సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము, గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము, ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు పలికెను - ధర్మరాజా! దైత్యబాలకులు ఇట్లు ప్రశ్నింపగా భాగవతోత్తముడైన ప్రహ్లాదునకు నేను తెలిపిన మాటలు స్మరణకు వచ్చెను. అప్ఫుడతడు పరమానందభరితుడై చిరునవ్వుతో ఇట్లుపలికెను-
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు నుడివెను- మా తండ్రియైన హిరణ్యకశిపుడు తపస్సుచేయుటకై మందరాచలమునకు వెళ్ళియుండెను. అప్పుడు ఇంద్రాదిదేవతలు దానవులపై యుద్ధమొనర్చుటకు ఉద్యమించిరి. ఇంద్రాదిదేవతలు ఇట్లు పలికిరి- చీమలు ఒక మహాసర్పమును భక్షించినట్లుగా, లోకములను తపింపజేసిన పాపియగు హిరణ్యకశిపుని, దైవవశమున అతని పాపములే తినివేసినవి. ఇంతలో దేవతలు తమతో గొప్ప యుద్దము చేయుటకు ప్రయత్నించుచున్నారను విషయము దైత్య సేనాపతులకు తెలిసెను. అప్పుడు వారి ధైర్యము సడలిపోయెను. దేవతలచే దెబ్బతిని వారు స్త్రీలను, పుత్రులను , మిత్రులను, భవనములకు, పశువులను, గృహోపకరణములను గూర్చి ఆలోచింపక తమ ప్రాణములను రక్షించుకొనుటకై త్వరత్వరగా ఎటు వారటు పారిపోయిరి. విజయమును కోరుకొనుచున్న దేవతలు రాజభవనములోని వస్తువులను చెల్లాచెదరు చేసిరి. ఇంద్రుడు పట్టమహిషియు, నాతల్లియు ఐన కయాధువును గూడ బందీగా చేసెను. నా తల్లి భయపడుచు కురరీ పక్షివలె రోదింపసాగెను. కాని, ఇంద్రుడు ఆమెను బలవంతముగా తీసికొనిపోయెను. అప్పుడు దైవికముగా నారదమహర్షి అచటికి ఏతెంచెను. అతడు మార్గమధ్యమున ఏడ్చుచున్న నా తల్లిని జూచెను.
ఆ దేవర్షి ఇట్లు పలికెను "సురపతీ! ఈమె నిరపరాధి. ఈమెను తీసికొనిపోవుట ఉచితముగాదు. సాధ్వియైన పరసతిని ఇట్లు అవమానించరాదు. ఈమెను వదలివేయుము. వెంటనే వదలి వేయుము.
ఇంద్ర ఉవాచ
ఇంద్రుడు పలికెను- ఈమె గర్భమును దేవద్రోహియైన హిరణ్యకశిపుని వీర్యము గలదు. అది మిక్కిలి ప్రభావము గలది. ప్రసవించువరకు ఈమె నా యొద్ద ఉండగలదు. బాలుడు జన్మింపగనే అతనిని వధించి, నేను ఈమెను వదలిపెట్టెదను.
నారద ఉవాచ
నారదుడు పలికెను- ఈమె గర్భమున ఉదయించువాడు పరమభాగవతుడు. అతడు పుణ్యాత్ముడు, మహాశక్తిగలవాడు. భగవంతుని సేవకుడైన ఇతనిని చంపగల శక్తి నీకు లేదు.
దేవర్షియైన నారదుని మాటలను విని ఇంద్రుడు మహాసాధ్వియగు నా తల్లిని వదలిపెట్టెను. ఈమె గర్భము నందు భగవద్భక్తుడు కలడని తెలిసికొని, అతడు నా తల్లికి ప్రదక్షిణమొనర్చి, స్వర్గలోకమునకు వెళ్ళపోయెను.
అనంతరము దేవర్షియైన నారదుడు నా తల్లిని తన ఆశ్రమమునకు తీసికొని పోయెను. ఆమెను ఓదార్చి - 'బిడ్డా! నీ భర్త తపస్సు ముగించుకొని తిరిగి వచ్చునంతవరకు నీవు ఇచటనే యుండుము' అని పల్కెను.
'అట్లే' అని పలికి, ఆమె దేవర్షి ఆశ్రమమునందే నిర్భయముగా ఉండసాగెను. మా తండ్రి తీవ్రమైన తన తపస్సునుండి తిరిగి వచ్చునంతవరకు ఆమె అక్కడనే యుండెను.
గర్భవతియైన నా తల్లి ఆమె గర్భస్థుడనై యున్న నా శుభము కొరకును, సరియైన సమయములో క్షేమముగా సంతాన ప్రాప్తికొరకును భక్తి శ్రద్ధలతో నారదునకు శుశ్రూషలు చేయసాగెను.
గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
దేవర్షియైన నారదుడు మిగుల దయాళువు, సర్వసమర్థుడు. అతడు నా తల్లికి భాగవత ధర్మరహస్యములను, విశుద్ధజ్ఞానమును ఉపదేశించెను. ఆయన అట్లు ఉపదేశించునపుడు ఆ మహాత్ముని దృష్టి నాపై పడియుండెను.
చాల సమయము గడచుటవలనను, స్త్రీ యగుటవలనను నా తల్లికి ఆ జ్ఞానము ఇప్పుడు జ్ఞాపకము లేదు. కాని దేవర్షియొక్క విశేషకృపవలన ఆ ఉపదేశమును నేను ఏ మాత్రమూ మరచిపోలేదు.
నా మాటపై మీకు విశ్వాసమున్నచో, మీకు గూడ ఆ జ్ఞానము లభ్యమగును. ఏలయన, తగు శ్రద్ధవలన దేహాదులయందు అహంభావమును నశింపచేయునట్టి శుద్ధమైన బుద్ధి నాకు లభించినట్లుగానే, స్త్రీలకు, బాలురకు కూడా లభింపగలదు.
కాలస్వరూపుడైన పరమేశ్వరుని ప్రేరణచే వృక్షములకు కాయలుగాయును. అవి కొంతకాలము వరకు ఉండును. అవి వృద్ధి చెందును, ఫలించును, క్షీణించును, నష్టమగును. అట్లే ఈ శరీరమునకు గూడ జననము, అస్తిత్వము, వృద్ది, పరిణామము, క్షయము, వినాశము అని ఆరు భావవికారములు కలుగుచుండును. కాని, ఆత్మకు ఏవిధముగను వీటితో సంబంధము ఉండదు. ఆత్మ నిత్యము, అవినాశి, శుద్ధము, ఏకము, క్షేత్రజ్ఞము, ఆశ్రయము, నిర్వికారము, స్వయంప్రకాశకము, సర్వకారణము, వ్యాపకము, అసంగము, ఆవరణరహితము - ఐనది.
