Tuesday, 5 November 2019







ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: హరిః ఓం

01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర  సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు

మీ ప్రాంజలి ప్రభ 
సేకరణ : రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
అందరికీ ధన్యవాదములు 
--(())--

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(01_8_2019)
హరిః ఓం
01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
ఈరీతిగా స్తవనీయుండును మహాత్ముండును అగు శ్రీ మహావిష్ణువు
దివ్యాతి దివ్యములయిన వేయి పుణ్యనామములు సంకీర్తనము చేయబడినవి.
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
పరమ మంగళకరములగు ఈ సహస్రనామములను శ్రద్ధగా శ్రవణము
చేయునట్టిగానీ, కీర్తనము చేయునట్టిగాని మానవులకు ఇహ లోకమందును పరలోకమందును యెట్టి అశుభములును కలుగవు.
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
ఈ సహస్రనామ పారాయణముచేత బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త యగును . క్షత్రియుడు విజయపరంపరలనొందును. వైశ్యుడు ధనసంపన్ను
డగును . శూద్రుడు సుఖభోగముల ననుభవింౘును.
( అనగా బ్రహ్మజ్ఞానాభిలాషతో, అద్వైత సిద్ధిని గోరి పారాయణము
చేసినచో బ్రహ్మస్వరూపుడే యగును. లౌకిక కార్య విజయ కాంక్షలు గలవానికి
అదియే సిద్ధింౘును. ధనసంపన్నత అభిలషింౘు వానికి ధనరాసులు సిద్ధింౘును.
లౌకిక భోగ సుఖములు కాంక్షింౘు వానికి అవియే లభింౘునని భావము).
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
ధర్మాభిలాషికి ధర్మపరంపరలు అర్థార్థులకు సమస్తములగు
అర్థములు. వివిధవాంఛలు గలవారికి ఆయా మనోవాంఛలును ఈ సహస్రనామ
పారాయణము వలన లభింౘును. ( ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములును సిద్ధిౘునని భావము )
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
ప్రాతఃకాలము నందు మేల్కొని, శుచిర్భూతుడై భక్తిభావముతో
ప్రతిదినమును (నిరంతరమును) సర్వమంగళకరుడగు వాసుదేవుని ఈ సహస్ర
నామములను పారాయణ మొనర్పవలెను.
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
ఈరీతిగా సంకీర్తనము చేయుటవలన గొప్ప యశస్సు కలుగును. జ్ఞాతులందు ప్రాధాన్యము పొందును. స్థిరముగా సంపదలు వర్ధిల్లును. ఉత్తమ శ్రేయస్సు లభింౘును.
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
దీనిని పఠింౘు పుణ్యాత్మునకు యెట్టి భయమును కలుగదు.
అతడు ప్రతిభా సంపన్నుడును గొప్ప తేజశ్శాలియునగును. శారీర మానసిక రోగములు కలుగవు . గొప్ప దీప్తిగలవాడును ,ౘక్కని ఆరోగ్యము, బలము, కాంతి
సద్గుణములు గలవాడును అగును.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(02_8_2019)
హరిః ఓం
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
వ్యాధిహరణమును గోరి పారాయణము చేయువారలకు అట్టి వ్యాధులు
నశింౘును. సాంసారిక బంధనములతో కలతచెందు వారికి సమస్త భయములును
హరింౘును. సమస్త కష్టములును ఈపుణ్యపారాయణము వలన నశింౘును.
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
భక్తితో నిరంతరమును మంగళకరములగు భగవానుని సహస్రనామ
ముల పారాయణము చేత సమస్తములగు భయంకరక్లేశములు మహాదుఃఖములు
హరింౘును.
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
వాసుదేవుని ఆశ్రయించి, వాసుదేవుడే పరమ గతి యని భావించి మనుష్యుడు సకల పాపముల నుండియును విముక్తుడై, చిత్తశుద్ధి గలవాడై
సనాతన పరబ్రహ్మమునే పొందును.
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
భగవానుని శరణాగతిని పొందిన భక్తులకు అశుభములెన్నడును
కలుగనే కలుగవు. జనన, మరణ, జరా (ముసలితనము) రోగాది భయము లెంత
మాత్రమును గలుగవు.
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
