంసం నిరాశీరయజత్ప్రభుమ్॥7959॥

ఒక్కొక్కప్పుడు  మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండును. మరియొకప్పుడు అవి అదృశ్యములగు చుండును. అట్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలోభాసిల్లుచుండును. మరియొకప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా - పాలనదశలో దేవమనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతమగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై, అవ్యక్తమగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథములవలె చంచలము, కల్పితము. శ్రీమన్నారాయణుడు సకలప్రాణుల హృదయములలో విరాజమానుడై యుండును. ఆస్వామి స్వరూపము సూక్ష్మాతిసూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి ఐన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామభావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను ఒనర్చెను.

18.51 (ఏబది ఒకటవ శ్లోకము)

ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనఃసుఖమ్|

విదధానోఽపి నాతృప్యత్సార్వభౌమః కదింద్రియైః॥7960॥

ఈ విధముగా యయాతి, చంచలములైన షడింద్రియములచే వేయి సంవత్సరములపాటు మానసిక భోగములను అనుభవించుచున్నను అతనికి తనివిదీరకుండెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  పదునెనిమిదవ అధ్యాయము (18)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు పలికెను - "పరీక్షిన్మహారాజా! యయాతి ఈ విధముగా స్త్రీలోలుడై సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి, విరక్తిని పొందెను. అంతట అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను.

భృగువంశజురాలైన దేవయానీ! నావలె విషయసుఖ లోలుడైన వానియొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై, జితేంద్రియులైన వనవాసులు (మునులు; వారికై జాలిపడుచు) ఆలోచించుచుందురు.

ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువుకొఱకై వెదకుచు అటునిటు సంచరించు చుండెను. అప్పుడు అది  కర్మవశముస బావిలో పడియున్న ఒక మేకను చూచెను.

పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలోనుండి గట్టెక్కించుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను.

పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యౌవనములో నున్న ఆ మేకపోతు చక్కని మీసములుగలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై యుండెను. అట్టి మేకపోతును జూచి, తక్కిన మేకలన్నియును దానిపై మోహపడసాగెను. అంతట ఆ ఒక్క మేకపోతే అచటి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలోబడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.

అప్పుడు బావిలోనుండి బయటపడిన మేక,  తన భర్తయైన పోతుపై మరులుగొనిన మరియొక మేకతో తన పతి (పోతు) క్రీడించుట చూచి, దాని చేష్టలను సహింపలేకపోయెను. అంతట అది 'ఈ మేకపోతు మిక్కిలి కామాతుర. దీని ప్రేమ క్షణికమైనది. కనుక, దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు. అనగా - పయోముఖ విషకుంభము' అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి, కుమలిపోవుచు తన పాలకుని కడకు వెళ్ళిపోయెను.

అంతట ఆ మేకపై మోహములో మునిగియున్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచు దానిని (ఆ మేకను) సానుకూలముగా జేసికొనుటకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు 'మే-మే' అని అఱచుచు వెంబడించినను అది (ఆ పోతు) దానిని (ఆ మేకను) దారికి తీసికొని రాలేకపోయెను.

ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేసెను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుటకొఱకై వాటిని   ఎప్పటివలె సంధించెను. ప్రియురాలా! అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావినుండి లభించిన ఆ మేకతో పెద్దకాలము తనివిదీర సుఖించెను. ఐనను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను.

చక్కని కనుతీరుగల సుందరీ! ప్రస్తుతము నా పరిస్థితి గూడ ఆ మేకపోతువలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలోపడి మిక్కిలి దీనుడనై యున్నాను. నీ మాయలో చిక్కుపడియుండుటచే నేను ఇప్పటికిని నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను.

లోకమున అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశుసంపదలు, భార్యాపుత్రులు ఇవి యేమియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు (వదలవు) సరిగదా, అతనిలో  అవి వృద్ధిచెందుచునే యుండును. ఎట్లనగా, ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయే గాక, అవి ఇంకను ఎగసిపడుచుండునుగదా!