పైన తెలుపబడిన పన్నెండును ఆత్మయొక్క ఉత్కృష్టలక్షణములు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనగోరు పురుషుడు అజ్ఞాన కారణముగా దేహాదుల యందు గల నేను-నాది అను మిథ్యా భావమును విడిచిపెట్టవలెను.
గనులయందు బంగారము రాళ్ళతో కలిసియుండును. స్వర్ణకారుడు ఆ బంగారమును వెలికితీయు విధులను తెలిసికొని, ఆ విధులద్వారా బంగారమును సంపాదించు కొనును. అట్లే అధ్యాత్మతత్త్వము తెలిసికొన దలచిన పురుషుడు ఆత్మప్రాప్తి యొక్క ఉపాయముల ద్వారా తన శరీరము అను క్షేత్రమునందే బ్రహ్మపదమును సాక్షాత్కరింపజేసి కొనును.
మూలప్రకృతి, మహతత్త్వము అహంకారము, పంచతన్మాత్రలు అను ఎనిమిది తత్త్వములను ప్రకృతి అని ఆచార్యులు (గురువులు) తెలిపిరి. ఆ ప్రకృతి సత్త్వము, రజస్సు, తమస్సు - అను మూడుగుణములు గలది. పది ఇంద్రియములు, మనస్సు, పంచమహాభూతములు అను పదహారును దాని వికారములు. వీటి అన్నింటియందును ఒక పురుషుడు (ఆత్మ) చైతన్య స్వరూపుడుగా వ్యాపించియుండును.
వీటి అన్నింటి సముదాయమే దేహము. ఇది స్థావరములు, జంగమములు - అని రెండు విధములు. ఇందలి అంతఃకరణము, ఇంద్రియములు మొదలగు అనాత్మ పదార్థములను ఇదికాదు-ఇదికాదు అని నిరాకరించుచు ఆత్మను అన్వేషింపవలెను.
ఆత్మ అన్నింటియందు వ్యాపించియున్నది. కాని, అది అన్నింటికంటె వేరుగా ఉన్నది. విలక్షణమైనది. ఈ విధముగా శుద్ధమైన బుద్ధితో నెమ్మది-నెమ్మదిగా జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను గూర్చి వివేచన చేయవలెను. ఈ విచారమునందు ఎంతమాత్రము తొందరపాటు పనికిరాదు.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడును బుద్ధియొక్క వృత్తులు. ఎవరిద్వారా ఈ వృత్తులు అనుభవమునకు వచ్చుచున్నవో, అతడే వీటికి అతీతుడైన సాక్షియగు పరమాత్మ.
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలద్వారా కలిగెడు మార్పులు - చేర్పులు బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందే ఆత్మ అవగతమై యున్నది. అందువలన బుద్ధితో ఏర్పడిన తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మవలననే జరుగుచున్నవా! యని అనిపించును. కావున ఇట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధము అనగా వాసనవలన దానికి ఆశ్రయమైన వాయువును గుర్తించి, గంధమును నిరాకరించినట్లుగా, బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేయునట్టి సాక్షిరూపమున నున్న ఆత్మను తెలిసికొనవలెను.
గుణములచే, కర్మలచే సంబంధము జోడింపబడుటవలన జనన మరణ చక్రములో తిరుగుట తప్పదు. అజ్ఞానమువలన శరీరమందును ఆత్మబుద్ధి కలుగుచున్నది. ఇది మిథ్యయే కాని, సత్యము కాదు. ఐననూ, ఇది స్వప్నమువలె జీవునకు ప్రతీతమగు చుండును.
సోదరులారా! అందువలన మొట్టమొదట మీరు గుణములను అనుసరించుచు కలుగునట్టి కర్మబీజములను నష్టపరచవలెను. దీనివలన బుద్ధియొక్క వృత్తుల ప్రవాహము నివృత్తమగును. దీనినే యోగము, లేక పరమాత్మప్రాప్తి అందురు.
త్రిగుణాత్మకమైన కర్మబీజములను తొలగించుటకును, లేదా బుద్ధివృత్తుల ప్రవాహమును ఆపివేయుటకును వేలకొలది సాధనములు గలవు. భగవంతుని యందు ప్రేమ కలుగుటవలన సహజముగనే అతని స్మరణ జరుగుచుండును. భగవంతుని యెడల ప్రేమ కలుగుటకు ఇదియే సులభోపాయము. ఈ విషయమును భగవానుడే స్వయముగా తెలిపియుండెను.
భక్తితో గురువును సేవించుట, తనకు దొరికిన సకల పదార్థములను భగవంతునకు సమర్పించుట, సాధుపురుషులైన భక్తులతో సాంగత్యము చేయుట, భగవంతుని ఆరాధించుట, ఆ ప్రభువు యొక్క కథలను శ్రద్ధగా వినుట, ఆయన గుణములను, లీలలను శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాదపద్మములను ధ్యానించుట, ఆయన మందిరములోని మూర్తిని దర్శించి, పూజించుట మొదలగు సాధనముల ద్వారా భగవంతుని యందు సహజమైన ప్రేమ (భక్తి) కలుగును.
'సర్వశక్తిమంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలో విరాజిల్లుచున్నాడు' అను భావముచే యథాశక్తి ప్రాణులన్నింటియొక్క అభిలాషలను నెరవేర్పవలెను. హృదయ పూర్వకముగా వారిని గౌరవింపవలెను.
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అను ఆరు శత్రువులను జయించి, పూర్వోక్త విధముగా సాధనములను అనుష్ఠించువారికి భగవంతుడైన శ్రీమహావిష్ణు చరణములయందు అనన్య భక్తి కలుగును.
భగవంతుడు తన లీలావతారములయందు ప్రదర్శించిన అద్భుత బలపరాక్రమములను, సాటిలేని ఆ స్వామి గుణములను, కర్మలను వినుట వలన అత్యంత ఆనందాతిరేకముతో మానవుని శరీరము పులకించును. కన్నులలో అశ్రువులు స్రవించి,, కంఠము గద్గదమగును. సంకోచమును విడిచి, అతడు బిగ్గరగా అరచుచు, గానము చేయుచు నాట్యము చేయును. ఒక్కొక్కసారి, గ్రహగ్రస్తుడైన పిచ్చివానివలె నవ్వుచుండును. కరుణా పూరితమైన ఆక్రందనలు చేయుచుండును. ఒక్కొక్కసారి ధ్యానమగ్నుడగును. భగవద్భావముతో జనులకు నమస్కరించుచుండును. భగవంతునియందు తన్మయుడై మాటిమాటికిని దీర్ఘనిశ్వాసములను విడచుచుండును. బిడియమును విడిచి, హరీ! జగన్నాథా! నారాయణా అనుచు గట్టిగ అరచుచుండును. ఇట్టి భక్తి యోగ ప్రభావమున అతని బంధములన్నియును తెగిపోవును. అతని హృదయము భగవన్మయమగును. అట్టి సమయమున అతని జనన, మరణములకు హేతువులగు వాసనా రూపములగు బీజములన్నియును దగ్ధమైపోవును. అంతట ఆ పురుషుడు భగవత్ప్రాప్తిని పొందును.