శ్రద్ధా భక్తి సమన్వితుడై ఈపవిత్ర స్తవరాజమును పారాయణము గావింౘు భక్తులకు అంతఃకరణ శుద్ధి కలుగును. గొప్ప సహనము, మహైశ్వర్యము, చిత్తస్థైర్యము, మేధాసంపద, సత్కీర్తి లభింౘును. ఏకాగ్ర చిత్తము, సదాచార
సంపద, శుచిత, భగవానునియందు పూర్ణ విసశ్వాసము, అనురాగమును కలిగి పారాయణము చేసిన వారికి పైన వివరించిన మహా ఫలము లన్నియును కలుగునని భావము.
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
భగవానునియందు భక్తిగల పుణ్యాత్ములకు కామ, క్రోధ, లోభ
మద, మాత్సర్యములు మున్నగు దుర్గుణములుండవు (వారు అరిషడ్వర్గములను
జయించిన వారగుదురు. అట్టి పవిత్రులకు అశుభములగు భావనలే యుండవు.
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
సూర్యచంద్ర నక్షత్రములతో కూడిన స్వర్గలోకమును, ఆకాశము
దిక్కులు, భూమి, మహాసాగరములు మున్నగునవన్నియును మహాత్ముండగు
శ్రీకృష్ణపరమాత్మ యొక్క బలవీర్యములచేతనే ధరింపబడి యున్నవి.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(03_8_2019)
హరిః ఓం
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
దేవదానవ గంధర్వులతో కూడినట్టియు యక్షోరగ రాక్షస గణములతో
కూడినట్టిదియును నగు విశాల సచరాచర విశ్వమంతయును భగవానుడగు
శ్రీకృష్ణుని వశవర్తియైయున్నది.
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
సర్వేంద్రియములు, మనస్సు, బుద్ధి అహంకారము, తేజస్స్సు, బలము,ధారణ, ప్రతిభా సంపత్తి, క్షేత్రము (శరీరము) క్షేత్రజ్ఞుడు (దేహి) మున్నగు
సమస్తమునూ వాసుదేవుని స్వరూపములేయని తెలుపబడుౘున్నవి.
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
సర్వ శాస్త్రములందును సదాచారమే ప్రధానముగా చెప్పబడి యున్నది. సదాచారము నుండియే ధర్మముత్పన్న మగును. అట్టి ధర్మమునకు పరమాత్మయే ప్రభువు.
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
ఋషులు , పితరులు, సమస్త దేవతలు, మహాభూతములు,
సువర్ణాది ధాతువులు జంగమ స్థావరములగు నీ యనంత విశ్వము నారాయణుని
వలననే యుద్భవించినది.
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
యోగము, జ్ఞానము, సాంఖ్యము, సకలవిద్యలు , సమస్తములగు
శిల్పాది కర్మలు, వేద శాస్త్రాదులు ఈ విజ్ఞానమంతయును పరమాత్మ నుండియే
కలుగుౘున్నవి.
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
మహారూపుడై, సమస్తభూత స్వరూపుడై , సర్వమును భరింౘు
వాడును, నాశన రహితుడును, అద్వితీయుండునునగు శ్రీమహావిష్ణువు ముల్లోకములందును వ్యాపించి సకలభూతజాలములందును వేరువేరు వివిధ
రూపములతో ననుభవింౘుౘున్నాడు.
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
సర్వ విజ్ఞాన సాగరుండును భగవానుండును నగు శ్రీకృష్ణద్వైపాయనుని చేత గానము చేయబడిన నీ విష్ణసహస్రనామ స్తోత్రమను
దివ్యస్తవరాజమును పరమశ్రేయస్సును, సకలఫలసిద్ధులను వాంఛింౘు వారందరును సాదరముతో పఠింపవలయును.
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
సర్వలోక మహేశ్వరుండును , ఆదిమధ్యాంత రహితుండును,
తేజోమూర్తియును, సృష్టిస్థితి లయకారకుండును, సర్వశక్తిసంపన్నుడును నగు
శ్రీకృష్ణపరమాత్మను భక్తిభావముతో (స్మరణ చింతన ధ్యాన కీర్తనాదులచే)
భజింౘువాఱికి ఎట్టి అపజయములుగాని, పరాభవములుగాని దుఃఖములుగాని
యెన్నడును కలుగవని వ్యాసదేవుని వాక్యమై యున్నది.
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు
సౌందర్యలహరి శివానందలహరి స్తోత్రము ల నాస్వాదించి ఆదరించినటులే శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము ను
గూడా భక్తి శ్రద్ధలతో నాస్వాదించి యాదరించి ప్రోత్సహించిన
మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, భగవద్భక్తు లందరికీ
శ్రావణమాస శుభాకాంక్షలతో
శుభాభినందనలతో
సదా మీయందఱి శ్రేయోభిలాషి
మునీశ్వరరావు యనమండ్రం
(03_8_2019)