మనుష్యుడు సకల ప్రాణుల యెడలను, వస్తువులమీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును. అనగా సమదర్శియగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులును సుఖమయములుగా తోచును.

మందబుద్ధులు (అజ్ఞానులు) అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కాని, అతనిలో తృష్ణమాత్రము నిత్యనూతనముగా పెంపగుచునే యుండును. కావున శ్రేయస్సును (శాంతిని) కోరుకొనువాడు వెంటనే తృష్ణను వీడవలెను.

తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఏలయన, ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని ఐనను చలింపజేయును. కనుక, స్త్రీలు సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను.

నేను పూర్తిగా వేయిసంవత్సరముల నుండి తరచుగా విషయసుఖములను అనుభవించుచునే యుంటిని. ఐనను వాటియందు (సుఖభోగములయందలి) లాలస అనుక్షణము వృద్ధి చెందుచునే యున్నది.

అందువలన నేను అట్టి భోగతృష్ణను త్యజించి, మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై, అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో గూడి నివసింతును.

ఇహలోక సుఖములుగాని, పరలోక సుఖములుగాని (ఐహికాముష్మిక సుఖములలో ఏవైనను) శ్రేయస్కరములుగావు. కనుక, ఎవ్వడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు. వాటికి లోనుకారాదు. చింతించుటవలన జననమరణ చక్రమున చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుటవలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి, వీటికి దూరముగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏   ..... (1)

విషయసుఖములయెడ విరక్తుడైన యయాతి తన భార్యయగు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూరునకు అతని యౌవనమును అప్పగించి, అతనినుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమునగల ప్రదేశమునకు ద్రుహ్యుని, దక్షిణమునగల ప్రదేశమునకు యదువును, పశ్చిమభాగమునకు తుర్వసును, ఉత్తరభాగమునకు అనువును ప్రభువులనుగా జేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి, ప్రజాపాలన భారమును, ఆయనకు అప్ఫగించెను. అతని సోదరులు అందరును అతని వశములో ఉండునట్లు గావించి, తాను వనములకు వెళ్ళెను.

ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయసుఖ భోగములను అనుభవించియుండెను. ఐనను ఱెక్కలు వచ్చిన పక్షి గూటినివలె, అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయెను.

యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగపరిత్యాగియై ఆత్మసాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై, భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను.

యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట - దేవయాని ఇట్లు తలపోసెను. 'పరస్పరానురాగముగల స్త్రీ పురుషులకు విరహబాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపుటకే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్ఫెను. కాని ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ గాదు. వాస్తవముగా తనలో అంతర్మథనము జరుగుటకై అనగా - తనను నివృత్తి మార్గమునకు మళ్ళించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు (పతి, పత్నీపుత్రాదులు) అందరుసు భగవధీనములోనివారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. అని భగవన్మాయా విలసితము, స్వప్నసదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయములయెడ ఆసక్తిని వీడెను. కృష్ణపరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూలదేహమును పరిత్యజించెను.

వాసుదేవుడు జగతృష్టికారకుడు. ఆ స్వామి సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు. విరాట్ స్వరూపుడు. సకలలోకములకును ఆధారభూతుడు. అట్టిభగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను శుకమహర్షిగాని, సూతుడుగాని చేసినట్లు భావింపనగును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  పందొమ్మిదవ అధ్యాయము (19)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



శ్రీశుక ఉవాచ

19.1 (ప్రథమ శ్లోకము)

స ఇత్థమాచరన్ కామాన్ స్త్రైణోఽపహ్నవమాత్మనః|

బుద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాథామేతామగాయత॥7961॥

శ్రీశుకుడు పలికెను - "పరీక్షిన్మహారాజా! యయాతి ఈ విధముగా స్త్రీలోలుడై సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి, విరక్తిని పొందెను. అంతట అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను.