భక్తియోగముద్వారా భగవంతుని ఆశ్రయించుటచే జీవుని అమంగళకరమైన సంస్కారములన్నియును నశించిపోవును. దీనివలన సంసార చక్రము నివారింపబడును. ఆ శ్రీహరిచే బ్రహ్మగా, నిర్వాణసుఖముగా మహాత్ములు పేర్కొందురు. కనుక మిత్రులారా! మీరు మీ హృదయములలో అంతరాత్మగా వెలుగొందు భగవంతుని భజింపుడు.
అమరబాలకులారా! మీ హృదయముల యందు భగవంతుడు ఆకాశమువలె నిత్యమై సమానముగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవంతుని భజించుటలో మిక్కిలి ప్రయాస ఏమియు ఉండదు. అతడు సమస్తప్రాణులలో ఆత్మగా నుండు ప్రేమ స్వరూపుడు. అట్టి స్వామిని వదలి భోగ్యసామాగ్రిని సేకరించుటకై తిరుగుట ఎంతటి మూర్ఖత్వము?
సోదరులారా! భార్యాపుత్రులు, బంధువులు, భవనములు, భూములు, సంపదలు, ఇంకను అనేక వైభవములు, జగత్తులోని సమస్తధనము, భోగసామాగ్రి, సర్వమూ, క్షణభంగురములు. నశ్వరములు. ఇట్టి నశ్వరములైన వస్తువులతో శాశ్వతసుఖము లభించునా? అట్టి వాటివలన క్షణికమైన ఆయుష్షుగల మనుజునకు ఎట్టి సుఖముండును?
ఈ లోకమునందలి సంపదలు మనము చూచుచుండగనే నశించుచున్నవి గదా! అట్లే, యజ్ఞములవలన ప్రాప్తించు స్వర్గాది లోకములు గూడ నాశవంతములే. వాటిలో చిన్న-పెద్ద, ఉత్తమ-అధమ తారతమ్యములు ఉండును. తద్ద్వారా పరస్పరముగా స్పర్ధ యేర్పడును. కావున, అవి దోషరహితములు కావు. పరమాత్మ ఒక్కడే. అతడెట్టి దోషములను లేనివాడు. ఆ ప్రభువు నందు ఎవ్వరును దోషములను వినలేదు, కనలేదు. కనుక, అట్టి పరమాత్మ ప్రాప్తికి అనన్య భక్తితో ఆ ప్రభువును భజింపవలెను.
ఈ లోకమున జనులు తామే పండితులమని భావించుచు, సుఖ భోగములను పొందుటకై పదే పదే కర్మలను చేయుచుందురు. వారు వాటిని పొందలేరు సరిగదా, విపరీతఫలములను పొందుదురు. ఇందు సదేహము లేదు.
జనులు కర్మలలో ప్రవృత్తులగుటకు దుఃఖములను దుఃఖములను తప్పించుకొనుట, సుఖములను పొందుట అను రెండు లక్ష్యములు ఉండును. కాని మొదట ఎట్టి కోరికలను లేనివాడు సుఖములో నిమగ్నుడైయుండును. కాని, అతడే సుఖభోగములను ఆశించుటవలన సర్వదా దుఃఖములనే అనుభవింపవలసి వచ్చును.
ఈ లోకములో మనుష్యులు సకామకర్మలద్వారా దైహిక భోగములను పొందగోరుదురు. కాని, ఆ దేహమే శాశ్వతముగాదు. అది ప్రకృతియొక్క అంశమగుటచే జడమైనది. ప్రాప్తించిన శరీరము ఎప్పటికైనను పోకమానదు. ఈ శరీరముయొక్క స్థితియే ఇట్లు ఉన్నప్పుడు, దీని కంటెను వేరైన భార్యాపుత్రులు, భవనములు, ధనము, సంపదలు, రాజ్యము, కోశాగారములు, వాహనములు, మంత్రులు, సేవకులు, గురుజనులు, ఇంకను 'నావి' అని అనుకొను వస్తువుల విషయము చెప్పనేల?
రాజ్యము మొదలగు వస్తువులు అన్నియును తుచ్ఛములే. శరీరముతో బాటు ఇవి అన్నియును నశించునవియే. ఇవి పురుషార్థములవలె కన్పట్టును. కాని, వాస్తవముగా ఇవి అనర్థదాయకములు. ఆత్మ స్వయముగా శాశ్వతము, పరమానంద సముద్రము.
సోదరులారా! ఈ విషయమును గూర్చి కొంచెము ఆలోచింపుడు. జీవుడు తల్లి గర్భములో పడినప్పటినుండి మృత్యుపర్యంతము తన ప్రారబ్ధకర్మానుసారము కష్టపరంపరను అనుభవించుచునే యుండును. ఈ సంసారమున అతనికి చేకూరు స్వార్థమేముండును?
ఈ జీవుడు శరీరమునే తన ఆత్మగా భావించి, పలువిధములైన కర్మలను ఆచరించును. ఆ కర్మల కారణముగా మరియొక శరీరమును ధరించును. ఈ విధముగా కర్మలు, శరీరములు పరంపరగ సంభవించుచునే యుండును. దీనికి అంతటికిని కారణము అజ్ఞానమే.
శ్రీమహావిష్ణువు సకల ప్రాణులకు ప్రభువు, ఆత్మ, ప్రియతముడు. తనచే సృష్టీంపబడిన పంచమహా భూతములు, సూక్ష్మభూతములు మొదలగు వాటి ద్వారా రుపొందిన ఈ శరీరమునందు జీవుడు అని పిలువబడే ప్రియమున ఆత్మ శ్రీహరియే. అతడే సమస్త జీవులలో అంతర్యామిగా వెలుగొందుచున్నాడు.
దేవతలు, దైత్యులు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు మొదలగువారు ఎవ్వరైనను భగవంతుని పాదపద్మములను సేవించి, మనవలె సకల శ్రేయస్సులకును అర్హులగుదురు.
దైత్యబాలకులారా! శ్రీహరిని ప్రసన్నునిగా చేసి కొనుటకు బ్రాహ్మణుడుగా, దేవతగా, ఋషిగా జన్మించుట, సదాచారమును కలిగియుండుట, పెక్కు శాస్త్రముల యందు జ్ఞానమును సంపాదించుట, అట్లే దానము, తపము, యజ్ఞములు, శారీరక, మానసికశౌచము, శ్రేష్ఠములైన వ్రతములను అనుష్ఠించుట మొదలగునవి చాలవు- భగవంతుడు కేవలము నిష్కామభక్తి చేతనే ప్రసన్నుడగును. ఇవి యన్నియును ఆ భక్తికి సహాయకములే.
దానవులారా! కనుక, సకల ప్రాణులను మీ ఆత్మలుగా భావించి, సర్వత్ర విరాజిల్లుచున్న సర్వాత్మయు, సర్వశక్తిమంతుడు ఐన పరమేశ్వరునియెడ భక్తి కలిగియుందురు.
భగవద్భక్తి ప్రభావముచే దైత్యులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గోపాలురు (గొల్లలు), పక్షులు, మృగములు ఇంకను పెక్కుమంది పాప జీవులు గూడ భగవద్భావమును పొందిరి.
ఈ ప్రపంచమున మానవశరీరమును పొందిన జీవుని ఒకే పరమార్థము (పరమప్రయోజనము) భగవంతుడైన గోవిందునియందు అనన్య భక్తిని కలిగియుండుటయే. సర్వదా, సర్వత్ర, సకలవస్తువులలోను భగవంతుని దర్శించుటయే ఆ భక్తియొక్క నిజస్వరూపము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమోఽధ్యాయః (7)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
28.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము
గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
7.1 (ప్రథమ శ్లోకము)
ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతోఽసురః|
ఉవాచ స్మయమానస్తాన్ స్మరన్ మదనుభాషితమ్॥5855॥
నారదుడు పలికెను - ధర్మరాజా! దైత్యబాలకులు ఇట్లు ప్రశ్నింపగా భాగవతోత్తముడైన ప్రహ్లాదునకు నేను తెలిపిన మాటలు స్మరణకు వచ్చెను. అప్ఫుడతడు పరమానందభరితుడై చిరునవ్వుతో ఇట్లుపలికెను-
ప్రహ్లాద ఉవాచ
7.2 (రెండవ శ్లోకము)
పితరి ప్రస్థితేఽస్మాకం తపసే మందరాచలమ్|
యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి ॥5856॥
7.3 (మూడవ శ్లోకము)
పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః|
పాపేన పాపోఽభక్షీతి వాదినో వాసవాదయః॥5857॥
7.4 (నాలుగవ శ్లోకము)
తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః|
వధ్యమానాః సురైర్భీతా దుద్రువుః సర్వతో దిశమ్॥5858॥
7.5 (ఐదవ శ్లోకము)
కలత్రపుత్రమిత్రాప్తాన్ గృహాన్ పశుపరిచ్ఛదాన్|
నావేక్ష్యమాణాస్త్వరితాః సర్వే ప్రాణపరీప్సవః॥5859॥
7.6 (ఆరవ శ్లోకము)
వ్యలుంపన్ రాజశిబిరమమరా జయకాంక్షిణః|
ఇంద్రస్తు రాజమహిషీం మాతరం మమ చాగ్రహీత్॥5860
7.7 (ఏడవ శ్లోకము)
నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ|
యదృచ్ఛయాఽఽగతస్తత్ర దేవర్షిర్దదృశే పథి5861॥
ప్రహ్లాదుడు నుడివెను- మా తండ్రియైన హిరణ్యకశిపుడు తపస్సుచేయుటకై మందరాచలమునకు వెళ్ళియుండెను. అప్పుడు ఇంద్రాదిదేవతలు దానవులపై యుద్ధమొనర్చుటకు ఉద్యమించిరి. ఇంద్రాదిదేవతలు ఇట్లు పలికిరి- చీమలు ఒక మహాసర్పమును భక్షించినట్లుగా, లోకములను తపింపజేసిన పాపియగు హిరణ్యకశిపుని, దైవవశమున అతని పాపములే తినివేసినవి. ఇంతలో దేవతలు తమతో గొప్ప యుద్దము చేయుటకు ప్రయత్నించుచున్నారను విషయము దైత్య సేనాపతులకు తెలిసెను. అప్పుడు వారి ధైర్యము సడలిపోయెను. దేవతలచే దెబ్బతిని వారు స్త్రీలను, పుత్రులను , మిత్రులను, భవనములకు, పశువులను, గృహోపకరణములను గూర్చి ఆలోచింపక తమ ప్రాణములను రక్షించుకొనుటకై త్వరత్వరగా ఎటు వారటు పారిపోయిరి. విజయమును కోరుకొనుచున్న దేవతలు రాజభవనములోని వస్తువులను చెల్లాచెదరు చేసిరి. ఇంద్రుడు పట్టమహిషియు, నాతల్లియు ఐన కయాధువును గూడ బందీగా చేసెను. నా తల్లి భయపడుచు కురరీ పక్షివలె రోదింపసాగెను. కాని, ఇంద్రుడు ఆమెను బలవంతముగా తీసికొనిపోయెను. అప్పుడు దైవికముగా నారదమహర్షి అచటికి ఏతెంచెను. అతడు మార్గమధ్యమున ఏడ్చుచున్న నా తల్లిని జూచెను.
7.8 (ఎనిమిదవ శ్లోకము)
ప్రాహ మైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్|
ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహమ్॥5862॥
ఆ దేవర్షి ఇట్లు పలికెను "సురపతీ! ఈమె నిరపరాధి. ఈమెను తీసికొనిపోవుట ఉచితముగాదు. సాధ్వియైన పరసతిని ఇట్లు అవమానించరాదు. ఈమెను వదలివేయుము. వెంటనే వదలి వేయుము.
ఇంద్ర ఉవాచ
7.9 (ఎనిమిదవ శ్లోకము)
ఆస్తేఽస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః|
ఆస్యతాం యావత్ప్రసవం మోక్ష్యేఽర్థపదవీం గతః॥5863॥
ఇంద్రుడు పలికెను- ఈమె గర్భమును దేవద్రోహియైన హిరణ్యకశిపుని వీర్యము గలదు. అది మిక్కిలి ప్రభావము గలది. ప్రసవించువరకు ఈమె నా యొద్ద ఉండగలదు. బాలుడు జన్మింపగనే అతనిని వధించి, నేను ఈమెను వదలిపెట్టెదను.