19.2 (రెండవ శ్లోకము)

శృణు భార్గవ్యమూం గాథాం మద్విధాచరితాం భువి|

ధీరా యస్యానుశోచంతి వనే గ్రామనివాసినః॥7962॥

భృగువంశజురాలైన దేవయానీ! నావలె విషయసుఖ లోలుడైన వానియొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై, జితేంద్రియులైన వనవాసులు (మునులు; వారికై జాలిపడుచు) ఆలోచించుచుందురు.

19.3 (మూడవ శ్లోకము)

బస్త ఏకో వనే కశ్చిద్విచిన్వన్ ప్రియమాత్మనః|

దదర్శ కూపే పతితాం స్వకర్మవశగామజామ్॥7963॥

ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువుకొఱకై వెదకుచు అటునిటు సంచరించు చుండెను. అప్పుడు అది  కర్మవశముస బావిలో పడియున్న ఒక మేకను చూచెను.

19.4 (నాలుగవ శ్లోకము)

తస్యా ఉద్ధరణోపాయం బస్తః కామీ విచింతయన్|

వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోధసీ॥7964॥

పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలోనుండి గట్టెక్కించుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను.

19.5 (ఐదవ శ్లోకము)

సోత్తీర్య కూపాత్సుశ్రోణీ తమేవ చకమే కిల|

తయా వృతం సముద్వీక్ష్య బహ్వ్యోఽజాః కాంతకామినీః॥7965॥

19.6 (ఆరవ శ్లోకము)

పీవానం శ్మశ్రులం ప్రేష్ఠం మీఢ్వాంసం యాభకోవిదమ్|

స ఏకోఽజవృషస్తాసాం బహ్వీనాం రతివర్ధనః|

రేమే కామగ్రహగ్రస్త ఆత్మానం నావబుధ్యత॥7966॥

పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యౌవనములో నున్న ఆ మేకపోతు చక్కని మీసములుగలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై యుండెను. అట్టి మేకపోతును జూచి, తక్కిన మేకలన్నియును దానిపై మోహపడసాగెను. అంతట ఆ ఒక్క మేకపోతే అచటి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలోబడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.

19.7 (ఏడవ శ్లోకము)

తమేవ ప్రేష్ఠతమయా రమమాణమజాన్యయా|

విలోక్య కూపసంవిగ్నా నామృష్యద్బస్తకర్మ తత్॥7967॥

19.8 (ఎనిమిదవ శ్లోకము)

తం దుర్హృదం సుహృద్రూపం కామినం క్షణసౌహృదమ్|

ఇంద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితా యయౌ॥7968॥

అప్పుడు బావిలోనుండి బయటపడిన మేక,  తన భర్తయైన పోతుపై మరులుగొనిన మరియొక మేకతో తన పతి (పోతు) క్రీడించుట చూచి, దాని చేష్టలను సహింపలేకపోయెను. అంతట అది 'ఈ మేకపోతు మిక్కిలి కామాతుర. దీని ప్రేమ క్షణికమైనది. కనుక, దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు. అనగా - పయోముఖ విషకుంభము' అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి, కుమలిపోవుచు తన పాలకుని కడకు వెళ్ళిపోయెను.

19.9 (తొమ్మిదవ శ్లోకము)

 సోఽపి చానుగతః స్త్రైణః కృపణస్తాం ప్రసాదితుమ్|

కుర్వన్నిడవిడాకారం నాశక్నోత్పథి సంధితుమ్॥7969॥

అంతట ఆ మేకపై మోహములో మునిగియున్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచు దానిని (ఆ మేకను) సానుకూలముగా జేసికొనుటకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు 'మే-మే' అని అఱచుచు వెంబడించినను అది (ఆ పోతు) దానిని (ఆ మేకను) దారికి తీసికొని రాలేకపోయెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

21.10.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము -  పందొమ్మిదవ అధ్యాయము

యయాతి గృహత్యాగము చేయుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

19.10 (పదియవ శ్లోకము)

తస్యాస్తత్ర ద్విజః కశ్చిదజాస్వామ్యచ్ఛినద్రుషా|

లంబంతం వృషణం భూయః సందధేఽర్థాయ యోగవిత్॥7970॥

19.11 (పదకొండవ శ్లోకము)

సంబద్ధవృషణః సోఽపి హ్యజయా కూపలబ్ధయా|

కాలం బహుతిథం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి॥7971॥

ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేసెను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుటకొఱకై వాటిని   ఎప్పటివలె సంధించెను. ప్రియురాలా! అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావినుండి లభించిన ఆ మేకతో పెద్దకాలము తనివిదీర సుఖించెను. ఐనను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను.