నారద ఉవాచ
7.10 (పదియవ శ్లోకము)
అయం నిష్కిల్బిషః సాక్షాన్మహాభాగవతో మహాన్|
త్వయా న ప్రాప్స్యతే సంస్థామనంతానుచరో బలీ॥5864॥
నారదుడు పలికెను- ఈమె గర్భమున ఉదయించువాడు పరమభాగవతుడు. అతడు పుణ్యాత్ముడు, మహాశక్తిగలవాడు. భగవంతుని సేవకుడైన ఇతనిని చంపగల శక్తి నీకు లేదు.
7.11 (పదకొండవ శ్లోకము)
ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః|
అనంతప్రియభక్త్యైనాం పరిక్రమ్య దివం యయౌ॥5865॥
దేవర్షియైన నారదుని మాటలను విని ఇంద్రుడు మహాసాధ్వియగు నా తల్లిని వదలిపెట్టెను. ఈమె గర్భము నందు భగవద్భక్తుడు కలడని తెలిసికొని, అతడు నా తల్లికి ప్రదక్షిణమొనర్చి, స్వర్గలోకమునకు వెళ్ళపోయెను.
7.12 (పండ్రెండవ శ్లోకము)
తతో నో మాతరమృషిః సమానీయ నిజాశ్రమమ్|
ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః॥5866॥
అనంతరము దేవర్షియైన నారదుడు నా తల్లిని తన ఆశ్రమమునకు తీసికొని పోయెను. ఆమెను ఓదార్చి - 'బిడ్డా! నీ భర్త తపస్సు ముగించుకొని తిరిగి వచ్చునంతవరకు నీవు ఇచటనే యుండుము' అని పల్కెను.
7.13 (పదమూడవ శ్లోకము)
తథేత్యవాత్సీద్దేవర్షేరంతి సాప్యకుతోభయా|
యావద్దైత్యపతిర్ఘోరాత్తపసో న న్యవర్తత॥5857॥
'అట్లే' అని పలికి, ఆమె దేవర్షి ఆశ్రమమునందే నిర్భయముగా ఉండసాగెను. మా తండ్రి తీవ్రమైన తన తపస్సునుండి తిరిగి వచ్చునంతవరకు ఆమె అక్కడనే యుండెను.
8.14 (పదునాలుగవ శ్లోకము)
ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ|
అంతర్వర్త్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛాప్రసూతయే॥5868॥
గర్భవతియైన నా తల్లి ఆమె గర్భస్థుడనై యున్న నా శుభము కొరకును, సరియైన సమయములో క్షేమముగా సంతాన ప్రాప్తికొరకును భక్తి శ్రద్ధలతో నారదునకు శుశ్రూషలు చేయసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
29.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము
గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.15 (పదునైదవ శ్లోకము)
ఋషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః|
ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్॥5869॥
దేవర్షియైన నారదుడు మిగుల దయాళువు, సర్వసమర్థుడు. అతడు నా తల్లికి భాగవత ధర్మరహస్యములను, విశుద్ధజ్ఞానమును ఉపదేశించెను. ఆయన అట్లు ఉపదేశించునపుడు ఆ మహాత్ముని దృష్టి నాపై పడియుండెను.
7.16 (పదునారవ శ్లోకము)
తత్తు కాలస్య దీర్ఘత్వాత్స్త్రీత్వాన్మాతుస్తిరోదధే|
ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్స్మృతిః॥5870॥
చాల సమయము గడచుటవలనను, స్త్రీ యగుటవలనను నా తల్లికి ఆ జ్ఞానము ఇప్పుడు జ్ఞాపకము లేదు. కాని దేవర్షియొక్క విశేషకృపవలన ఆ ఉపదేశమును నేను ఏ మాత్రమూ మరచిపోలేదు.
7.17 (పదునేడవ శ్లోకము)
భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః|
వైశారదీ ధీః శ్రద్ధాతః స్త్రీబాలానాం చ మే యథా॥5871॥
నా మాటపై మీకు విశ్వాసమున్నచో, మీకు గూడ ఆ జ్ఞానము లభ్యమగును. ఏలయన, తగు శ్రద్ధవలన దేహాదులయందు అహంభావమును నశింపచేయునట్టి శుద్ధమైన బుద్ధి నాకు లభించినట్లుగానే, స్త్రీలకు, బాలురకు కూడా లభింపగలదు.
7.18 (పదునెనిమిదవ శ్లోకము)
జన్మాద్యాః షడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః|
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా॥5872॥
కాలస్వరూపుడైన పరమేశ్వరుని ప్రేరణచే వృక్షములకు కాయలుగాయును. అవి కొంతకాలము వరకు ఉండును. అవి వృద్ధి చెందును, ఫలించును, క్షీణించును, నష్టమగును. అట్లే ఈ శరీరమునకు గూడ జననము, అస్తిత్వము, వృద్ది, పరిణామము, క్షయము, వినాశము అని ఆరు భావవికారములు కలుగుచుండును. కాని, ఆత్మకు ఏవిధముగను వీటితో సంబంధము ఉండదు.
7.19 (పందొమ్మిదవ శ్లోకము)
ఆత్మా నిత్యోఽవ్యయః శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః|
అవిక్రియః స్వదృగ్ హేతుర్వ్యాపకోఽసంగ్యనావృతః॥5873॥
ఆత్మ నిత్యము, అవినాశి, శుద్ధము, ఏకము, క్షేత్రజ్ఞము, ఆశ్రయము, నిర్వికారము, స్వయంప్రకాశకము, సర్వకారణము, వ్యాపకము, అసంగము, ఆవరణరహితము - ఐనది.
7.20 (ఇరువదియవ శ్లోకము)
ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః|
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్॥5874॥
పైన తెలుపబడిన పన్నెండును ఆత్మయొక్క ఉత్కృష్టలక్షణములు. ఈ ఆత్మతత్త్వమును తెలిసికొనగోరు పురుషుడు అజ్ఞాన కారణముగా దేహాదుల యందు గల నేను-నాది అను మిథ్యా భావమును విడిచిపెట్టవలెను.
7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్|
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగై- రధ్యాత్మవిద్బ్రహ్మగతిం లభేత॥5875॥
గనులయందు బంగారము రాళ్ళతో కలిసియుండును. స్వర్ణకారుడు ఆ బంగారమును వెలికితీయు విధులను తెలిసికొని, ఆ విధులద్వారా బంగారమును సంపాదించు కొనును. అట్లే అధ్యాత్మతత్త్వము తెలిసికొన దలచిన పురుషుడు ఆత్మప్రాప్తి యొక్క ఉపాయముల ద్వారా తన శరీరము అను క్షేత్రమునందే బ్రహ్మపదమును సాక్షాత్కరింపజేసి కొనును.
7.22 (ఇరువది రెండవ శ్లోకము)
అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః|
వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్॥5876॥
మూలప్రకృతి, మహతత్త్వము అహంకారము, పంచతన్మాత్రలు అను ఎనిమిది తత్త్వములను ప్రకృతి అని ఆచార్యులు (గురువులు) తెలిపిరి. ఆ ప్రకృతి సత్త్వము, రజస్సు, తమస్సు - అను మూడుగుణములు గలది. పది ఇంద్రియములు, మనస్సు, పంచమహాభూతములు అను పదహారును దాని వికారములు. వీటి అన్నింటియందును ఒక పురుషుడు (ఆత్మ) చైతన్య స్వరూపుడుగా వ్యాపించియుండును.
7.23 (ఇరువది మూడవ శ్లోకము)
దేహస్తు సర్వసంఘాతో జగత్తస్థురితి ద్విధా|
అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్॥5877॥
వీటి అన్నింటి సముదాయమే దేహము. ఇది స్థావరములు, జంగమములు - అని రెండు విధములు. ఇందలి అంతఃకరణము, ఇంద్రియములు మొదలగు అనాత్మ పదార్థములను ఇదికాదు-ఇదికాదు అని నిరాకరించుచు ఆత్మను అన్వేషింపవలెను.
7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
అన్వయవ్యతిరేకేణ వివేకేనోశతాత్మననా|
సర్గస్థానసమామ్నాయైర్విమృశద్భిరసత్వరైః॥5878॥
ఆత్మ అన్నింటియందు వ్యాపించియున్నది. కాని, అది అన్నింటికంటె వేరుగా ఉన్నది. విలక్షణమైనది. ఈ విధముగా శుద్ధమైన బుద్ధితో నెమ్మది-నెమ్మదిగా జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను గూర్చి వివేచన చేయవలెను. ఈ విచారమునందు ఎంతమాత్రము తొందరపాటు పనికిరాదు.
7.25 (ఇరువది ఐదవ శ్లోకము)
బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః|
తా యేనైవానుభూయంతే సోఽధ్యక్షః పురుషః పరః॥5879॥
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడును బుద్ధియొక్క వృత్తులు. ఎవరిద్వారా ఈ వృత్తులు అనుభవమునకు వచ్చుచున్నవో, అతడే వీటికి అతీతుడైన సాక్షియగు పరమాత్మ.
7.26 (ఇరువది ఆరవ శ్లోకము)
ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రియోద్భవైః|
స్వరూపమాత్మనో బుధ్యేద్గంధైర్వాయుమివాన్వయాత్॥5886॥
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలద్వారా కలిగెడు మార్పులు - చేర్పులు బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందే ఆత్మ అవగతమై యున్నది. అందువలన బుద్ధితో ఏర్పడిన తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మవలననే జరుగుచున్నవా! యని అనిపించును. కావున ఇట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధము అనగా వాసనవలన దానికి ఆశ్రయమైన వాయువును గుర్తించి, గంధమును నిరాకరించినట్లుగా, బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేయునట్టి సాక్షిరూపమున నున్న ఆత్మను తెలిసికొనవలెను.
7.27 (ఇరువది ఏడవ శ్లోకము)
ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః|
అజ్ఞానమూలోఽపార్థోఽపి పుంసః స్వప్న ఇవేష్యతే॥5881॥
గుణములచే, కర్మలచే సంబంధము జోడింపబడుటవలన జనన మరణ చక్రములో తిరుగుట తప్పదు. అజ్ఞానమువలన శరీరమందును ఆత్మబుద్ధి కలుగుచున్నది. ఇది మిథ్యయే కాని, సత్యము కాదు. ఐననూ, ఇది స్వప్నమువలె జీవునకు ప్రతీతమగు చుండును.
7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్|
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః॥5882॥
సోదరులారా! అందువలన మొట్టమొదట మీరు గుణములను అనుసరించుచు కలుగునట్టి కర్మబీజములను నష్టపరచవలెను. దీనివలన బుద్ధియొక్క వృత్తుల ప్రవాహము నివృత్తమగును. దీనినే యోగము, లేక పరమాత్మప్రాప్తి అందురు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
29.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము
గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః|
యదీశ్వరే భగవతి యథా యైరంజసా రతిః॥5883॥
త్రిగుణాత్మకమైన కర్మబీజములను తొలగించుటకును, లేదా బుద్ధివృత్తుల ప్రవాహమును ఆపివేయుటకును వేలకొలది సాధనములు గలవు. భగవంతుని యందు ప్రేమ కలుగుటవలన సహజముగనే అతని స్మరణ జరుగుచుండును. భగవంతుని యెడల ప్రేమ కలుగుటకు ఇదియే సులభోపాయము. ఈ విషయమును భగవానుడే స్వయముగా తెలిపియుండెను.
7.30 (ముప్పదియవ శ్లోకము)
గురుశుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ|
సంగేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ॥5584॥
7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణామ్|
తత్పాదాంబురుహధ్యానాత్తల్లింగేక్షార్హణాదిభిః॥5885॥
భక్తితో గురువును సేవించుట, తనకు దొరికిన సకల పదార్థములను భగవంతునకు సమర్పించుట, సాధుపురుషులైన భక్తులతో సాంగత్యము చేయుట, భగవంతుని ఆరాధించుట, ఆ ప్రభువు యొక్క కథలను శ్రద్ధగా వినుట, ఆయన గుణములను, లీలలను శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాదపద్మములను ధ్యానించుట, ఆయన మందిరములోని మూర్తిని దర్శించి, పూజించుట మొదలగు సాధనముల ద్వారా భగవంతుని యందు సహజమైన ప్రేమ (భక్తి) కలుగును.
7.32 (ముప్పది రెండవ శ్లోకము)
హరిః సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః|
ఇతి భూతాని మనసా కామైస్తైః సాధు మానయేత్॥5886॥
'సర్వశక్తిమంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలో విరాజిల్లుచున్నాడు' అను భావముచే యథాశక్తి ప్రాణులన్నింటియొక్క అభిలాషలను నెరవేర్పవలెను. హృదయ పూర్వకముగా వారిని గౌరవింపవలెను.
7.33 (ముప్పది మూడవ శ్లోకము)
ఏవం నిర్జితషడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే|
వాసుదేవే భగవతి యయా సంలభతే రతిమ్॥5887॥
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అను ఆరు శత్రువులను జయించి, పూర్వోక్త విధముగా సాధనములను అనుష్ఠించువారికి భగవంతుడైన శ్రీమహావిష్ణు చరణములయందు అనన్య భక్తి కలుగును.