19.12 (పండ్రెండవ శ్లోకము)

తథాహం కృపణః సుభ్రు భవత్యాః ప్రేమయంత్రితః|

ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా॥7972॥

చక్కని కనుతీరుగల సుందరీ! ప్రస్తుతము నా పరిస్థితి గూడ ఆ మేకపోతువలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలోపడి మిక్కిలి దీనుడనై యున్నాను. నీ మాయలో చిక్కుపడియుండుటచే నేను ఇప్పటికిని నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను.

19.13 (పదమూడవ శ్లోకము)

యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః|

న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే॥7973॥

19.14 (పదునాలుగవ శ్లోకము)

న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి|

హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥7974॥

లోకమున అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశుసంపదలు, భార్యాపుత్రులు ఇవి యేమియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు (వదలవు) సరిగదా, అతనిలో  అవి వృద్ధిచెందుచునే యుండును. ఎట్లనగా, ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయే గాక, అవి ఇంకను ఎగసిపడుచుండునుగదా!

19.15 (పదిహేనవ శ్లోకము)

యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగళమ్|

సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః॥7975॥

మనుష్యుడు సకల ప్రాణుల యెడలను, వస్తువులమీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును. అనగా సమదర్శియగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులును సుఖమయములుగా తోచును.

19.16  (పదహారవ శ్లోకము)

యా దుస్త్యజా దుర్మతిభిర్జీర్యతో యా న జీర్యతే|

తాం తృష్ణాం దుఃఖనివహాం శర్మకామో ద్రుతం త్యజేత్॥7976॥

మందబుద్ధులు (అజ్ఞానులు) అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కాని, అతనిలో తృష్ణమాత్రము నిత్యనూతనముగా పెంపగుచునే యుండును. కావున శ్రేయస్సును (శాంతిని) కోరుకొనువాడు వెంటనే తృష్ణను వీడవలెను.

19.17 (పదిహేడవ శ్లోకము)

మాత్రా స్వస్రా దుహిత్రా వా నావివిక్తాసనో భవేత్|

బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి॥7977॥

తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఏలయన, ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని ఐనను చలింపజేయును. కనుక, స్త్రీలు సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను.

19.18 (పదునెనిమిదవ శ్లోకము)

పూర్ణం వర్షసహస్రం మే విషయాన్ సేవతోఽసకృత్|

తథాపి చానుసవనం తృష్ణా తేషూపజాయతే॥7978॥

నేను పూర్తిగా వేయిసంవత్సరముల నుండి తరచుగా విషయసుఖములను అనుభవించుచునే యుంటిని. ఐనను వాటియందు (సుఖభోగములయందలి) లాలస అనుక్షణము వృద్ధి చెందుచునే యున్నది.

19.19 (పందొమ్మిదవ శ్లోకము)

తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసమ్|

నిర్ద్వంద్వో నిరహంకారశ్చరిష్యామి మృగైః సహ॥7979॥

అందువలన నేను అట్టి భోగతృష్ణను త్యజించి, మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై, అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో గూడి నివసింతును.

19.20 (ఇరువదియవ శ్లోకము)

దృష్టం శ్రుతమసద్బుద్ధ్వా నానుధ్యాయేన్న సంవిశేత్|

సంసృతిం చాత్మనాశం చ తత్ర విద్వాన్ స ఆత్మదృక్॥7980॥

ఇహలోక సుఖములుగాని, పరలోక సుఖములుగాని (ఐహికాముష్మిక సుఖములలో ఏవైనను) శ్రేయస్కరములుగావు. కనుక, ఎవ్వడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు. వాటికి లోనుకారాదు. చింతించుటవలన జననమరణ చక్రమున చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుటవలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి, వీటికి దూరముగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః|

దత్త్వా స్వాం జరసం తస్మాదాదదే విగతస్పృహః॥7981॥

19.22 (ఇరువది రెండవ శ్లోకము)

దిశి దక్షిణపూర్వస్యాం ద్రుహ్యుం దక్షిణతో యదుమ్|

ప్రతీచ్యాం తుర్వసుం చక్రే ఉదీచ్యామనుమీశ్వరమ్॥7982॥

19.23 (ఇరువది మూడవ శ్లోకము)

భూమండలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశామ్|

అభిషిచ్యాగ్రజాంస్తస్య వశే స్థాప్య వనం యయౌ॥7983॥

విషయసుఖములయెడ విరక్తుడైన యయాతి తన భార్యయగు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూరునకు అతని యౌవనమును అప్పగించి, అతనినుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమునగల ప్రదేశమునకు ద్రుహ్యుని, దక్షిణమునగల ప్రదేశమునకు యదువును, పశ్చిమభాగమునకు తుర్వసును, ఉత్తరభాగమునకు అనువును ప్రభువులనుగా జేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి, ప్రజాపాలన భారమును, ఆయనకు అప్ఫగించెను. అతని సోదరులు అందరును అతని వశములో ఉండునట్లు గావించి, తాను వనములకు వెళ్ళెను.

19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సః|

క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః॥7984॥

ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయసుఖ భోగములను అనుభవించియుండెను. ఐనను ఱెక్కలు వచ్చిన పక్షి గూటినివలె, అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయెను.

19.25 (ఇరువది ఐదవ శ్లోకము)

స తత్ర నిర్ముక్తసమస్తసంగ  ఆత్మానుభూత్యా విధుతత్రిలింగః|

పరేఽమలే బ్రహ్మణి వాసుదేవే  లేభే గతిం భాగవతీం ప్రతీతః॥7985॥

యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగపరిత్యాగియై ఆత్మసాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై, భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను.

19.26 (ఇరువది ఆరవ శ్లోకము)

శ్రుత్వా గాథాం దేవయానీ మేనే ప్రస్తోభమాత్మనః|

స్త్రీపుంసోః స్నేహవైక్లవ్యాత్పరిహాసమివేరితమ్॥7986॥

19.27 (ఇరువది ఏడవ శ్లోకము)

సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్ఛతామ్|

విజ్ఞాయేశ్వరతంత్రాణాం మాయావిరచితం ప్రభోః॥7987॥

19.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సర్వత్ర సంగముత్సృజ్య స్వప్నౌపమ్యేన భార్గవీ|

కృష్ణే మనః సమావేశ్య వ్యధునోల్లింగమాత్మనః॥7988॥

యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట - దేవయాని ఇట్లు తలపోసెను. 'పరస్పరానురాగముగల స్త్రీ పురుషులకు విరహబాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపుటకే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్ఫెను. కాని ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ గాదు. వాస్తవముగా తనలో అంతర్మథనము జరుగుటకై అనగా - తనను నివృత్తి మార్గమునకు మళ్ళించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు (పతి, పత్నీపుత్రాదులు) అందరుసు భగవధీనములోనివారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. అని భగవన్మాయా విలసితము, స్వప్నసదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయములయెడ ఆసక్తిని వీడెను. కృష్ణపరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూలదేహమును పరిత్యజించెను.

19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే|

సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః॥7989॥

వాసుదేవుడు జగతృష్టికారకుడు. ఆ స్వామి సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు. విరాట్ స్వరూపుడు. సకలలోకములకును ఆధారభూతుడు. అట్టిభగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను శుకమహర్షిగాని, సూతుడుగాని చేసినట్లు భావింపనగును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు  పందొమ్మిదవ అధ్యాయము (19)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