7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్ వీర్యాణి లీలాతనుభిః కృతాని|
యదాతిహర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి॥5888॥
7.35 (ముప్పది ఐదవ శ్లోకము)
యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసత్యాక్రందతే ధ్యాయతి వందతే జనమ్|
ముహుః శ్వసన్ వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః॥5889॥
7.36 (ముప్పది ఆరవ శ్లోకము)
తదా పుమాన్ ముక్తసమస్తబంధనస్తద్భావభావానుకృతాశయాకృతిః|
నిర్దగ్ధబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజం॥5890॥
భగవంతుడు తన లీలావతారములయందు ప్రదర్శించిన అద్భుత బలపరాక్రమములను, సాటిలేని ఆ స్వామి గుణములను, కర్మలను వినుట వలన అత్యంత ఆనందాతిరేకముతో మానవుని శరీరము పులకించును. కన్నులలో అశ్రువులు స్రవించి,, కంఠము గద్గదమగును. సంకోచమును విడిచి, అతడు బిగ్గరగా అరచుచు, గానము చేయుచు నాట్యము చేయును. ఒక్కొక్కసారి, గ్రహగ్రస్తుడైన పిచ్చివానివలె నవ్వుచుండును. కరుణా పూరితమైన ఆక్రందనలు చేయుచుండును. ఒక్కొక్కసారి ధ్యానమగ్నుడగును. భగవద్భావముతో జనులకు నమస్కరించుచుండును. భగవంతునియందు తన్మయుడై మాటిమాటికిని దీర్ఘనిశ్వాసములను విడచుచుండును. బిడియమును విడిచి, హరీ! జగన్నాథా! నారాయణా అనుచు గట్టిగ అరచుచుండును. ఇట్టి భక్తి యోగ ప్రభావమున అతని బంధములన్నియును తెగిపోవును. అతని హృదయము భగవన్మయమగును. అట్టి సమయమున అతని జనన, మరణములకు హేతువులగు వాసనా రూపములగు బీజములన్నియును దగ్ధమైపోవును. అంతట ఆ పురుషుడు భగవత్ప్రాప్తిని పొందును.
7.36 (ముప్పది ఆరవ శ్లోకము)
అధోక్షజాలంభమిహాశుభాత్మనః శరీరిణః సంసృతిచక్రశాతనమ్|
తద్బ్రహ్మనిర్వాణసుఖం విదుర్బుధాస్త భజధ్వం హృదయే హృదీశ్వరమ్॥5891॥
భక్తియోగముద్వారా భగవంతుని ఆశ్రయించుటచే జీవుని అమంగళకరమైన సంస్కారములన్నియును నశించిపోవును. దీనివలన సంసార చక్రము నివారింపబడును. ఆ శ్రీహరిచే బ్రహ్మగా, నిర్వాణసుఖముగా మహాత్ములు పేర్కొందురు. కనుక మిత్రులారా! మీరు మీ హృదయములలో అంతరాత్మగా వెలుగొందు భగవంతుని భజింపుడు.
7.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
కోఽతిప్రయాసోఽసురబాలకా హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్సతః|
స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం సామాన్యతః కిం విషయోపపాదనైః॥5892॥
అమరబాలకులారా! మీ హృదయముల యందు భగవంతుడు ఆకాశమువలె నిత్యమై సమానముగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవంతుని భజించుటలో మిక్కిలి ప్రయాస ఏమియు ఉండదు. అతడు సమస్తప్రాణులలో ఆత్మగా నుండు ప్రేమ స్వరూపుడు. అట్టి స్వామిని వదలి భోగ్యసామాగ్రిని సేకరించుటకై తిరుగుట ఎంతటి మూర్ఖత్వము?
7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
రాయః కలత్రం పశవః సుతాదయో గృహా మహీ కుంజరకోశభూతయః|
సర్వేఽర్థకామాః క్షణభంగురాయుషః కుర్వంతి మర్త్యస్య కియత్ప్రియం చలాః॥5893॥
సోదరులారా! భార్యాపుత్రులు, బంధువులు, భవనములు, భూములు, సంపదలు, ఇంకను అనేక వైభవములు, జగత్తులోని సమస్తధనము, భోగసామాగ్రి, సర్వమూ, క్షణభంగురములు. నశ్వరములు. ఇట్టి నశ్వరములైన వస్తువులతో శాశ్వతసుఖము లభించునా? అట్టి వాటివలన క్షణికమైన ఆయుష్షుగల మనుజునకు ఎట్టి సుఖముండును?
7.40 (నలుబది ఒకటవ శ్లోకము)
ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ క్షయిష్ణవః సాతిశయా న నిర్మలాః|
తస్మాదదృష్టశ్రుతదూషణం పరం భక్త్యైకయేశం భజతాత్మలబ్ధయే॥5895॥
ఈ లోకమునందలి సంపదలు మనము చూచుచుండగనే నశించుచున్నవి గదా! అట్లే, యజ్ఞములవలన ప్రాప్తించు స్వర్గాది లోకములు గూడ నాశవంతములే. వాటిలో చిన్న-పెద్ద, ఉత్తమ-అధమ తారతమ్యములు ఉండును. తద్ద్వారా పరస్పరముగా స్పర్ధ యేర్పడును. కావున, అవి దోషరహితములు కావు. పరమాత్మ ఒక్కడే. అతడెట్టి దోషములను లేనివాడు. ఆ ప్రభువు నందు ఎవ్వరును దోషములను వినలేదు, కనలేదు. కనుక, అట్టి పరమాత్మ ప్రాప్తికి అనన్య భక్తితో ఆ ప్రభువును భజింపవలెను.
7.41(నలుబది రెండవ శ్లోకము)
యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః|
కరోత్యతో విపర్యాసమమోఘం విందతే ఫలం ॥5895॥^
ఈ లోకమున జనులు తామే పండితులమని భావించుచు, సుఖ భోగములను పొందుటకై పదే పదే కర్మలను చేయుచుందురు. వారు వాటిని పొందలేరు సరిగదా, విపరీతఫలములను పొందుదురు. ఇందు సదేహము లేదు.
7.42 (నలుబది రెండవ శ్లోకము)
సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః|
సదాఽఽప్నోతీహయా దుఃఖమనీహాయాః సుఖావృతః॥5896॥
జనులు కర్మలలో ప్రవృత్తులగుటకు దుఃఖములను దుఃఖములను తప్పించుకొనుట, సుఖములను పొందుట అను రెండు లక్ష్యములు ఉండును. కాని మొదట ఎట్టి కోరికలను లేనివాడు సుఖములో నిమగ్నుడైయుండును. కాని, అతడే సుఖభోగములను ఆశించుటవలన సర్వదా దుఃఖములనే అనుభవింపవలసి వచ్చును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
30.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఏడవ అధ్యాయము
గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారదమహర్షి యొక్క ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.43 (నలుబది మూడవ శ్లోకము)
కామాన్ కామయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః|
స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ॥5897॥
7.44 (నలుబది నాలుగవ శ్లోకము)
కిము వ్యవహితాపత్యదారాగారధనాదయః|
రాజ్యం కోశగజామాత్యభృత్యాప్తా మమతాస్పదాః॥5898॥
ఈ లోకములో మనుష్యులు సకామకర్మలద్వారా దైహిక భోగములను పొందగోరుదురు. కాని, ఆ దేహమే శాశ్వతముగాదు. అది ప్రకృతియొక్క అంశమగుటచే జడమైనది. ప్రాప్తించిన శరీరము ఎప్పటికైనను పోకమానదు. ఈ శరీరముయొక్క స్థితియే ఇట్లు ఉన్నప్పుడు, దీని కంటెను వేరైన భార్యాపుత్రులు, భవనములు, ధనము, సంపదలు, రాజ్యము, కోశాగారములు, వాహనములు, మంత్రులు, సేవకులు, గురుజనులు, ఇంకను 'నావి' అని అనుకొను వస్తువుల విషయము చెప్పనేల?
7.45 (ఏబది ఒకటవ శ్లోకము)
కిమేతైరాత్మనస్తుచ్ఛైః సహ దేహేన నశ్వరైః|
అనర్థైరర్థసంకాశైర్నిత్యానందమహోదధేః॥5899॥
రాజ్యము మొదలగు వస్తువులు అన్నియును తుచ్ఛములే. శరీరముతో బాటు ఇవి అన్నియును నశించునవియే. ఇవి పురుషార్థములవలె కన్పట్టును. కాని, వాస్తవముగా ఇవి అనర్థదాయకములు. ఆత్మ స్వయముగా శాశ్వతము, పరమానంద సముద్రము.
7.46 (నలుబది ఆరవ శ్లోకము)
నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహభృతోఽసురాః|
నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః॥5900॥
సోదరులారా! ఈ విషయమును గూర్చి కొంచెము ఆలోచింపుడు. జీవుడు తల్లి గర్భములో పడినప్పటినుండి మృత్యుపర్యంతము తన ప్రారబ్ధకర్మానుసారము కష్టపరంపరను అనుభవించుచునే యుండును. ఈ సంసారమున అతనికి చేకూరు స్వార్థమేముండును?
7.47 (నలుబది ఏడవ శ్లోకము)
కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా|
కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః॥5901॥
ఈ జీవుడు శరీరమునే తన ఆత్మగా భావించి, పలువిధములైన కర్మలను ఆచరించును. ఆ కర్మల కారణముగా మరియొక శరీరమును ధరించును. ఈ విధముగా కర్మలు, శరీరములు పరంపరగ సంభవించుచునే యుండును. దీనికి అంతటికిని కారణము అజ్ఞానమే.
7.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః|
భజతానీహయాఽఽత్మానమనీహం హరిమీశ్వరమ్॥5902॥
సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః|
భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః॥5903॥
శ్రీమహావిష్ణువు సకల ప్రాణులకు ప్రభువు, ఆత్మ, ప్రియతముడు. తనచే సృష్టీంపబడిన పంచమహా భూతములు, సూక్ష్మభూతములు మొదలగు వాటి ద్వారా రుపొందిన ఈ శరీరమునందు జీవుడు అని పిలువబడే ప్రియమున ఆత్మ శ్రీహరియే. అతడే సమస్త జీవులలో అంతర్యామిగా వెలుగొందుచున్నాడు.
7.50 (ఏబదియవ శ్లోకము)
దేవోఽసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ చ|
భజన్ ముకుందచరణం స్వస్తిమాన్ స్యాద్యథా వయమ్॥5904॥
దేవతలు, దైత్యులు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు మొదలగువారు ఎవ్వరైనను భగవంతుని పాదపద్మములను సేవించి, మనవలె సకల శ్రేయస్సులకును అర్హులగుదురు.
7.51 (ఏబది ఒకటవ శ్లోకము)^
నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః|
ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా॥5905॥
7.52 (ఏబది రెండవ శ్లోకము)
న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ|
ప్రీయతేఽమలయా భక్త్యా హరిరన్యద్విడంబనమ్॥5906॥
దైత్యబాలకులారా! శ్రీహరిని ప్రసన్నునిగా చేసి కొనుటకు బ్రాహ్మణుడుగా, దేవతగా, ఋషిగా జన్మించుట, సదాచారమును కలిగియుండుట, పెక్కు శాస్త్రముల యందు జ్ఞానమును సంపాదించుట, అట్లే దానము, తపము, యజ్ఞములు, శారీరక, మానసికశౌచము, శ్రేష్ఠములైన వ్రతములను అనుష్ఠించుట మొదలగునవి చాలవు- భగవంతుడు కేవలము నిష్కామభక్తి చేతనే ప్రసన్నుడగును. ఇవి యన్నియును ఆ భక్తికి సహాయకములే.
7.53 (ఏబది మూడవ శ్లోకము)
తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః|
ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే॥5907॥
దానవులారా! కనుక, సకల ప్రాణులను మీ ఆత్మలుగా భావించి, సర్వత్ర విరాజిల్లుచున్న సర్వాత్మయు, సర్వశక్తిమంతుడు ఐన పరమేశ్వరునియెడ భక్తి కలిగియుందురు.
7.54 (ఏబది నాలుగవ శ్లోకము)
దైతేయా యక్షరక్షాంసి స్త్రియః శూద్రా వ్రజౌకసః|
ఖగా మృగాః పాపజీవాః సంతి హ్యచ్యుతతాం గతాః॥5908॥
భగవద్భక్తి ప్రభావముచే దైత్యులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గోపాలురు (గొల్లలు), పక్షులు, మృగములు ఇంకను పెక్కుమంది పాప జీవులు గూడ భగవద్భావమును పొందిరి.
7.55 (ఏబది ఐదవ శ్లోకము)
ఏతావానేవ లోకేఽస్మిన్ పుంసః స్వార్థః పరః స్మృతః|
ఏకాంతభక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణమ్॥5909॥
ఈ ప్రపంచమున మానవశరీరమును పొందిన జీవుని ఒకే పరమార్థము (పరమప్రయోజనము) భగవంతుడైన గోవిందునియందు అనన్య భక్తిని కలిగియుండుటయే. సర్వదా, సర్వత్ర, సకలవస్తువులలోను భగవంతుని దర్శించుటయే ఆ భక్తియొక్క నిజస్వరూపము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమోఽధ్యాయః (7)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం